కుంజా రజితకి వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan Congratulate Kunja Rajitha For Gold Medal | Sakshi
Sakshi News home page

కుంజా రజితకి వైఎస్ జగన్ అభినందనలు

Jun 3 2025 5:05 PM | Updated on Jun 3 2025 5:56 PM

YS Jagan Congratulate Kunja Rajitha For Gold Medal

సాక్షి, గుంటూరు: భారత అథ్లెట్ కుంజా రజిత(Kunja Rajitha)కి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 4x400 రిలేలో ఆమె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్‌ జగన్‌ తన ఎక్స్‌ ఖాతాలో మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. 

‘‘రజిత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన మహిళ కావటం మనకు గర్వకారణం. 2028లో దేశం తరపున ఒలింపిక్ పతకం సాధించాలనే ఆమె కల సాకారం కావాలని ఆశిస్తున్నా’’ అని తన సందేశంలో ఆకాంక్షించారాయన.

Advertisement
 
Advertisement
Advertisement