ఇండియా కూటమి నేతల కీలక భేటీ | Operation Sindoor: INDIA Alliance Demand Parliament Special Session Details | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి నేతల కీలక భేటీ

Jun 3 2025 12:16 PM | Updated on Jun 3 2025 12:16 PM

Operation Sindoor: INDIA Alliance Demand Parliament Special Session Details

సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి, కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ అందుబాటులో ఉన్న ఆ పార్టీ ఎంపీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం సమావేశ వివరాలను ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మధ్యాహ్నం మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. 

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం నిర్వహణ కోసం.. సుమారు 200 మంది ఎంపీలతో సంతకాల సేకరణ జరిపింది ఇండియా కూటమి. పలు రాజకీయ పక్షాల ఎంపీలు సమ్మతి తెలిపిన ఆ ఉమ్మడి లేఖను సైతం ప్రధానికి పంపగా.. ఇవాళ మీడియా ముందు దానిని విడుదల చేయనున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement