
ఆర్థిక స్వావలంభనే లక్ష్యం
రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ కల్పించేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఎఫ్పీఓలు ఏర్పాటు చేస్తున్నారు.
- 10లో
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం : ఎస్పీ
నల్లగొండ : బక్రీద్
పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం నల్లగొండలోని మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్, అవసరమున్న చోట పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.