
బడిబాటను విజయవంతం చేయాలి
నల్లగొండ : జయశంకర్ బడిబాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ కోరారు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న బటిబాట కార్యక్రమాలపై గురువారం నల్లగొండలో వివిధ శాఖల అధికారులు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ తేదీ నాటికి పాఠశాలలను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. అదే రోజున యూనిఫాం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడిబాట కార్యక్రమంలో మండల, జిల్లాస్థాయి అధికారులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్