
సాక్షి,తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ రెడ్డిని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు.
సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డిని విమర్శించారంటూ రమేష్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. లక్కిరెడ్డిపల్లి నుంచి మదనపల్లి పీఎస్కి తరలించారు. రమేష్ రెడ్డి అరెస్ట్పై సమాచారం అందుకున్న వైఎస్ జగన్ ఆయనను ఫోన్లో పరామర్శించారు. పోలీసుల అక్రమ అరెస్ట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.