సదస్సులతో భూసమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సదస్సులతో భూసమస్యల పరిష్కారం

Jun 5 2025 7:42 AM | Updated on Jun 5 2025 7:42 AM

సదస్స

సదస్సులతో భూసమస్యల పరిష్కారం

పెద్దవూర : అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం పెద్దవూర మండలంలోని వెల్మగూడెం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. సాదా బైనామాలు, పెండింగ్‌ మ్యూటేషన్లు, సక్సేషన్స్‌, విస్తీర్ణంలో తప్పోప్పొల సవరణ, భాగ పంపిణీ తదితర అన్ని రకాల సమస్యలను రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. పాసుబుక్‌లలో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చునని, చిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుకోవచ్చని తెలిపారు. లావుణి పట్టా భూములు పట్టా చేయడం, ప్రభుత్వ భూములు కొన్నవారికి రెగ్యులరైజేషన్‌ చేయడం కుదరని తెలిపారు. కలెక్టర్‌ రైతుల నుంచి దరఖాస్తులను స్వయంగా స్వీకరించటమే కాకుండా వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, తహసీల్దార్‌ జె.శ్రీనివాసరావు, ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, హబీబ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

సదస్సులతో భూసమస్యల పరిష్కారం1
1/1

సదస్సులతో భూసమస్యల పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement