నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక

Jun 6 2025 12:57 AM | Updated on Jun 6 2025 6:25 AM

నేడు

నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక

యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం సుమారు రూ.1,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకు ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపురం గ్రామం వేదిక కానుంది. అన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు తిర్మలాపూర్‌ వద్దనే ఆవిష్కరించనున్నారు. అక్కడే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్‌ అందజేయనున్నారు. అనంతరం తిర్మలాపురం గ్రామంలో జరిగే సీఎం సభలో పాల్గొననున్నారు.

శంకుస్థాపన చేసే పనులు ఇవే..

● యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు వసతుల కల్పన, అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. టెంపుల్‌ సిటీలో 15 ఎకరాల్లో రూ.43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణం. దాతారుపల్లి రెవెన్యూ పరిధిలోని వైటీడీఏ స్థలంలో రూ.180కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణం, దాతారుపల్లిలో రూ.15కోట్లతో ఏర్పాటు చేసే వేర్‌ హౌజ్‌ గోదాములకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

● తుర్కపల్లి మండలంలోని గంధమల్ల రిజర్వాయర్‌ పనులకు, రాంపూర్‌తండా సమీపంలో 15ఎకరాల స్థలంలో నిర్మించే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన.

● ఆలేరు నియోజకవర్గంలో రూ.50 కోట్ల నిర్మించనున్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు, రూ.14.50 కోట్లతో ఆలేరు మండలం కొలనుపాక, రాజాపేట మండలం కాల్వపల్లి వాగులపై హైలెవల్‌ బ్రిడ్జిలు, రూ.30 కోట్లతో సీఆర్‌ఆర్‌, ఎంఆర్‌ఆర్‌ రోడ్లకు, మోటకొండూర్‌లో రూ.10కోట్లతో ఎంపీపీ, తహసీల్దార్‌, పోలీస్‌ స్టేషన్‌ భవనాలకు, ఆలేరులో రూ.15కోట్లతో నిర్మించే మార్కెట్‌ యార్డు గోదాములకు శంకుస్థాపన చేస్తారు.

సీఎం వెంట రానున్న ప్రముఖులు వీరే..

సీఎం రేవంత్‌రెడ్డి వెంట శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదరం రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రానున్నారు.

ఫ రూ.1,500 కోట్ల పనులకు తుర్కపల్లి మండలంలో తిర్మలాపురం వద్ద శంకుస్థాపనలు

ఫ అక్కడే సభలో ప్రసంగించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఫ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్‌ అందజేత

సీఎం పర్యటన షెడ్యూల్‌ ఇలా..

సీఎం రేవంత్‌రెడ్డి తుర్కపల్లి మండలంలోని తిర్మలాపూర్‌ సభాస్థలికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోనున్నారు. 2.40కి హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి తిర్మలాపూర్‌ చేరుకుంటారు. 3.10కి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే జరిగే బహిరంగసభలో పేదలకు సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్‌ అందజేస్తారు. 5 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.

నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక1
1/1

నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement