
నేటి నుంచి రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు
కనగల్: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తుల పాలిట కొంగుబంగారం దర్వేశిపురం(పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి 7వ తారీకు వరకు కనులపండువగా జరగనున్నట్లు ఆలయ ఈఓ జల్లేపల్లి జయరామయ్య, చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో నిత్య పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం ఎదుర్కోళ్ల మహోత్సవం, 6న శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి 23వ వార్షిక కల్యాణ మహోత్సవం బ్రహ్మశ్రీ డేరం భాస్కరశర్మ, ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి, శ్రవణాచారి, గాదె ఉమామహేశ్వరరావు, దామోదర్రావుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 7న 108 కలశములతో అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం 4 గంటలకు పర్వతగిరి, దర్వేశిపురం గ్రామాల నుంచి బోనాలు వంటి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

నేటి నుంచి రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు