
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విక్టరీ పరేడ్ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు.. ఈ విషాదం నడుమే విధానసౌధలో ఆర్సీబీ ఆటగాళ్లకు ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలనుకున్న సన్మానాన్ని.. హడావిడిగా ముగించేసింది.




















