నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నీటి విడుదల

Jun 8 2025 1:23 AM | Updated on Jun 8 2025 1:23 AM

నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నీటి విడుదల

నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నీటి విడుదల

శాలిగౌరారం : జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి ప్రస్తుత వానాకాలం పంటల సాగుకు ఆదివారం నీటి విడుదల చేయనున్నట్లు నీటిపారుదలశాఖ డీఈ సత్యనారాయణ శనివారం సాయంత్రం తెలిపారు. నీటి విడుదల కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, రైతుప్రతినిధులు హాజరు కావాలని కోరారు. కాగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా.. ప్రస్తుతం 18 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు కింద మండలంలోని తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

రైతు భరోసా

విడుదల చేయాలి

నల్లగొండ టౌన్‌ : రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా ఆయన శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రైతు భరోసా విడుదల చేయకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి పంటలను సాగు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని నకిలీ విత్తనాలను పురుగుల మందులను అరికట్టాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పాలడుగు నాగార్జున, ఐలయ్య, డబ్బికార్‌ మల్లేష్‌, పాలడుగు ప్రభావతి, సయ్యద్‌ హాసం, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

సంస్థాన్‌ నారాయణపురం: మునుగోడు ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే స్పందించి పరిష్కరించాలని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. శనివారం సంస్థాన్‌ నారాయణపురంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సుర్విరాజుగౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేకు ఏమైనా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. సాగునీరు లేక ఈ ప్రాంత రైతులు, రైతు కూలీలు హైదరాబాద్‌కు వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు దోనూరు వీరారెడ్డి, సోమ నరసింహ, బచ్చనబోయిన దేవేందర్‌, జక్కలి రాజు, దర్శనం వేణు, భాస్కర నరసింహ, వంగరి రఘు, సూరపల్లి శివాజీ, నందగిరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement