arrest
-
నేపాల్ మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలీ అరెస్టు
కఠ్మాండు: నేపాల్ మాజీ ప్రధానమంత్రి, కమ్యూ నిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్) చైర్మన్ కె.పి.శర్మ ఓలీ అరెస్టయ్యారు. గత ఏడాది జెన్ జెడ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని కఠ్మాండుకు 12 కిలోమీటర్ల దూరంలోని భక్తపూర్ జిల్లా గుండూ ఏరియాలో పోలీసులు శనివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ నూతన ప్రధానిగా బాలెంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుటి రోజే కె.పి.శర్మ ఓలీ అరెస్టు కావడం గమనార్హం.ఇదే కేసులో హోంశాఖ మాజీ మంత్రి, నేపాలీ కాంగ్రెస్ నేత రమేశ్ లేఖక్ సైతం అరెస్టయ్యారు. భక్తపూర్ జిల్లాలోని సూర్యబినాయక్ మున్సిపాల్టీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓలీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఉద్యమించారు. గత ఏడాది సెప్టెంబర్ 8, 9న నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ప్రజలపై భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి. కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 23 మంది యువతీ యువకులు సహా 76 మంది మరణించారు.తర్వాత ఓలీ ప్రభుత్వం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జెన్ జెడ్ ఉద్యమంలో హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. కె.పి.శర్మ ఓలీతోపాటు రమేశ్ లేఖక్లను ఇందుకు బాధ్యులుగా కమిషన్ గుర్తించింది. వారిద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ తమ నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచింది. మూడేళ్ల నుంచి పదేళ్ల దాకా జైలు శిక్ష విధించాలని సూచించింది. చట్టానికి ఎవరూ అతీతం కాదు ప్రధానిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన బాలెంద్ర షా తన మొదటి మంత్రివర్గ సమావేశంలోనే.. విచారణ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కె.పి.శర్మ ఓలీ, రమేశ్ లేఖక్లను పోలీసులు అరెస్టు చేశారు. చట్టానికి ఎవరూ అతీతం కాదని నూతన హోంమంత్రి సుధాన్ గురూంగ్ తేలి్చచెప్పారు. తాము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని, చట్టప్రకారం ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. దేశం ఇకపై కొత్త దిశలో పయనిస్తుందన్నారు. ఇదిలా ఉండగా, కె.పి.శర్మ ఓలీ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకున్న తర్వాత జైలుకు తరలించే అవకాశం ఉంది. సీపీఎన్–యూఎంఎల్ కార్యకర్తల ఆందోళన ఓలీ అరెస్టు పట్ల సీపీఎన్–యూఎంఎల్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓలీతోపాటు రమేశ్ లేఖక్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఓలీపై బాలెంద్ర షా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. -
20 ఏళ్లకు నిందితుడిని పట్టుకున్న సీబీఐ
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఓ విద్యార్థి హత్య కేసును ఎట్టకేలకు సీబీఐ ఛేదించింది. 2005లో కేరళలో జరిగిన హత్య కేసులో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అండమాన్ వాసిని మహారాష్ట్రలోని నాగ్పూర్లో మారుపేరుతో చలామణీ అవుతున్నాడని గుర్తించి అరెస్ట్ చేసింది. కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన శ్యామ్ మండల్ అనే విద్యార్థి 2005 అక్టోబర్లో కిడ్నాపయ్యాడు. దుండగులు అతడి తండ్రికి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. అదే నెల 23వ తేదీన తిరువనంతపురంలోని వెల్లార్ వద్ద శ్యామ్ మృతదేహం కన్పించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అండమాన్ నికోబార్కు చెందిన దుర్గా బహదూర్ భట్ ఛత్రి, మహ్మద్ అలీలను పోలీసులు నిందితులుగా గుర్తించారు. అలీని అరెస్ట్ చేసి, 2022లో జైలుకు పంపారు. ఛత్రి జాడ మాత్రం దొరకలేదు. 2008 డిసెంబర్లో ఈ కేసును కేరళ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి ఇరవయ్యేళ్లుగా ఛత్రి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు మహారాష్ట్రలోని నాగ్పూర్లో సూరజ్ భట్ అనే మారుపేరుతో ఛత్రి చలామణి అవుతున్నట్లు సీబీఐ వర్గాలు కనిపెట్టాయి. సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఛత్రి స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు. దీనిపై సీబీఐ స్థానిక పోలీసుల సాయం కోరింది. వారు గుర్తింపు కార్డులతోపాటు అతడి నేపథ్యం గురించి చుట్టుపక్కల వారిని ఆరాతీశారు. ఛత్రినే సూరజ్ భట్ అని పోలీసులు ధ్రువీకరించడంతో శుక్రవారం సీబీఐ బృందం అరెస్ట్ చేసింది. -
నేపాల్లో సంచలనం.. మాజీ ప్రధాని కేపీ ఓలీ అరెస్ట్
ఖాట్మాండ్: నేపాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ శనివారం తెల్లవారుజామున అరెస్టు అయ్యారు. నేపాల్లో జెన్ జెడ్ నిరసనలను హింసాత్మకంగా అణచివేసిన ఘటనకు సంబంధించి, నరహత్య కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక, నేపాల్ ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజే ఆయన అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.ఇక, ఇదే కేసులో నేపాలీ కాంగ్రెస్ నాయకుడు, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ కూడా అరెస్టు అయ్యారు. భక్తపూర్లోని వారి నివాసాల నుండి ఈ ఇద్దరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించగల నిబంధనల కింద అభియోగాలు మోపే అవకాశం ఉంది. నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) నాయకుడైన ఓలీపై విచారణ జరపాలని నేపాల్లోని ఒక ఉన్నత స్థాయి కమిషన్ సిఫార్సు చేసిన తర్వాత ఆయన అరెస్టు జరిగింది.This is how it’s started to arrest Nepal Ex Prime Minister KP Sharma Oli. New Prime Minister Balendra Shah cabinet’s Home Minister Sudhan Gurung also confirmed! पूर्वप्रधानमन्त्री केपी शर्मा ओली पक्राउ ! #Nepal #KPSharmaOli #KPOli Gen Z pic.twitter.com/jfTvZzI4cN— Jitan Katwal 𝕏 (@JitanKatwal) March 28, 2026కాగా, కేపీ శర్మ ఓలీ హయాంలో పాలనా వైఫల్యాలు, అవినీతి, నిరుద్యోగం, రాజకీయ అస్థిరతపై ప్రజల్లోని ఆగ్రహంతో 2025 సెప్టెంబర్లో ‘జెన్ జెడ్ విప్లవం’గా పిలవబడే భారీ యువత తిరుగుబాటు నేపాల్ను అట్టుడికింది. డిజిటల్ స్వేచ్ఛ కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం, త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుగా పరిణమించడంతో ప్రభుత్వం తీవ్ర అణచివేతకు పాల్పడింది. తత్ఫలితంగా జరిగిన హింసా కాండలో కనీసం 77 మంది ప్రాణాలు కోల్పోగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు. #WATCH | Former Nepal Prime Minister KP Sharma Oli taken into custody from his residence in Gundu, Bhaktapur, by Nepal Police. According to the Kathmandu Post, "he has been arrested in connection with a culpable homicide-related case linked to the alleged suppression of the… pic.twitter.com/S0zrAmPUFV— ANI (@ANI) March 28, 2026నేపాల్ ప్రధానిగా షా..ఇదిలా ఉండగా.. నేపాల్లో రాప్ నుంచి నవతరం నాయకుడిగా ఎదిగిన బాలేంద్ర షా ‘బాలెన్’ (35) శుక్రవారం నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేశారు. శీతల్ నివాస్లోని అధ్యక్ష కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాలెన్తో దేశ అధ్యక్షుడు రామ్ చంద్రపౌడెల్ ప్రమాణం చేయించారు. గతంలో ఖాట్మాండ్ నగర మేయర్గా పనిచేసిన బాలెన్... ప్రజాస్వామ్యబద్ధంగా అతి పిన్న వయసులో దేశ ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇక, కొత్తగా ఏర్పాటైన బాలేంద్ర షా మంత్రివర్గం తొలిరోజే సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. గత సెప్టెంబరు నెలలో జరిగిన జెన్ జెడ్ ఉద్యమంపై దర్యాప్తు జరిపిన ఉన్నతస్థాయి కమిషన్ సిఫార్సులను తక్షణం అమలు చేయాలని నిర్ణయించింది. -
దేశవ్యాప్తంగా బెజవాడ ‘ఉగ్ర’ లింకులు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ)/విజయవాడ లీగల్: బెజవాడ ‘ఉగ్ర’ లింకులు దేశవ్యాప్తంగా విస్తరించినట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం వేట మొదలుపెట్టారు. పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. విజయవాడలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సోహైల్ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. తీవ్రవాద భావజాలాన్ని వ్యాపింపచేస్తున్న కేసులో బుధవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన మహిళ కాగా, మరొకరు బీదర్కు చెందిన యువకుడు ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరో 8 మంది ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు విజయవాడ పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లారు. ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో నిందితులను గుర్తించామని.. 7 రాష్ట్రాల్లో ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు చేశామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 15 మంది గుర్తింపు తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న బృందంలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో మొత్తం 15 మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. 13 మందిపై విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం విజయవాడకు చెందిన రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహైల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. వారినుంచి సీజ్ చేసిన సెల్ఫోన్ల ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) గుర్తించింది. మరో ఇద్దరిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. 7 రాష్ట్రాల్లో ఇటువంటి వారి ఉనికిని ఇప్పటికే గుర్తించి వారిని పట్టుకునే బాధ్యతలను విజయవాడ నగరంలోని వేర్వేరు పోలీస్స్టేషన్ల సీఐలకు అప్పగించారు. మొత్తం 9 బృందాలు ఆయా రాష్ట్రాలకు చేరుకుని నిందితుల నివాసం ఉండే స్థానిక పోలీస్స్టేషన్లకు సమాచారాన్ని అందించారు. అక్కడి పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే హైదరాబాద్ చంచల్గూడ ప్రాంతానికి చెందిన సయిదా బేగం(38)తో పాటు కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్ సలాం(38)ని మంగళవారం రాత్రి నగర పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చి బుధవారం చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులిద్దరికీ న్యాయమూర్తి బి.రాధారాణి వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని జైలుకు తరలించారు. హ్యాండ్లర్లపైనా గురి బిహార్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన యువకులు తీవ్రవాద భావాల్ని వ్యాప్తి చేస్తున్న గ్రూప్లో సభ్యులుగా ఉన్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. దిల్ఖాష్ (బిహార్), లక్కీ అహమ్మద్ (ఢిల్లీ), అస్మానుల్లా ఖాన్ (బిహార్), జిషణ్ (రాజస్థాన్), మీరా ఆసిఫ్ అలీ (పశ్చిమ బెంగాల్), షారుక్ఖాన్ (మహారాష్ట్ర), షేక్ ఫీజర్ రెహమాన్ (మహారాష్ట్ర)లను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు విదే శాల్లో ఉండే అల్ హకీమ్ షుకూర్ (హ్యాండ్లర్), ఇతర హ్యాండ్లర్ల గురించి కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు ఇటీవల రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ప్రార్థనా మందిరాల్లో జరిగే సమావేశాలకు హాజరయ్యారా అనే దిశగా పోలీసులు విచారణ చేప ట్టారు. నిందితులతో సన్నిహితంగా ఉంటున్న వారి వివరాలను గోప్యంగా సేకరించినట్టు తెలు స్తోంది. స్థానికంగా ఉండే యువకులతో మొ హ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మొహ్మద్ డానిష్ మతపరమైన సమావేశాలకు హాజరై అక్కడ యువకులను ఏమైనా ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు చేశారా అనే దిశగా పోలీసులు విచారణ సాగుతోంది. తోడు కోసమై ఉగ్రవాద ముఠా వలలో..సైదా బేగంకు ప్రేమ పేరుతో వల వేసిన ఐసిస్ సానుభూతిపరులు సోషల్ మీడియా ఐడీలు తీసుకుని దుర్వినియోగం సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): హైదరాబాద్లోని చంచల్గూడకు చెందిన వితంతు మహిళ సయీదా బేగం (38) తోడు కోసం పాకులాడుతూ ఉగ్రవాద సానుభూతిపరుల ఉచ్చులో చిక్కింది. ఈమె సోషల్ మీడియా ఐడీలు సంగ్రహించిన ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులిద్దరు ఐసిస్తో పాటు అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) భావజాల వ్యాప్తి కోసం వినియోగించారు. ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు మంగళవారం గుట్టురట్టు చేసిన అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ కేసులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చంచల్గూడకు చెందిన సయీదా బేగం భర్త ఇమ్రాన్ఖాన్ నాలుగేళ్ల క్రితం చనిపోయారు. అప్పటినుంచి ఇళ్లల్లో పనిచేస్తూ తన కుమారుడిని (7) పోషించుకుంటోంది. సోషల్ మీడి యాలో యాక్టివ్గా ఉండే సయీదా బేగం తోడుగా ఉండే వ్యక్తి కోసం సామాజికమాధ్యమాల్లో అన్వేషిస్తోంది. దీనిని ఉగ్రవాద సానుభూతిపరులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈమెతో చాటింగ్స్ చేస్తూ, ఆసక్తి ఉన్నట్టు నటిస్తూ తమ లక్ష్యాలను సాధించడానికి యత్నించారు. దీనిలోభాగంగా నిషేధిత ఉగ్రవా ద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడు ఉత్తరప్రదేశ్కు చెందిన హరీష్ అలీ, బిహార్కు చెందిన షాద్మన్ దిల్ఖుష్ సయిదాబేగం ఐడీలతో ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. యూపీ ఏటీఎస్ అధికారులు ఈనెల 15న హరీష్ అలీని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే దిల్ఖుష్, సయీదాబేగంను అరెస్టు చేసిన పోలీసులు తొలుత ఈమెను ఐసిస్ సానుభూతిపరురాలిగా అనుమానించారు. అయితే విచారణలో దిల్ఖుష్, సయీదా వెల్లడించిన వివరాల ఆధారంగా అభియోగ పత్రాలు దాఖలు సమయంలో కేసు నుంచి సయీదా పేరు తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం. -
ఉద్యోగాల పేరిట రూ.25 కోట్లకు కుచ్చుటోపీ
యశవంతపుర: కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసగించే కిలాడీ దంపతులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన జైసన్ డిసోజా, లవీనా దంపతులు నిరుద్యోగులు. వీరు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న యువకులను గుర్తించి, కోర్టుల్లో గ్రూప్–డి ఉద్యోగాలను ఇప్పిస్తామని నమ్మించేవారు. నిరుద్యోగులను గుర్తించేందుకు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డబ్బు వసూలు చేశారు.ఖరీదైన హోటల్స్లో ధ్రువపత్రాల తనిఖీ, ఇంటర్వ్యూలు అని నాటకాలు ఆడేవారు. నకిలీ నియామక పత్రాలను చేతిలో పెట్టేవారు. నకిలీ పత్రాలు తీసుకుని కోర్టులకు వెళ్లినవారికి తాము మోసపోయామని అర్థమయ్యేసరికి, ఈ జంట ఫోన్లను స్విచాఫ్ చేసేది. చేసేది లేక బాధితులంతా బసవేశ్వరనగరతో పాటు నగరంలోని వివిధ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. 500 మంది నుంచి రూ.25 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. 2024లో ఇదే ఫిర్యాదుపై అరెస్టయి కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చిన ఈ దంపతులు, మళ్లీ అదే దందా కొనసాగిస్తున్నారని, కేసు విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ను సిట్ అదుపులోకి తీసుకుంది. రోహిత్ పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేయగా.. అభిషేక్ నుంచి రోహిత్రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొన్నారు. రోహిత్కు 24 సార్లు అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోహిత్ డ్రైవర్ శరత్ కొనుగోలు చేశారు. అభిషేక్ సింగ్సెల్ఫోన్ డేటాను సిట్ బృందం విశ్లేషిస్తోంది. అభిషేక్ సింగ్ నుండి ఎవరెవరూ డ్రగ్స్ తీసుకున్నారు? అనే విషయంపై సిట్ కూపీ లాగుతోంది.కాగా, డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. పలు కీలక విషయాలను సేకరిస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్నగర్లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. -
పెద్దిరెడ్డి PA అరెస్ట్..
-
లేడీ కాదు.. మహా కిలాడీ.. వైద్యురాలిగా నటిస్తూ!
సాక్షి, హైదరాబాద్: వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న కిలేడీ, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష.. వివిధ ఆసుపత్రులలో వైద్యరాలిగా నటిస్తూ రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుంటోంది. ఆమెకు సహకరిస్తున్న భర్త ఎడులపల్లి సాయి కుమార్ను కూడా సికిందరాబాద్ జోన్ టాస్క్ఫోర్, మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితురాలు శిరీష ప్రస్తుతం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సులభంగా డబ్బు సంపాదించేందుకు తన భర్తతో కలిసి ఆసుపత్రులలో దొంగతనాలకు ప్లాన్ చేసింది. తన వైద్య పరిజ్ఞానంతో వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకునేది. డాక్టర్ ఆప్రాన్ (Apron) ధరించి ఆసుపత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న 'డయాజెపామ్' (Diazepam) అనే మత్తు ఇంజక్షన్ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యేది.గత మార్చి 11న సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో, అలాగే చందానగర్లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వీరు ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్కు ఖర్చు చేసేవారు. వీరి నుంచి సుమారు 11 తులాల బంగారం, మారుతీ సుజుకీ బాలెనో కారు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఏంటీ.. రోబో అరెస్టా..
చైనాలో ఓ వృద్ధురాలిని బెదిరించినందుకుగానూఓ హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అరెస్టు చేశారు!! ఇంటర్నెట్లో ఈ వార్త రాగానే.. ఏంటి బ్రో.. రోబో అరెస్టా? అనినోరెళ్లబెట్టినోళ్లు కొందరైతే.. చైనాలో ఇంతే.. చైనాలో ఇంతే అనిసరిపుచ్చుకున్నవాళ్లు మరికొందరు. మరి.. మనమేం చేద్దాం..నిజంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న 70 ఏళ్ల మహిళ ఒక్కసారిగా రోబో తన వెనుక నిల్చుని ఉండటాన్ని చూసి హడలిపోయారు. నా గుండె ఆగినంత పనైంది అంటూ తిట్టేశారు. ఆ వృద్ధురాలు రోబోను తిడుతున్నట్లు.. చేతులు పలుమార్లు గాల్లోకి లేపి రోబో ఏదో అంటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్గా మారింది. రోబో తనను ఫాలో చేసిందని.. భయపెట్టిందని ఆ మహిళ పోలీసులకు చెప్పడంతో యూనీట్రీ జీ–1 రోబోను పోలీసులు అరెస్టు చేసే నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. భయపడటం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆస్పత్రికి పంపారు. అయితే, వైద్యులు బాగానే ఉందని అనడంతో ఆ రోబో ఆపరేటర్ మీద తాను ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయడం లేదని ఆమె పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు రోబోను ఆపరేటర్కు అప్పగించి.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ రోబో దగ్గర్లోని విద్యాసంస్థదట. ఆ సంస్థ ప్రమోషన్ కార్యక్రమాలకు దాన్ని వాడుతున్నారు. ఆ రోజున తన దారిలో తాను రోబో వెళ్తుండగా.. ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు రోబో ఆపరేటర్ చెప్పారు. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు చేయకున్నా.. ఇలా రోబోను అదుపులోకి తీసుకోవడం కూడా ఇదే తొలిసారని చెబుతున్నారు. మరోవైపు ఇంటర్నెట్లో నెటిజనులు ఎప్పట్లాగా రెండుగా విడిపోయారు. కొందరిటు.. కొందరటు చేరారు. ఇంతకీ మీరెటు? తప్పు రోబోదా? ఆ వృద్ధురాలిదా? -
చంద్రబాబు అరెస్ట్.. రమణ రియాక్షన్.. KSR దిమ్మతిరిగే కౌంటర్
-
UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే..
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై మొత్తం 35 మందిని అరెస్ట్ చేయగా, అందులో ఏకంగా 19 మంది భారతీయులు ఉండటం గమనార్హం.అసలేం జరిగింది?పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, క్షిపణి దాడులు లేదా రక్షణ వ్యవస్థల ఆపరేషన్లను చిత్రీకరించవద్దని యూఏఈ ప్రభుత్వం గతంలోనే స్థానికులను హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారు. తాజాగా యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ 25 మందిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు (వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారు). అంతకుముందు శనివారం పది మందిని (వీరిలో ఇద్దరు భారతీయులు) అరెస్ట్ చేశారు. మొత్తంగా 19 మంది భారతీయులు ఇప్పుడు జైలు పాలయ్యారు.అరెస్ట్ అయిన వారిపై మూడు రకాల ఆరోపణలు..నిందితులు మూడు గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారుక్షిపణుల వీడియోలు: ఆకాశంలో వెళ్తున్న క్షిపణులను లేదా వాటిని అడ్డుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి, వాటికి భయాందోళనలు కలిగించే శబ్దాలను జోడించి ప్రచారం చేయడం.ఏఐ ఫేక్ దృశ్యాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ఉపయోగించి పేలుళ్లు జరిగినట్లు కృత్రిమ వీడియోలను సృష్టించడం. ఇతర దేశాల్లో జరిగిన పాత ఘటనలను యూఏఈలో జరిగినట్లుగా నమ్మించడం.శత్రు దేశాలకు మద్దతు: యూఏఈ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే దేశాలను, వారి సైనిక చర్యలను పొగుడుతూ పోస్టులు పెట్టడం.శిక్షలు కఠినం: లక్ష దిర్హమ్ల జరిమానాఈ తరహా చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని అటార్నీ జనరల్ హెచ్చరించారు. నిందితులకు కనీసం ఏడాది జైలు శిక్షతో పాటు, ఒక లక్ష దిర్హమ్లకు (సుమారు రూ. 22 లక్షలకు పైగా) తగ్గకుండా జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వీరందరినీ అదుపులోకి తీసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూషన్, త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశించింది.ఇది కూడా చదవండి: మెగా ఫైట్ @2026: పేలుతున్న ‘సీనియర్ల’ మాటల తూటాలు -
ఎట్టకేలకు వాంగ్చుక్ విడుదల
లేహ్/న్యూఢిల్లీ/జోద్పూర్: లద్దాఖ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలో చేర్చాలని ఉద్యమించి చివరకు జైలుపాలైన పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చారు. గత ఆరునెలలుగా కారాగారానికే పరిమితమైన వాంగ్చుక్పై కొనసాగుతున్న నిర్బంధాన్ని తక్షణం రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన విడుదలచేసింది. తక్షణం ఆయనను విడుదలచేస్తున్నట్లు వెల్లడించింది. వెనువెంటనే ఆయనను జోధ్పూర్ కేంద్ర కారాగారం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విడుదలచేశారు. భర్త విడుదల కోసం కొంతకాలంగా న్యాయస్థానాల్లో పోరాడుతున్న గీతాంజలి ఆంగ్మో జోధ్పూర్ కేంద్ర కారాగారానికి వచ్చి ఆయనను వెంట తీసుకెళ్లారు.వాంగ్చుక్ను అరెస్ట్ను సవాల్చేస్తూ భార్య వేసి న పిటిషన్ మార్చి 17వ తేదీన సుప్రీంకోర్టులో తదుపరి విచారణకు రాబోతున్న వేళ కేంద్రం ఆయనను విడుదలచేయడం గమనార్హం. ‘‘తాజా పరిస్థితులు, లద్దాఖ్లో శాంతిస్థాపనే ధ్యేయంగా వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దుచేయాలని నిర్ణయించాం. లద్దాఖ్లో శాంతి, సుస్థిరత, పరస్పర విశ్వాసం పాదుగొల్పడమే మా లక్ష్యం. రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ వంటి అంశాల్లో అన్ని భాగస్వామ్య పక్షాలతో అర్థవంతమైన చర్యల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటుచేశాం. ఎన్ఏసీ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఆయనను తక్షణం వదిలేస్తున్నాం’’అని కేంద్రం శనివారం విడుదలచేసిన ప్రకటనలో పేర్కొంది.లద్దాఖ్కు రాష్ట్ర ప్రతిపత్తి, ఆరో షెడ్యూల్లో చేర్చడం సహా పలు డిమాండ్ల సాధన కోసం 59 ఏళ్ల వాంగ్చుక్ సారథ్యంలో యువత చేపట్టిన ఉద్యమం ఆనాడు లేహ్ పరిధిలో హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఉద్యమకారులతోపాటు 22 మంది పోలీసులు సహా ఆనాడు 90 మంది గాయపడ్డారు. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న లద్దాఖ్లో ఉద్యమం లేవదీసి అత్యంత సున్నితమైన సరిహద్దు భద్రతా అంశాన్ని ఆయన ప్రమాదంలో పడేశారంటూ కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద గత ఏడాది సెపె్టంబర్ 26వ తేదీన ఆయనను లద్దాఖ్ పాలనాయంత్రాంగం అదుపులోకి తీసుకుంది. భద్రతా కారణాలతో ఆయనను తర్వాత జోధ్పూర్ జైలుకు మార్చిన విషయం తెల్సిందే. మిగతా వారినీ విడుదలచేయండి వాంగ్చుక్ విడుదలను కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు స్వాగతించాయి. వాంగ్చుక్తోపాటు ఉద్యమించి జైలుపాలైన తమ తోటి వారిని తక్షణం విడుదలచేయాలని ఉద్యమకారుల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. ‘‘సోనమ్ రాక మాకు ఆనందమే. కానీ ఉద్యమం వేళ జైలుపాలైన ఉద్యమకారులనూ విడుదలచేయాలి. వాళ్లపై మోపిన అక్రమ కేసులను ఎత్తేయాలి. ఉద్యమం చేయడమనేది రాజ్యాంగబద్ధ హక్కు. మా రాష్ట్ర హోదా డిమాండ్ను మోదీ సర్కార్ నెరవేర్చాల్సిందే’’అని లద్దాఖ్ లోక్సభ సభ్యుడు మొహమ్మద్ హనీఫా డిమాండ్చేశారు.‘‘వాంగ్చుక్ విడుదల లద్దాఖ్ ప్రజల విజయం. లద్దాఖ్ వాసులపై మోపిన జాతీయవ్యతిరేక ముద్ర తప్పు అని వాంగ్చుక్ విడుదలతో తేలిపోయింది’’అని ది లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ) సహ చైర్మన్ చెరింగ్ డోర్జే అన్నారు. ‘‘దిల్దాన్ నామ్గియాల్, స్మాన్లా డోర్జీలనూ విడుదలచేయాలి. ఉద్యమం ఆగదు’’అని కార్గిల్ ప్రాంత రాజకీయనేత, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్(కేడీఏ) సభ్యుడు సజ్జద్ కార్గిలీ అన్నారు. ‘‘లద్దాఖ్ భద్రత, సుస్థిరతలో జాతీయవాది వాంగ్చుక్ పాత్ర అత్యంత కీలకమైంది’’అని అతని లాయర్, కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా వ్యాఖ్యానించారు. వాంగ్చుక్ విడుదలను జమ్మూకశీ్మర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. హింసను ఆపేయాలి: ఎల్జీ ‘‘లద్దాఖ్ ప్రాంత సమస్యలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. వాంగ్చుక్ విడుదల తర్వాత మళ్లీ హింసాత్మక మార్గంలో ఉద్యమిస్తామంటూ ఊరుకునేది లేదు. ఉద్యమాలకు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు. లద్దాఖ్ పౌరులు, నేతలు, వివిధ వర్గాల భాగస్వాములతో సంప్రదింపుల మార్గంలోనే సమస్యలకు పరిష్కారం వెతుకుదాం’’అని లద్దాఖ్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యాఖ్యానించారు. పది రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సారథ్యంలోని హైపవర్ కమిటీ సమావేశం కాగా అందులో వాంగ్చుక్ను తక్షణం విడుదలచేయాలని ఎల్ఏబీ, కేడీఏ నేతలు కోరడం తెల్సిందే. -
సిలిండర్లు దాచారో.. జైలుకే!
మధురై: ఎల్పీజీ కొరతను ఆసరాగా చేసుకుని, అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసిన ఇద్దరు వ్యక్తులపై తమిళనాడు ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు నడుం బిగించింది. మధురైలో భారీ ఎత్తున వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినట్లు సివిల్ సప్లైస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిపై అత్యంత కఠినమైన ‘ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్’ (గుండా చట్టం) కింద కేసు నమోదు చేశారు. సిలిండర్ల నిల్వపై రాష్ట్రంలో ఈ తరహా కఠిన చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు మధురై సమీపంలోని కోవిల్పాపాకుడి ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పళని అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన 100 సబ్సిడీ సిలిండర్లు, 109 కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆనందం నగర్లోని మదన్ కుమార్ (27) నివాసంలో సోదాలు నిర్వహించి, మరో 189 సిలిండర్లను గుర్తించారు. మొత్తం కలిపి 398 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.పి. మురళి మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళనతో ముందస్తు కొనుగోళ్లు చేయవద్దని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 టెర్మినల్స్లో 7,000 పైగా పెట్రోల్ బంకులకు సరిపడా నిల్వలు ఉన్నాయని, కనీసం మూడు వారాలకు సరిపడే స్టాక్ అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ బంకుల్లో నిల్వలు అయిపోవడం వల్ల ఇటువంటి వదంతులు వ్యాపించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తమిళనాడు వణిగర్ సంఘంగళిల్ పేరమైపు అధ్యక్షుడు విక్రమరాజా ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఏజెంట్లు ఒక్కో సిలిండర్ను రూ. 4,000 వరకు విక్రయిస్తున్నారని, దీనివల్ల సామాన్యులకు ఆహార పదార్థాల లభ్యత భారంగా మారుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం -
USAలో విద్యార్థిని అక్రమ అరెస్ట్?
అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై ఎంత కఠిన వైఖరి అవలంభిస్తోందో తెలిసిన విషయమే. తాజాగా పాలస్తీనాకు మద్ధతుగా నిరసన జరిపిందంటూ ఒక విదేశీ విద్యార్థిని USA సర్కార్ అరెస్టు చేసింది. అయితే దీనిపై న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ జోక్యంతో స్టూడెంట్ను రిలీజ్ చేసింది.గురువారం ఉదయం ( USA)ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక అపార్టుమెంటులోకి అకస్మాత్తుగా ప్రవేశించారు. ఒక పాపకోసం వచ్చామంటూ అందులోని అక్కడ ఉన్న నివాసితులకు నమ్మబలికారు. అలా సోదాలు జరిపి కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న ఎల్లీ అఘయేవా అనే విద్యార్థిని అరెస్టు చేశారు. దీంతో ఆమె షాక్కు గురైంది. తనను DHS ప్రతినిధులు అక్రమంగా అరెస్టు చేశారని తనను కాపాడాలని ఇన్స్టాలో మెసేజ్ చేసింది.ఆమె అరెస్టు వార్త విని కొలంబియా వర్సిటీలో నిరనసలు చెలరేగాయి. దీంతో న్యూయార్క్ మేయర్ జోహ్రానీ మామ్దానీ ట్రంప్తో భేటీ జరిపి ఆ విద్యార్థిని విడుదల చేయాలని కోరడంతో ట్రంప్ వెంటనే ఓకే అన్నారు. దీంతో ఆమె రిలీజైంది. అయితే తనను అరెస్టు చేయడం ఎంతో షాక్కు గురిచేసిందని ఆ విద్యార్థిని తెలిపింది. అయితే ఎల్లీ అఘవేయా అజర్బైజాన్ దేశానికి చెందిన విద్యార్థిని. అయితే మామ్దానీ, ట్రంప్ ఒకే పార్టీకి చెందిన నేతలు కాదు. ఎన్నికల సమయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అయినప్పటికీ ఆయన నిర్ణయాన్నిగౌరవించడం మేయర్ మాటకు గౌరవమిచ్చి ఆ విద్యార్థిని విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. -
యూత్ కాంగ్రెస్ చీఫ్ అరెస్టు
న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సు వేదిక వద్ద అర్ధ నగ్న నిరసన ప్రదర్శన కేసులో భారత యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది. చిబ్ను ఉదయం 4:30 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని ఉదయం 10 గంటలకు పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనపై నేరపూరిత కుట్ర, ప్రభుత్వోద్యోగికి హాని కలిగించడం, విధి నిర్వహణను అడ్డుకోవడం, ఉద్దేశపూర్వక అవిధేయత వంటి పలు అభియోగాలు నమోదు చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిరసన ప్రదర్శనకు ప్రధాన సూత్రధారి, కుట్రదారు ఆయనేనని పోలీసులు పేర్కొన్నారు. ‘‘ఇది నేపాల్లో జెన్–జీ నిరసనల నుంచి ప్రేరణ పొందిన పెద్ద కుట్ర. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అందులో పాల్గొన్నారు. ఈ దర్యాప్తు చాలా ముఖ్యమైనది’’అని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే చిబ్ నిరసన స్థలంలో లేరని, నిరసనకు సంబంధించి ఎలాంటి సూచనలూ చేయలేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అంతర్జాతీయ కార్యక్రమాల సందర్భంగా నిరసనలు పరిపాటేనని వాదించారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని అంతా అభినందిస్తుంటే నిరసనలకు నిరాకరించడం ఏమిటని ప్రశ్నించారు. వాదనల అనంతరం చిబ్కు జడ్జి నాలుగు రోజుల పోలీసు రిమాండ్ విధించారు.గత శుక్రవారం ఢిల్లీలో ఏఐ సదస్సు వేదికైన భారత మండపం ముందు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు టీ షర్టులు విప్పి అర్ధనగ్న నిరసనలకు దిగడం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన నరసింహ యాదవ్ కూడా ఉన్నారు. వేదిక వద్దకు ప్రవేశం కోసం వారంతా ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయని వెల్లడించారు. ఏఐ సదస్సు నిరసన కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. తదుపరి దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ తాలూకు ఇంటర్ స్టేట్ సెల్ (ఐఎస్సీ) నిర్వహిస్తుంది. నియంతృత్వం: రాహుల్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. చిబ్, ఇతర యువజన కాంగ్రెస్ నేతల అరెస్టులను ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది మోదీ సర్కారు నియంతృత్వ ధోరణులకు, పిరికితనానికి నిదర్శనమంటూ దుయ్యబట్టారు. దేశ ప్రయో జనాల కోసం నిర్భయంగా గొంతెత్తిన యువజన కాంగ్రెస్ సభ్యులను చూస్తే గర్వంగా ఉందన్నారు.భయపడేది లేదు: ఖర్గే అరెస్టులకు కాంగ్రెస్ భయపడబోదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ‘‘మమ్మల్ని భయపెట్టాలని మోదీ ప్రయతి్నస్తున్నారు. అదెన్నటికీ జరగదు. ఆయన సర్కారు ట్రంప్కు లొంగిపోయింది. ఆయన షరతులన్నింటికీ తలూపింది. ఉపాధి లేక దేశ యువత తీవ్ర నిరాశలో కూరుకుపోతోంది. మోదీ సర్కారుపై వారిలో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి’’అని ఆయన పేర్కొన్నారు. -
ఎప్స్టీన్ ఫైళ్ల కేసు.. మరో కీలక పరిణామం
లండన్: ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం తాలూకు టేపుల రగడ బ్రిటన్లో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలు నెరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మండేల్సన్ (72)ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే మండేల్సన్పై లైంగిక దుష్ప్రవర్తన వంటి ఆరోపణలేమీ లేవు. దాదాపు పదిహేనేళ్ల కింద బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆయన ఎప్స్టీన్కు చేరవేశారన్న అభియోగాలపై దర్యాప్తు సాగుతోంది. ఎప్స్టీన్ బాగోతానికి సంబంధించి బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ ఆండ్రూను ఐదు రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.2010లో జెఫ్రీ ఎప్స్టీన్కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై దర్యాప్తు ప్రారంభించామనీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ నేరంపై విచారణ జరుపుతున్నప్పుడు, దర్యాప్తు సమగ్రతను, నిష్పాక్షికతను కాపాడటం చాలా ముఖ్యమని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు ఆండ్రూ రహస్య సమాచారం ఇచ్చాడనే నివేదికలపై విచారణకు కింగ్ చార్లెస్ III సహకరిస్తారని బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపిన సంగతి తెలిసిందే.మరోవైపు.. ఎప్స్టీన్ కేసులో బాధితురాలు రినా ఓహ్ ఎదుర్కొన్న చేదు అనుభవాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా బ్రిటీష్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్ట్ తరువాత లైంగిక వేధింపుల పర్వంపై 40 ఏళ్ల రీనా విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఎప్స్టీన్ లాంటిపవర్పుల్ వ్యక్తి సామాన్యులను, మానసికంగా బలహీనంగా ఉన్నవారిని ఎలా లోబరుచుకుంటారో, ఎలాంటి వేధింపులకు గురిచేస్తారో వివరించింది. -
అతనితో పనైపోయింది.. అందుకే వాసుదేవరెడ్డి అరెస్ట్
-
హైదరాబాద్ లో బీజేపీ రామచందర్ రావు అరెస్ట్
-
భారీ ఉగ్ర కుట్ర భగ్నం: ఎనిమిది మంది అరెస్ట్
న్యూఢిల్లీ: భారత గడ్డపై మరోసారి నెత్తురు పారించాలని చూసిన అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా కుట్రను ఢిల్లీ పోలీసులు తిప్పికొట్టారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద సంస్థల అండదండలతో భారత్లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచించిన ఎనిమిది మంది ముష్కరులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఆరుగురిని తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో, మరో ఇద్దరిని పశ్చిమ బెంగాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులకు పట్టుబడిన వారిలో కొందరు బంగ్లాదేశీయులు ఉన్నారని, వీరంతా నకిలీ ఆధార్ కార్డులతో తమ స్వస్థలాలను దాచిపెట్టి, దేశంలో చొరబడినట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా తమిళనాడులోని గార్మెంట్ తయారీ యూనిట్లలో కార్మికులుగా చలామణి అవుతూ, వీరు రహస్యంగా ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నట్లు ప్రత్యేక విభాగం అధికారులు గుర్తించారు. ఈ భారీ కుట్ర వెనుక విదేశాల్లో తలదాచుకున్న హ్యాండ్లర్ల హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.కశ్మీర్కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంటూ ఈ ఎనిమిది మందిని భారత్లో ఆపరేట్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు నిర్ధారించాయి. నిందితుల నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, పదహారు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిలోని డిజిటల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు, చారిత్రక కట్టడాలే లక్ష్యంగా లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఐఈడీ దాడులకు ప్లాన్ చేస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ముఖ్యంగా పాత ఢిల్లీలోని చాంద్నీ చౌక్ ప్రాంతంలోని ఓ దేవాలయంతో పాటు ఎర్రకోట పరిసరాల్లో మారణహోమం సృష్టించేందుకు వీరు వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఢిల్లీ మెట్రో సహా సుమారు పదికి పైగా ప్రాంతాల్లో ‘ఫ్రీ కాశ్మీర్’ నినాదాలతో కూడిన రెచ్చగొట్టే పోస్టర్లను ఈ ముఠా అంటించింది. ఈ పోస్టర్ల మూలాలపై దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులకు తమిళనాడు కేంద్రంగా సాగుతున్న ఈ నెట్వర్క్ చిరునామా చిక్కింది. గతంలో జమ్ముకశ్మీర్ నుంచి ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీ వరకు విస్తరించిన డాక్టర్ల ఉగ్ర మాడ్యూల్ తరహాలోనే, ఈ ముఠా కూడా అత్యంత రహస్యంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఢిల్లీ డిక్లరేషన్: బయటపడిన పాక్ కుళ్లు.. తైవాన్ భయం? -
వాసుదేవరెడ్డి అరెస్ట్
విజయవాడ లీగల్: మద్యం అక్రమ కేసులో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా పని చేసిన ఏ2 నిందితుడు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు శనివారం విజయవాడలో అరెస్టు చేశారు. అధికారులు విచారణ కోసం శనివారం సిట్ కార్యాలయానికి పిలిచి, మద్యం అక్రమ కేసుకు సంబంధించిన వివరాలు కాకుండా వేరే కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారని తెలిసింది. అనంతరం వాసుదేవరెడ్డిని సాయంత్రం అరెస్టు చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వాసుదేవరెడ్డికి ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డి తరపు న్యాయవాది కావూరి గోపీనా«థ్ వాదనలు వినిపిస్తూ, సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని, ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారారని, ఈ సమయంలో అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డి విచారణకు సంబంధించిన స్టేట్మెంట్ను సిట్ సమర్పించిందని, హైకోర్టులో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు పెండింగ్లో ఉందన్నారు. ప్రాసిక్యూషన్కు పూర్తిగా సహకరిస్తున్నందున సెక్షన్ 35 నోటీసులు జారీ చేసి రిమాండ్ను తిరస్కరించాలని న్యాయమూర్తిని కోరారు. సిట్ తరఫు న్యాయవాది రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో వాసుదేవరెడ్డి కీలకపాత్ర వహించారని, ఆయనకు తెలిసే ఈ అక్రమాలు జరిగాయన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.192 కోట్లు నష్టం చేకూర్చారని, ప్రైవేటు వ్యక్తులకు సహకరించారని పేర్కొన్నారు. ప్రతి నెల రూ.60 కోట్లు వరకు దారి మళ్లించారని పేర్కొన్నారు. అప్రూవర్గా మారినంత మాత్రాన నిర్దోíÙగా చూడలేమని, అతన్ని కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున రిమాండ్ విధించాలని వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి భాస్కరరావు ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ, గుంటూరు జైలుకు తరలించాలని ఆదేశించారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. ధనుంజయ్రెడ్డి, ఇతరుల బెయిల్పై విచారణ వాయిదా ఈ కేసులో బెయిల్పై ఉన్న ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లపై విచారణను న్యాయమూర్తి భాస్కరరావు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. -
పని అయిపోయిందా.. ఇది మరో కుట్రా.?
సాక్షి, అమరావతి : మద్యం అక్రమ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్) అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డిని ఇప్పటి వరకు వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు అరెస్ట్ చేసిందని, ఆయనతో పని అయిపోయిందా లేక ఇది మరో కుట్రా అని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జరగని మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం, ఇందుకు వాసుదేవరెడ్డిని ఓ పావుగా వాడుకుందని, ఆయన్ను హింసించి, ప్రలోభపెట్టి వారికి కావాల్సిన విధంగా ఆయన్నుంచి వాంగ్మూలాలు తీసుకుందని బొత్స శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏ స్కీమ్ ప్రకారం ఇంత బురదజల్లారని ఆయన ప్రశ్నించారు.అన్యాయంగా ఆఫీసర్లను, వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి జైలులో నిర్బంధించారని, వారందరినీ న్యాయస్థానాలు విడుదల చేయడంతోనే ఈ కేసులో అసలు స్కామ్ లేదని అర్ధమవుతోందని బొత్స వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ ఏ2ను బయట ఉండనిచ్చి, తాము ఎంచుకున్న అధికారులను, నాయకులను అరెస్టులు చేయడాన్ని బట్టే ఇందులో ఏ స్కామ్ లేదని అందరికీ అర్ధమయ్యిందని, ఇదంతా సర్కారు జల్లిన బురదేనని అర్ధమవుతోందని అన్నారు. వరుసగా లడ్డూ కల్తీ వివాదంలో దొరికిపోవడం, హెరిటేజ్ – ఇందాపూర్ బంధం బయటపడడం, శాసనమండలిలో కనీసం సమాధానం చెప్పలేని దుర్గతి పట్టడంతో.. ఇపుడు ఏదో కొత్త కుట్రకు పదును పెడుతున్నట్లు అర్ధమవుతోందని బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు సాగించిన మద్యం దోపిడీపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తాను గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి భిన్నంగా అబద్దపు వాంగ్మూలం ఇచ్చి చంద్రబాబు మద్యం కేసు మూసివేతకు సహకరించిన విషయమూ తెలిసిందేనన్నారు. బొత్స ఇంకా ఏమన్నారంటే.. ‘‘వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని పలువురు వైఎస్సార్సీపీ నేతలను, అప్పటి ప్రభుత్వ హయాంలోని కీలక అధికారులను అక్రమంగా అరెస్ట్ చేసి నెలల పాటు జైల్లో ఉంచింది. అయితే న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వడంతో వారందరూ జైలు నుంచి విడుదలయ్యారు. ఇన్ని రోజులు ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పుడు కనీస స్థాయిలో కూడా అభ్యంతరం చెప్పని చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. వాసుదేవరెడ్డి బయట ఉండటానికి వీల్లేదని, ఆయన సాక్ష్యాలను తారుమారు చేస్తారని, అందువల్ల ఆయన్ను అరెస్ట్ చేసినట్లు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. వాస్తవానికి ఇదంతా కూడా ఓ నాటకంలా కనిపిస్తోంది. ఇన్ని రోజులు తమ చెప్పు చేతల్లో ఉన్న వాసుదేవరెడ్డి నుంచి వారికి కావాల్సిన విధంగా వివరాలు తెలుసుకున్న సిట్, ఇప్పుడు అదే వ్యక్తి నుంచి కొత్తగా రాబట్టాల్సిన వివరాలు ఏముంటాయి? అరెస్ట్ సమయంలో ఆయన్ను మధ్యవర్తుల సమక్షంలో విచారించామని, అయితే ఆయన కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పలేదని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ముందస్తు బెయిల్ కోసం వాసుదేవరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు, ఇదే సిట్ అప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో చేసిన ఏ ఆరోపణను కూడా ఏసీబీ కోర్టు ముందు ప్రస్తావించలేదు. పైపెచ్చు వాసుదేవరెడ్డి తమకు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పింది. హైకోర్టులో కూడా ఇదే రీతిలో చెప్పింది. భయపెట్టి.. ప్రలోభపెట్టి వాసుదేవరెడ్డిని లొంగదీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ కీలక నేతలపై దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా మద్యం కుంభకోణమంటూ ఓ తప్పుడు కేసు తెరపైకి తెచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ పలువురు వైఎస్సార్సీపీ నేతలను, అప్పటి అధికారులను నిందితులుగా చేర్చింది. ఇందులో వాసుదేవరెడ్డి రెండో నిందితునిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు వాసుదేవరెడ్డిని వేధింపులకు గురి చేసి సిట్ తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుంది. అరెస్ట్ బూచిని చూపి ఆయన్ను భయపెట్టింది. ఇలా వాసుదేవరెడ్డిని దార్లోకి తెచ్చుకున్న సీఐడీ, ఆయనకు ప్రలోభాలు చూపింది. ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమని, రాష్ట్రం నుంచి రిలీవ్ చేసి తిరిగి మాతృశాఖ అయిన రైల్వేకు పంపుతామని హామీ ఇచ్చింది. అరెస్ట్ చేయబోమని, అప్రూవర్గా మారి తాము చెప్పినట్లు చేస్తే చాలని వాసుదేవరెడ్డికి చెప్పింది. దీంతో వాసుదేవరెడ్డి పూర్తిగా చంద్రబాబు అండ్ కోకు లొంగిపోయారు. ఇచ్చిన హామీ మేర ఆయన్ను మాతృశాఖ అయిన రైల్వేకు పంపేసింది. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలను, విశ్రాంత అధికారులను అరెస్ట్ చేయడం మొదలు పెట్టింది. వాసుదేవరెడ్డి వాంగ్మూలాలను ముందు పెట్టి వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటూ వచ్చింది. చివరకు వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు మద్దతుగా వాదనలు వినిపించింది. వాసుదేవరెడ్డిని అప్రూవర్గా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిట్ ద్వారా శతవిధాలా ప్రయత్నించింది. ముందస్తు బెయిలిస్తే అప్రూవర్గా మారుతానంటూ ఏసీబీ కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సిట్ వ్యతిరేకించలేదు. అయితే ముందస్తు బెయిల్ ఇస్తే అప్రూవర్గా మారుతానన్న షరతును ఏసీబీ కోర్టు తప్పుపట్టింది. అప్రూవర్గా మారే వ్యక్తి కేసు విచారణ మొత్తం పూర్తయి తీర్పు వెలువడేంత వరకు జైల్లోనే ఉండాల్సి ఉంటుందని, ముందస్తు బెయిల్ అన్న ప్రశ్నే తలెత్తదని ఏసీబీ కోర్టు తేల్చి చెబుతూ, ఆయన పిటిషన్ను కొట్టేసింది. దీంతో వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అప్రూవర్గా మారతానని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మద్యం కేసులో సహ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అభ్యంతరం చెబుతూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి కీలక నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించాల్సిన సిట్, విస్మయకరంగా చెవిరెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను వ్యతిరేకించింది. తద్వారా పరోక్షంగా వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను సమర్థించినట్లయింది.’’ అని బొత్స పేర్కొన్నారు. -
ఇద్దరు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): ఆన్లైన్ యాప్లలో ఇన్వెస్ట్ చేస్తే అధికలాభాలు వస్తాయని నమ్మించి మోసగించారని అందిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. తీగ లాగితే డొంక కదిలిన చందాన క్రికెట్ బెట్టింగ్ వెలుగులోకి వచ్చింది. ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం వివరాలు వెల్లడించారు. నెల్లూరు ఎన్టీఆర్ నగర్కు చెందిన ఓ వ్యాపారికి బుచ్చిరెడ్డిపాళెం రామకృష్ణానగర్కు చెందిన కె.వేణుగోపాల్తో పరిచయమైంది. ఆయన ఆన్లైన్ యాప్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ ఫోన్ నంబర్ ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన వ్యాపారి పలుమార్లు ఆ యాప్లో రూ.53 లక్షలు డిపాజిట్ చేశారు. రోజులు గడుస్తున్నా ఆదాయం రాకపోవడంతో వేణుగోపాల్ను బాధితుడు సంప్రదించగా కాలయాపన చేయడంతోపాటు ఇటీవల బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి బుచ్చిరెడ్డిపాళెంలోని ఇంటిపై దాడి చేసి వేణుతోపాటు అక్కడే ఉన్న బి.వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా క్రికెట్ బెట్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వేణుగోపాల్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు కలిసి రాధే ఎక్స్చేంజ్ యాప్ (ఆర్777) ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు, వెంకటరమణ బెట్టింగ్ తాలుకు నగదును తీసుకుని జూదరులకు ఇస్తున్నట్లు వెల్లడైంది. ఎవరైనా బెట్టింగ్ విషయంలో గొడవ చేస్తే కత్తులతో చంపుతామని నిందితులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. వ్యాపారికి చెందిన నగదును సైతం నిందితులు బెట్టింగ్లో పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. క్స్చేందీంతో పోలీసులు వేణుగోపాల్, వెంకటరమణను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.34,65,800 నగదు, ల్యాప్టాప్, టీవీ, 13 మొబైల్స్, రెండు కత్తులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1,64,74,600.60 నగదును సీజ్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష పాల్గొన్నారు. -
ఎప్స్టీన్ ఫైల్స్ : మాజీ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్
దశాబ్దాల పాటు సెక్స్ ట్రాఫికింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వ పదవిలో ఉండి దుష్ప్రవర్తనకు (misconduct in public office) పాల్పడ్డారనే అనుమానంతో, బ్రిటన్ రాజుగ కింగ్ చార్లెస్-3 సోదరుడు మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్బాటన్-విండ్సర్ (Andrew Mountbatten)ను సాండ్రింగ్హామ్ ఎస్టేట్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఈ మేరకు థేమ్స్ వ్యాలీ పోలీసులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నార్ఫోక్కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బ్రిటన్ చట్టం ప్రకారం నిందితుడి పేరును వారు అధికారికంగా వెల్లడించలేదు.సమగ్రమైన పరిశీలన తర్వాతే ఆయనను అరెస్టు చేసినట్లు, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపారని బీబీసీ నివేదించింది. 2010లో జెఫ్రీ ఎప్స్టీన్కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై కూడా తాము విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై దర్యాప్తు ప్రారంభించామనీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ నేరంపై విచారణ జరుపుతున్నప్పుడు, దర్యాప్తు సమగ్రతను, నిష్పాక్షికతను కాపాడటం చాలా ముఖ్యమని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు ఆండ్రూ రహస్య సమాచారం ఇచ్చాడనే నివేదికలపై విచారణకు కింగ్ చార్లెస్ III సహకరిస్తారని బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుఅంతకుముందు రోజు ఉదయం, సాండ్రింగ్హామ్ ఎస్టేట్లోని వుడ్ ఫామ్ వద్దకు గుర్తు తెలియని ఆరు పోలీసు కార్లు , సుమారు ఎనిమిది మంది సాదా దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు చేరుకోవడం కనిపించిందని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు మాజీ యువరాజు ఈరోజు 66 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
రాళ్ల దాడి కేసు.. బాల్క సుమన్ అరెస్టు
సాక్షి,మంచిర్యాల జిల్లా: రాళ్ల దాడి కేసులో అరెస్టయిన బాల్క సుమన్కు మంచిర్యాల కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషన్ జూనియర్ సివిల్ జడ్జ్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం. బాల్క సుమన్ అరెస్టు సమయంలో ఆయన నివాస ప్రాంతమైన క్యాతన పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బాల్క సుమన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలి వచ్చారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటిగేటును బలవంతంగా ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల రాకపై సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాల్క సుమన్ ఇంటి గేట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాల్క సుమన్ ఇంటి గేట్లను బలవంతంగా ఓపెన్ చేశారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాల్క సుమన్ను అరెస్టు చేశారు. సుమన్ను విడుదల చేయాలి: హరీశ్రావుమాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. బాల్క సుమన్ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకే ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. -
సృష్టి ఫెర్టిలిటీ కేసు.. డాక్టర్ నమృత అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్ నమృతను పోలీసులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గిరిజనుల వద్ద నుంచి బిడ్డలను కోనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టినట్లు నమ్మించిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.అయితే డాక్టర్ నమృతపై గతంలో పలు అభియోగాలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో సరోగసీ పేరుతో 'సృష్టి' ఫెర్టిలిటీ సెంటర్ చాలా మోసాలు చేస్తోందని గతంలో కేసులు నమోదయ్యాయి. ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీనికోసం ఏపీలో కొంత మంది ఏఎన్ఎం(ANM)ల సహాయం కూడా తీసుకున్నారని విచారణలో తేలింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రతను జులై 27న పోలీసులు అరెస్టు చేశారు. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని. తదితర ఆరోపణలతో డాక్టర్ నమ్రతపై కేసులు నమోదు చేశారు.అంతేకాకుండా డాక్టర్ నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవిద్యను చదివిన ముగ్గురు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలు గతంలో బెయిల్ పై విడుదలకాగా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
లంబోర్ఘిని ప్రమాదం : బిజినెస్ టైకూన్ కొడుకు అరెస్ట్, గంటల్లో బెయిల్
లంబోర్గిని కారు ప్రమాదం కేసులో టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా కుమారుడు 26 ఏళ్ల శివం మిశ్రాను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ (Kanpur) లో గత ఆదివారం జరిగిన లగ్జరీ లంబోర్ఘిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా టుబాకో టైకూన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా (Shivam Mishra) ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో హాజరుపర్చిన కేవలం గంటల వ్యవధిలోనే శివం మిశ్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖరీదైన , హైస్పీడ్ కారు ఢీకొని ముగ్గురు ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.గత ఆదివారం రింగ్ వాలా చౌరాహా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన లంబోర్ఘిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్ బైకును ఢీకొని, ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోరిక్షా డ్రైవర్ తౌసీఫ్ అహ్మద్, ఇద్దరు మోటార్ సైకిల్ రైడర్లు విశాల్, సోను త్రిపాఠి గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివమ్ కాదని, డ్రైవర్ మోహన్ యాదవ్ అని శివమ్ తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్ మోహన్ యాదవ్ కూడా తానే డ్రైవ్ చేశానని తొలుత ఒప్పుకున్నాడు.అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారును శివం మిశ్రానే నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, తమ దర్యాప్తులో తేలిందని , ఆస్పత్రి నుంచే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శివమ్ మిశ్రా కాన్పూర్లో ఉన్నట్లు సమాచారం అందగానే ఐదు బృందాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కన్పూర్ డీసీపీ తెలిపారు.శివం మిశ్రా అరెస్ట్ అక్రమని న్యాయవాది నరేష్ చంద్ర త్రిపాఠి వాదించారు. అందుకే అతని రిమాండ్ను కోర్టు తిరస్కరించిందన్నారు. రూ.20,000 అండర్ టేకింగ్ , మరో రూ.20 వేల వ్యక్తిగత బాండ్పై విడుదలైనట్టు తెలిపారు. -
జైల్లో అంబటిని కలిసిన తరువాత ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
-
ఇటువంటివి నేనెప్పుడూ చూడలేదు... ఇది మీకు చాలా ప్రమాదం.. అరెస్ట్ పై ఉండవల్లి
-
నోబెల్ విజేతకు ఏడున్నరేళ్ల జైలుశిక్ష
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ మొహమ్మదికి ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది. తాజా తీర్పు ప్రకారం ఏడున్నరేళ్ల జైలు శిక్ష పడింది. దేశం విడిచి వెళ్లకుండా రెండేళ్ల పాటు నిషేధం విధించారు. ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తుండగానే ఈ తీర్పు వచ్చింది. ఇది వెలువడిన వెంటనే అంతర్జాతీయంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ మేరకు నర్గెస్ న్యాయవాది మోస్తఫా నీలీ పలు వివరాలు వెల్లడించారు.నర్గెస్ లాయర్ చెప్పిన ప్రకారం.. ఈమెపై ప్రభుత్వం రెండు ప్రధాన ఆరోపణలు మోపింది. దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం, సమావేశాలు నిర్వహించారనే ఆరోపణపై ఆరేళ్లు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణపై ఏడాదిన్నర జైలు శిక్ష విధించారు. మొత్తంగా ఏడున్నరేళ్లు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం నర్గెస్ మొహమ్మది చాన్నాళ్లుగా పోరాడుతున్నారు. ఈ విషయమై ఇదివరకే పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. శిక్ష కూడా అనుభవించారు. కొరడా దెబ్బలు సైతం ఓర్చుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా నర్గెస్ చేస్తున్న పోరాటానికి గుర్తింపుగానే 2023లో ఈమెని నోబెల్ శాంతి బహుమతి వరించింది. జైల్లో ఉండగానే నోబెల్కు ఎంపికవడం విశేషం.హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలు.. నర్గెస్ మొహమ్మదిని తక్షణమే విడుదల చేయాలని, ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా మానవ హక్కుల్ని గౌరవించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. -
31 ఏళ్ల క్రితం నాటి కేసులో ప్రస్తుత ఎంపీ అరెస్ట్
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొని ఊరికి వచ్చిన బిహార్ పూర్ణియా నియోజకవర్గ ఇండిపెండెంట్(స్వతంత్ర) ఎంపీని పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. శుక్రవారం అర్థరాత్రి దాదాపు మూడు గంటల పాటు ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు పోలీసులు.. 31 ఏళ్ల క్రితం నాటి కేసులో పప్పు యాదవ్ని అరెస్ట్ చేశారు.కేసు ఏంటి?1995లో వినోద్ బిహారి లాల్ అనే వ్యక్తికి సంబంధించిన ఇంటిని అద్దెకు తీసుకున్న పప్పు యాదవ్.. తర్వాత దాన్ని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వినోద్.. అప్పట్లో పోలీసులని ఆశ్రయించారు. పప్పు యాదవ్పై ఫోర్జరీ, మోసం, బెదిరింపులు తదితర సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే తాజాగా కోర్టు వారెంట్ జారీ చేసింది. దీనిని తీసుకుని పోలీసులు.. శుక్రవారం రాత్రి పాట్నాలోని మందిరి ప్రాంతంలో ఉన్న పప్పు యాదవ్ ఇంటికి వచ్చారు. కానీ అరెస్ట్ చేసేందుకు మూడు గంటలకు పైగానే పట్టేసింది.50 మంది పోలీసులు వచ్చినప్పటికీ.. పప్పు యాదవ్ అనుచరలు రంగంలోకి దిగడంతో పెద్ద హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు భారీ బందోబస్తు నడుమ పప్పు యాదవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల చేసి అనంతరం పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లే అవకాశముంది. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం తనని వేధిస్తోందని.. అరెస్ట్ సమయంలో పప్పు యాదవ్ మండిపడ్డారు. -
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్.. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా..!
గతంలో డ్రగ్స్ మహమ్మారి టాలీవుడ్ను ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతో సినీ ప్రముఖులు సైతం విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా చెన్నైలో మలయాళ నటి అంజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన ఆమెను డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సినీ రంగంలో ఈ డ్రగ్స్ దందా మరోసారి హాట్ టాపిక్గా మారింది.చెన్నై నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో వెంకటేశ్ అనే మరో వ్యక్తితో పాటు నటి అంజు కృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ విన్సీ నివేతను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు.కాగా.. కేరళలోని త్రిసూర్కు చెందిన అంజు కృష్ణ మోడలింగ్తో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరో' (Aaro) సినిమాతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా మలయాళంలో 'సుమేశ్ రమేశ్', ఆకాశం కడన్'లాంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 'వెల్లిమలై' అనే చిత్రంలో మెరిసింది. తాజాగా అంజు కృష్ణ డ్రగ్స్ కేసులో దొరకడం అభిమానులను షాకింగ్కు గురి చేస్తోంది. -
థాయిలాండ్: ఆశ్రమంలో అశ్లీల చిత్రాలు.. నలుగురు సన్యాసుల అరెస్ట్
థాయిలాండ్లో ఓ బౌద్దసన్యాసుల మఠంలో పోలీసులు దాడులు నిర్వహించగా అశ్లీల చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఇతర నిషేదిత వస్తువులు లభించాయి. దీంతో ఆ నలుగురు సన్యాసులను పోలీసులు అరెస్టు చేశారు.చోన్బూరి ప్రావిన్స్లోని ఫ్రోమ్ సాంథోన్ అనే బౌద్ద సన్యాసుల ఆశ్రమంలో నిషేదిత వస్తువులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆ ఆశ్రమంపై దాడి చేయగా పలు నిషేదిత వస్తువులు లభించాయి. తనీఖీల్లో తుపాకులు, మాదకద్రవ్యాలు, అశ్లీల చిత్రాల వీడియోలు లభించాయి. దీంతో అంతే కాకుండా వారి వద్ద అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహిళల ఫోన్ నెంబర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారు ఫ్రా సుపాచాయ్, జంతావోంగ్, ఫ్రా విరాట్ ముక్దాసానిత్, ఫ్రా థానావోల్, వీరందరూ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిగా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఆశ్రమంలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని గ్రామస్థుల నుంచి ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలు వాడుతున్న ముగ్గురు సన్యాసులను పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. మరోకరిని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
10 గంటలు.. 2000 మంది.. ప్రధానికి కంప్లైంట్ ఇస్తే..! అడ్వకేట్ సంచలన నిజాలు
-
ఆంధ్రప్రదేశ్లో గూండారాజ్... పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. శనివారం రాత్రి అరెస్టు
-
High Court: న్యాయస్థానంలో పోలీసుల హద్దులు దాటారా?
-
సౌదీలో వారంలో 18,200 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా?
సౌదీ అరేబియా చట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలు అమలు చేసే దేశంలో సౌదీ ముందు వరుసలో ఉంటుంది. తాజా నివేదికలు సైతం అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. కేవలం ఒక్క వారంలోనే ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఉల్లంఘించినందుకు 18 వేలకు పైగా కార్మికులను అరెస్టు చేసినట్లు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.గతవారం సౌదీ అరేబియాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు భారీ స్థాయిలో ఆపరేషన్ చేపట్టి 18,200 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 11,422 మంది వలసదారుల చట్టాలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేసినట్లు తెలిపారు. 3,858 మందిని సరిహద్దు భద్రతా చట్టాలను 3,951 మంది కార్మిక చట్టాలు అతిక్రమించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు అక్రమంగా సౌదీలోకి ప్రవేశించడానికి యత్నించిన 2,827మందిని బంధించినట్లు తెలిపారు. అయితే ఇదివరకే 14,451 మందిని ఇప్పటికే దేశం నుంచి బహిష్కరించినట్లు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించిన వారిలో దాదాపు 53 శాతం ప్రజలు ఇథియోపియా దేశానికి చెందిన వారు కాగా 46 శాతం మంది యెమెన్కు చెందిన వారు. సౌదీలో చట్టాలను అతిక్రమించిన వారికి ఆశ్రయం కల్పించినా ఏదైనా సహాయం చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. వారికి జైలుశిక్ష వేయడంతో పాటు వారి ఆస్తులు జప్తుచేస్తారు. అయితే ఇటీవల సౌదీలో పనిచేస్తున్న ఓ భారతీయుడు ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తికి లిప్ట్ ఇచ్చాడు. ఆ విషయం అతనికి తెలియదు. అయితే ఆ సమయంలోనే భద్రతా అధికారులు తనిఖీలు జరిపగా ఆ విదేశీయుడు అక్రమంగా సౌదీలోకి ప్రవేశించినట్లు తేలింది. దీంతో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తితో పాటు అతనికి లిఫ్ట్ ఇచ్చినందుకు ఆ భారతీయున్ని అరెస్టు చేశారు. అనంతరం అతడి ఉద్యోగం సైతం పోయింది.దీంతో ఆ బాధితుడు ఇండియాకు తిరిగి వచ్చాడు. కనుక జీవనోపాధి కోసం సౌదీ వెళ్లేవారు అక్కడి చట్టాలపై అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
గతేడాది USAలో 23,830 మంది భారతీయుల అరెస్ట్
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినాటి నుంచి అక్రమ వలసదారులపై కఠినవైఖరి అవలంభించారు. వారు దేశంలోకి రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. అయినప్పటికీ అమెరికాలోకి అక్రమ వలసలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఆ దేశం విడుదల చేసిన సర్వేలో కనీసం 20 నిమిషాలకు ఒక భారతీయుడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే యత్నం చేస్తున్నట్లు తేలింది. ఈ నివేదిక భారత్లో కొంత ఆందోళన కలిగిస్తుంది.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై రెచ్చిపోయారు. ఎట్టిపరిస్థితుల్లో వారు దేశంలో ఉండేది లేదంటూ హుకుం జారీ చేశారు. తమకు తాము స్వచ్ఛందంగా దేశాన్ని వదిలితే ప్రోత్సహాకాలు అందిస్తామని ప్రకటించారు. అయితే ట్రంప్ ఇంతగా కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆదేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య ఇప్పటికీ లక్షల్లోనే ఉంది. 2025లో USAలోకి అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య 3లక్షల 90వేలుగా ఉన్నట్లు యుఎస్ కస్టమ్స్.. బోర్డర్ ప్రోటెక్షన్ విడుదల చేసిన సర్వే తెలిపింది.అయితే వీరిలో భారతీయులు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. బోర్డర్ ప్రొటెక్షన్ నివేదిక ప్రకారం... 2025లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 23,830 భారతీయులు అరెస్టయ్యారు. అదే 2024 అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ అరెస్టైన వారి సంఖ్య 85,119గా ఉంది. మెుత్తంగా 2025లో USAలోకి అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య 3లక్షల 90వేలుగా ఉంది. అయితే బాధాకర విషయం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు ఒంటరిగా సరిహద్దు దాటుతున్నారు. వారి వెంట ఎవరూ లేకుండా పోలీసులకు పట్టుబడుతున్నారు.భారతీయులు అధికంగా కెనడా సరిహాద్దునుండే అమెరికాలోకి ప్రవేశిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. 6,968 మంది కెనడా, యుఎస్ బోర్డర్ గుండా ప్రవేశిస్తూ అరెస్టైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. 2022లో ఇటువంటి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ ఓ భారతీయ కుటుంబం మృతిచెందిన ఘటన ఒకటి జరిగింది.గుజరాత్ గాంధీనగర్కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిద్దామని ప్రయత్నించారు. కానీ ఆ తీవ్రమైన చలిగాలులకు తట్టుకోలేక మార్గమధ్యలోనే నలుగురు మరణించారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
29 ఏళ్ల తర్వాత దండుపాళ్యం ముఠా సభ్యుడి అరెస్టు
దొడ్డబళ్లాపురం: దండుపాళ్యం ముఠా సభ్యుడిని 29 ఏళ్ల తర్వాత మంగళూరులోని ఉర్వ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటె తాలూకా దండుపాళ్యంకి చెందిన నిందితుడు చిక్కహనుమ అలియాస్ చిక్క హనుమంతప్ప అలియాస్ కృష్ణప్ప (55) ప్రస్తుతం ఏపీలోని మదనపల్లె విజయనగర కాలనీలో కె.కృష్ణగా పేరు మార్చుకుని నివసిస్తున్నాడు. మంగళూరు మారిగుడి క్రాస్ వద్ద అన్వర్ మహల్ అనే వ్యక్తి ఇంట్లోకి 1997 అక్టోబర్ 14న అర్ధరాత్రి దండుపాళ్యం ముఠా సభ్యులు ఎనిమిది మంది చొరబడ్డారు. లూవిస్ డిమెల్లో(80), రంజిత్ వేగస్(19) అనే ఇద్దరిని హత్య చేసి దోపిడీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న ఉర్వ పోలీసులు ప్రధాన నిందితుడైన చిక్కహనుమ మినహా మిగతా నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని ఏపీలో గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. ఇతనిపై 13 హత్యలు, దోపిడీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
సోషల్ మీడియా సెన్సేషన్.. ఎవరీ అభినవ భగత్ సింగ్!
ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తాం..అన్న నేతలే పారిపోతుంటే, ఓ బాలుడు మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నాడు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అవినీతి చూసి ‘ఆ నాకెందుకులే’ అని పక్కకు తప్పుకోకుండా, ప్రశ్నిస్తున్నాడు. విమర్శిస్తున్నాడు. ఇందుకోసం పాఠ్య పుస్తకాలే కాదు, లా పుస్తకాలు కూడా తిరగేస్తున్నాడు. అధికారులకు, నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నెటిజన్లు అతన్ని ‘యూపీ భగత్ సింగ్’గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన 14 ఏళ్ల బాలుడు అశ్వమిత్ గౌతమ్. సాధారణంగా 14ఏళ్ల బాలుడు అంటే తొమ్మిది, లేదంటే పదోతరగతి పుస్తకాలతో కుస్తీ పడతారు. మార్క్స్,ఎగ్జామ్స్,పర్సంటేజ్ పేరుతో క్షణం తీరికి లేకుండా స్కూల్,ట్యూషన్,ఇల్లే జీవితంగా గడిపేస్తుంటారు. కానీ ఈ ఛోటా భగత్ సింగ్ అలా కాదు. సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన గౌతమ్ ఇన్స్టాగ్రామ్లో ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ను సంపాదించాడు. రాజకీయాలు, నేతలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, మీడియా, వ్యాపారవేత్తల స్కాంలు వంటి అంశాలపై ఆధారాలతో మాట్లాడుతున్నాడు. ప్రజలు అతన్ని అభినవ భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పోలుస్తున్నారు. ఈ చైతన్యం పాలకులను, అధికారులను అసహనానికి గురి చేసింది. మైనర్ అని కూడా చూడకుండా అతనిపై సెక్షన్ 151 ప్రయోగించి అరెస్టు చేశారు. కొద్దిసేపటికే విడుదల చేసినా, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతూ, ప్రభుత్వాలపై అతను సంధించిన ప్రశ్నలు ప్రజల్లో చైతన్యం రేపుతున్నాయి.వెరసీ అతడిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై విమర్శాత్మక వీడియోలు పోస్ట్ చేసినందుకు ఈ చర్య తీసుకోవడం పిల్లల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలపై కేసులు నమోదు చేయడం ప్రత్యేక నిబంధనలతో మాత్రమే సాధ్యం. ఈ కేసు చట్టపరమైన సరళతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. న్యాయవేత్తలు పిల్లలపై ఇలాంటి చర్యలు భయపెట్టే ప్రయత్నం’ అని వ్యాఖ్యానిస్తున్నారు.అశ్వమిత్ గౌతమ్ కథ ఒక చిన్నారి ధైర్యానికి ప్రతీక. వయసు చిన్నదైనా, ఆలోచనలు పెద్దవిగా మారి సమాజాన్ని కదిలిస్తున్నాయి. పిల్లలపై ఇలాంటి చర్యలు చట్టపరంగా సరైనవా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సత్యం, న్యాయం కోసం ప్రశ్నించే స్వరం ఎప్పటికీ ఆగదు. ఈ బాలుడి ధైర్యం కొత్త తరం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. -
300కు పైగా జర్నలిస్టుల అరెస్టులు
2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల అరెస్టులపై కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్ (CPJ) నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 2025 డిసెంబర్లో అరెస్టైన జర్నలిస్టుల సంఖ్య 300కు పైగా ఉన్నట్లు పేర్కొంది. దీనిలో అత్యధికంగా చైనా 50 మంది పాత్రికేయులను బంధించినట్లు తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయుల అక్రమ నిర్భందాలు ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్ధం పడుతున్నాయి. 300సంఖ్య దాటి అరెస్టులు జరగడం ఇది వరుసగా ఐదవ సారని CPJ నివేదిక పేర్కొంది. పాత్రికేయుల అరెస్టులలో చైనా అధికంగా 50, మయన్మార్ 30, ఇజ్రాయెల్ 29 అరెస్టులు ఉన్నట్లు తెలిపింది. రష్యా 27, బెలారస్ 25, అజర్బైజాన్ 24 తరువాతి స్థానాలలో ఉన్నట్లు పేర్కొంది.ఇప్పటి వరకూ జర్నలిస్టులు అధికంగా 1992 సంవత్సరంలో 384 మంది అరెస్టు కాగా ప్రస్తుతం 2025 మూడవ అత్యధిక అరెస్టులు జరిగిన సంవత్సరమని CPJ తెలిపింది. అయితే అరైస్టైన జర్నలిస్టులలో దాదాపు సగంమందికి పైగా ఎటువంటి నేరం చేయకుండానే అక్రమంగా నిర్భందించినట్లు న్యూయార్క్కు చెందిన ఒక ఎన్జీవో సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా జైలులో 20 శాతం తీవ్రమైన హింసను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. జర్నలిస్టులను హింసించే దేశాలలో ఇరాన్, ఇజ్రాయెల్, ఈజిప్టు ముందు వరుసలో ఉంటాయని కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్ నివేదిక తెలిపింది. -
నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ నోయిడాలో ఒక నిర్మాణ స్థలంలో ఉన్న నీటి గుంత ప్రమాదంలో యువ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరణానికి కారణంగా భావిస్తున్న కంపెనీ యజమానుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశాడు. నిర్మాణ పనుల కోసం తవ్విన, నీటితో నిండి ఉన్న గుంతలో తన ఎస్యూవీ వాహనం పడిపోవడంతో 27 ఏళ్ల యువరాజ్ మెహతా మృతికి సంబంధించి ఒక బిల్డర్ను అరెస్టు చేశారు. విష్టౌన్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులలో ఒకరైన అభయ్ కుమార్ను అరెస్టు చేశామని, మరో యజమాని మనీష్ కుమార్ కోసం గాలిస్తున్నామని నోయిడా పోలీసులు మంగళవారం ప్రకటించారు. కాగా గురుగ్రాంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువరాజ్ మోహతా విధినిర్వహణ తరువాత ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నోయిడాలోని సెక్టార్-150లోని ఏటీఎస్ లే గ్రాండియోస్ కూడలి వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి ఓ గోడను ఢీకొట్టి, పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో సహాయక చర్యలు కూడా సకాలంలో అందలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి -
తెలంగాణలో జర్నలిస్టులను ఉగ్రవాదులు, నేరగాళ్ల లాగ అరెస్టు చేస్తున్నారు
-
అమెరికా ‘కస్టడీ’లో ఇద్దరు భారత విద్యార్థులు
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. సెయింట్ లూయిస్ పార్క్లోని ఓ ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్న పలువురు సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు.. ఇద్దరు భారతీయ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతోనే ఈ ఇద్దరు విద్యార్థులను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఈ విద్యార్థులు తమ వీసా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతర్జాతీయ విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్న ప్రదేశాలపై ఇటీవలి కాలంలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెంచారు. గత కొన్ని నెలలుగా అనధికారిక ఉపాధి,వీసా నిబంధనల అమలుపై ఐసీఈ అధికారులు పలు రాష్ట్రాల్లో ఈ తరహా చర్యలను ముమ్మరం చేశారు. BREAKINGICE reportedly detained two Indian students at an Indian restaurant in St. Louis Park yesterday afternoon.STUDENTS, BE VERY CAREFUL. DO NOT TAKE UP ANY PART TIME JOBS THAT ARE NOT LEGALLY ALLOWED. pic.twitter.com/WmEwnAAIVf— M9 USA🇺🇸 (@M9USA_) January 16, 2026విద్యార్థులు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తుండటానికి తోడు తాజా అరెస్టులతో అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, నిపుణులు భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సరైన అనుమతులు లేకుండా క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయడం లాంటి పొరపాట్లు చేయవద్దని సూచిస్తున్నారు. ఇటువంటి ఉల్లంఘనలు.. డిటెన్షన్, వీసా రద్దు లేదా దేశ బహిష్కరణ వంటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: కెనడాలో హత్య చేసొచ్చి.. పంజాబ్లో హల్చల్! -
విక్టిమ్ ఎవరు? స్టేట్మెంట్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మంత్రి, ఐఏఎస్ అధికారిపై కథనాల ప్రసారానికి సంబంధించిన కేసులో.. హైదరాబాద్ సిటీ పోలీసులపై మెజిస్ట్రేట్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసులో ఫిర్యాదుదారు ఎవరు? విక్టిమ్ ఎవరు? బాధితుల స్టేట్మెంట్ ఎక్కడ? అని ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సు«దీర్లను సుదీర్ఘంగా విచారించిన సీసీఎస్ పోలీసులు చారిని మధ్యలోనే పంపించేశారు. మిగతా ఇద్దరిని సుమారు 24 గంటలపాటు విచారణ పేరుతో అదుపులో పెట్టుకున్నారు.అనంతరం కింగ్కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత తిరిగి సీసీఎస్కు తీసుకొచ్చారు. అక్కడ రిమాండ్ రిపోర్ట్లో అదనంగా మరో మూ డు సెక్షన్లు జోడించారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మణికొండలోని మెజిస్ట్రేట్ ఇంటికి తరలించారు. ఒంటిగంట సమయంలో రమేశ్, సు«దీర్లను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు. అసోసియేషన్ ఫిర్యాదు మేరకు విచారణ పోలీసులకు పలు ప్రశ్నలు వేసిన న్యాయమూర్తి..ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్లకు, రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలకు సంబంధం లేదని అన్నారు. దీంతో విక్టిమ్ ఎవరూ లేరని, విక్టిమ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని, వాళ్ల అసోసియేషన్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారిపై అభ్యంతరకర వార్తలు ప్రసారం చేశారని, దాంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కేసులో మరింత విచారణ జరపాల్సి ఉందంటూ రిమాండ్ విధించాలని పీపీ కోరారు. నిరాధారమైన ఆరోపణలతో అరెస్టు ఎన్టీవీ రిపోర్టర్ల తరఫు న్యాయవాదులు కిరణ్, జగదీశ్, శేరియార్ వాదిస్తూ..పోలీసులు చట్టవిరుద్దంగా చర్యలు చేపట్టడం దారుణమని అన్నారు. ఈ కేసులో పెట్టిన కొన్ని సెక్షన్లు ఏడేళ్ల లోపువే ఉన్నాయని, ఈ కేసులో బాధితుల పేర్లు లేవని, వారి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేయలేదని తెలిపారు. పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే అరెస్టు చేశారన్నారు. అధికారిక పర్యటన కోసమే దొంతు రమేష్ విదేశాలకు వెళ్తున్నారని, కుటుంబాన్ని తీసుకుని ముందుగా బ్యాంకాక్ వెళ్లి, ఆ తర్వాత దావోస్లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.నిరాధారమైన ఆరోపణలతో అరెస్టు చేశారని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన మేజి్రస్టేట్.. పోలీసుల రిమాండ్ రిక్వెస్ట్ను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. ‘విక్టిమే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేశారు..? సెక్షన్లు ఎలా పెట్టారు..? సీనియర్ అయినా.. జూనియర్ అయినా.. ఐఏఎస్ అయినా.. అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. సదరు అధికారుల కోసం ప్రత్యేక చట్టాలు ఏం లేవు. కాబట్టి రిమాండ్ రిక్వెస్ట్ను రిజెక్ట్ చేస్తున్నాం..’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. సు«దీర్, రమేష్ లకు బెయిల్ మంజూరు చేశారు. వారు తమ పాస్పోర్ట్లు సరెండర్ చేయాలని, రూ.20 వేల విలువైన రెండు షూరిటీలు సమరి్పంచాలని ఆదేశించారు. అరెస్టులు ఖండించిన జర్నలిస్టు సంఘాలు ఎన్టీవీ రిపోర్టర్లను అరెస్టు చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టుల అరెస్టును పలు జర్నలిస్టు సంఘాలు, పౌరహక్కుల సంఘాలు ఖండించాయి. పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టాయి. ఐఏఎస్పై కథనానికి సంబంధించి ఈనెల 10న ఎన్టీవీ తోపాటు తెలుగు స్క్రైబ్, ఎమ్ఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ, వ్లోగా టైమ్స్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ తెలుగు ఛానల్స్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ–1 గా ఎన్టీవీని చేర్చారు.ఆ తర్వాత ఇదే తరహా మరో కేసును కలిపి రెండు కేసుల దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ డీజీపీ బి.శివధర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సిట్ దర్యాప్తు పర్యవేక్షణను హైదరాబాద్ సిటీ సీపీ వీసీ సజ్జనార్కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న రాత్రి 11 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొంతు రమేష్ ను అరెస్టు చేసి నేరుగా సీసీఎస్కు తరలించారు. అదేరోజు రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య మరో ఇద్దరు ఎన్టీవీ రిపోర్టర్లు సు«దీర్, పరిపూర్ణాచారిని వాళ్ల ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే రిపోర్టర్ సు«దీర్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. ఒక దశలో ఇంటి తలుపులు బద్ధలు కొడతామంటూ పోలీసులు బెదిరించినట్లు రిపోర్టర్లు చెప్పారు.చివరకు సు«దీర్, చారి, రమేష్ ముగ్గురిని బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. ఓ వైపు సీసీఎస్లో విచారణ జరుగుతుండగానే.. ఎన్టీవీ సీఈఓ ఇంటికి, యాంకర్ దేవి ఇంటికి మరికొన్ని పోలీస్ బృందాలను పంపారు. అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు జర్నలిస్టు వర్గాల సమాచారం. దేవి, రాజశేఖర్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ.. అర్జెంట్గా తమ ముందు హాజరవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించినట్లు తెలిసింది. సాక్షిగా స్టేట్మెంట్ ఇచి్చన యాంకర్ దేవిని కూడా ఇబ్బంది పెట్టినట్లు రిపోర్టర్లు తెలిపారు. కమిషనర్ సజ్జనార్ తీరుపై విస్మయం ఎన్టీవీ కథనంపై కేసు, రిపోర్టర్ల అరెస్టు వ్యవహారంలో నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రిపోర్టర్ల అరెస్టు విషయంలో ఆయన మీడియాతో ఆగ్రహంగా బెదిరించేలా మాట్లాడారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ‘సిట్ అంటేనే దర్యాప్తు..ఎందుకు నోటీసులు ఇవ్వాలండి...కావాల్సిన వాళ్లను పిలిపిస్తాం. మేము పిలిస్తే రావాల్సిందే..మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి చూపండి.. ఎందుకు పారిపోతున్నారు? ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తా. చట్టం ముందు ప్రవేశపెడ్తా..’ అంటూ సజ్జనార్ ఆవేశంగా మాట్లాడటాన్ని పలువురు సీనియర్ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే రిపోర్టర్లు తప్పు చేశారనే విధంగా తీర్పునిచ్చేలా మాట్లాడడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎడిటర్లు ఎక్కడ? ఇన్చార్జిలు ఎక్కడ? విచారణలో భాగంగా ఎన్టీవీ ఆఫీస్లోకి వెళ్లిన ఇన్స్పెక్టర్తో పాటు మరో ఆరుగురితో కూడిన బృందం.. ఎడిటర్లు ఎక్కడ? ఇన్చార్జిలు ఎక్కడ..? అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. హార్డ్ డిస్్కలు, సీపీయూలు సీజ్ చేస్తామని, సర్వర్ వైర్లు లాగేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. సీఈఓ, దేవి, రాంబాబు.. ఎక్కడున్నారో చెప్పకపోతే, ఇక్కడున్న మిమ్మల్ని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందంటూ భయబ్రాంతులకు గురిచేశారని వారు వాపోయారు. సెర్చ్ వారెంట్ ఉందా..? అని గట్టిగా నిలదీయడంతో పోలీసులు వెనుదిరిగారని, కాసేపటికి తిరిగి వచి్చన పోలీసులు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి ఓ సీపీయూ సీజ్ చేశారని తెలిపారు. ఇలావుండగా తెలుగుదేశం సోషల్ మీడియా ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి బ్యాంకాక్ పారిపోయారంటూ దు్రష్పచారాన్ని ప్రారంభించింది. అయితే ఆయన మూడు రోజులుగా కార్యాలయానికి వస్తూనే ఉన్నారని ఎన్టీవీ రిపోర్టర్లు తెలిపారు. -
జంతువులా ఈడ్చుకెళ్లారు
వాషింగ్టన్: అమెరికాలో ఒక మహిళను ఇమిగ్రేషన్ అధికారులు కారులోనుంచి బలవంతంగా బయటకు లాగి అరెస్టు చేసి, చేతులు పట్టుకొని బరబరా ఈడ్చుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అలియా రెహ్మాన్(42) అమెరికా పౌరురాలు. ఇక్కడే జన్మించారు. మిన్నెపొలిస్ నగరంలో నివసిస్తున్నారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీ సెంటర్లో చికిత్స కోసం ముందే అపాయింట్మెంట్ తీసుకున్నారు. మంగళవారం కారులో అక్కడికి బయలుదేరారు. మధ్యలో ముఖాలకు మాస్క్లు ధరించిన ఇమిగ్రేషన్ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఆమె కూర్చున్నవైపు కారు అద్దం పగులగొట్టారు. సీటు బెల్ట్ను కట్ చేశారు. డ్రైవర్ సీటు గుండా ఆమెను బయటకు లాగారు. కాళ్లు చేతులు పట్టుకొని ఈడ్చుకెళుతూ తమ వాహనంలోకి ఎక్కించారు. డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని, వదిలిపెట్టాలని రోదిస్తూ వేడుకున్నా కనికరించలేదు. కనీసం చికిత్స అందించే ఏర్పాటు కూడా చేయలేదు. దాంతో బాధితురాలు చాలాసేపు స్పృహ కోల్పోయారు. చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తాను ఇప్పటికీ బతికి ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని అలియా రెహ్మానచెప్పారు. ఒక జంతువును ఈడ్చుకెళ్లినట్లుగా తనను ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. మిన్నెపొలిస్లో అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్ అధికా రులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వారిని గుర్తించడానికి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను డిటెన్షన్ కేంద్రాలకు తరలించి ప్రశి్నస్తున్నారు. మరోవైపు వలసదారులకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి. -
త్వరలో అరెస్ట్? రోజా రియాక్షన్
-
ఎన్టీవీ జర్నలిస్టులకు బెయిల్..
సాక్షి, హైదరాబాద్: ఓ కథనానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసిన ఎన్టీవీ జర్నలిస్టులకు 14వ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు చేసిన ఎన్టీవీ జర్నలిస్టులను హైదరాబాద్ పోలీసులు ఇన్ఛార్జ్ 14వ ఏసీఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఓ కథనానికి సంబంధించిన కేసులో ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.వీరిలో ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్ లు దొంతు రమేష్, సుధీర్ లను బషీర్ బాగ్ సీసీ ఎస్ నుంచి మణికొండలోని ఇన్ఛార్జ్ 14వ ఏసీఎంఎం మేజిస్ట్రేట్ వద్దకు సిసిఎస్ పోలీసులు తరలించి హాజరుపరిచారు. కేసుకి సంబంధించి మేజిస్ట్రేట్ ముందు వాదనలు కొనసాగాయి. వాదనలను విన్న మేజిస్ట్రేట్ జర్నలిస్టులకు రిమాండ్ విధించాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించారు.జర్నలిస్టుల అరెస్టులను జర్నలిస్టు సంఘాలతోపాటు పలువురు రాజకీయ నేతలు ఖండించారు. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేశారని, జర్నలిస్టులను నేరస్తుల్లా చూడటం దురదృష్టకరమని, వారి పట్ల వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. -
ఇమ్రాన్ను కలవనివ్వండి.. ఖురాన్తో సోదరిల నిరసన
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం మరోసారి ఆ దేశంలో చర్చనీయాంశమయ్యింది. ఆయనను కలవడానికి ఎవరికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వారి కుటుంబసభ్యులతో పాటు ఆయన మద్ధతుదారులు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ సోదరిలు అడియాలా జైలు బయట ధర్నా చేపట్టారు.కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాఫిక్గా మారింది. ఆయనను జైలులోనే చంపేశారు అని పుకార్లు రావడంతో ఇమ్రాన్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు పీటీఐ మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం ఆయనను కలవడానికి అనుమతిచ్చింది. దీంతో ఆయన సోదరి డా. ఖానుమ్ ఆయనను జైలులో కలిసింది. దీంతో ఆయన బ్రతికే ఉన్నాడని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఇమ్రాన్ వ్యవహారం పాక్లో చర్చనీయాంశమైంది.ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి మంగళ, గురువారాల్లో అనుమతి ఇవ్వాలి. అయితే ఈ ఆదేశాలను అక్కడి అధికారులు పాటించడం లేదు. ఆయనను కలవడానికి వారి సోదరిమణులు ఆలీమాఖాన్, ఉజ్మా ఖాన్లను వారిని కలవడానికి అనుమతించడం లేదు. దీంతో వారు జైలు బయిట ఆందోళన చేపట్టారు.దీంతో వారు జైలు బయిట ఖురాన్ చదువుతూ నిరసన చేపట్టారు. ఇమ్రాన్ సోదరి ఆలీమా ఖాన్ మాట్లాడుతూ.. మేము ఇక్కడ ఖురాన్ చదవడం పూర్తి చేస్తామని వారు భయపడుతున్నారు. ఎటువంటి మనుషులు వారు. అడియాలాకు వెళ్లే దారులన్నీ నిర్భందించారు. అని ఆమె తెలిపారు.అయితే మంగళ, గురవారాల్లో ఇమ్రాన్ను కలవడానికి అనుమతులివ్వాలని కోర్టు చెప్పడంతో ఆ రోజుల్లో అడియాలా జైలు ఎదుటు పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. -
NTV రిపోర్టర్ల అక్రమ అరెస్టు
-
NTV రిపోర్టర్ల అరెస్ట్.. రేవంత్ సర్కార్పై జర్నలిస్టుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్లు అరెస్ట్ ఘటన తీవ్ర దుమారం లేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఒక వార్త విషయంలో విచారించాలంటూ మంగళవారం రాత్రి ఎన్టీవీ రిపోర్టర్లను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి జర్నలిస్టులను పోలీసులు తీసుకెళ్లారు. ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న జర్నలిస్టును కూడా ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఎన్టీవీ రిపోర్టర్ల అక్రమ అరెస్ట్పై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికీ ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్లు పోలీసుల అదుపులోనే ఉండటం గమనార్హం. -
ఇది రేవంత్ సర్కార్ రాజకీయ వికృత క్రీడ
సాక్షి, హైదరాబాద్: పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు అన్నారు. తెలంగాణవ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. ‘‘మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి. .. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. అంతేకాదు డీజీపీ శివధర్రెడ్ఢికి ఫోన్ చేసి జర్నలిస్టులను విడుదల చేయాలని కోరారు.పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు.మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా?ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా…— Harish Rao Thanneeru (@BRSHarish) January 14, 2026ఈ అరెస్టులను తెలంగాణ పీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఖండించారు. ‘‘అర్ధరాత్రిళ్లు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సదరు జర్నలిస్టులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని ఉంటే బాగుండేది. జర్నలిస్టుల అరెస్టుతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓ మంత్రి-ఐఏఎస్ అధికారిణి అంటూ.. ప్రముఖ చానెల్లో కథనం ప్రసారం అయ్యింది. దాని ఆధారంగా అటు సోషల్ మీడియాలో విస్తృత కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మంత్రి కోమటిరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ క్రమంలో సదరు ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులను గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని.. ఎలాంటి ప్రొసీజర్, నోటీసులు ఫాలో కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. రాష్ట్రంలో మరికొన్ని చోట్లా పోలీసులు పాత్రికేయుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా పలు చానెల్స్, 40కి పైగా యూట్యూబ్ చానెల్స్పై పోలీసులు దృష్టిసారించినట్లు సమాచారం. అయితే అక్రమ అరెస్టులు.. పోలీసుల ప్రతాపంపై జర్నలిస్టుల సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. -
కండలేరు వద్దకు వెళ్తున్న YSRCP నేతల అక్రమ అరెస్ట్
-
శబరిమల బంగారం కేసు.. ఐసీయూలో నిందితుడు
తిరువనంతపురం: శబరిమల బంగారు అభరణాల కేసులో అరెస్టైన ఆలయ ప్రధాన పూజారి కందావారు రాజీవరు ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎనిమిది మంది సభ్యులున్నా సిట్ బృందం ఈరోజు( శనివారం) మద్యాహ్నం ప్రాంతంలో పూజారి నివాసానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కీలక ఆధారాలు ఏమైనా లభిస్తాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు.. అనారోగ్యం కారణంగా అరెస్టయిన కందరరు రాజీవరు వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేరారు. తిరువనంతపురం స్పెషల్ సబ్-జైలులో కస్టడీలో ఉన్నప్పుడు తంత్రి ఆరోగ్య సమస్యలను నివేదించిన తర్వాత మొదట జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల తరువాత, అతను ప్రత్యేక సంరక్షణ కోసం మెడికల్ కాలేజీకి బదిలీ చేయబడ్డారు. వైద్య పరీక్షల కోసం అతడిని ఆసుపత్రికి తీసుకురాగానే.. మెడిసిన్, కార్డియాలజీ విభాగాల అధిపతులు ఆయనను పరీక్షించారు. నిపుణుల సూచన మేరకు అతడిని ఐసీయూకి తరలించారు. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.అయితే, జైలులో అల్పాహారం తీసుకుంటుండగా తంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, జైలు అధికారులను వైద్య సహాయం కోరారు. అనంతరం, అతన్ని పరీక్షించేందుకు ఒక వైద్యుడు జైలుకు వెళ్లాడు. సదరు వైద్యుడి సూచనలు మేరకు రాజీవరును ఆసుపత్రికి తరలించారు.కాగా శబరిమల బంగారు తాపడాల చోరి కేసులో శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు కందావారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో, రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. విచారణలో రాజీవరు కూడా నిందితుడు అని తేలడంతో నిన్న ఉదయం ఆయనను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా సిట్ విచారణ చేపడుతుంది. కాగా ఈ కేసులో ఆయన అరెస్టు 11వది.ఏమిటి ఈ కేసు?2019లో శబరిమల గర్భగుడి ముందున్న బంగారు పూత విగ్రహాలను మరమ్మత్తుల నిమిత్తం తొలగించారు. అనంతరం వాటిని మరమ్మత్తు చేసి తిరిగి ప్రతిష్ఠించారు. బంగారు పలకలను ఇవ్వడంలో గోల్మాల్ జరిగిందని క్రితంతో పోలిస్తే బంగారం తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. -
మదురో మాదిరే పుతిన్ను బంధించి పట్టుకొస్తారా?
ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా.. వెనెజువెలాపై సైనిక చర్యను చేపట్టిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించి తమ దేశానికి తీసుకొచ్చింది అమెరికా. ఈ ఘటనను పలు దేశాలు ఖండించగా.. ఇది తమ దేశ భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, వెనెజువెలా మంచి కోసం కూడా చేశామంటూ డొనాల్డ్ ట్రంప్ తన చర్యను సమర్థించుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలోనూ ఇలా చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి ప్రణాళిక ఒప్పందం కోసం ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మీద మండిపడ్డ అగ్రరాజ్యం అధ్యక్షుడు.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మీద సాఫ్ట్ టోన్ ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా ఆ పరిస్థితి మారింది. పైగా వెనెజువెలా చమురు విషయంలో రష్యాకు సంబంధించిన షాడో ఫ్లీట్ సీజ్ నేపథ్యంలో.. అమెరికా-రష్యాల మధ్య వార్నింగ్ ఇచ్చుకునే స్థాయిలో పరిస్థితి చేరుకుంది. ఈ తరుణంలో.. వెనెజువెలా రాజధాని కారకస్పై జనవరి 3వ తేదీన అమెరికా వైమానిక దళాలతో మెరుపు దాడులు చేసి మదురోను బంధించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ నేరాల అభియోగాలతో ఆయన్ని అమెరికా ఫెడరల్ కోర్టులు విచారణ చేస్తున్నాయి. ఈ పరిణామంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కొలంబియా అధ్యక్షుడా?, ఇరాన్ సుప్రీం లీడరా?అమెరికా అధ్యక్షుడి నెక్ట్స్ టార్గెట్ ఎవరై ఉంటారా? అనే చర్చా జోరందుకుంది. అమెరికా చమురు–గ్యాస్ కంపెనీల అధిపతులతో సమావేశంలో.. పుతిన్ను అలా బంధిస్తారా? అని మీడియా వేసిన ప్రశ్నకుగానూ ట్రంప్ సమాధానం ఇచ్చారు. పుతిన్ను పట్టుకోవడం అవసరం లేదు, కానీ నేను ఆయన విషయంలో చాలా నిరాశలో ఉన్నాను అని అన్నారు. ఇప్పటిదాకా తాను ఎనిమిది యుద్ధాలను ముగించానని, కానీ ఉక్రెయిన్ సంక్షోభాన్ని మాత్రం త్వరగా ఆపలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు... ఇదే అంశంపై పరోక్షంగా జెలెన్స్కీ కూడా స్పందించారు. మదురో అరెస్టు తర్వాత పుతిన్పై కూడా అమెరికా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదంటూ వ్యాఖ్యానించారు. ఒక నియంతను(పుతిన్ను ఉద్దేశిస్తూ..) ఇలా ఎదుర్కోవాలంటే.. తర్వాత ఏం చేయాలో అమెరికాకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. అయితే యుద్ధ నేరాల ఆరోపణలతో ది హేగ్లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్లాదిమిర్ పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధినేతగా పుతిన్కంటూ ఓ పేరుంది. అలాంటిది ఆయన్ని అంత తేలికగా నిర్బంధించడం అమెరికాకు కలలో కూడా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి ఎదురవుతోంది. -
Kakani: హౌస్ అరెస్ట్ మా ప్రాణాలు బ అర్పించడానికైనా సిద్ధం
-
శబరిమల బంగారం చోరీలో పురోగతి అర్చకుడు అరెస్ట్..
-
శబరిమల ప్రధాన అర్చకుడి(తంత్రి) అరెస్ట్
సంచలనం రేపిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు(తంత్రి) కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్ట్ చేసింది. వరుస నోటీసులకు స్పందించని ఆయన్ని.. శుక్రవారం విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ప్రధాన అర్చకుడు రాజీవరు అరెస్టుతో ఆ సంఖ్య 11కి చేరింది. SIT arrests Sabarimala Chief Priest Kandararu Rajeevaru in gold loss case— Press Trust of India (@PTI_News) January 9, 2026ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన పద్మకుమార్, ఉన్నికృష్ణన్ పొట్టి వాంగ్మూలాల మేరకు సిట్ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి తంత్రి రాజీవరును ప్రశ్నించారు. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. వీలైనంత త్వరగా.. కొల్లంలోని కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన తంత్రిని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదు. గత ఏడాది నవంబరులో కూడా సిట్ ఆయన్ని విచారణ జరిపింది. అయితే..ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమల కాంట్రాక్టులకు తీసుకొచ్చింది కందరారు రాజీవర్ అని పద్మకుమార్ తదితరులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ వాంగ్మూలాల ఆధారంగా ఈ రోజు ఉదయం రాజీవర్ను సిట్ కార్యాలయానికి పిలిపించారు. రెండున్నర గంటల పాటు విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు సిట్ అధికారికంగా ప్రకటించింది.ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారు1. ఉన్నికృష్ణన్ పొట్టి (స్పాన్సర్)2. మురారిబాబు (మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, దేవస్వం బోర్డు)3. డి.సుధీష్ కుమార్ (మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)4. కెఎస్ బైజు (తిరువాభరణం మాజీ కమిషనర్)5. ఎన్.వాసు (మాజీ దేవస్వం కమిషనర్, అధ్యక్షుడు)6. ఎ.పద్మకుమార్ (మాజీ దేవస్వం బోర్డు అధ్యక్షుడు)7. ఎస్.శ్రీకుమార్ (మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)8. పంకజ్ భండారి (సీఈవో, స్మార్ట్ క్రియేషన్స్)9. బళ్లారి గోవర్ధన్ (ఆభరణాల వ్యాపారి)10. ఎన్.విజయకుమార్ (మాజీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు)11. కందరారు రాజీవరార్ (శబరిమల తంత్రి)ఎప్పుడు ఏం జరిగిందంటే.. బంగారం తాడపం పనులు పూర్తయ్యాక బరువులో వ్యత్యాసం బయటపడడంతో ఈ కేసు మొదలైంది. 2019లో.. ద్వారపాలక విగ్రహాలు, శ్రీకోవిలి తలుపులపై ఉన్న బంగారు తాపడం తొలగించి మళ్లీ తాపడం చేశారు. ఆ సమయంలో తిరిగి ఇచ్చిన బంగారం బరువులో వ్యత్యాసం బయటపడింది.ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫిర్యాదుల నేపథ్యంలో దర్యాప్తు మొదలైంది. అయితే ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో కేరళ ప్రభుత్వం సిట్ను నియమించింది. ఆ దర్యాప్తు వేగవంతం చేయాలని అక్టోబర్లో కేరళ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది కూడా. బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి ప్రదాన సూత్రధారిగా సిట్ పేర్కొంది. అతనితో పాటు మాజీ అధికారిగా ఉన్న బి. మురారి బాబు అరెస్టు అయ్యారు. బెంగళూరులోని ఓ దుకాణం నుంచి బంగారాన్ని రికవరీ కూడా చేశారు. ఆపై మరికొందరిని విచారించి.. అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ప్రధాన అర్చకుడి అరెస్టుతో కేసు మరో మలుపు తిరిగింది. అయితే.. మరిన్ని బంగారు తాపడం ప్లేట్లు తొలగించి బంగారం దోచుకోవాలని పెద్ద కుట్ర జరిగిందని కోర్టుకు సిట్ ఇప్పటికే నివేదించింది. శబరిమల బంగారం చోరీ కేసులో సిట్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్(Prevention of Money Laundering Act) అభియోగాల కింద దర్యాప్తు జరుపుతోంది. -
హీరో కాబోయి జీరో
అమ్మాయి ప్రేమ కోసం ‘యాక్సిడెంట్’ డ్రామా..ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలి.. తన దృష్టిలో హీరోగా నిలిచిపోవాలి.. ఇదీ ఒక యువకుడి పిచ్చి ఆలోచన. దీనికోసం అతను వేసిన ప్లాన్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. రోడ్డుపై ఘోర ప్రమాదండిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలు. కోచింగ్ క్లాస్ ముగించుకుని ఓ యువతి తన స్కూటర్పై ఇంటికి వెళ్తోంది. పతనంతిట్ట సమీపంలోని వళ ముట్టం ఈస్ట్ వద్దకు రాగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆమె స్కూటర్ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. కారు ఆగకుండా మెరుపు వేగంతో వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు భయబ్రాంతులయ్యారు.‘రక్షకుడు’ ఎంట్రీఏం చేయాలో తెలియక జనం తత్తరపడుతున్న సమయంలో.. అక్కడికి ఒక ఇన్నోవా కారు వచ్చి ఆగింది. అందులో నుంచి రంజిత్ రాజన్ అనే యువకుడు కంగారుగా దిగాడు. ‘నేను ఆమె భర్తను’.. అంటూ అందరినీ నమ్మించాడు. ఎంతో ఆవేదన నటిస్తూ ఆమెను హుటాహుటిన కొన్నీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అందరూ అతన్ని ‘దేవుడు పంపిన రక్షకుడు’ అని మెచ్చుకున్నారు.విస్తుపోయే నిజం!ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య తనిఖీల్లో.. ఆ యువతికి తీవ్ర గాయాలైనట్లు తేలింది. కుడి చేయి ఎముక పక్కకు జరగడం, వేలు విరగడంతో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. మొదట ఇది సాధారణ హిట్ అండ్ రన్ కేసు అని పోలీసులు భావించారు. కానీ, విచారణ ముదిరే కొద్దీ పోలీసులకు అనుమానం కలిగింది. రంజిత్ మాటల్లో పొంతన లేకపోవడంతో లోతుగా ఆరా తీశారు. అప్పుడు బయటపడింది అసలు గుట్టు.పక్కా ప్రణాళికతో..ఆ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు.. రంజిత్ పక్కాగా ప్లాన్ చేసి చేయించాడు.. అదెలా అంటే.. ‘యువతిని తన స్నేహితుడు అజాస్ కారుతో గుద్దిస్తాడు. వెంటనే తనే అక్కడికి చేరుకుని కాపాడినట్టు నటించాలి. యువతికి, ఆమె కుటుంబానికి తనపై విపరీతమైన ప్రేమ, కృతజ్ఞత కలిగేలా చేయాలి. మళ్లీ ఆమెను తన దారిలోకి తెచ్చుకోవాలి..’పారని సైకో ప్రేమికుడి పాచికప్రేమ పేరుతో ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ‘సైకో’ ప్రేమికుడి పాచిక పారలేదు. పోలీసులు రంజిత్తో పాటు అతడికి సహకరించిన అజాస్ ను అరెస్ట్ చేశారు. సాధారణ యాక్సిడెంట్ కేసు కాస్తా ఇప్పుడు ‘హత్యాయత్నం’ కేసుగా మారింది. నకిలీ ‘ప్రేమల’ వెనుక దాగున్న ఇలాంటి క్రూరత్వాలపై అప్రమత్తంగా ఉండాల్సిందే..– సాక్షి, నేషనల్ డెస్క్ -
RK Roja : అందుకే 36వ ర్యాంకు వచ్చింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి..
-
ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో అమర్ దీప్ను పట్టుకున్న పోలీసులు
-
నేను వెనెజువెలా అధ్యక్షుడిని..
న్యూయార్క్: వెనెజువెలా పదవీచ్యుత అధ్యక్షుడు నికొలస్ మదురో అమెరికా గడ్డపై బందీగా ఉన్నా ఏమాత్రం జంక లేదు. ‘నేను వెనెజువెలా అధ్యక్షుడిని. కారకాస్లోని నా ఇంట్లో ఉండగా బంధించి తీసుకువచ్చారు. నేనెలాంటి తప్పూ చేయలేదు. అమాయకుడిని. మర్యాదస్తుడిని’ అని సోమవారం మన్హట్టన్ కోర్టులో చెప్పుకున్నారు. వ్యాపార లావాదేవీలను తప్పుగా చూపారంటూ నమోదైన కేసులో 2024లో డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే కోర్టు బోనులో నిలుచోవడం విశేషం. మదురో కేసులో క్లింటన్ హయాంలో నియమితులైన 92 ఏళ్ల అల్విన్ హెల్లెర్స్టీన్ వాదనలు విన్నారు. సరిగ్గా 12 గంటల సమయంలో కాళ్లకు మాత్రమే గొలుసులుండగా చేతులు వెనక్కి పెట్టుకుని భద్రతా సిబ్బంది వెంటరాగా మదురో కోర్టు హాల్లోకి ప్రవేశించారు.ౖ మదురో, సిలియాలు హెడ్ఫోన్లు పెట్టుకుని ఇంగ్లిష్ నుంచి స్పానిష్లోకి కోర్టు ప్రొసీడింగ్ అనువాదాలను వింటూ ఉన్నారు. జడ్జి అల్విన్ హెల్లెర్స్టీన్ పరిచయం అనంతరం మదురో.. వెనెజువెలా అధ్యక్షుడినంటూ జడ్జికి స్పానిష్ భాషలో పరిచయం చేసుకున్నారు. తానెలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తనను బందీగా మార్చారంటూ స్పానిష్లో మదురో చెప్పారు. ఆయన మాటలను కోర్టు రూం రిపోర్టర్ అనువాదం చేసి జడ్జికి తెలిపారు. మదురో భార్య సిలియా ఫ్లోరెస్ కూడా తాను వెనెజువెలా ప్రథమ మహిళనంటూ చెప్పుకున్నారు. ఎలాంటి తప్పూ చేయలేదని స్పానిష్లో తెలిపారు. వీరిద్దరూ జైలు నుంచి విడుదలను గానీ, బెయిల్ను గానీ కోరడం లేదని లాయర్లు తెలిపారు. జడ్జి ఆదేశాల మేరకు అభియోగాలకు సంబంధించిన పత్రాలను అధికారులు ఇద్దరికీ అందించారు. అనంతరం, తదుపరి విచారణ మార్చి 17న ఉదయం 11 గంటలకు ఉంటుందని జడ్జి ప్రకటించారు. మదురోపై విచారణ చేపట్టిన కోర్టు సముదాయం వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. మదురోను విడుదల చేయాలని కొందరు, ట్రంప్ కింగ్.. అంటూ మరికొందరు నినాదాలు చేశారు. అంతకుముందు, బ్రూక్లిన్ జైలు నుంచి సోమవారం ఉదయం 7.15 గంటల సమయంలో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను జైలు నుంచి అత్యంత భారీ భద్రతతో కూడిన వాహన శ్రేణిలో దగ్గర్లోని అథ్లెటిక్ ఫీల్డ్కు తీసుకెళ్లారు. హెలికాప్టర్ లోకి వారిని ఎక్కించారు. ఆ హెలికాప్టర్ మన్హ ట్టన్ హెలిపోర్టులో ల్యాండయ్యింది. హెలికాప్టర్ నుంచి దించి సాయుధ వాహనంలో వారిని కూర్చో బెట్టుకుని కోర్టుహౌస్ కాంప్లెక్స్లోకి తీసుకెళ్లారు. శనివారం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో కారకాస్ లోని మిలటరీ బేస్లోని నివాసం నుంచి మదురో, సిలియాలను అమెరికా బలగాలు న్యూయార్క్కు తీసుకురావడం తెల్సిందే. మాదక ద్రవ్యాలతో పాటు ఆయుధాల అక్రమ రవాణా ఆరోపణలను వారిద్దరిపైనా మోపారు. కాగా, మదురో భార్య సిలియా డ్రగ్స్ అక్రమ రవాణాదారుల నుంచి 2007లో భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరీ పొలాక్..?మదురో తరఫున వాషింగ్టన్కు చెందిన ప్రముఖ లాయర్ బ్యారీ పొలాక్ వాదనలు వినిపించారు. వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే తరఫున దీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించింది ఈయనే. అమెరికా గూఢచర్య చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను జైలు నుంచి విడుదల చేయించి, సొంతదేశం ఆస్ట్రేలియాకు పంపించడంలో కీలకంగా ఉన్నారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలరని ఈయనకు పేరుంది. -
డయల్ 100.. స్పాట్లోనే దొరికిన దొంగ
సాక్షి హైదరాబాద్: మియాపూర్ పోలీసులు శబాష్ అనిపించుకున్నారు. డయల్ 100కు కాల్ చేసిన క్షణాల్లోనే స్పందించి ఏటీఎంలో దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని సత్తా చాటుకున్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ బాధ్యతని దానికోసం నిరంతరం అప్రమత్తతతో ఉంటామని పోలీసులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. మాదాపూర్ జోన్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్, మార్థండనగర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద నిన్న(ఆదివారం) రాత్రి సమయంలో దొంగతనం జరుగుతోందని గుర్తుతెలియని వ్యక్తులు 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఏటీఏంలో డబ్బుల చోరీకి యత్నిస్తున్న నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనంతపురం జిల్లా అక్కంపల్లి మండలం జార్జ్పేట్ గ్రామం వాసి కాటమయ్య (24)గా గుర్తించినట్లు తెలిపారుఏటీఏం చోరికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్దనష్టం తప్పినట్లు మియాపూర్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు. చుట్టు ప్రక్కల ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు నమోదైతే ప్రజలు డయల్–100కు కాల్ చేయాలని ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. -
న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో
-
అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర
అమెరికాలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయ్యింది. ఐసిస్తో సంబంధాలున్న ఓ టీనేజర్ను ఎఫ్బీఐ అదుపులోకి తీసుకుంది. న్యూఇయర్ వేడుకల సందర్భంగా దాడులకు అతను ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థ చీఫ్ కాష్ పటేల్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా యువత ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా సారిస్తామని ప్రకటించారాయన. పక్కా సమాచారంతో నార్త్ కరోలినాలోని షార్లెట్ సమీపంలో మింట్ హిల్ ప్రాంతానికి చెందిన ఓ టీనేజర్ను ఎఫ్ఐబీ అదుపులోకి తీసుకుంది. అతని నుంచి దాడికి సంబంధించిన ప్రణాళికను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా రద్దీగా ఉండే ఓ గ్రాసరీ స్టోర్, మరో ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లో మారణహోమం జరపాలని చూశాడని కాష్ పటేల్ మీడియాకు వెల్లడించారు. ఐసిస్ లింకులుఎఫ్బీఐ అదుపులో ఉన్న టీనేజర్ పేరు క్రిస్టియన్ స్టర్డివాంట్. వయసు 18 ఏళ్లు. ఐసిస్ ప్రేరణతోనే అతను దాడులు చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా విదేశీ ఉగ్రసంస్థ అతనికి బ్రెయిన్వాష్ చేసిందని ఎఫ్బీఐ ప్రకటించింది. ‘‘మూడేళ్లుగా అతనిపై నిఘా ఉంచాం. యూరప్లోని ఓ ఐసిస్ సభ్యుడితో కాంటాక్ట్లో ఉన్నాడు. అక్కడి నుంచి అతనికి ఆన్లైన్లో ఆదేశాలు అందేవి. నల్ల దుస్తుల్లో దాడులకు పాల్పడాలని అతనికి సమాచారం అందింది. తనను తాను ఐసిస్ సైనికుడిగా ప్రకటించుకుని.. దాడికి సిద్ధమంటూ అవతలి వాళ్లకు డిసెంబర్ 12వ తేదీన ఓ సందేశం పంపాడు. ఈ దాడికి తాను పని చేసే చోట్లనే ఎంచుకున్నాడు. ముస్లింయేతర గ్రూపులు, ఎల్జీబీటీక్యూలను, యూదులు, క్రిస్టియన్లపై దాడుల చేయాలని తన బుక్లో రాసుకున్నాడు. ఐసిస్కు సంబంధించి టిక్టాక్ వీడియోలను ఇతను ప్రొత్సహించాడు. అతని మానసిక స్థితి కూడా బాగోలేదు. గతంలో చికిత్స తీసుకున్నట్లు ఆధారలు లభించాయి’’ అని అధికారులు తెలిపారు.అయితే తుపాకులు, బాంబులతో కాకుండా కత్తులు, హ్యమర్లతో దాడికి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయుధాల్ని ఎఫ్బీఐ స్వాధీనం చేసుకుంది. మరోవైపు.. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ (US Justice Department) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా యువతలో ఈ తరహా సంబంధాలపై నిఘా, దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని సూచించింది.ఆ పేపర్పై.. మింట్హిల్లోని క్రిస్టియన్ ఇంటిని తనిఖీలు నిర్వహించినప్పుడు “New Years Attack 2026” అనే టైటిల్తో ఉన్న ఒక బుక్ను గమనించారు. అందులో దాడి ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలి.. విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి అనే వివరాలు ఉన్నట్లు ఎఫ్ఐబీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన అతనిపై క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసి.. నిన్న కోర్టులో హాజరు పరిచారు. నార్త్ కరోలినా వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ యుఎస్ అటార్నీ రస్ ఫెర్గుసన్ ‘‘క్రిస్టియన్ స్టిర్టివాంట్ జిహాద్కు సిద్ధమయ్యాడు. కాస్తుంటే అమాయకులు ప్రాణాలు పోయేవే’’ అని వ్యాఖ్యానించారు. స్టర్డివాంట్ తనపై ఆరోపణలకు ఇంకా నోరు విప్పలేదు. ప్రస్తుతం కస్టడీలోనే ఉన్న అతన్ని.. వచ్చే వారం ఎఫ్బీఐ కోర్టులో హాజరు పర్చనుంది. -
మనీ లాండరింగ్ కేసులో... గుజరాత్ ఐఏఎస్ అధికారి అరెస్ట్
అహ్మదాబాద్: లంచానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గుజరాత్లో ఓ ఐఏఎస్ అధికారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. 2015 బ్యాచ్ ఐఏఎస్ అయిన రాజేంద్ర కుమార్ పటేల్ సురేంద్రనగర్ కలెక్టర్గా పనిచేస్తుండగా వారం క్రితం హఠాత్తుగా ఎటువంటి పోస్ట్ ఇవ్వకుండానే ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. మోరి తదితరులపై నమోదైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తోంది. ఈడీ ఫిర్యాదు మేరకు గుజరాత్ ఏసీబీ వేరుగా పటేల్, ఆయన వ్యక్తిగత సహాయకుడు జయరాజ్ ఝాలా తదితరులపై కేసు నమోదు చేసింది. డిసెంబర్ 23వ తేదీన మోరీ ఇంట్లో ఈడీ సోదాలు జరపగా రూ.67.5 లక్షలు దొరికాయి. అదంతా లంచం సొత్తేనని విచారణలో మోరి అంగీకరించాడు. భూ వినియోగానికి సంబంధించిన దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించినందుకు గాను లంచం తీసుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. దర్యాప్తు మరింత చేపట్టిన ఈడీ..ఈ మొత్తం వ్యవహారంలో కలెక్టర్ సహా ఆ కార్యాలయంలోని అధికారుల అందరి ప్రమేయం ఉన్నట్లు తేలి్చంది. వీరు భూమి చదరపు మీటర్ చొప్పున లెక్కకట్టి మరీ లంచం తీసుకుని లంచం తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు శుక్రవారం ఈడీ బృదం రాజేంద్ర కుమార్ పటేల్ను అరెస్ట్ చేసింది. -
రావులపాలెంలో హైటెన్షన్.. కోనసీమ YSRCP అధ్యక్షుడు జగ్గిరెడ్డి అరెస్ట్
-
ఢిల్లీలో హై అలర్ట్.. 285 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: కొత్త ఏడాది సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక పోలీసులు చర్యలు ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పరిధిలో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో ఏకంగా 285 మంది నేరగాళ్లను పోలీసులు కటకటాల వెనక్కి తరలించారు. ఈ ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున మారణాయుధాలు, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో అసాంఘిక శక్తులు చెలరేగిపోయే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు ఈ మెగా డ్రైవ్ నిర్వహించారు.‘ఆపరేషన్ ఆఘాత్’ (Operation Aaghaat) పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో పోలీసులు పక్కా వ్యూహంతో నేరస్తుల అడ్డాగా పేరున్న పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 40కి పైగా అక్రమ ఆయుధాలు, లక్షలాది రూపాయల నగదు లభ్యమైంది. వీటితో పాటు భారీ పరిమాణంలో డ్రగ్స్, అక్రమ మద్యం నిల్వలను కూడా పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 1,000 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నేర చరిత్ర ఉన్న 285 మందిని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్వర్క్ను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి.న్యూ ఇయర్ వేడుకల సమయంలో గొడవలకు దిగే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల పని పట్టేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేశామని సీనియర్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై ఆయుధ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం కింద పలు కేసులు నమోదు చేశామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మందు పార్టీలు చేసుకునే వారిపై, న్యూ ఇయర్ ముసుగులో రెచ్చిపోయే పోకిరీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే! -
నకిలీ కార్ల ముఠా అరెస్ట్
నరసరావుపేట రూరల్: నకిలీ కార్ల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 20 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. సోమవారం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 12న విజయవాడకు చెందిన పుల్లా శ్రీనివాసరెడ్డి తన కారును నకరికల్లుకు చెందిన పుల్లంశెట్టి అంజినాయుడు వద్ద తాకట్టు పెట్టగా, అసలు, వడ్డీ చెల్లించినా కారు తిరిగి ఇవ్వకుండా నంబర్ ప్లేట్ను మార్చి తిరుగుతున్నట్లు నరసరావుపేట రూరల్ స్టేçషన్లో ఫిర్యాదు అందిందన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అంజినాయుడు ఇచ్చిన సమాచారంతో నకరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన పుల్లంశెట్టి భానుప్రకాష్ , గురజాలకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ, హైదరాబాద్కు చెందిన మధ్యాహ్నపు మోహన సత్యశ్రీనివాస్లు రావిపాడు రోడ్డు చెక్పోస్ట్ వద్ద 3 కార్లు తీసుకుని విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.విచారణలో 3 కార్లకు ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో వాటిని సీజ్ చేశామన్నారు. నిందితులను విచారించగా.. ఫైనాన్స్ సంస్థలకు బకాయిలు ఎగ్గొట్టేందుకు నంబర్ ప్లేట్లు మార్చినట్లు నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. ఈ విధంగా తాకట్టు పెట్టుకునే క్రమంలో ఒక ముఠాగా ఏర్పడి పలు ఫైనాన్స్ సంస్థల నుంచి 20 కార్లను తీసుకున్నట్లు తెలిపారు. ఆయా కార్లకు నెలవారి కిస్తీలు చెల్లించకుండా నంబర్ ప్లేట్లు మార్చి అద్దెకు తిప్పుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో పాటు కొందరు యజమానుల నుంచి కార్లను తాకట్టు రూపంలో తీసుకుని అసలు, వడ్డీ చెల్లించినా కార్లు తిరిగి ఇవ్వకుండా బెదిరించి బలవంతపు అగ్రిమెంట్లు తీసుకున్నారన్నారు. ఆ విధంగా 20 కార్లను తీసుకుని కొన్నిటికి నంబర్లు మార్చి, మరికొన్నిటికి ఫైనాన్స్ ఎగొట్టారని తెలిపారు. ఒక వాహనానికి రిజి్రస్టేషన్ నంబర్ను మరొక వాహనానికి మార్చారని చెప్పారు. వెలుగులోకి వచ్చిందిలా.. చిలకలూరిపేట బైపాస్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి కేసులో నిందితులు వినియోగించిన కారుపై విచారణ జరపడంతో నకిలీ కార్ల వినియోగం వెలుగు చూసింది. నకిలీ కార్ల కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. నకరికల్లు గ్రామానికి చెందిన పొనుగంటి రామకృష్ణ అలియాస్ ఆర్కే, హైద్రాబాద్కు చెందిన భానుప్రకాష్ గౌడ్, వైజాగ్కు చెందిన వర్మ, నరసరావుపేటకు చెందిన ఏఎస్ఐ కుమారుడు మదమంచి వెంకట అనుజ్ఞనాయుడు, పుల్లంశెట్టి మహేష్ బాబులను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నిందితులకు కార్లకు సంబందించిన నకిలీ డాక్యుమెంట్లు అందించడంలో ప్రకాష్ గౌడ్, సత్యశ్రీనివాస్, వర్మలు సహకరించారని తెలిపారు. ఇద్దరు పోలీసు అధికారులు కూడా గతంలో నిందితుల నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్టు విచారణలో తెలిసిందన్నారు. ఆ వాహనాలను అప్పుడే సదరు ఫైనాన్స్ సంస్థకు అప్పగించినట్టు తెలిపారు. -
ఏఐ గ్లాసులతో అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి.. తరువాత ఏమైందంటే
తిరువనంతపురం: కేరళ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోకి సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సాంకేతికత కలిగిన గ్లాసులు ధరించి వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతికత కలిగిన కలిగిన వస్తువులతో ఆలయంలోకి వచ్చినందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకున్నరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి అధికారులు ఐదెంచెల భద్రత కల్పిస్తారు. డ్రోన్, స్మార్ట్ సెన్సార్లు వంటి ఆధునాతన పరికారలతో నిరంతంరం నిఘా నేత్రాలలో ఉంచుతారు. అయితే ఆలయంలోకి మెుబైల్స్, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతులు లేవు.ఈ నేపథ్యంలోనే ఏఐ మెటా సాంకేతికత కలిగిన గ్లాసులను ధరించి వచ్చిన విదేశీ భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయ నిబంధనలు తెలియక తాను గ్లాసులు ధరించానని ఆ భక్తుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం అతనిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పి వదిలి వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరస్టైన వ్యక్తి పేరు తిరుపనీన్ అని ప్రస్తుతం ఆయన శ్రీలంక సంతతికి చెందిన వ్యక్తి కాగా ప్రస్తుతం సింగపూర్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. -
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ గాదె ఇన్నయ్య ఆశ్రమంలోనూ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు.. గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్పై కేసు నమోదు చేశారు. ఆదివారం.. నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు.. ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.ఇన్నయ్యను అరెస్ట్చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్ఐఏ అధికారులను చిన్నారులు అడ్డుకున్నారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. సంస్మరణ సభలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారని దర్యాప్తులో తేలింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రధాని, కేంద్ర హోంమంత్రిపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇన్నయ్య అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు సమాచారం. -
బెడ్ మీదే బేడీలు !
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ప్రముఖ బాండీ బీచ్ సమీప ఆర్చర్ పార్క్లోని యూదులపై విచక్షణా రహితంగా రైఫిళ్లతో కాల్పులు జరిపి పలువురిని పొట్టనబెట్టుకున్న 24 ఏళ్ల నవీద్ అక్రమ్ను పోలీసులు ఆస్పత్రిలోనే అరెస్ట్చేశారు. బీచ్లో ఇష్టారీతిగా కాల్పులు జరుపుతున్న నవీద్పైకి భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడటంతో అతన్ని సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యపరిస్థితి విషమించి తర్వాత నవీద్ కోమాలోకి వెళ్లాడు. కోమాలో ఉన్న నవీద్ బుధవారం కళ్లు తెరచి కోలుకోగానే ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మందిని చంపినందుకు 15 నేరాలు, ఉగ్రవాద చర్యతో పలువురిని పొట్టనబెట్టుకోవడం, పలువురిని గాయపర్చడం, అక్రమంగా ఆయుధాలు కల్గి ఉండటం, దుర్వినియోగపర్చడం, ఒక భవంతి సమీపంలో బాంబు అమర్చడం, కారులో పేలుడు పదార్థాలను పెట్టడం వంటి అంశాలపై మరో 40కిపైగా నేరాలను ఆ కేసులో పేర్కొన్నారు. నవీద్ కారులో ఇప్పటికే ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండాలను పోలీసులు గుర్తించడంతో అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాల నేరాన్ని సైతం కేసుకు జతచేశారు. మొత్తంగా 59 నేరాలు చేసినట్లుగా అతనిపై కేసు నమోదుచేశారు. వెలుగులోకి మరో జంట సాహసం50 ఏళ్ల ఉగ్రవాది సాజిద్, అతని కుమారుడు నవీద్ సమీప పార్క్ పాదచారుల వంతెన వద్ద కాల్పులతో తెగబడుతున్నప్పుడు వారిని అడ్డుకునేందుకు ఒక వృద్ధజంట ప్రయత్నించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరిస్, సోఫియా గుర్మాన్ అనే వృద్ధ జంట అటుగా వెళ్తున్నప్పుడే ఈ తండ్రీకొడుకులు కాల్పులు మొదలెట్టినట్లు తెలుస్తోంది. వెంటనే వీళ్లను అడ్డుకునేందుకు బోరిస్, సోఫియా విశ్వప్రయత్నంచేశారు. షూటర్ల చేతుల్లోని రైఫిళ్లను లాక్కునే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో దంపతులిద్దరూ కిందపడ్డారు. రైఫిల్ మాత్రం షూటర్ చేతుల్లోనే ఉండిపోయింది. దీంతో షూటర్ జరిపిన కాల్పులకు దంపతులిద్దరూ నేలకొరి వీరమరణం పొందారని ఆస్ట్రేలియా మీడియా వారిని సాహసోపేత చర్యను పొగిడింది. పలువురిని కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన దంపతులను కీర్తిస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు లక్షలాదిగా పోస్ట్లు పెడుతున్నారు. షూటర్ల మీదకు ఇటుకలు విసిరి, గాయపరిచేందుకు ప్రయత్నించిన 60 ఏళ్ల తన తండ్రి రీవెన్ మోరిస్ సైతం ప్రాణాలు కోల్పోయారని కూతురు వెల్లడించారు. -
లూథ్రా సోదరుల అప్పగింత.. అరెస్ట్
న్యూఢిల్లీ: గోవా అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన కేసులో, ’బిర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్ సహ యజమానులైన గౌరవ్, సౌరభ్ లూథ్రా సోదరులను థాయ్లాండ్ అప్పగించిన అనంతరం మంగళవారం అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలో ఈ సోదరులిద్దరూ థాయ్లాండ్లోని ఫుకెట్కు పారిపోవడం తెలిసిందే. దీంతో అధికారులు ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసి, వారి పాస్పోర్ట్లను రద్దు చేశారు. డిసెంబర్ 11న, భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు థాయ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఇరు దేశాల మధ్య ఉన్న న్యాయ ఒప్పందాల కింద లూథ్రా సోదరులను బ్యాంకాక్ నుండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి, అధికారులకు అప్పగించారు. 44 ఏళ్ల గౌరవ్, 40 ఏళ్ల సౌరభ్లను పటియాలా హౌస్ కోర్టులో జ్యుడీíÙయల్ మేజిస్ట్రేట్ ట్వింకిల్ చావ్లా ముందు హాజరుపరచగా, గోవా పోలీసుల అభ్యర్థన మేరకు రెండు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరైంది. నిందితులను బుధవారం ఉదయానికల్లా విమానంలో గోవాకు తీసుకురానున్నట్లు గోవా పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు. -
ఐసిస్తో సంబంధాలు.. ఉగ్రవాదుల అరెస్ట్
ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాజన్, మనీష్ బేడీ అనే ఇద్దరు టెర్రరిస్టులు పాకిస్థాన్లోని ఐసిస్ ఉగ్రసంస్థ ఆదేశాల మేరకు భారత్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వీరంతా ఆర్మేనియా నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గత నెలలో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) NIA అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీగా సోదాలు నిర్వహిస్తుంది. అధికారులు ఇదివరకే పలువురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎర్రకోట వద్ద జరిగిన బాంబుపేలుళ్లలో 15 మంది మృతిచెందగా అనేక మంది గాయపడ్డారు. కాగా ఈ ఘటనతో సంబంధమున్న నిందితులను దర్యాప్తు బృందాలు ఇది వరకే అరెస్టు చేశాయి. -
18 ఏళ్ల వేట
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది. చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి. అది కాళరాత్రి మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు. నేపాల్కు పరారైన హంతకుడు నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు. అతి ముఖ్యమైన క్లూ.. వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది. పట్టుబడిన క్షణం నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు. నిజం నిప్పులాంటిది ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం
బంజారాహిల్స్: ట్యూషన్లో చదవడం లేదనే కారణంతో ఓ కసాయి ట్యూషన్ టీచర్ ఒకటో తరగతి విద్యార్థికి గరిటెతో కాల్చి వాతలు పెట్టింది. చిన్నారికి నాలుగు చోట్ల వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలుకాగా ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. షేక్పేట ఓయూ కాలనీలో నివసించే వి.మానస ఎథిక్ సొల్యూషన్స్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం నుంచి ఆమె ఇంట్లో కళ్యాణి, సత్యబాబు దంపతులు పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. మానస రోజూ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉచితంగా ట్యూషన్లు చెబుతోంది. ఇందుకోసం ఇంట్లో పనిచేస్తున్న వారికి జీతం ఇవ్వకుండా ట్యూషన్లు చెబుతున్నానంటూ ఎగ్గొట్టేది. సమీపంలోని కాకతీయ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న తేజానందన్ (6) గురువారం సాయంత్రం అన్నతోపాటు మానస వద్దకు ట్యూషన్కు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తేజానందన్ అన్న ఇంటికి వెళ్లిపోగా, తేజానందన్ చదువుకుంటున్నాడు. అయితే ట్యూషన్లో సరిగా చదవడం లేదంటూ ఆగ్రహానికి గురైన మానస గరిటె కాల్చి చేతులు, తొడలు, వీపుపై వాతలు పెట్టింది. గాయాలతో విలవిల్లాడుతూ చిన్నారి ఏడుస్తుండగా తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. చిన్నారికి గరిటెతో కాల్చినట్లుగా ఒళ్లంతా ఎర్రగా బొబ్బలెక్కింది. దీంతో బాధిత తల్లిదండ్రులు తేజానందన్ను తీసుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి మానసపై ఫిర్యాదుచేశారు. పోలీసులు మానసపై బీఎన్ఎస్ సెక్షన్ 324, 75 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.నాకేమీ పశ్చాత్తాపం లేదు: మానస తేజానందన్ సరిగ్గా చదవడం లేదని భయపెట్టడానికే గరిటె కాల్చి వాతలు పెట్టినట్లు మానస వెల్లడించింది. గతంలో రెండుసార్లు ఇలాగే భయపెట్టానని, ఈసారి మాత్రం వాతలు పెట్టానని చెప్పింది. అయితే, తానేమీ పశ్చాత్తాపం చెందడంలేదంది. -
లెంగిక వేధింపుల కేసులో ఇద్దరు అధ్యాపకుల అరెస్ట్
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో ఇటీవల సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. బాధితురాలు స్వరాష్ట్రం ఒడిశాకు తిరుపతి పోలీసుల బృందం మంగళవారం చేరుకుంది. ఒడిశా జార్హ్పూర్లో బాధితురాలిని మహిళా ఎస్ఐ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి వివరాలను సేకరించారు. యువతి స్టేట్మెంట్ను వీడియో రికార్డ్ చేసి భద్రపరిచారు. ఇప్పటికే ఈ కేసు విషయంపై తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంట్ వేదికగా ప్రస్తావించడంతో ఇటు పోలీసులు, అటు వర్సిటీ అధికారులలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. అధ్యాపకుడు లక్ష్మణ్ కుమార్ తనను పలు మార్లు లైంగికంగా వేధించారని, మరో అధ్యాపకుడు శేఖర్రెడ్డితో ఏకాంతంగా గడిపిన వీడియోలు ఉన్నాయంటూ లక్ష్మణ్ కుమార్ పలుమార్లు బెదిరింపులకు దిగారని బాధితురాలు తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ స్టేట్మెంట్లను ఆధారం చేసుకొని, పోలీసులు ఆ ఇద్దరి అధ్యాపకులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈస్ట్ పోలీసులు స్థానిక డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం అధ్యాపకులకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. -
రూ.29 కోట్ల డ్రగ్స్ పట్టివేత
బెంగళూరు(బనశంకరి): బెంగళూరులో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.29 కోట్ల విలువ చేసే 10.36 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్, 8 కేజీల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చామరాజపేటేలోని పోస్టాఫీస్లో డ్రగ్స్ పార్శిల్స్ వచ్చినట్లు తెలిసి పోలీసులు సోదాలు చేయగా 8 కిలోల హైడ్రో గంజాయి లభించింది. మరోఘటన.. బెంగళూరు విమానాశ్రయంలో ఓ ప్రయాణికుని నుంచి కోట్ల రూపాయల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
Film Nagar: అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి పై కేసు నమోదు
-
ఢిల్లీ.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రసంస్థతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. అరెస్టైన ముగ్గురు తీవ్రవాదులు నార్త్ ఇండియాకు చెందిన వారని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లలో వీరిని అదుపులోికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల గురుదాస్ పూర పోలీస్ స్టేషన్ పై బాంబుతో దాడి చేసింది ఈ టెర్రరిస్టులేనని స్పెషల్ సెల్ అడిషనల్ సీపీ ప్రమోద్ కుమార్ కుశ్వాహా పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో హార్గున్ ప్రీత్ సింగ్ (పంజాబ్), వికాస్ ప్రజాపతి (మధ్యప్రదేశ్) ఆరిఫ్ (ఉత్తరప్రదేశ్) రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. వీరు కొన్ని ప్రదేశాలను టార్గెట్ చేసుకున్నారని ఆ ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి పలు వీడియోలు చిత్రీకరించారని పేర్కొన్నారు. వీరందరిని షాబాద్ బట్టి అనే వ్యక్తి బయిటి నుండి ఆదేశాలు ఇచ్చేవాడని సీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ లకు ఆయన స్వయంగా గాని ఆయన అనుచరుల ద్వారా గాని నడిపించేవారన్నారు.టెర్రరిస్ట్ గ్రూప్ రిక్రూట్ మెంట్ కోసం సామాజిక మాధ్యమాలను వాడారని వాటి ద్వారానే యువకులను ఉగ్రవాదులుగా నియమించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న టెర్రరిస్టులు ఉగ్రవాదుల విషయంలో కొంత సమాచారం ఇచ్చారని త్వరలో వాటి ఆధారంగా మరిన్ని అరెస్టులు జరుగుతాయని సీపీ ప్రమోద్ కుమార్ కుశ్వాహ పేర్కొన్నారు. -
దొంగ ఆఫీసర్.. ఉదయం IAS.. రాత్రి IPS
-
ఢిల్లీ పేలుడు: ఎన్ఐఏ చేతికి కీలక ఆధారం
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి మరో కీలక ఆధారం లభ్యమయ్యింది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల కారు బాంబు దాడికి పాల్పడిన కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనలో కీలకంగా ఉన్న సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన సోయాబ్ను తాజాగా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.ఇండియా టీవీ అందించిన కథనం ప్రకారం సోయాబ్ ఉగ్రవాది ఉమర్కు లాజిస్టికల్(రవాణా) సాయాన్ని అందించాడు. ఈ పేలుడులో 15 మంది మృతిచెందగా, 20 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇది యావత్ దేశాన్నీ భయభ్రాంతులకు గురిచేసింది. కాగా సోయాబ్ అరెస్టుతో ఈ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. షోయబ్.. జమ్ముకశ్మీర్ పోలీసులు గతంలో ఛేదించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో భాగమని విచారణలో తేలింది. అలాగే ఈ కేసులో సోయాబ్ పాత్ర ఉగ్రవాది ఉమర్కు బస కల్పించడం వరకూ మాత్రమే పరిమితం కాలేదని తేలింది.ఫరీదాబాద్లోని అల్ఫాలా విశ్వవిద్యాలయంలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసిన సోయాబ్, ఆ విశ్వవిద్యాలయ ప్రయోగశాల నుండి పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలను సేకరించేందుకు ఉమర్కు సహాయం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సోయాబ్.. హర్యానాలోని నుహ్లోని హిదాయత్ కాలనీలో ఉమర్ కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఈ ఇంటిని ఉమర్ తాను తప్పించుకునే సమయంలో ఉపయోగించాడు. అలాగే ఇక్కడే పేలుడు పదార్థాలను కూడా నిల్వ చేశాడని అధికారులు వెల్లడించారు.ఈ అద్దె ఇంటిని హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) నవంబర్ 16న తనిఖీ చేసి, ఆ తర్వాత సీలు చేసింది. ఇక్కడి నుంచే ఉమర్ కారులో ప్రయాణించాడు. ఈ ప్రయాణ మార్గాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఫిరోజ్పూర్ ఝిర్కాలో ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేసుకున్న తరువాత, ఉమర్ ముంబై ఎక్స్ప్రెస్వే పైనుంచి బాదర్పూర్ మీదుగా ఐ20 కారులో ఢిల్లీలోకి ప్రవేశించాడు. తరువాత ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో ఆ కారు పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి సమీపంలోని ఇతర వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ఈ దాడిని కేంద్ర మంత్రివర్గం ఉగ్రవాద ఘటనగా పేర్కొంది. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు సంస్థలు కృషి చేయాలని ఆదేశించింది. ఎన్ఐఏ ప్రస్తుతం ఆత్మాహుతి బాంబు దాడికి సంబంధించిన వివిధ ఆధారాలను సేకరిస్తోంది. ఈ దాడిలో భాగస్వామ్యమున్న ఇతరులను గుర్తించేందుకు పోలీసు బలగాలతో సమన్వయంతో వివిధ రాష్ట్రాలలో సోదాలు కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: కమ్రా టీ షర్టు వివాదం: ఉతికి ఆరేసిన బీజేపీ, శివసేన -
ఢిల్లీలో వాయు కాలుష్యంపై నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రమాదస్థాయిలను మించిన వాయు కాలుష్యంపై చేపట్టిన ఆందోళన తీవ్ర గందరగోళానికి, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇండియా గేట్ వద్ద సోమవారం ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన ఆందోళకారులు అడ్డుకోబోయిన పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన ఘటనలపై పోలీసులు 22 మంది అరెస్ట్ చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించగా అక్కడా పోలీసు అధికారులపై దాడికి దిగారు. దీంతో, విధులకు ఆటంకం కలిగించడంతోపాటు మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారంటూ వీరిపై సన్సద్ మార్గ్ పోలీస్ స్టేషన్తోపాటు, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిరసనకారులు పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడికి దిగడం తామెన్నడూ చూడలేదని ఓ అధికారి తెలిపారు. ‘ఇండియా గేట్ వద్ద నిరసనలకు అనుమతి లేదు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాము. జంతర్మంతర్ వద్ద ముందుగా అనుమతి తీసుకుని ఎవరైనా ఆందోళనకు దిగొచ్చని చెప్పాం. వినకుండా, బారికేడ్లపై నుంచి దూకి వెళ్లి రోడ్డుపై బైటాయించి, ట్రాఫిక్కు అవరోధం కలిగించారు. వాహనదారులు కోరినా అక్కడి నుంచి వారు కదల్లేదు’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘పైపెచ్చు, దురుసుగా ప్రవర్తించారు. మాపై దాడికి దిగారు. పెప్పర్ స్ప్రేను వాడారు. నిరసనకారుల దాడిలో గాయపడిన పోలీసులకు చికిత్స చేయించాం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, చర్యలు తీసుకుంటాం’అని ఆయన వివరించారు. ఇటీవల ఏపీలో ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు నేత హిడ్మాను, అమర్ రహే హిడ్డా, లాంగ్ లివ్ హిడ్మా అంటూ పోస్టర్లతో కొందరు నినాదాలు చేయడం పైనా దృష్టి సారించామన్నారు. కాగా, ఇండియా గేట్ వద్ద పోలీసులపై దాడికి దిగిన 22 మందికి సోమవారం ఢిల్లీ కోర్టు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరో వ్యక్తిని, అతడి వయస్సు నిర్ధారణ అయ్యేంత వరకు అబ్జర్వేషన్ హోంకు తరలించాలని ఆదేశించింది. కాగా, గాలి కాలుష్యంపై నిరసన చేపట్టిన ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్ అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజారోగ్యానికి కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా మారిందని, ప్రభుత్వం మాత్రం నీళ్లు చల్లడం, క్లౌడ్ సీడింగ్ అంటూ కంటితుడుపు చర్యలు చేపడుతోందని ఆరోపించింది. -
పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్
Dentist Suicide case ముంబై: హత్యారోపణల కింద మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే (Pankaja Munde) ముఖ్య సన్నిహితుడిని పోలీసలు అరెస్టు చేయడం కలకలం రేపింది. పంకజ ముండే వ్యక్తిగత సహాయకుడు అనంత్ గార్జేని ముంబైలోని వర్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య గౌరీ గార్జే ఆత్మహత్య కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. అనంత్ భార్య గౌరీ శనివారం సాయంత్రం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే భర్త ఆమెపై వేధింపులకు పాల్పడి, తీవ్రంగా హింసించాడని, అవి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్న గౌరీ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. గార్జేకు వివాహేతర సంబంధం ఉందని మరొక మహిళతో మొబైల్ ఫోన్లో చాట్ చేస్తుండగా పట్టుబట్టాడని, దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్-కెమెరా పోస్ట్మార్టం ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ద్వారా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున వర్లీ పోలీసులు గార్జేను అరెస్టు చేసి, కోర్టులో హాజరపర్చారు.గౌరీ ప్రభుత్వ కెఇఎం ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు. అనంత్, గౌరీ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి పంకజ ముండే, మాజీ ఎంపీ ప్రీతమ్ ముండే సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే పెళ్లి అయ్యి ఇంకా ఏడాది కూడా నిండకుండానే ఆమె బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స -
టాయిలెట్లో వీడియో రికార్డింగ్.. వ్యక్తి అరెస్టు
చెన్నై: బాత్రూం, టాయిలెట్లో సెల్ఫోన్ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళల వీడియోలను తీసిన టీ దుకాణం యజమానిని అరెస్టు చేశారు. వివరాలు.. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని రాసిపురం సమీపం ఆండకలూర్ గేట్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కాంప్లెక్స్లో ఒక టీ దుకాణం ఉంది. ఐదు రూపాయలకే టీ అమ్ముతూండటంతో ఈ దుకాణం దగ్గర రద్దీ ఎక్కువ. వెన్నండూరుకు చెందిన నాగరాజ్ (27) ఇక్కడ టీ చేస్తూంటాడు.నాగరాజ్ టాయిలెట్కు వెళ్లి తన సెల్ఫోన్ వీడియో ఆన్ చేసి వచ్చాడు. ఆ తర్వాత టాయిలెట్కు వెళ్లిన ఒక మహిళ దృశ్యాలు ఆ వీడియో రికార్డ్ అయిందని తెలుసుకుని దిగ్భ్రాంతి చెంది కేకలు వేసింది. అక్కడున్న వారు వెళ్లి తనిఖీ చేసి సెల్ఫోన్ తీసుకున్నారు. వారు ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సెల్ ఫోన్ను స్వాదీనం చేసుకున్న నాగరాజ్పై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ లో అనేక అశ్లీల చిత్రాలు ఉన్నట్లు తేలింది. -
ఐ బొమ్మ రవికి ఏమి శిక్ష పడబోతుందో తెలుసా? షాక్ అయ్యే విషయాలు!
-
యూనిఫామ్ వేసి బందోబస్తు డ్యూటీ చేసిన యువతి
హైదరాబాద్: పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన ఓ యువతి.. తానే పోలీస్ అని తప్పుదోవ పట్టించింది. విషయం తెలియడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాపూర్నగర్కు చెందిన ఓ యువతి (22) పోలీస్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం రాకపోవడంతో తాను పోలీస్ అని అందరిని నమ్మించాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగానే యూనిఫామ్ ధరించి పలుచోట్ల ఎవరికీ అనుమానం రాకుండా బందోబస్తు డ్యూటీ సైతం చేసింది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి వద్ద కూడా 10 రోజుల బందోబస్తు డ్యూటీ చేసిందట. ఈ విషయం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు తెలియడంతో వారు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ దీనిపై విచారించి..ఆ యువతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బొల్సనారో ముందే అరెస్ట్
సావొ పౌలొ: దేశంలో తిరుగుబాటు లేవదీసేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై గృహ నిర్బంధంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జయిర్ బొల్సనారోను అధికారులు ముందుగానే అరెస్ట్ చేశారు. మరో రెండు వారాల్లో ఆయనపై విధించిన 27 ఏళ్ల కారాగార శిక్ష అమల్లోకి రానుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. 2019–2022 సంవత్సరాల మధ్య దేశాధ్యక్షుడిగా ఉన్న బొల్సనారో.. 2022 ఎన్నికల్లో లులా డసిల్వా చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం, 2023లో దేశంలో తిరుగుబాటుకు, అధ్యక్షుడు లులా డ సిల్వా హత్యకు కుట్ర పన్నారంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బొల్సనారోకు 27 ఏళ్ల కారాగారంతోపాటు 2030 వరకు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనరాదంటూ నిషేధం విధించింది. ప్రస్తుతం ఆయన విలాసవంతమైన జర్దిప్ బొటనాకో ప్రాంతంలోని సొంతింట్లో గృహ నిర్బంధంలో ఉన్నారు. కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచేందుకు ఎల్రక్టానిక్ మానిటర్ను జూలై 18వ తేదీన ఆయన కాలికి అమర్చారు. శనివారం వేకువజామున ఆ పరికరాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని ప్రకటించిన సుప్రీంకోర్టు జడ్జి అలెగ్జాండర్ డి మోరెస్..బొల్సనారోను వెంటనే గృహ నిర్బంధం నుంచి రాజధాని బ్రెసిలియాలో ఫెడరల్ పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించాల్సిందిగా ఆదేశాలివ్వడం కలకలం రేపింది. బొల్సనారో దేశాన్ని విడిచి దొంగచాటుగా పరారయ్యే ప్రమాదముందని, నివాసం పొరుగునున్న రాయబార కార్యాలయాల్లో ఆశ్రయం కోరే అవకాశముందని అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. ఇదంతా ముందు జాగ్రత్త మాత్రమేనని, మాజీ అధ్యక్షుడిని అవమానించే ఉద్దేశం తమకు లేదన్నారు. ఆయనకు బేడీలు వేయడం, బహిరంగంగా జైలుకు తరలించడం వంటివి చేపట్టబోమన్నారు. -
నిందితులపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద బాంబుపేలుడు ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణను మరింత వేగవంతంచేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులు కస్టడీలో ఉన్న నిందితులు డాక్టర్ ముజామిల్ ఘనీ, అదీల్ రాఠర్, వైద్యురాలు షాహీనా సయీద్, మత బోధకుడు ఇర్ఫాన్ అహ్మద్ వగాయ్లను ఎన్ఐఏ గురువారం తమ కస్టడీలోకి తీసుకుంది. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఫరీదాబాద్ ఉగ్రమాడ్యూల్ సభ్యులు ఎలా అఫ్గాన్, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, తుర్కియేలోని హ్యాండ్లర్లతో సత్సంబంధాలు పెట్టుకున్నారు? నిధులు ఏఏ మార్గాల్లో సంపాదించారు? విధ్వంసకర రచన చేసిందెవరు? వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రమాడ్యూల్లో వాస్తవంగా ఎంత మంది సభ్యులు ఉన్నారు? అంటూ ప్రశ్నలవర్షం కురిపించి వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ‘‘ ఈ నలుగురు మొత్తం ఉగ్రమాడ్యూల్లో అత్యంత కీలకమైన సభ్యులు. వీళ్ల వద్ద చాలా సమాచారం ఉంటుంది’’ అని జాతీయ దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఢిల్లీ పోలీసుల నుంచి నవంబర్ 11న అధికారికంగా కేసు తమ చెంతకు వచ్చాక ఎన్ఐఏ అమీర్ రషీద్ అలీ, జసీర్ బిలాల్ వానీ అలియాస్ డ్యానిష్లను అరెస్ట్చేసింది. గురువారం ఈ నలుగురిని తమ అదుపులోకి తీసుకోవడంతో ఎన్ఐఏ అరెస్ట్ల సంఖ్య ఆరుకు పెరిగింది. గురువారం ముజామిల్, అదీల్, షాహీనా, ఇర్ఫాన్ వగాయ్లను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుల ప్రాంగణంలోని కోర్టులో ఎన్ఐఏ ప్రవేశపెట్టింది. కేసు దర్యాప్తు నిమిత్తం వీళ్లందర్నీ తమకు అప్పగించాలని కోర్టును కోరగా 10 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి అంజూ బజాజ్ ఛాంద్నా ఉత్తర్వులు జారీచేశారు. -
అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
-
త్వరగా అరెస్ట్ చేయండంటూ పోలీసులకు ఫోన్ ల మీద ఫోన్ లు.. వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
మావోయిస్టులూ... లొంగిపోండి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మావోయిస్టులు లొంగిపోవడం మంచిదని, లేకపోతే చర్యలు తప్పవని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేశ్చంద్ర లడ్హా హెచ్చరించారు. విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా, మరో ఐదుగురు మృతిచెందారని చెప్పారు. ఘటనాస్థలంలో లభించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారనే విషయంపై వెంటనే దృష్టి పెట్టామని వెల్లడించారు. ఆ తర్వాత పక్కా సమాచారంతో ఎన్టీఆర్, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని వివరించారు. హిడ్మా దళానికి చెందిన 27 మందితోపాటు సౌత్ బస్తర్ ఏరియా కమిటీ, స్థానిక కేడర్తో సహా అరెస్టయిన వారందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారని చెప్పారు.మావోయిస్టు కీలక నేత దేవ్జీ లొంగిపోలేదని తెలిపారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది మావోయిస్టులను పట్టుకోవడం తొలిసారి అని వివరించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు. షెల్టర్ కోసమే వచ్చారు... ఇటీవల తెలంగాణలో కొంతమంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని, వారి ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోయిస్టులు భావించారని లడ్హా తెలిపారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో చాలాచోట్ల ముమ్మరంగా దాడులు జరుగుతున్నాయన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీని ఎంచుకున్నారని చెప్పారు. మళ్లీ సమయం చూసి తమ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అయితే, మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం ఉందని, వారి ప్రణాళికలపై మాత్రం సమాచారం లేదన్నారు. మావోయిస్టుల ప్లాన్ ఎమిటి? కానూరులో ఎందుకు ఉన్నారు? వారికి ఎవరు షెల్టర్ ఇచ్చారు? అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాయడం గురించి తమకు తెలియదన్నారు. ఎదురు కాల్పుల్లోనే హిడ్మా మృతిచెందారని, పట్టుకుని చంపారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీలోని ప్రజాప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.మారేడుమిల్లి ప్రాంతంలో మరో ఎన్కౌంటర్..మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలోనే బుధవారం ఉదయం 7 గంటలకు మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు లడ్హా తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని, వారిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. చనిపోయినవారిలో జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఒక్కరినే గుర్తించామన్నారు. శ్రీకాకుళానికి చెందిన జోగారావు పదేళ్లుగా మావోయిస్టు పారీ్టలో కొనసాగుతున్నారని తెలిపారు.ఆయుధాలు, రూ.12.72లక్షల నగదు స్వాధీనంఅరెస్ట్ చేసిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఒక పిస్టల్, రెండు రివాల్వర్లు, రెండు డీబీబీఎల్ఎస్, 31 దేశీయ తయారీ తుపాకులు, చెక్కతో తయారు చేసిన 8ఎంఎం తపంచాలు ఉన్నాయి. వాటితోపాటుగా 302 రౌండ్ల బుల్లెట్లు, రెండు మేగజైన్లు తూటలు, నాలుగు కత్తులు, కోర్డిటెక్స్ వైర్ 750 గ్రాములు, రూ.12.72 లక్షల నగదుతోపాటుగా 64 మెమొరీ కార్డులను, ఒక రేడియో సెట్ను స్వా«దీనం చేసుకున్నారు. విజయవాడకు మావోయిస్టులు ఏలూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అరెస్ట్ చేసిన 50 మంది మావోయిస్టులను భారీ భద్రత మధ్య విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు తరలించారు. వీరిలో మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ముగ్గురు, డివిజనల్ కమిటీ సభ్యులు ఐదుగురు, ఏరియా కమిటీ సభ్యులు 19 మంది, పార్టీ సభ్యులు 23 మంది ఉన్నారు. వారి నుంచి స్వా«దీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మేగజైన్స్, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్లు, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను కూడా విజయవాడ తీసుకొచ్చారు. మీడియా సమావేశం అనంతరం మళ్లీ ఏ జిల్లాలో దొరికిన మావోయిస్టులను ఆ జిల్లాకు తరలించారు. మీడియా సమావేశంలో ఎస్ఐబీ ఐజీ పీహెచ్డీ రామకృష్ణ, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్, ఐదు జిల్లాల ఎస్పీలు విద్యాసాగర్ నాయుడు, ప్రతాప్ శివకిశోర్, రాహుల్మీనా, బిందుమాదవ్, విజయవాడ సీపీ రాజశేఖరబాబు, డీసీపీలు కేజీవీ సరిత, కృష్ణప్రసన్న, లక్ష్మీనారాయణ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.అరెస్ట్ చేసిన మావోయిస్టుల వివరాలు కృష్ణా జిల్లాలో...1) ఉద్దె రఘు (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) 2) మదకం దివాకర్ అలియాస్ మిట్టు (ఏరియా కమిటీ సభ్యుడు) 3) వెట్టి నందె (ఏరియా కమిటీ సభ్యుడు) 4) ఓయం సంబట్టి అలియాస్ సమిత (ఏరియా కమిటీ సభ్యురాలు) 5) కొర్సా సోమ్ల్ అలియాస్ పరిమిళ (ఏరియా కమిటీ సభ్యురాలు) 6) కుంజం రాంబు (పార్టీ సభ్యుడు), 7) దొడి నీలేష్ (పార్టీ సభ్యుడు) 8) మదకం గంగి (పార్టీ సభ్యులు) 9) హేమల్ల రమే (పార్టీ సభ్యులు) 10) మదకం హైమ (పార్టీ సభ్యులు) 11) సోడి అర్జున్ అలియాస్ సంజు (పార్టీ సభ్యులు) 12) కర్టం బండి (పార్టీ సభ్యులు) 13) మదకం బుజ్జి అలియాస్ మంగ్లీ (పార్టీ సభ్యురాలు) 14) మదకం నవ్య అలియాస్ యుగి (పార్టీ సభ్యురాలు) 15) మండ్వీ లక్ష్మి (పార్టీ సభ్యురాలు) 16) మదకం పుజీ అలియాస్ రితిక (పార్టీ సభ్యురాలు) 17) హేమ్ల హిడ్మీ అలియాస్ నిర్మల (పార్టీ సభ్యురాలు) 18) పుణెం ఇష్టు అలియాస్ సరీనా (పార్టీ సభ్యులు) 19) మదకం హంగు అలియాస్ రోహన్ (పార్టీ సభ్యులు) 20) పుల్సు లక్ష్మణ్ (పార్టీ సభ్యులు)21) మడ్వీ జోగి (పార్టీ సభ్యులు)22) తాతి లక్ష్మి (పార్టీ సభ్యురాలు) 23) నుప్పు కోసి (పార్టీ సభ్యురాలు)24) ఓయం జ్యోతి (పార్టీ సభ్యురాలు) 25) కోర్స శాంతి (పార్టీ సభ్యురాలు) 26) కుంజం భీమి (పార్టీ సభ్యురాలు)27) ఎం.జోగి (పార్టీ సభ్యులు)28) మడ్వీ మహిణి (పార్టీ సభ్యురాలు)ఏలూరు జిల్లాలో...1) సోదె లచ్చు అలియాస్ గోపాల్ (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) 2) సోదె లక్మా అలియాస్ భీమ (డివిజనల్ కమిటీ సభ్యుడు) 3) గంగి లక్ష్మి అలియాస్ మాదే (డివిజనల్ కమిటీ సభ్యుడు) 4) వెంటి వెంకట్ (ఏరియా కమిటీ సభ్యుడు) 5) మదకం వాగా (ఏరియా కమిటీ సభ్యుడు) 6) కశ్యప్ భీమా అలియాస్ యోగేష్ (ఏరియా కమిటీ సభ్యుడు) 7) పుడియం ఆనంద్ అలియాస్ దన్ను (ఏరియా కమిటీ సభ్యుడు) 8) మదకం లక్ష్మణ్ అలియాస్ కోసా (ఏరియా కమిటీ సభ్యుడు) 9) కుంజం బుజ్జి (ఏరియా కమిటీ సభ్యుడు) 10) తాతీ కమల (ఏరియా కమిటీ సభ్యురాలు) 11) దాది ఆద్మా అలియస్ మల్లేష్ (ఏరియా కమిటీ సభ్యుడు) 12) మడ్వీ జోగా (ఏరియా కమిటీ సభ్యుడు) 13) మడ్వీ సునీత, 14) కుంజం నందిని (ఏరియా కమిటీ సభ్యులు) 15) బాడిశ రాజు (ఏరియా కమిటీ సభ్యుడు)ఎన్టీఆర్ జిల్లాలో..1) పోడియం రెన్గు (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) 2) సోడి మనల్ల (డివిజనల్ కమిటీ సభ్యుడు) 3) మదకం మదన్ అలియాస్ మధన్న (డివిజన్ కమిటీ సభ్యుడు ) 4) సోడి మంగీ (ఏరియా కమిటీ సభ్యురాలు) కాకినాడ జిల్లాలో... 1) పోట్టం కాంతి (ఏరియా కమిటీ సభ్యురాలు) 2) మడ్వీ కోసి (ఏరియా కమిటీ సభ్యురాలు) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో... 1) మడ్వీ హంధా (డివిజనల్ కమిటీ సభ్యులు) -
ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నా.. పోలీసులకు చిక్కాడు
రావులపాలెం: మరో మావోయిస్టు కీలకనేత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పోలీసులకు చిక్కారు. ఆ వివరాలను రావులపాలెం సీఐ శేఖర్బాబు బుధవారం విలేకరులకు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సరోజ్ మడవి (అలియాస్) మడ్వీ హంధాను రావులపాలెం గౌతమి గోదావరి డంపింగ్ యార్డ్ వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లోని బుంద్లేలంక కిష్ట్రారం పోలీస్ స్టేషన్ పరిధిలో సుక్మా జిల్లాకు చెందిన సరోజ్ మడవి ఐదో తరగతి వరకు చదివారు. 12 ఏళ్ల వయసులో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై దళంలో చేరారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఎటపాక మావోయిస్టుల సౌత్ డివిజన్ కమాండర్ ఇన్చార్జిగా ఉన్న ముచాకీ ఎర్రా అలియాస్ ఎర్ర దాదా వద్ద కమ్యూనికేషన్ కమాండర్గా ఉన్నారు. 2021 నుంచి వివిధ దాడుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుని కోనసీమకు రాగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఒక గన్, పది తూటాలు స్వాదీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కొత్తపేట కోర్టులో హాజరుపరచారు. కాగా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు సరోజ్ మడవి సన్నిహితుడు. హిడ్మాకు అనుంగు అనుచరుడు కోనసీమను తలదాచుకోవడానికి సురక్షిత ప్రాంతంగా మావోయిస్టులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సరోజ్ మడవి కొంత కాలం క్రితం సఖినేటిపల్లి వచ్చి అక్కడ ఆక్వా చెరువు వద్ద గుమస్తాగా చేరి జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. కోనసీమలో ఎవ్వరికీ అనుమానం రాకుండా అతను మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు, పోలీసులు అతని సెల్ సిగ్నల్ ట్రాక్ చేయడం ద్వారా కనిపెట్టారు. హిడ్మాకు అనుంగు అనుచరుడు. ఎన్కౌంటర్కు ముందే హిడ్మా వద్దకు వెళ్లిన సరోజ్.. ఎన్కౌంటర్లో హిడ్మా హతమవడంతో అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి కోనసీమలో తలదాచుకోవడానికి వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. -
ఇది పక్కా ప్లాన్.. త్వరలో మరో ఎన్ కౌంటర్..
-
మేజిస్ట్రేట్ ముందు CI సిగ్గుతో తలదించుకున్నాడు
-
హిడ్మా.. ది మోస్ట్ వాంటెడ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీలోని మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగినట్లు మంగళవారం ఉదయం 8 గంటలకు బయటకు తెలిసింది. 9 గంటలకల్లా ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత చనిపోయినట్టుగా ప్రచారం మొదలైంది. ఆ తర్వాత గంటకే చనిపోయింది హిడ్మా అంటూ ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే, చనిపోయింది భీకర దాడులతో భద్రతా దళాలను ముప్పు తిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడ్వి హిడ్మానా? మరొకరా? అనే చర్చ మొదలైంది. ఓ వైపు మీడియాలో హిడ్మా మరణంపై కథనాలు వస్తున్నా, గెరిల్లా వార్ఫేర్లో ఆరితేరిన హిడ్మా చనిపోయే అవకాశమే లేదని మావోయిస్టుల సానుభూతిపరులు అభిప్రాయపడుతూ వచ్చారు. మరోవైపు ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాల నుంచీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎన్కౌంటర్లో చనిపోయింది హిడ్మానే అంటూ ఏపీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్ మహేశ్చంద్ర లడ్డా అధికారికంగా ప్రకటించారు. దీంతో విప్లవ శ్రేణులు విస్తుపోగా.. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ కోసం ఏళ్ల తరబడి దండకారణ్యంలో అడవులను జల్లెడ పడుతున్న భద్రతా దళాలు సంబరాలు చేసుకున్నాయి. భద్రన్న, చలపతి అడుగుజాడల్లో.. ఆదివాసీల్లో మురియా తెగకు చెందిన మడ్వి హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం. బాలల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా ఆ తర్వాత చేతన నాట్య మంచ్ ద్వారా విప్లవ బాటలో నడిచారు. కిషన్ జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో తొలి పాఠాలు నేర్చుకుంటే, మరో అగ్రనేత చలపతి హిడ్మాను మరింత సాన పట్టారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా 2009లో పార్టీ హిడ్మాకు సుక్మా జిల్లాలోని జేగురుగొండ ఏరియా దళ కమాండర్గా నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఆ సమయంలోనే అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో 2010 ఏప్రిల్ 7న సుక్మా జిల్లా చింతల్నార్ – టేక్మెట్ల అంబూష్ దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇప్పటివరకు మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్దది. భీకర దాడులకు కేరాఫ్ » 2013 ఏప్రిల్లో సుక్మా జిల్లా కంచాల దగ్గర కూంబింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. దీంతో కూంబింగ్ను అర్ధంతరంగా ఆపి హెలికాప్టర్ ఎక్కుతున్న ఆర్ఎస్సై పైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చనిపోయిన ఆర్ఎస్సై మృతదేహం అప్పగింత విషయంలో మూడు రోజుల పాటు హైడ్రామా నెలకొంది. ఈ సమయంలోనే తొలిసారిగా హిడ్మా పేరు బయటి ప్రపంచానికి తెలిసింది. » 2013 మే 25న సుక్మా జిల్లాలోని దర్బా లోయలో సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్గా ఝిరామ్ఘాటీ దగ్గర మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ అగ్రనేతలు నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. దీంతో భీకర దాడులకు కేరాఫ్ అడ్రస్ హిడ్మా అనే పేరు స్థిరపడిపోయింది. » 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అంబూష్లో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతా దళాల వెన్నులో వణుకు పుట్టించింది. » 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 మంది డీఆర్జీ జవాన్లు చనిపోయారు. అప్పటి నుంచి భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మా ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది.కోలుకోలేని ఎదురుదెబ్బ!హిడ్మా ఎన్కౌంటర్తోమావోయిస్టు కేడర్లో ఆందోళన శత్రువును దెబ్బ కొట్టే వ్యూహాల్లో హిడ్మా దిట్ట ఇప్పటివరకు జరిగిన కీలకఆపరేషన్లన్నింటి మాస్టర్ మైండ్ అతనేసాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు మూలాలపై కీలక దెబ్బ పడింది. కీలక నేత హిడ్మా భద్రత బలగాల ఎదురు కాల్పుల్లో మరణించడంతో..వారిలో భవిష్యత్తు గురించిన ఆందోళన మొదలైంది. శత్రువును వ్యూహాత్మకంగా దెబ్బతీయడంలో దిట్టగా పేరు పొందిన హిడ్మా సైతం ఎన్కౌంటర్లో మరణించడాన్ని ఆ పార్టీ కేడర్ జీర్ణించుకోలేక పోతోంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కంపెనీ వన్ కమాండర్ హిడ్మాను హతమార్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సాయుధ పోలీసు బలగాలకు డెడ్లైన్ విధించారంటేనే హిడ్మా ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయినట్టు ప్రచారం జరిగింది. కానీ మావోయిస్టు కమిటీ హిడ్మా ఫొటోలు రిలీజ్ చేయడంతో ఆ ప్రచారానికి తెరపడింది. కానీ హిడ్మా భద్రత బలగాలకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. గిరిజనుడు కావడంతో స్థానికంగా బలం..: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా స్థానికుడు కావడంతో గిరిజన ప్రాంతాల్లో పూర్తి పట్టుంది. ఈ నేపథ్యంలో హిడ్మా దళంలోనూ చాలా వరకు గిరిజనులే ఉంటారని సమాచారం. కాగా హిడ్మా బృందం అత్యంత శక్తివంతమైనదిగా మావోయిస్టులలో పేరుంది. చాలా తక్కువ మాట్లాడే హిడ్మా..శత్రువును దెబ్బకొట్టే వ్యూహాల రచనలో దిట్టగా పేరుపొందాడు. చిన్న వయస్సులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. హిడ్మాకు గోండి, కోయ, హిందీ, తెలుగు, బెంగాలీ భాషలపై పట్టుండడంతో స్థానికులతో బాగా కలిసిపోయేవాడని, ఇంగ్లిష్లోనూ మాట్లాడే వాడని సమాచారం. అతడి నెట్వర్క్ సైతం ఎంతో బలంగా ఉండేదని చెబుతారు. హిడ్మా కోసం కొన్నేళ్ల పాటు ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు, ఏపీ, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు సెర్చ్ ఆపరేషన్లు చేశాయి. అయితే ఎప్పటికప్పుడు స్థావరాలు మార్చే హిడ్మా..అదే క్రమంలో వేరే ప్రాంతానికి వెళుతూ ఎన్కౌంటర్కు గురయ్యాడు. డిఫెన్స్లో పట్టుండడంతోపాటు ఎంతో పక్కాగా వ్యూహ రచన చేసే యువ నాయకత్వం లేకపోవడం ఇప్పుడు మావోయిస్టు కేడర్లో నైరాశ్యం నింపిందని మాజీ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిడ్మాలా ముందుండి భద్రతా బలగాలను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకత్వం లేదని ఆయన అన్నారు. 50 మంది మావోయిస్టుల అరెస్ట్! బెజవాడ కానూరులో 28.. ఏలూరులో 15.. సామర్లకోట సమీపంలో ఇద్దరు ప్రసాదంపాడులో మరో నలుగురు, గన్నవరంలో ఒకరు.. ఎక్కడికక్కడ వారున్న భవనాలను చుట్టుముట్టి పట్టుకున్న పోలీసులు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయిన వైనం అందరూ హిడ్మా బృంద సభ్యులే అంటున్న పోలీసులుపెనమలూరు/ఏలూరు టౌన్/సామర్లకోట: విజయవాడ సమీపంలోని కానూరులో, ప్రసాదంపాడులో, ఏలూరు గ్రీన్ సిటీలో, కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరంలో తల దాచుకున్న 50 మంది మావోయిస్టులు మంగళవారం పోలీసులకు పట్టుబడ్డారు. కానూరు ఆటోనగర్లోని ఓ భవనంలో 28 మంది, ప్రసాదంపాడు రైల్వే గేటు వద్ద నలుగురు, గన్నవరంలో ఒకరు, ఏలూరు గ్రీన్ సిటీలో 15 మంది, సామర్లకోట మండలం కొప్పవరం సమీపంలో ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారు. ముందస్తు సమాచారంతో ఆక్టోపస్, ఇంటిలిజెన్స్, స్థానిక పోలీసులు ఒక్కసారిగా ఆయా ప్రాంతాల్లోని భవనాలపై మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో కానూరు వద్ద ఛత్తీస్గఢ్కు చెందిన 28 మంది పట్టుబడగా, వీరిలో 21 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి (దేవ్జీ) అంగరక్షకులు తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో నలుగురు కీలక హోదాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే దేవోజీ దొరికాడా.. లేదా.. అనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. వీరు పట్టుబడిన భవనంలోనే కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కానూరు ఆటోనగర్లో మూడు అంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రైవేటు వ్యక్తికి చెందిన టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన గోడౌన్ ఉంది. భవనంలో పైన మూడు అంతస్తులు ఉన్నాయి. జర్మనీలో ఉంటున్న భవన యజమాని, ప్లానర్, బిల్డర్ స్వామినాయుడు తన భవనం అద్దెకు ఉందని ఆన్లైన్లో పెట్టాడని సమాచారం. విశాఖపట్నంకు చెందిన ఈయనకు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద కార్యాలయం ఉంది. అద్దెకు ఎవరూ రాక పోవటంతో ఆన్లైన్లో వివరాలు పెట్టారు. దీంతో మావోయిస్టులు కూలీ పనులు చేసుకోవటానికి వచ్చామని, భవనం కావాలని ఓ మహిళ ద్వారా సంప్రదించారు. దీంతో 20 రోజుల క్రితం ఆయన వీరికి భవనాన్ని అద్దెకు ఇచ్చారు. భవనాన్ని చుట్టుముట్టి.. మావోయిస్టులు భవనంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఆక్టోపస్, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున భవనాన్ని చుట్టుమట్టారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న వివిధ రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. భవనంలో పెద్ద ఎత్తున సోదాలు చేశారు. ఇతరత్రా సామగ్రి ఉండటంతో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్లు భవనాన్ని అణువణువు పరిశీలించాయి. అనంతరం భవనాన్ని సీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగారులో భాగంగా చాలా మంది మావోయిస్టులు కేంద్ర బలగాల చేతిలో మరణించారు. అగ్రనేతలు సైతం చనిపోయారు. దీంతో మావోయిస్టులు అడవులు వదిలి నగరాలు, పట్టణాల బాట పట్టారు.ఇందులో భాగంగానే 20 రోజుల క్రితం కానూరు ఆటోనగర్లో భవనం తీసుకుని ఉంటున్నారు. ఆటోనగర్లో బీహార్, ఉత్తర్ప్రదేశ్, ఒడిస్సా, తదితర రాష్ట్రలకు చెందిన కారి్మకులు వివిధ పనులు చేస్తుండటంతో మావోయిస్టులకు ఇక్కడ షెల్టర్ తీసుకోవటానికి వాతావరణం అనుకూలంగా మారింది. పక్కా సమాచారంతో దాడులు : ఎస్పీ మావోయిస్టులు కానూరు ఆటోనగర్లోని ఓ భవనంలో ఉన్నారన్న పక్కా సమాచారంతోనే దాడులు చేసి, 28 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ విద్యాగర్నాయుడు మీడియాకు వెల్లడించారు. విజయవాడ ప్రాంతంలో వ్యూహాత్మకంగా దాడులు చేసేందుకే వారు వచ్చారన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి బృందాన్ని పట్టుకున్నామని, హిడ్మా బృందానికి చెందిన వారే ఇక్కడ షెల్టర్ తీసుకున్నారని తెలిపారు. -
YSRCP Shyamala: ఎలాంటి నోటీసులు లేకుండా బెదిరించి అరెస్ట్ చేస్తారా?
-
మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో తిరుపతి?
సాక్షి,అమరావతి: మావోయిస్టు ఉద్యమంలో కీలక నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల ఎదుట లొంగిపోయారనే ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఏపీ పోలీస్ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.తిప్పిరి తిరుపతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ఈయన, 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి దశలవారీగా ఎదిగి, కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. గత మేలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందడంతో, తిరుపతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలుస్తోంది. ఇటీవల లొంగుబాట్ల పరంపరలో మావోయిస్టులు కీలక నేతలు, కమాండర్లు పోలీసుల ఎదుట లొంగిపోతుండటంతో తిరుపతి సైతం లొంగిపోయినట్లు జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీలో ‘అభయ్’ అనే పేరుతో లేఖలు విడుదల చేసిన నేతగా తిరుపతిని గుర్తించారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, తిరుపతి ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారా? లేదంటే అజ్ఞాతంలోనే ఉన్నారా? అనే అంశంపై స్పష్టత లేదు. మావోయిస్టు వర్గాలు ఈ విషయంపై మౌనం పాటిస్తుండగా, పోలీసు వర్గాలు కూడా అధికారికంగా స్పందించలేదు.ఆర్ఎస్యూ నేపథ్యమే..కోరుట్లలోని అంబేడ్కర్నగర్కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు సాధారణంగా జరుగుతున్న క్రమంలో పోలీసు కేసులు నమోదు అయ్యాయి. 1983 చివరలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్గా, మిలిషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్ క్యాడర్ హోదాలో పనిచేస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో తిప్పిరి తిరుపతిని దేవ్జీగా పిలుచుకుంటారు. మిలి షియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది ఇతడేనని పోలీసు వర్గాలు చెబుతాయి. ఆయన తలకు ఎన్ఐఏ రూ. కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం.ఎక్కడున్నడో ఏమో? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లో కీలకంగా వ్యవహరించడంతోపాటు మిలటరీ శిక్షణ కేంద్రం నిర్వహణలోనూ తిరుపతి పాలుపంచుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తి రుపతి తన స్థావరాలు మార్చుకుంటున్నట్లు పో లీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొంత మంది మా వోయిస్టు కీలక నేతలు పశ్చిమ బెంగాల్ సరి హద్దు ప్రాంతాల్లోకి వెళ్లి షెల్టర్ తీసుకుంటున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ భావించింది. కొద్ది నెలల క్రితం మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు కోరుట్లలోని తిరుపతి ఇంటికి వెళ్లి అజ్ఞాతంలో ఉన్న అతడిని లొంగిపోయేలా చూడాలని ఆయన బంధువులను సైతం కోరారు. ఈ క్రమంలో తిరుపుతి అడవిని వదిలి ఏపీ పోలీసులకు లొంగిపోయినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
Ambati: కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
-
జ్యూస్ తాగించి మహిళపై గ్యాంగ్ రేప్
సాక్షి, బళ్లారి/రాయచూరు రూరల్: ఓ మహిళకు జ్యూస్ తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకా మడ్లూరు గ్రామానికి చెందిన మహిళ (39)ను బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నమ్మించి, మాయ మాటలు చెప్పి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి జ్యూస్ తాగించారు. ఆమెపై నలుగురు అత్యాచారం చేయడంతో బాధితురాలు యలబుర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి అత్యాచారానికి పాల్పడిన లక్ష్మణ కెంచప్ప, బసవరాజ్ సక్రప్ప, భీమప్ప, శశికుమార్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం హొసపేటె నుంచి కొప్పళకు బకాయి డబ్బులిస్తామని చెప్పిన యువకుడి మాటలు నమ్మి బాధిత మహిళ వచ్చింది. ఆమె తనకు పరిచయం ఉన్న లక్ష్మణ్కు అప్పు ఇచ్చింది. దానిని పొందడానికి ఆ మహిళను కుష్టిగికి పిలిపించారు. లక్ష్మణ్, మరో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంలో ఆమెను యలబుర్గా తాలూకా మడ్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ జ్యూస్లో మత్తు మందు కలిపి తాగించి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలు కొప్పళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత వెంకటరెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. ఆ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వాళ్ల ఫోన్లు లాక్కున్న పోలీసులు.. భయబ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డి సతీమణి హరిత సాక్షితో మాట్లాడుతూ.. నా భర్తకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెప్పారు. వాటిని మాకు కనీసం చూపించలేదు. పోలీసులు మా ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు. నా భర్తను తమ వెంట తీసుకెళ్లారు. ప్రశ్నించిన వారి నోరు మూయించడం సరికాదు అని అన్నారు. కేసు ఏంటంటే.. టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ వెంకటరెడ్డిపై చర్యలకు దిగారు. తాడిపత్రి రూరల్ పోలీసులు 352, 353(1)(2), 196(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడి అరెస్ట్
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్లు కేసులో మరో ముందడుగు పడింది. బాంబు పేలుడికి సంబంధించి కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వని అలియాస్ డానిష్ ని ఎన్ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. బాంబు తయారికి సంబంధించిన సాంకేతిక అంశాలు బిలాల్ అందించాడని ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీతో కలిసి పనిచేశాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎర్రకోట బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జాసిర్ బిలాల్ వని అలియాస్ (డానిష్)ను ఎన్ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. బిలాల్ బాంబుదాడి జరగడానికి ముందు ఉగ్రవాదులకు సాంకేతిక సహాయం అందించాడని డ్రోన్ల ఆధునీకరణ, రాకెట్ లాంఛర్ల తయారీ వంటి విషయాలలో సహాయం అందించాడని పేర్కొంది. అంతేకాకుండా కారు బాంబు దాడికి ముందు ప్రధాన నిందితుడు ఉమర్కు ఎంతో సన్నిహితంగా మెదిలేవాడని పేలుళ్ల కేసులో సహా కుట్రదారుగా బిలాల్ వ్యవహరించాడని తెలిపింది.జాసిర్ బిలాల్ జమ్మూకశ్మీర్ అనంతనాగ్ జిల్లాకు చెందిన వాడని ఎన్ఐఏ తెలిపింది. కాగా ఎర్రకోట బాంబు పేలుళ్ల కేసులో ఇదివరకే షహీన్ సయీద్, మజమ్మిల్ షకీల్, ఆదిల్ రాథర్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పేలుళ్లపై లోతైన విచారణ జరుపుతున్నామని వివిధ రాష్ట్రాలలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయని త్వరలోనే ఢిల్లీ బాంబుపేలుళ్ల కుట్ర కేసును చేధిస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. -
ఐ బొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. వచ్చింది విడాకుల కోసం కాదు!
ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటికొస్తున్నాయి. విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న రవిని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇది కాస్తా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రవి అరెస్ట్తో సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే తన భార్యతో విడాకుల కేసు కోసమే ఇండియాకు వస్తుండగా రవి అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చాయి. అందరూ అదే నిజమనుకున్నారు.కానీ తీరా చూస్తే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు రవి విడాకుల కోసం ఇండియాకు రాలేదని తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని టాక్. అంతేకాకుండా అతను 2022లోనే ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. భారత పౌరసత్వాన్ని వదులుకొని రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా.. 2022 నుంచి కరేబియన్ దీవుల్లోనే నివాముంటున్నారు. అయితే టెక్నాలజీని వాడుకోవడంలో కింగ్ అయిన ఇమ్మడి రవి.. పైరసీ సైట్ ఐ బొమ్మను స్థాపించాడు. దాదాపు కొన్ని వేల సినిమాలను ఐ బొమ్మ ద్వారా అందుబాటులో ఉంచాడు. ఓటీటీ కంటెంట్ను డీఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మూవీరూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకుని హెచ్డీ ఫార్మాట్లోకి మార్చి ఐబొమ్మ సైట్లో అప్లోడ్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. -
ఐబొమ్మ నిర్వాహకుడు వందలాది మంది కష్టాన్ని దోచుకున్నాడు
-
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్! సజ్జనార్ సంచలన ప్రెస్ మీట్
-
iBOMMA రవి అరెస్ట్ వెనుక మహిళ..!
-
నిర్మాతలకు శుభవార్త.. ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
-
ఢిల్లీ పేలుళ్లు: ఉగ్రవాది షహీన్.. ఆమె భర్త ఏమన్నారంటే?
ఢిల్లీ: ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణ కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్ విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు మతపిచ్చి లేదని, మతపరమైన కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా జీవించాలని ఉండేదని సయీద్ మాజీ భర్త డాక్టర్ హయత్ జాఫర్ తెలిపారు. అంతే కాకుండా 2012లో తమ పిల్లలతో కలిసి యూరప్ లేదా ఆస్ట్రేలియాలలో సెటిల్ అవుదామని షహీన్ సయీద్ భావించినట్లు పేర్కొన్నారు.డాక్టర్ షహీన్ సయీద్ ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన ఈ ఉగ్రవాది గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. భారత్లో నిషేదిత ఉగ్రవాద సంస్థ జైషే మెుహమ్మద్ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడానికి షహీన్ సయీద్ ప్రయత్నించింది. ఎర్రకోట పేలుళ్ల తర్వాత ఢిల్లీ పోలీసుల విచారణ తేలింది. షహీన్ వ్యవహారమై జాతియమీడియా ప్రతినిధులు ఆమె మాజీ భర్త హయాత్ను సంప్రదించారు. షహీన్ 2006లో పల్మనాలజీ పూర్తి చేసిందని వారిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమని హయత్ తెలిపారు. తనతో ఉన్న సమయంలో మతం విషయంలో కట్టుబాట్లు లేకుండా స్వేచ్చగా ఉండేదన్నారు. వారిద్దరు యూరప్, ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలని భావించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యే విషయంలో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నామని, నాటి నుంచి తనకు షహీస్కు మధ్య మాటల్లేవని తెలిపారు. షహీన్ ఉగ్రవాద కార్యక్రమాల్లో భాగం పంచుకోవడాన్ని తాను నమ్మలేకపోతున్నామని ఆమె తండ్రి అహ్మద్ అన్సారి అన్నారు. ‘నాకు ముగ్గురు పిల్లలు. నా రెండో సంతానమే షహీన్. వైద్యవిద్యను అభ్యసించింది. అలాంటి హషీన్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటుందని నమ్మలేకపోతున్నా. తనని కలిసి ఏడాది కాలమైంది. చివరి సారిగా గతనెలలో మాట్లాడాను’అని చెప్పుకొచ్చారు. షహీన్ సయీద్ అరెస్టయిన మరుసటి రోజే ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఈనేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. -
Delhi 10/11 Blast: అనుమానితుడి మొదటి ఫొటో..
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో ఆత్మాహుతి బాంబర్గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ మొదటి ఫొటో బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిని తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు డాక్టర్ ఉమర్కు చెందినది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానిత ఆత్మాహుతి బాంబర్ మొదటి చిత్రాన్ని ‘ఎన్డీటీవీ’ యాక్సెస్ చేసింది. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో 1989, ఫిబ్రవరి 24న జన్మించిన ఉమర్.. అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు అరెస్టు చేసిన వైద్యులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్లకు డాక్టర్ ఉమర్ అత్యంత సన్నిహితుడు.దర్యాప్తు అధికారులు మాడ్యూల్లోని ఇద్దరు కీలక సభ్యులను అరెస్టు చేశారని, 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్న డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ నుండి పారిపోయాడు. తరువాత అతను భయాందోళనకు గురై పేలుడుకు పాల్పడ్డాడని సమాచారం. ఉమర్ మొహమ్మద్, అతని సహచరులు దాడి చేయడానికి అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ఏఎన్ఎఫ్ఓ)ఉపయోగించారు. వారు కారులో డిటోనేటర్ను ఉంచి ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో దాడికి పాల్పడ్డారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.ఎర్రకోట సమీపంలో పేలిన తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు బదర్పూర్ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ వీడియో, ఫొటోలలో కనిపిస్తోంది. కారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి పాత ఢిల్లీకి వచ్చింది. HR 26CE7674 నంబర్ ప్లేట్తో ఉన్న ఈ వాహనం ఎర్ర కోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు నిలిపి ఉంచారు. మధ్యాహ్నం 3:19 గంటలకు ప్రవేశించి సాయంత్రం 6:30 గంటలకు కారు బయలుదేరిందని భద్రతా వర్గాలు తెలిపాయి. అనుమానిత ఆత్మాహుతి దళ సభ్యుడు కారును ఒక్క నిమిషం కూడా వదిలి వెళ్లలేదని సమాచారం. -
కశ్మీర్లో కలకలం.. ఉగ్రవాదులతో వైద్యుల దోస్తీ?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పోలీసులు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కశ్మీర్ లోయలో ఒక వైద్యుని నుంచి పోలీసులు ఏకే-47 రైఫిల్తో పాటు కొంత మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న దరిమిలా అతనిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. అరెస్టు అయిన వైద్యుడు వెల్లడించిన వివరాల ఆధారంగా జమ్ముకశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్లో 300 కిలోల ఆర్డీఎక్స్, ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను.. ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ చేయడంలో, రవాణా చేయడంలో అతని ప్రమేయంపై ఉన్నతాధికారులు ప్రశ్నించారు. పోలీసులు ఆ వైద్యుడిని పుల్వామా జిల్లాలోని కోయిల్ నివాసి ముజామిల్ షకీల్గా గుర్తించారు. ఈ వ్యవహారంలో మరో వైద్యుని ప్రమేయం ఉన్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను నిల్వ చేయడంలో షకీల్ సహాయం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారని ‘ఇండియా టుడే’ తన కథనంలో పేర్కొంది. ఈ కేసులో ఇద్దరు వైద్యుల ప్రమేయం ఉండటంతో జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ ప్రాంతానికి చెందిన అందరు వైద్యులపై దృష్టి సారించారు. వారికి జైష్ ఎ మొహమ్మద్, ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని జేకే పోలీసులతో పాటు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. పోలీసులకు పట్టుబడిన ఇద్దరు వైద్యులపై ఆయుధ చట్టంలోని సెక్షన్లు 7/25, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్లు 13, 28, 38, 39 కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
‘శ్వాస చంపేస్తోంది’.. ఢిల్లీలో భారీ నిరసనలు
న్యూఢిల్లీ: ‘పొగమంచు నుంచి మమ్మల్ని విముక్తులను చేయండి’.. ‘శ్వాస మమ్మల్ని చంపేస్తోంది’ అనే ప్లకార్డులు చూపిస్తూ, పిల్లాపెద్దా అనే బేధభావం లేకుండా వందలాదిమంది ఢిల్లీవాసులు ఆదివారం ఇండియా గేట్ సమీపంలోని మాన్ సింగ్ రోడ్లో ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. ఢిల్లీ గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ‘చాలా పేలవమైన’ విభాగంలో 370ని తాకిన తరుణంలో, ఢిల్లీ ప్రజలు ఊపిరి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.‘ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితి. ప్రభుత్వం ఇప్పుడే క్లీన్ ఎయిర్ పాలసీని అందించాలి’ అని ఒక నిరసనకారుడు నినదించగా ‘ధనవంతులు ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేసుకుంటారు లేదా పచ్చని కొండ ప్రాంతాలకు పారిపోతారు. కానీ మా సంగతేంటి? ప్రతి శీతాకాలంలో శ్వాస తీసుకునేందుకు పోరాటం చేస్తున్నాం’ అని ఒక నిరసనకారుడు అన్నాడు. ‘గాలి ప్రభుత్వ ఆస్తి కాదు. అది అందరికీ చెందుతుంది’ అని నినదించాడు.మరో నిరసనకారురాలు జ్యోత్స్న సింగ్ ‘ఎన్డీటీవీ’తో మాట్లాడుతూ ‘పేదలు, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ బస్సులు, ఆటోల నుంచి వచ్చే ఉద్గారాలతో జనం బాధపడుతున్నారు. ఇవి కాలుష్యానికి 80 శాతం దోహదం చేస్తాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు రావాలి’ అని అన్నారు. ‘ప్రతి శీతాకాలంలో నాకు రక్తం పడేలా దగ్గువస్తుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. ప్రభుత్వం ఇలాంటివాటిని పట్టించుకోదు. పంజాబ్ రైతులను లేదా గత పాలనను నిందిస్తూనే ఉంటుంది’ అంటూ డీయూ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.అని మరో నిరసనకారిణి ప్రేరణ మెహ్రా ‘కాలుష్యం పెరిగిన తరుణంలో ఏక్యూఐ పర్యవేక్షణ కేంద్రాల దగ్గర నీటిని చల్లుతున్న వీడియోలను చూసిన తర్వాత నేను ఒక దానిని నమ్మలేకపోతున్నాను. ఎవరైనా సంఖ్యలను తప్పుదారి పట్టిస్తున్నారా? లేదా నీటిని వ్యర్థం చేస్తున్నారా?’ అని ప్రశ్నించారు. వసంత్ కుంజ్కు చెందిన 76 వృద్ధుడు మాట్లాడుతూ ‘ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ప్రజలు అవే బాధలను ఎదుర్కొంటున్నారు. నా మనవళ్ల కోసం నేను ఆందోళన చెందుతున్నాను. ప్రతిచోటా నిర్మాణాలు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది’ అని అన్నారు.నిరసనలు తీవ్రతరం కావడంతో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు సంయుక్తంగా పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. పర్యావరణ కార్యకర్త విమ్లేందు ఝా ఈ అణిచివేతను ఖండించారు. 15 రోజులుగా లాక్డౌన్ లేదు, షట్డౌన్ లేదు కేవలం క్లౌడ్ సీడింగ్ లాంటి పనులు చేస్తున్నారు. ఇది దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీపీ మహలా మాట్లాడుతూ తాము భద్రతను కాపాడేందుకు కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘మరిన్ని రాష్ట్రాల్లో..’ మళ్లీ ‘బాంబు’ పేల్చిన రాహుల్ -
ఆన్లైన్ ఉగ్ర నెట్వర్క్లపై కొరడా
శ్రీనగర్: ఆన్లైన్ ఉగ్రవాద నెట్వర్క్లపై ఉక్కుపాదం మోపుతూ.. కౌంటర్–ఇంటెలిజెన్స్ కాశ్మీర్ ఆదివారం లోయవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక మహిళతో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదాన్ని ఆన్లైన్లో కీర్తించడం, యువకులను ప్రభావితం చేయడంపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, కౌంటర్–ఇంటెలిజెన్స్ కాశ్మీర్ బృందాలు శ్రీనగర్, కుల్గామ్, బారాముల్లా, షోపియాన్, పుల్వామాలోని 10 ప్రత్యేక ప్రాంతాలపై దాడులు చేశాయని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.‘ఆన్లైన్ ఉగ్రవాద నెట్వర్క్లపై విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టడంలో భాగంగా కాశ్మీర్ లోయవ్యాప్తంగా సమన్వయంతో దాడులు నిర్వహించాం.. ఇది తీవ్రవాదం, సైబర్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక సందేశాన్ని పంపింది’.. అని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది అనుమానితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పలు రకాల డిజిటల్ పరికరాలు మొదలుకొని నేరారోపణకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వా«దీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
అమెరికాలో ఇద్దరు భారత గ్యాంగ్స్టర్లు అరెస్ట్
న్యూఢిల్లీ: విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత దేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లలో ఇద్దరిని అరెస్టు చేయడంలో భారత భద్రతా సంస్థలు విజయాన్ని సాధించాయి. హర్యానా పోలీసులతోపాటు భద్రతా సంస్థ అధికారులు జార్జియాలో వెంకటేష్ గార్గ్ను అరెస్టు చేయగా, భాను రాణాను అమెరికాలో అరెస్టు చేశారు.ప్రస్తుతం భారతదేశానికి చెందిన 25 మందికి పైగా గ్యాంగ్స్టర్లు దేశం వెలుపల ఉన్నారు. వీరు క్రిమినల్ సిండికేట్లను నడుపుతున్నారని ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. గార్గ్, రాణాలను అరెస్టు చేయడానికి సాగించిన ఆపరేషన్లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయని సమాచారం. గార్గ్.. హర్యానాలోని నారాయణ్గఢ్ నివాసి. ప్రస్తుతం జార్జియాలో ఉంటున్న గార్గ్పై భారతదేశంలో 10 కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతను హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, తదితర రాష్ట్రాలకు చెందిన యువతను ప్రలోభపెట్టిన తన బృందంలో నియమించుకుంటాడు. గురుగ్రామ్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత హత్య తరువాత అతను జార్జియాకు పారిపోయాడు.గార్గ్ ప్రస్తుతం విదేశాలలో ఉంటున్న గ్యాంగ్స్టర్ కపిల్ సంగ్వాన్తో కలిసి దోపిడీ సిండికేట్ను నడుపుతున్నాడు. కాగా భాను రాణా .. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం కలిగి ఉంటూ, చాలా కాలంగా అమెరికాలో నివసిస్తున్నాడు. కర్నాల్ నివాసి అయిన రాణా చాలా కాలంగా నేర ప్రపంచంలో చురుగ్గా ఉన్నాడు. అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. రాణా నేర నెట్వర్క్ హర్యానా, పంజాబ్, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. పంజాబ్లో జరిగిన గ్రెనేడ్ దాడి దర్యాప్తులో అతని పేరు బయటకు వచ్చింది.ఇది కూడా చదవండి: 11న భూటాన్కు ప్రధాని మోదీ -
హక్కులకు ‘సుప్రీం’ ఛత్రం
‘మన పోలీసులకు తగినంత సామర్థ్యం లేదు. సంస్థాగతంగా, శిక్షణపరంగా ఎన్నో లోపాలున్నాయి. పోలీసు వ్యవస్థపై తగిన పర్యవేక్షణ కూడా లేదు’– ఇవి ఇటీవల ఏదో ఉదంతంలో ఎవరో చేసిన వ్యాఖ్యలు కాదు. సరిగ్గా నూట ఇరవై మూడేళ్ల క్రితం బ్రిటిష్ వలస పాలకుల హయాంలో ఫ్రేజర్ నేతృత్వంలోని రెండో పోలీస్ కమిషన్ నివేదికలోని మాటలు. దేశంలో తరచుగా జరిగే ఉదంతాలు వింటుంటే అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా మారిందేమీ లేదని అర్థమవుతుంది. మిగిలినవాటి మాటెలా ఉన్నా పౌరుల్ని అరెస్టు చేయటం విషయంలో నిబంధనలు సక్రమంగా పాటించే సంస్కృతి పోలీసులకు అలవడ లేదు. అందుకే ఎవరినైనా అరెస్టు చేయదల్చుకున్నప్పుడు నిందితులకు అర్థమయ్యే భాషలో అందుకు గల కారణాలను వెంటనే తెలియజెప్పాలని, వారిని ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో... ఎందుకు చేస్తున్నారో... ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయో లిఖిత పూర్వకంగా చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మసీహ్ల ధర్మాసనం గురువారం తేల్చిచెప్పింది. ఒకవేళ అందుకు వ్యవధి లేకపోతే కోర్టులో హాజరు పరచటానికి రెండు గంటల ముందైనా నెరవేర్చాలని నిర్దేశించింది. అలా చేయకపోతే ఆ అరెస్టూ, రిమాండ్ కూడా చట్టవిరుద్ధమే అవుతాయని స్పష్టం చేసింది.మన దేశంలో దాదాపు 40 శాతం అరెస్టులు స్వల్ప కారణాలపైనే జరుగుతాయి. వీరిలో అత్యధికులు అట్టడుగు వర్గాలవారు కనుక తమను ఎందుకు అరెస్టు చేశారో కూడా తెలియదు. పోలీసులు చెప్పరు. ‘కామన్ కాజ్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా’ నివేదిక అరెస్టుల విషయంలో కులం, మతం, రాజకీయ అనుబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పింది. 17 రాష్ట్రాల్లో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ల వరకూ వేలాది మందితో మాట్లాడి ఈ నివేదిక రూపొందించారు. అరెస్టుల విషయంలో నిబంధనలన్నీ తు.చ. తప్పకుండా పాటిస్తామని కేవలం 41 శాతం మంది చెప్పారు. ఒక మతం లేదా కులానికి చెందినవారు సహజంగా నేరగాళ్లన్న భావన నిలువెల్లా పాతుకుపోయింది. ఇలాంటివారి విషయంలో ఇక నిబంధనలేం పాటిస్తారు? ఈ నేపథ్యంలో తాజా తీర్పు ఒక ఊరట. నిజానికి సుప్రీంకోర్టు ఇలా చెప్పటం మొదటి సారేమీ కాదు. గత ఫిబ్రవరిలో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం సైతం విహాన్ కుమార్ కేసులో పోలీసులకు రాజ్యాంగం నిబంధనలను గుర్తు చేయాల్సి వచ్చింది. నిరుడు పంకజ్ బన్సాల్, ప్రబీర్ పురకాయస్థల కేసుల్లోనూ సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈ సంగతే చెప్పాయి. అరెస్టులకు సంబంధించి రాజ్యాంగం 22వ అధికరణంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏకపక్ష అరెస్టు లేదా నిర్బంధం నుంచి పౌరులకు రక్షణనిస్తున్నాయి. మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచటానికి ముందే అరెస్టుకు దారితీసిన కారణాలేమిటో నిందితులకు తెలియాలనీ, న్యాయవాదిని నియమించుకుని సమర్థించుకునే అవకాశం ఉండాలనీ, బెయిల్ కోరవచ్చనీ ఆ అధికరణం చెబుతోంది. గతంలో సీఆర్పీసీ (ఇప్పుడు బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 57, అరెస్టయినవారిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని నిర్దేశిస్తోంది. కానీ 22వ అధికరణానికి అనుగుణమైన చట్టాలు కొరవడటం పోలీసుల ఇష్టారాజ్యానికి దారితీస్తోంది. మన దేశంలో అరెస్టు చేయటానికి ‘సహేతుకమైన అనుమానం’ ఉంటే సరిపోతుంది. అమెరికాలో ‘సంభావ్యమైన కారణం’ చూపాలి. ఈ వ్యత్యాసం వల్లే అక్రమ అరెస్టులు రివాజవుతున్నాయి. ఫలితంగా ‘చట్టం నిర్దేశించిన విధానంలో తప్ప పౌరుల జీవితాన్నీ, వారి వ్యక్తిగత స్వేచ్ఛనూ హరించ రాద’ని చెప్పే రాజ్యాంగంలోని 21వ అధికరణం కూడా ఉల్లంఘనకు గురవుతోంది. అక్రమ అరెస్టు ఆ వ్యక్తిపైన మాత్రమేకాక అతనితో సంబంధం ఉన్న వారందరిపైనా ప్రభావం చూపుతుందనీ, వారి మానసిక సమతౌల్యాన్నీ, సామాజిక సంక్షేమాన్నీ దెబ్బతీస్తుందనీ సుప్రీంకోర్టు చేసిన తాజా హెచ్చరిక పాలకులకు కనువిప్పు కావాలి. నేరాలు పెరిగాయనో, చట్టాలంటే భయం లేకుండా పోయిందనో పోలీసులు చట్ట బాహ్యతను ఆశ్రయించటం నీతిమాలినతనం. పాలకులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. -
కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం
సాక్షి, కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ను పోలీసులు అరెస్టు చేశారు. వేమూరి వినోద్ కుమార్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వినోద్కు సొంత పూచికత్తుపై స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం ఘటనలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనపై బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు.చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందికొండ పోలీస్ స్టేషన్లో యజమాని, డ్రైవర్పై కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. డ్రైవర్తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద BNS 125(a), 106(1) సెక్షన్లు పోలీసులు నమోదు చేశారు.కాగా, 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు. -
NRI భాస్కర్రెడ్డి అక్రమ అరెస్ట్.. పోలీసుల ఓవరాక్షన్!
NRI భాస్కర్ రెడ్డి అరెస్ట్ అప్డేట్స్...విజయవాడ..విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నారై భాస్కర్ రెడ్డి, అతని సోదరుడు ఓబుల్ రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలువైద్య పరీక్షల అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి కోర్టుకు తరలింపుకోర్టుకు తీసుకొచ్చిన సమయంలో నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డితనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటున్న భాస్కర్ రెడ్డిసోషల్ మీడియా పోస్టుల కేసుతో పాటు భాస్కర్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు.సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని ఒప్పుకోవాలంటూ కోర్టు ప్రాంగణంలో భాస్కర్ రెడ్డిపై పోలీసుల ఒత్తిడిపోలీసుల బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాస్కర్ రెడ్డి👉కూటమి ప్రభుత్వం ఎన్నారైలపై కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఎన్నారైలపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వేధింపులకు గురిచేస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఓ ఎన్నారైను అక్రమంగా అరెస్ట్ చేసింది. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.👉వివరాల ప్రకారం.. మాలపాటి భాస్కర్ రెడ్డి లండన్లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. అయితే, భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేసిన కూటమి సర్కార్ ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈనెల ఒకటో తేదీన తన తండ్రి మరణంతో భాస్కర్ రెడ్డి.. లండన్ నుంచి స్వగ్రామం చోడవరం చేరుకున్నారు.👉అనంతరం, వైద్య పరీక్షల కోసం తాడిగడపలోని కామినేని ఆసుపత్రికి భాస్కర్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. భాస్కర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో తనను అరెస్ట్ చేశారో.. ఎక్కడికి తీసుకువెళ్లారో అనే కనీస సమాచారం కూడా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులు ఇవ్వలేదు. అరెస్ట్పై ప్రశ్నిస్తే పెనమలూరు పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ఇక, తాజాగా వారిద్దరినీ వైద్య పరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు. -
Srinagar: భారీ ఉగ్రదాడి విఫలం
శ్రీనగర్: భారీ ఉగ్రదాడి కుట్రను జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. దీంతో దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీనగర్ పోలీసులు కోనఖాన్లోని మమతా చౌక్ సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నిస్తున్న సాయుధులైన ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు.‘ఇండియా టీవీ’ తెలిపిన వివరాల ప్రకారం సాధారణ వాహన తనిఖీల సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ లేని ఒక నల్లని రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్సైకిల్ పోలీసులలో అనుమానాలను రేకెత్తించింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని ఆపాలంటూ సిగ్నల్ ఇవ్వగానే, రైడర్తో పాటు మరో ఇద్దరు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు అనుమానితులను షా ముతైబ్, కమ్రాన్ హసన్ షా,మొహమ్మద్ నదీమ్గా గుర్తించారు. వీరంతా ఖన్యార్లోని కావా మొహల్లాలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి ఒక కంట్రీ-మేడ్ పిస్టల్, తొమ్మిది లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. వారు ఒక ప్రణాళిక ప్రకారం ఉగ్రదాడులకు పాల్పడేవారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఖన్యార్ పోలీస్ స్టేషన్లో వీరిపై ఆయుధ చట్టం, యూఏపీఏ అండ్ మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ముగ్గురూ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఉగ్ర దాడికి కుట్ర పన్నారని తేలింది. అనుమానితుల నెట్వర్క్ను కనుగొనేందుకు పోలీసు అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనగర్ పోలీసుల అప్రమత్తత కారణంగా భారీ ఉగ్రదాడి తప్పిందని ఉన్నతాధికారులు తెలిపారు. భారత భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దరిమిలా కొంతకాలం వెనుకకు తగ్గిన ఉగ్రవాదులు.. ఇప్పుడు తిరిగి సంఘటితం అవుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.ఇది కూడా చదవండి: పని ఒత్తిడి: 10 మందిని చంపిన నర్స్ -
అరెస్టుకు కారణాలను తక్షణం చెప్పాలి
న్యూఢిల్లీ: ఆగమేఘాల మీద అరెస్ట్లు జరిగిపోయే భారత్లో ఇకమీదట నిందితులకు అరెస్ట్ కారణాలు, కేసులో పొందుపరిచిన చట్టాల చిట్టాను విడమర్చి చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అరెస్ట్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి తనను ఎందుకు అరెస్ట్ చేశారో, ఆ కేసులో ఏమేం రాశారో, ఎలాంటి చట్టాలను పేర్కొన్నారో, ఏ నేరాలను పొందుపరిచారో అతనికి అరెస్ట్ సమయంలోగానీ అరెస్ట్ చేసిన తక్షణంగానీ తెలియజేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువర్చింది. గత ఏడాది ముంబైలో జూలైలో ఢీకొట్టి ఖరీదైన బీఎండబ్ల్యూతో పారిపోయిన ఘటనలో నమోదైన ఉదంతానికి సంబంధించి మిహిర్ రాజేశ్ షా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీహ్ల ధర్మాసనం ఈ కీలక తీర్పును ఇచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాథమిక రక్ష ఇది ధర్మాసనం తరఫున 52 పేజీల తీర్పును జస్టిస్ అగస్టీన్ రాశారు. ‘‘రాజ్యాంగంలోని 22(1) అధికరణం ప్రకారం ఎవరినైతే పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు అరెస్ట్చేస్తాయో వాళ్లకు వీలైనంత త్వరగా అరెస్ట్కు కారణాలను వివరించాలి. ఇది ఇన్నాళ్లూ తప్పనిసరిగా అవలంభించాల్సిన విధానం కాదుగానీ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక రక్షణగా నిలుస్తుంది. అరెస్ట్ అయిన నిందితునికి అతను అర్థంచేసుకునే భాషలో రాతపూర్వకంగా కేసు వివరాలను తెలియజేయాలి. ఏ నేరానికిగాను ఏ చట్ట నిబంధనల మేరకు అరెస్ట్చేయాల్సి వచ్చిందో నిందితునికి వెంటనే చెప్పాలి. అయితే అరెస్ట్ చేసిన రెండు గంటల్లోపే అతడిని రిమాండ్ నిమిత్తం మేజి్రస్టేట్ ఎదుట హాజరుపర్చగలిగితే మాత్రం నిందితునికి ముందే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మేజి్రస్టేట్ ముందుకు తీసుకెళ్లలేని సందర్భాల్లో ఇవన్నీ చెప్పకపోతే మాత్రం అతని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్లే. ఒక నిందితుడిని ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో అరెస్ట్చేస్తే ఆ అన్ని కేసుల్లో పొందుపరిచిన చట్టాలు, సెక్షన్లు, నేరాల చిట్టాను అతనికి వివరించాలి. వాటిని నిందితునికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా అందివ్వాలి. పాత భారతశిక్షా స్మృతి 1860 లేదా కొత్త భారతీయ న్యాయసంహిత,2023 చట్టం ప్రకారం చూసినా అరెస్ట్ అయిన వ్యక్తికి అరెస్ట్కు కారణాలను వెల్లడించాలని రాజ్యాంగమే ఉద్భోధిస్తోంది’’ అని ధర్మాసనం వివరించింది. కనీసం మౌఖికంగానైనా వివరించాలి ‘‘అరెస్ట్ చేసిన ప్రాంతంలో ఇలా అరెస్ట్కు కారణాలు లిఖితపూర్వకంగా వెల్లడించేందుకు పెన్ను, పేపర్ లాంటి ఏర్పాట్లు లేకపోతే సంబంధిత దర్యాపు అధికారి/పోలీసు కనీసం మౌఖికంగా నిందితునికి అరెస్ట్ కారణాలను తెలపాలి. మేజి్రస్టేట్ వద్దకు తీసుకెళ్లని పక్షంలో అతనికి వివరాలు చెప్పకపోతే అలాంటి అరెస్ట్/రిమాండ్కు చట్టబద్ధత లేదని భావించాలి. అప్పుడు నిందితుడిని వదిలేయడమే ఉత్తమం. మా తీర్పు ప్రతిని అన్ని రాష్ట్రాల హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్కు, అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించండి’’ అని రిజిస్ట్రీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘‘ అసాధారణ కేసుల్లోనూ తప్పనిసరిగా కేసు వివరాలను నిందితునికి చెప్పాల్సిందే. లేదంటే ఆ అరెస్ట్కు చట్టబద్ధత లేనట్లే భావించాలి. అరెస్ట్ వేళ రాతపూర్వకంగా అతనికి ఇచి్చన సమాచారాన్ని అతను అర్థంచేసుకోలేకపోతున్నాడంటే అతని రాజ్యాంగంలోని 22వ అధికరణం ఉల్లంఘనకు గురైనట్లే. అతనికి అర్థంకాని భాషలో సమాచారం ఇచ్చినా అది అతనికున్న రాజ్యాంగబద్ధ రక్షణను ఊహాత్మకంగా మార్చినట్లే. అది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21, 22ల్లోని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లే’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్ట్ చేసినప్పుడు తనకు కారణాలను చెప్పలేదంటూ నిందితుడు మిహిర్ బాంబే హైకోర్టులో కేసు వేశాడు. అయితే కారణాలను తెలపకపోవడం అనేది విధానపర తప్పిదమని ఒప్పుకున్న హైకోర్టు.. ఆ కేసు తీవ్రత దృష్ట్యా అరెస్ట్ సహేతుకమేనని తీర్పు చెప్పిన విషయం విదితమే. -
బంగారం చోరీ కేసుల్లో TDP ఎమ్మెల్యే అనుచరుడు అరెస్ట్
-
తెలుగు సీరియల్ నటికి అసభ్య వీడియోలు.. వ్యక్తి అరెస్ట్
తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ చేస్తున్న ఓ నటి.. నెలలుగా ఇబ్బంది పడుతోంది. ఇక తట్టుకోలేక ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో ఈ నటిని వేధిస్తున్న వ్యక్తిని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి)ఏం జరిగింది?స్వతహాగా బెంగళూరుకి చెందిన ఓ నటి.. కన్నడతోపాటు తెలుగులోనూ సీరియల్స్ చేస్తోంది. ఈమెకు ఓ రోజు నవీన్ అనే వ్యక్తి నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. కానీ ఈమె దీన్ని తిరస్కరించింది. పలుమార్లు ఇలానే చేసింది. దీంతో కక్ష పెంచుకున్న ఇతడు.. అభ్యంతరకర వీడియోలు పంపించడం మొదలుపెట్టాడు. బ్లాక్ చేయడంతో పలు ఫేక్ అకౌంట్స్ సృష్టించి మరీ సదరు నటికి మెసేజులు, వీడియోలు పంపిస్తూనే ఉన్నాడు.దాదాపు మూడు నెలల పాటు నవీన్ వల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న సదరు నటి.. ఇక తట్టుకోలేక వ్యక్తిగతంగా అతడిని కలిసి సమస్యని పరిష్కరించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే నాగభైరవి ప్రాంతంలోని నందన్ ప్యాలెస్లో నవీన్ని కలిసింది. ఇవన్నీ ఆపేయాలని కోరింది. అయినా సరే అతడిలో మార్పు రాకపోవడంతో పోలీసులని ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదు మేరకు నవీన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు సాగుతోంది.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ) -
కోయంబత్తూరు ఘటన: సినీ ఫక్కీలో నిందితుల అరెస్ట్
కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను సినీ ఫక్కీలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ శరవణ సుందర్ నిందితుల అరెస్టును ధృవీకరించారు. అరెస్టు సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితుల కాళ్లపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని శరవణ సుందర్ పేర్కొన్నారు. కోయంబత్తూరు నగర శివార్లలోని వెల్లకినారులో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు అక్కడి నుంచి తప్పించుకోబోయారు. ఈ నేపధ్యంలో పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడిన నిందితులు గుణ, కరుప్పసామి, కార్తీక్ అలియాస్ కాళీశ్వరన్లను కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఎన్కౌంటర్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారని శరవణ సుందర్ ‘ఏఎన్ఐ’కి తెలిపారు.కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ఆదివారం సాయంత్రం ఒక విద్యార్థినిని ముగ్గురు మువకులు అపహరించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. దాడి జరిగిన సమయంలో ఆ విద్యార్థిని తన స్నేహితునితోపాటు కారులో ఉన్నారని ‘హిందుస్తాన్ టైమ్స్’ గతంలో నివేదించింది. ఆ సమయంలో ముగ్గురు నిందితులు కలిసి కారు అద్దాలు పగలగొట్టి, ఆ యువతిని, అతని స్నేహితుడిని కొట్టి, గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేశారని తెలియవచ్చింది.ఈ ఘటన దరిమిలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై తమిళనాడులో క్షీణిస్తున్న శాంతిభద్రతలను, మహిళలు, పిల్లలపై పెరుగుతున్న లైంగిక నేరాలపై ‘ఎక్స్’ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకె అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇలాంటి సంఘటనలు పెరిగిపోయాయని, సామాజిక వ్యతిరేక శక్తులు అటు చట్టానికి, ఇటు పోలీసులకు భయపడటం లేదని అన్నామలై ఆరోపించారు. డీఎంకే మంత్రుల నుండి పోలీసు అధికారుల వరకు అందరూ న్యాయాన్ని కాపాడే బదులు నేరస్తులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లున్నదని అన్నామలై అన్నారు. ఇది కూడా చదవండి: భారత ట్రక్కు డ్రైవర్ కేసులో మరో మలుపు -
కన్నీటి పర్యంతం అయిన జోగి రమేష్ భార్య.. వడ్డీతో సహా చెల్లిస్తాం...
-
ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్పై దాడి జరిగింది. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఎమ్మెల్యే నివాసంలోకి చొరబడిన ఒక యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోలీసులు ఆ యువకుడిని అభిషేక్ దాస్గా గుర్తించిన దరిమిలా అరెస్ట్ చేశారు.ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జ్యోతిప్రియ మల్లిక్ను వెంబడించిన ఆ యువకుడు అతని ఇంటిలోనికి చొరబడి, హఠాత్తుగా ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లి, అతని పొత్తికడుపుపై బలంగా కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే షాక్నకు గురయ్యారు. వెంటనే తేరుకుని, కేకలు వేయడంతో అతని భద్రతా సిబ్బందితో పాటు సమీపంలోని ఇతరులంతా ఆ యువకుడిని పట్టుకుని, బిధాన్నగర్ పోలీసులకు అప్పగించారు.పోలీసులు విచారణలో ఆ యువకుడు తాను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా ప్రాంతానికి చెందినవాడినని, ఉద్యోగం కోసం మల్లిక్తో మాట్లాడాలనుకున్నానని చెప్పాడు. మల్లిక్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో హబ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఆ యువకుడు నగరంలోని ఒక ఆసుపత్రిలో మానసిక వైద్య చికిత్స పొందుతున్నాడని, సాల్ట్ లేక్లోని మల్లిక్ ఇంటికి పలుమార్లు వెళ్లాడని పోలీసు అధికారి తెలిపారు.ఎమ్మెల్యే మల్లిక్ విలేకరులతో మాట్లాడుతూ, ఆ యువకుడు ఇతర సందర్శకుల మాదిరిగానే తనను కలుసుకునేందుకు వచ్చాడని, అయితే అకస్మాత్తుగా ముందుకు దూకి, తనను కొట్టడంతో ఆశ్చర్యపోయానన్నారు. అతను మద్యం మత్తులో ఉన్నాడో లేదో తనకు తెలియదని, గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మల్లిక్ రెండేళ్ల క్రితం అటవీ మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి కేసులో కేంద్ర సంస్థలు ఆయనను అరెస్టు చేశాయి. ఇది కూడా చదవండి: ‘ట్రంప్ ఏం చేస్తారో..’: ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు -
‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’..అమెరికాలో భారత యువతి
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత యువతి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికింది. పైగా తాను దొంగతనం చేయలేదని బుకాయించింది. తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లించడం మరిచిపోయానంటూ ప్రాధేయపడింది. కావాలంటే ఇప్పుడు తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లిస్తా. నన్ను వదిలేయండి’ అంటూ చేతులు జోడించి అక్కడి పోలీసుల్ని వేడుకుంది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్కు చెందిన ఓ యువతి టూరిస్ట్ వీసాతో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో అమెరికాకు చెందిన ఓ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఓ షాప్లో తనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా.. సదరు షాపు యజమాని ..తన షాపులో ఓ యువతి దొంగతనం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు వీడియోలో.. ఆ యువతి ఎలా శిక్ష విధించకుండా వదిలేయమని కోరింది. తాను షాపులు వస్తువుల్ని కొనుగోలు చేశానే తప్పా.. దొంగతనం చేయలేదని, కొనుగోలు చేసిన వస్తువులకు ఇప్పుడే డబ్బులు చెల్లిస్తానని చెప్పడం ఆవీడియోలో చూడొచ్చు. కాగా, ఆ యువతి వివరాలు, ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. 👉ఇదీ చదవండి: చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?కొద్దిరోజుల క్రితం కొద్దిరోజుల క్రితం మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ అని కోరినప్పటికీ పోలీసులు ఆమెను కటకటాల వెనక్కు పంపారు. -
‘చంద్రబాబు సర్కార్ మరో డైవర్షన్ డ్రామా’
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్ను వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్బాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు‘‘మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వెఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్లు’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లేని లిక్కర్ స్కామ్లు సృష్టించారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైఎస్సార్సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు జోగి రమేష్ కోరారు. దానిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారు. కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట.. పలువురి దుర్మరణం. మోంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం. రెండింటి నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ అరెస్ట్. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
Bihar Elections: ‘బాహుబలి’ నేత అరెస్ట్.. మోకామాలో కలకలకం
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మోకామా నియోజకవర్గంలో కలకలం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, బాహుబలి నేతగా పేరొందిన అనంత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. జన్ సురాజ్ పార్టీ కార్యకర్త, ఆర్జేడీ మాజీ నేత దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్ను బార్హ్లోని అతని నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టును పట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) కార్తికేయ శర్మ, పట్నా జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్ ఎస్ఎమ్ మీడియా ముందు ధృవీకరించారు. అనంత్ సింగ్తో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న మణికాంత్ ఠాకూర్, రంజీత్ రాహలను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.అసలేం జరిగింది?గ్యాంగ్స్టర్ నుండి రాజకీయ నేతగా మారిన దులార్ చంద్ యాదవ్, గురువారం నాడు మోకామాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా హత్యకు గురయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ టికెట్పై పోటీ చేస్తున్న తన మేనల్లుడు ప్రియదర్శి పియూష్ తరపున యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత హత్యకు గురికావడం మోకామాలో ఉద్రిక్తతకు దారితీసింది.పోస్ట్మార్టం నివేదికపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దులార్ చంద్ యాదవ్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. యాదవ్ మరణానికి కారణం అతని గుండె, ఊపిరితిత్తులకు గట్టి గాయాలు కావడం. ఫలితంగా కార్డియో-శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది. పోస్ట్మార్టం నివేదిక, ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఇది హత్య అని స్పష్టంగా తెలుస్తున్నదని ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ తెలిపారు.అనంత్ సింగ్.. రాజకీయ వివాదాలుఅనంత్ సింగ్ బీహార్ రాజకీయాల్లో ‘బాహుబలి’నేతగా పేరొందారు. గతంలో ఆర్జేడీతో సంబంధాలు ఉన్న సింగ్, అనేక నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ తరపున మోకామా నుండి గెలిచినప్పటికీ, ఆయుధాల అక్రమ నిల్వ కేసులో దోషిగా తేలడంతో 2022లో ఆయన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన భార్య నీలం దేవి మోకామా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంత్ సింగ్ అరెస్టు రాబోయే బీహార్ ఎన్నికల పైన, ముఖ్యంగా మోకామాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అది అసాధ్యం’.. ఖర్గేకు అమిత్షా కౌంటర్ -
జనసేన నేత సత్య వెంకటకృష్ణ అరెస్ట్
సాక్షి, కోనసీమ జిల్లా: ఐ.పోలవరంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన జనసేన నాయకుడు సత్య వెంకట కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా పరారీ లో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై నిందితుడు ఆరు సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలికతో పాటు మరికొందరిపై కూడా నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.బాలిక తల్లి తప్ప.. ఫిర్యాదు చేయడానికి మిగిలిన బాధితులు ముందుకు రావడం లేదు. అత్యాచార ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని.. మోటారు సైకిళ్ల దొంగతనం, దొంగ నోట్ల మార్పిడి కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో సత్య కృష్ణపై సస్పెక్ట్ షీట్ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐ.పోలవరం హైస్కూల్లో విద్యా కమిటీ కో-ఆప్షన్ సభ్యుడిగా కొనసాగుతున్న సత్య కృష్ణ.. దుర్మార్గానికి ఒడికట్టాడు. నేరం రుజువైతే నిందితుడికి జీవిత ఖైదు పడుతుందని డీఎస్పీ తెలిపారు. -
Sabarimala Theft Case.. మాజీ అధికారి అరెస్ట్
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం చోరీ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీష్ కుమార్ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)అధికారులు.. సుధీష్ కుమార్ను అదుపులోకి తీసుకుని, విచారించిన దరిమిలా ఈ అరెస్ట్ జరిగింది.ఆలయ ద్వారం వద్దనున్న శిల్పాలకు పూత పూసిన పొరలు బంగారంతో తయారు చేసినవని తెలిసినప్పటికీ, సుధీష్ కుమార్ అధికారిక పత్రాలలో వాటిని రాగి పొరలుగా తప్పుగా నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి మహసర్ (అధికారిక రికార్డు)ను ట్యాంపరింగ్ చేసి, బంగారాన్ని దొంగిలించేందుకు సుధీష్ కుమార్ సహాయం చేశాడని సిట్ నిర్ధారించింది. 2019లో శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరించిన సుధీష్ నాడు ఉన్నికృష్ణన్ పొట్టిని దాతగా ఆమోదించారు. దీనికితోడు దేవస్వం బోర్డు ఆ బంగారు పొరలను రాగి పలకలుగా చెప్పాలంటూ ఉన్నికృష్ణన్ పొట్టిని కోరిందని సిట్ గుర్తించింది. అధికారులు శిల్పాలను ట్యాంపరింగ్ చేసినప్పుడు కూడా, సుధీష్ వాటిని రికార్డులలో రాగి పొరలుగా పేర్కొన్నారు.అయితే పొట్టికి ఆ షీట్లు అందకపోయినా, సుధీష్ అతని పేరును రికార్డులలో రాశారని చూపించే ఆధారాలను సిట్ స్వాధీనం చేసుకుంది. సుధీష్ మరో నిందితుడు మురారి బాబుకు ఈ బంగారం చోరీలో సహాయం చేశాడని కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సుధీష్ కుమార్ను అధికారులు (ఈరోజు) శనివారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం అతనిని తిరిగి కస్టడీకి కోరే అవకాశం ఉందని సమాచారం. -
సినిమా ఆడిషన్స్ పేరుతో.. 20మంది పిల్లల కిడ్నాప్!
ముంబై: ముంబైలో 20మంది పిల్లల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆడిషన్స్ పేరుతో కిడ్నాప్కు గురైన 20మంది పిల్లల్ని పోలీసులు కాపాడారు. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. గన్తో పాటు పలు రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. మీరు పేపర్లు,టీవీలు,సోషల్ మీడియాలో కొన్ని ప్రకటనలు చూస్తూనే ఉంటారు. వాటిలో మనల్ని ఎక్కువగా ‘మా సంస్థ నిర్మిస్తున్న సీరియల్స్లో నటినటులు కావాలని, లేదంటే మా సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రకు బాలనటులు కావాలంటూ వచ్చే ప్రకటనలు ఆకర్షిస్తుంటాయి. అదిగో అలాంటి ప్రకటనే ఇచ్చిన ఓ కిడ్నాపర్ ఓ 20మంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడు.సినిమా,డైలీ సీరియల్స్,వెబ్ సిరీస్లో బాల నటీనటులు కావాలంటూ కిడ్నాపర్ రోహిత్ ఆర్య ఓ యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్ చూసిన 100 మంది పిల్లలు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ప్రముఖ నివాస ప్రాంతం ‘పోవై’ ఆర్ఏ స్టూడియోకు తరలివచ్చారు. ఆడిషన్స్ ఇచ్చేందుకు వచ్చిన 100 మంది పిల్లలో 20మంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. వీరి వయస్సు 15లోపే ఉంటుందని సమాచారం. అయితే పిల్లల్ని బంధించిన అనంతరం ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో కిడ్నాపర్ రోహిత్ ఆర్య మాట్లాడుతూ.. ‘నావి మామూలు డిమాండ్లే. నేను కొంతమందిని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. వాళ్ల నుంచి నాకు జవాబు కావాలి. నేను ముందుగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ప్లాన్ మార్చి పిల్లల్ని కిడ్నాప్ చేశా. ఈ వీడియో చూసిన తర్వాత పిల్లల్ని రక్షించాలని పోలీసులు ఏదైనా ప్రయోగం చేస్తే ఈ ప్రదేశాన్ని తగలబెడతా. డబ్బును ఆశించడం లేదు. అలాగని ఉగ్రవాదిని కూడా కాదు’ అంటూ బెదిరింపులకు దిగాడు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టూడియో పరిసర ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడి చెరలో ఉన్న పిల్లలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చాకచక్యంగా వ్యహరించారు. స్టూడియోలోకి ప్రవేశించి పిల్లల్ని రక్షించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో రోహిత్ ఆర్య మానస్థిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.Man holds 15–20 children hostage at a studio in Mumbai’s Powai and released a video saying he wants to speak with specific people and be allowed to meet them.In the video, he threatened that if he’s not permitted to do so, he will set the studio on fire and harm himself and the… pic.twitter.com/UWG6Th95n9— The Tatva (@thetatvaindia) October 30, 2025 -
’బార్క్’లో నకిలీ శాస్త్రవేత్త.. న్యూక్లియర్ డేటా చోరీ?
ముంబై: దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా విభాగం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ కేంద్రంలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న ఒక నకిలీ శాస్త్రవేత్తను అరెస్టు చేయడానికి తోడు, అతని నుంచి అనుమానిత న్యూక్లియర్ డేటా, 14 మ్యాప్లను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలలో ఏదైనా గోప్యమైన న్యూక్లియర్ డేటా ఉన్నదీ లేనిదీ తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని అనే నకిలీ శాస్త్రవేత గత వారం ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో అరెస్టు అయ్యాడు. అతను వివిధ పేర్లతో శాస్త్రవేత్తగా నటిస్తూ వస్తున్నాడు. అతని నుండి పోలీసులు పలు నకిలీ పాస్పోర్ట్లు, ఆధార్, పాన్ కార్డులు, నకిలీ బార్క్ ఐడీలు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఐడీలో అతను అలీ రజా హుస్సేన్గా, మరొక దానిలో అతని పేరు అలెగ్జాండర్ పామర్ అని ఉందని పోలీసులు గుర్తించారు. హుస్సేని గత కొన్ని నెలలుగా పలు అంతర్జాతీయ కాల్స్ చేశాడని, అతని కాల్ రికార్డులను గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. అనుమానిత న్యూక్లియర్ డేటాతో ముడిపడిన విదేశీ నెట్వర్క్లతో హుస్సేని సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.హుస్సేని తన గుర్తింపును మార్చుకుని మారువేషంలో చాలాకాలంగా ఉంటున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2004లో రహస్య పత్రాలు కలిగిన శాస్త్రవేత్తగా గుర్తించి, అతనిని దుబాయ్ నుండి బహిష్కరించారు. అయితే ఆ తర్వాత కూడా అతను నకిలీ పాస్పోర్ట్లను ఉపయోగించి దుబాయ్, టెహ్రాన్ తదితర దేశాలలో ప్రయాణాలు సాగించాడు. జార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన అఖ్తర్ హుస్సేని 1996లో తన పూర్వీకుల ఇంటిని విక్రయించాడు. అయితే తన పాత పరిచయాల సహాయంతో నకిలీ పత్రాలను రూపొందించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపధ్యంలోనే అతను హుస్సేని మొహమ్మద్ ఆదిల్, నసీముద్దీన్ సయ్యద్ ఆదిల్ హుస్సేని పేర్లతో రెండు నకిలీ పాస్పోర్ట్లను పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జంషెడ్పూర్ చిరునామాతో ఈ పాస్పోర్టులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: Madhya Pradesh: రహస్య కెమెరాలో పోలీసు అధికారిణి.. ఏం చేస్తూ దొరికారంటే.. -
లాటరీలో భారీ జాక్పాట్.. కట్చేస్తే మృతదేహం అలా..
కోల్కత్తా: లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మాజీ తృణముల్ కాంగ్రెస్ నాయకుడు సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్లోని కుల్తీ అసెంబ్లీ నియోజకవర్గంలోని లఖియాబాద్ అప్పర్ పారా ప్రాంతంలో కార్తీక్ బౌరి కుటుంబం నివసిస్తోంది. ఈ మధ్యే కార్తీక్ బౌరికి కోటి రూపాయల లాటరీ తగిలింది. ఇంతలోనే అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో, కార్తీక్ బౌరి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన ఫిర్యాదులో మాజీ టీఎంసీ నాయకుడు బేబీ బౌరి, అమర్దీప్ బౌరి, సందీప్ బౌరి, జ్యోత్స్న బౌరిలే కార్తీక్ను హత్య చేసినట్లు ఆరోపించారు.అక్కడ మృతదేహాం.. కార్తీక్ బౌరి అచేతనంగా బేబీ బౌరి ఇంటి బయట ఉన్న మెట్లపై కనిపించాడు. అనంతరం, అతడి కుటుంబం అక్కడికి చేరుకుని వెంటనే కార్తీక్ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కార్తీక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో బేబీ బౌరిని కార్తీక్ కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. కార్తీక్ తన ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. దొంగతనానికి వచ్చి ఇంటి గోడ దూకి పారిపోతుండగా కిందపడి మృతి చెందినట్టు చెప్పుకొచ్చాడు.అయితే, బేబీ బౌరి వ్యాఖ్యలను కార్తిక్ తల్లి తిరస్కరించింది. ఇటీవలే తన కొడుకు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నాడని, దొంగతనం చేయడానికి ఎటువంటి కారణం లేదని చెప్పింది. కార్తీక్ను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు ఆరోపించారు. దీంతో, కార్తీక్ మృతి కేసులో మాజీ తృణమూల్ నాయకుడు బేబీ బౌరి, అమర్దీప్ బౌరిలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు సందీప్ బౌరి, జ్యోత్స్న బౌరి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరినీ అసన్సోల్ కోర్టు ముందు హాజరుపరిచినట్టు వెల్లడించారు. -
కర్నూలు కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్
కర్నూలులో వి కావేరి బస్సు ప్రమాదం కేసు డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు. బస్సు ప్రమాద కేసులో ఏ1గా ఉన్న మిరియాల లక్ష్మయ్య ఏ2 బస్సు యజమాని కోసం పోలీసుల గాలింపు.కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్గా, తర్వాత డ్రైవర్గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. యువతి చేతిలో ‘పార్ట్నర్’ హతం
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన గాంధీ విహార్లో కలకలం రేపింది. ఇక్కడి ఒక ఫ్లాట్లో ఉంటున్న 32 ఏళ్ల యూపీఎస్సీ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.కాలిపోయిన స్థితిలో..అతని మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసులకు లభ్యమయ్యింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుని లివ్ ఇన్ పార్ట్నర్తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఫోరెన్సిక్ సైన్స్లో బీఎస్సీ చదువుతున్న 21 ఏళ్ల మహిళ, ఆమె మాజీ ప్రియుడు, వారి స్నేహితుడు ఉన్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నివాసితులని పోలీసులు తెలిపారు. మృతునితో గతంలో సహజీవనం చేసిన ఒక యువతి తన ఇద్దరు పురుష స్నేహితులతో కలసి తన భాగస్వామిని హత్య చేసింది. ఆ తరువాత దానిని ప్రమాదవశాత్తూ జరిగినదిగా చూపించేందుకు అతని శరీరానికి నిప్పంటించారని పోలీసులు పేర్కొన్నారు.ఏసీ పేలిందంటూ ఫోన్..మృతుడిని రామ్కేష్ మీనాగా పోలీసులు గుర్తించారు. అతను గాంధీ విహార్లోని ఒక భవనంలోని నాల్గవ అంతస్తులో నివసిస్తున్నాడని తెలిపారు. అక్టోబర్ 6న, ఏసీ పేలుడు కారణంగా అతని ఫ్లాట్లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి, గది నుండి తీవ్రంగా కాలిపోయిన ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అక్టోబర్ 5- 6 తేదీల మధ్యరాత్రిలో ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఫ్లాట్లోకి ప్రవేశించారని, తెల్లవారుజామున 2.57 గంటల ప్రాంతంలో, ఒక మహిళతో పాటు వారంతా బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యింది. వారు వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.అశ్లీల వీడియోలే కారణం?దర్యాప్తు సమయంలో నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో మహిళ ఉన్నట్లు చూపించే కాల్ వివరాల రికార్డులు పోలీసులలో అనుమానాన్ని రేకెత్తించాయి. మొరాదాబాద్లో అక్టోబర్ 18న ఆమెను అరెస్టు చేశారు. ఆమె నేరాన్ని అంగీకరించడంతో పాటు తనకు సహకరించిన ఇద్దరు సహచరుల పేర్లను వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా మృతుడు రామ్కేష్ మీనా తన అశ్లీల వీడియోలను రికార్డ్ చేశాడని, అయితే వాటిని తొలగించడానికి నిరాకరించాడని ఆ యువతి పోలీసుల విచారణలో తెలిపింది. అందుకే ఆమె రామ్కేష్ మీనా చంపాలని నిర్ణయించుకున్నదని పోలీసులు తెలిపారు.ఎల్పీజీ పంపిణీదారు సహకారంతో..నిందితులు ముగ్గురూ తొలుత రామ్కేష్ మీనా గొంతు కోసి హత్య చేశారు. తరువాత అతని శరీరంపై నూనె, నెయ్యి మద్యం పోశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎల్పీజీ పంపిణీదారుగా పనిచేసే ఆ యువతి మాజీ ప్రియుడు గ్యాస్ సిలిండర్ వాల్వ్ తెరిచి నిప్పంటించాడు. దీంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత వారు రామ్కేష్ మీనాకు సంబంధించిన కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్టాప్లు, ఇతర వస్తువులు తీసుకుని పారిపోయారు. కాగా నిందితుల నుండి పోలీసులు హార్డ్ డిస్క్, ట్రాలీ బ్యాగ్, మృతుని షర్టు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: ‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు -
మద్యం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
ములకలచెరువు: నకిలీ మద్యం కేసులో ఇద్దరు నిందితులను అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం పెద్దపాళ్యం క్రాస్ వద్ద తనిఖీల సందర్భంగా రెండు కార్లలో వేగంగా వెళుతున్న ఏ 15 బాలాజీ, ఏ 20 సుదర్శన్ను ఎక్సైజ్ పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. తండ్రి, కుమారులైన వీరినుంచి 8స్మార్ట్ ఫోన్లు, 4 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితుడైన జనార్దన్రావు అతని స్నేహితులు ములకలచెరువులో మద్యం దుకాణాలు నడుపుతున్నారని, అక్కడ అక్రమ మద్యం తయారు చేయాలని 2025 ఏప్రిల్లో కోరినట్లు విచారణలో బాలాజీ వెల్లడించాడు. -
మరో సోషల్ మీడియా యాక్టివిస్టు అక్రమ అరెస్టు..
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన అంబోజి వినయ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు వినయ్పై కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పోలీసులు అంబోజి వినయ్ను అదుపులోకి తీసుకున్నారు.వినయ్పై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు.డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదుతో హైదరాబాద్లో ఉన్న వినయ్ను ఆదివారం తెల్లవారుజామున ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.వినయ్ అక్రమ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఖండించారు. వినయ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం
పుణే/సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య కేసులో నిందితుడైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానేను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అతని సహ నిందితుడు పట్టుబడిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫల్తాన్ పోలీసుల బృందం పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ను అరెస్టు చేసింది. వైద్యురాలు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్న ఇద్దరు ఆరోపితులలో ప్రశాంత్ బంకర్ ఒకరు.సతారా ఎస్పీ తుషార్ దోషి తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఐ బదానే ఫల్తాన్ గ్రామీణ పోలీసు స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. మరోవైపు బాధితురాలిని మానసికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ బంకర్ను సతారా జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడ పరిధిలోని బీడ్ జిల్లాకు చెందిన వైద్యురాలు గురువారం రాత్రి ఫల్తాన్ పట్టణంలోని ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ బదానే తనపై పలుమార్టు అత్యాచారం చేశాడని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన బంకర్ తనను మానసికంగా వేధించాడని ఆరోపించారు. ఈ నేపధ్యంలో వీరిద్దరిపై కేసు నమోదైంది.పోలీసుల కథనం ప్రకారం ప్రశాంత్ బంకర్.. ఆ వైద్యురాలు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు. కేసు దర్యాప్తులో సబ్-ఇన్స్పెక్టర్ బదానే పేరు బయటకు రాగానే ఉన్నతాధికారులు ఆయనను సర్వీసు నుండి సస్పెండ్ చేశారు. కాగా ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ వేధింపులపై పలుమార్టు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆమె బంధువు మీడియా ముందు ఆరోపించారు. మహిళా వైద్యురాలిని వేధించిన ఎంపీని ఈ కేసులో నిందితునిగా చేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే సురేష్ ధాస్ డిమాండ్ చేశారు. కాగా మృతురాలు తన ఎంబీబీఎస్ చదువు కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం ఇంకా తిరిగి చెల్లించలేదని ఆమె మామ మీడియాకు తెలిపారు.ఇది కూడా చదవండి: Singapore: విజిటర్ను వేధించిన భారత నర్సుకు జైలు -
ఎన్బీఏలో బెట్టింగ్ కలకలం
న్యూయార్క్: అమెరికాలో ఎప్పుడూ ఆటతోనే పతాక శీర్షికలకెక్కే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తాజాగా అవినీతి మకిలీతో పత్రికలకెక్కింది. ఇన్సైడ్ ఇన్ఫర్మెషన్ (జట్టు అంతర్గత సమాచారం) లీక్ చేసి బెట్టింగ్కు పాల్పడటం, మాఫియా కుటుంబాలతో కలిసి క్రీడా పందెంల రిగ్గింగ్, పోకర్ గేమ్ల అనుచిత కార్యకలాపాలు ఎన్బీఏకు మచ్చతెచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) పోర్ట్లాండ్ ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు హెడ్ కోచ్ చౌన్సే బిలప్స్, మయామి హీట్ జట్టు ప్లేయర్ టెర్రీ రోజియెర్ సహా 30 మందికి పైగా అరెస్టు చేసింది. దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ వెల్లడించారు. భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రమోద్ పటేల్ ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా భారీఎత్తున ఈ బెట్టింగ్ మాఫియా మిలియన్ డాలర్లను ఆర్జించినట్లు ఎఫ్బీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పెద్ద ఎత్తున జరిగిన నేరపూరిత కుట్రలో ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఉన్న కోచ్ బిలప్స్ ఉండటం ఎన్బీఏ వర్గాలను విస్మయపరిచింది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఫిక్సింగ్ కార్యకలాపాల్లో బిలప్స్ హస్తముండగా, మయామి హీట్ ప్లేయర్ రోజియెర్ జట్టు గోప్యతకు భంగం కలిగేలా అంతర్గత సమాచారం లీక్ చేసి స్పాట్ బెట్టింగ్ తరహా మోసాలకు పాల్పడినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కశ్యప్ తెలిపారు. బిలప్స్, రోజియెర్లవి రెండు వేర్వేరు కేసులు కాగా, ఈ రెండు కేసుల్లోనూ మాజీ ఎన్బీఏ సహాయ కోచ్, మాజీ ఆటగాడు డామన్ జోన్స్ నిందితుడని ఎఫ్బీఐ అధికారులు తెలిపారు. మరి ఎన్బీఏ ఏం చేసింది ఎన్బీఏ ప్రతిష్టకే మచ్చతెచ్చిన వ్యవహారంపై ఎన్బీఐ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. రిగ్గింగ్, బెట్టింగ్, ఫిక్సింగ్ ఆరోపణల్లో అరెస్టయిన బిలప్స్, రోజియెర్, డామన్ జోన్స్లపై వేటు వేసింది. ఎన్బీఏ క్రీడా సమగ్రతను కాపాడేందుకు ఎఫ్బీఐ అధికారులు, పోలీసులు చేసే విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఎన్బీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో 2007లో కూడా ఎన్బీఏను బెట్టింగ్ ఉదంతం ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడు రిఫరీ టిమ్ డొనగే మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్లతో ఎన్బీఏకు మచ్చ తెచ్చారు. ఆ తర్వాత కూడా బ్రాడ్కాస్టింగ్ ఒప్పందంలో అనివీతి ఆరోపణలతో ఎన్బీఐ ప్రతిష్ట మసకబారింది. -
పెళ్లి పేరుతో మోసం : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి (Sachin Sanghvi) పై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్ పాటలతో పాపులర్ అయిన సంఘ్విని లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే అనంతరం బెయిల్పై విడుదలైనారు. తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసు అధికారి తెలిపారు. చదవండి: వైద్యురాలిపై పోలీసుల అఘాయిత్యం, అరచేతిలో సూసైడ్ నోట్ కలకలంఇది ఇలా ఉంటే ఈ కేసులో సచిన్ సంఘ్వి తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే తన క్లయింట్పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్ చట్టవిరుద్ధం అన్నారు. ఈ విషయంపై సచిన్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా @soulfulsachin ఇన్యాక్టివ్గా ఉంది. అటు జిగర్ కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.కాగా రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించి , దీపావళికి విడుదలైన థమ్మాకి సచిన్ అండ్ జిగర్ సంగీతం అందించారు. గత ఏడాది స్త్రీ 2 కోసం ఈ ద్వయం స్వర పర్చిన చేసిన "ఆజ్ కీ రాత్" బాగా హిట్అయిన సంగతి తెలిసిందే.చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే! -
అమెరికాలో ట్రక్కు బీభత్సం.. భారతీయుడి అరెస్ట్
కాలిఫోర్నియా: అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతికి కారణమయ్యాడంటూ జశన్ప్రీత్ సింగ్ (21) అనే యవకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వార్తా కథనాల ప్రకారం.. అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని.. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు వెల్లడైంది.2022 మార్చిలో సింగ్.. అమెరికా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్(Border Patrol) ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ విధానం కారణంగా కొన్ని రోజుల్లోనే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.కాలిఫోర్నియాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో జశన్ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డాడు. ట్రక్ నడుపుతోన్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు.. ట్రాఫిక్లో కూడా బ్రేక్స్ వేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులైన ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల్లో ఇది తాజాది. గత ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడు. 🚨 SHOCKING: ICE sources confirm Jashanpreet Singh, the semi-truck driver behind the deadly DUI crash on CA’s I-10 freeway, is an Indian illegal alien caught & released by the Biden admin at the border in March 2022. Police say Singh was speeding, under the influence, and never… pic.twitter.com/bc1n5vEC9p— Svilen Georgiev (@siscostwo) October 23, 2025 -
టీడీపీ నేత అరాచకం బాలికపై లైంగిక దాడికి యత్నం
తుని రూరల్ : తాతయ్యా అని పిలిపించుకుంటూనే మనవరాలి వయసున్న 13 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. దీనిని అడ్డుకున్న యువకుడిపై ‘నేను కౌన్సిలర్ను. మేం ఎస్సీలం’ అంటూ బెదిరింపులకు దిగాడు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు ఆ టీడీపీ నేతకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారులో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో తుని పట్టణానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది.తండ్రి లేడు. సెలవులకు తల్లి వద్దకు వెళ్లి, వస్తుంటుంది. అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) మంగళవారం 11 గంటలకు పాఠశాలకు వెళ్లి ఇంజక్షన్ చేయించాలని ఉపాధ్యాయులకు చెప్పి ఆ బాలికను తుని మండలం హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో కాపలాదారుడు తోటకు వచ్చాడు. బాలిక వస్త్రాలను నారాయణరావు విప్పడాన్ని గమనించి మందలించాడు.దీంతో.. ఆవేశం కట్టలు తెంచుకున్న నారాయణరావు ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ కాపలాదారుడిని బెదిరించాడు. వాస్తవానికి నారాయణరావుది కొండవారపేట అయినప్పటికీ, తప్పించుకునేందుకు వీరవరపుపేట అని తప్పుగా చెప్పాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేస్తానని, తన తోటలోకి ఎందుకు వచ్చారంటూ నారాయణరావును, బాలికను ఆ కాపలాదారు నిలదీశాడు.బహిర్భూమికి వచ్చామని నమ్మబలికే ప్రయత్నం చేసూ్తనే నారాయణరావు బెదిరింపులకు దిగాడు. దీంతో, బాలికకు న్యాయంచేయాలనే ఉద్దేశంతో ఆమె కుటుంబ సభ్యులకు తెలిసున్న వ్యక్తుల ద్వారా కాపలాదారు సమాచారం అందించాడు. ఈలోపు బాలికను గురుకుల పాఠశాలలో దించి, నారాయణరావు కొండవారపేట వెళ్లిపోయాడు. అప్పటికే విషయం తెలియడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పటు్టకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.నాలుగైదుసార్లు ఇలాగే..తాతయ్యనంటూ చెప్పి, గతంలో నాలుగైదుసార్లు ఆ బాలికను నారాయణరావు బయటకు తీసుకువెళ్లినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. తాజాగా, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐసీడీఎస్, పోలీస్, విద్యాశాఖ అధికారులు బుధవారం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. బాలిక నుంచి వివరాలు సేకరించారు. గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లినందుకు కిడ్నాప్ కేసు, లైంగిక దాడికి యత్నించడంపై పోక్సో చట్టం కింద నారాయణరావుపై కఠినమైన కేసులు నమోదుచేస్తున్నామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో దళిత సంఘాల నేతలు, యువకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. బాలికకు న్యాయం చేయాలని, నిందితుడిని అరెస్టుచేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.విచారణకు మూడు బృందాలు..బాలికపై లైంగిక దాడికి యత్నించిన నారాయణరావును అరెస్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. ఈ కేసులలో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. 15 రోజుల్లో చార్్జషీట్ దాఖలు చేస్తామన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించామని డీఎస్పీ తెలిపారు. -
టీడీపీ జోలికొస్తే.. జనసేన నేతలైనా వదిలేదెలే..
-
చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్గా పనిచేస్తూ.. అమెరికా-భారత్ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్సీ సెక్షన్ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్ కార్యాలయం ఆయన అరెస్ట్, విచారణను ధృవీకరించింది.ఫెడరల్ అధికారులు ఏమన్నారంటే.. 64 ఏళ్ల వయసున్న టెలిస్.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్ ఎయిర్ఫోర్స్లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్లీ బ్యాగును కూడా గిఫ్ట్గా అందించారు అని అన్నారు. అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు దక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు -
న్యాయం గెలిచింది!
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్లో ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టులా మారింది. పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను యావత్ ప్రజానీకం తప్పుపడుతోంది. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని సూచిస్తోంది. సంక్షేమం విస్మరించి వేధింపులకు దిగడం పద్ధతి కాదని స్పష్టం చేస్తోంది. సర్కారు విధానాలను ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికీ ఉంటుందని వెల్లడిస్తోంది.సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టును తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి తిరస్కరించారు. 41 నోటీసులు సరిపోతాయని వెల్లడించారు. న్యాయస్థానం తీర్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు. అధికారాన్ని ఉపయోగించి సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టాల్సిన కేసులో సోషల్ మీడియా కార్యకర్తలు నవీన్, చంద్రశేఖర వెంకటేష్ని టెర్రరిస్ట్లను అరెస్ట్ చేసినట్టు ముసుగులేసి, రోడ్లపై నడిపిస్తూ కోర్టులో హాజరుపరచంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వారిద్దరి రిమాండ్ను న్యాయస్థానం మంగళవారం రాత్రి తిరస్కరించింది. అణగదొక్కడం సరికాదు ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకుంటే ప్రతిపక్ష పార్టీ ఎండగడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. విమర్శలను పాలకులు సానుకూలంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా తప్పులను ఎత్తి చూపిన వారిని కేసులతో వేధించడం, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు యతి్నంచడం సరికాదని వెల్లడిస్తున్నారు. బెల్ట్ షాపులను అరికట్టడం వదలేసి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల తిరుపతి లీగల్: తిరుపతి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నాయకుడు బృంగి నవీన్ అలియాస్ నాని, తిరుపతి, ఎంఆర్ పల్లి, శాంతినగర్కు చెందిన సి.వెంకటేష్ పై ఈస్ట్ పోలీసులు నమోదు చేసిన కేసులో వ్యక్తిగత పూచీ కత్తుపై ఇద్దరినీ విడుదల చేస్తూ తిరుపతి మూడవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు యుగంధర్ రెడ్డి, కొత్తపల్లి విజయ్కుమార్, ఐ.చంద్రశేఖర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 ఏ నోటీసు ఇవ్వాలని తీర్పు ఉండగా పోలీసులు రిమాండ్కు తీసుకురావడం చట్టవిరుద్ధమన్నారు. వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే! తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం సేవించిన కొందరు రోడ్డుపై పడి ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలు వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి చెందిన నవీన్, చంద్రశేఖర్ వెంకటేష్ వైరల్ చేశారని కూటమి నేతలు ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి చేశారు. కూటమి నేతల ఒత్తిడితో సోమవారం వారిద్దరిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి రిమాండ్కు తరలించారు. రిమాండ్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. దీంతో రిమాండ్ను తిరస్కరిస్తూ మూడో అదనపు జూనియర్ జడ్జి తీర్పు ఇచ్చారు.రెడ్బుక్ రాజ్యాంగం అమలు పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరంకుశంగా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారని, అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. పోలీసులు సైతం కూటమి నేతల కళ్లలో ఆనందం చూసేందుకు ౖవైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యులు బృంగి నవీన్, చంద్రశేఖర్ వెంకటే‹Ùను అదుపులోకి అవమానించారని వివరిస్తున్నారు. ఐటీ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని టెర్రరిస్టు మాదిరిగా ముసుగు వేసి మీడియా ముందు హాజరుపరిచారని విమర్శిస్తున్నారు. -
గ్యాంగ్ రేప్ కేసు.. స్నేహితుడి పనే?! అరెస్ట్
తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్రేప్ ఉదంతం కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్రేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్ షేక్, షేక్ రియాజుద్దీన్లను అరెస్ట్చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. దుర్గాపూర్/కోల్కతా: పశ్చిమబెంగాల్లో తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్రేప్ ఉదంతం(Durgapur Gang Rape Case) కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్రేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్దౌస్ షేక్, షేక్ రియాజుద్దీన్లను అరెస్ట్చేసిన పోలీసులు తాజాగా బాధితురాలి స్నేహితుడిని అరెస్ట్చేశారు. ఘటన జరిగిన తీరుపై బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలానికి, స్నేహితుడు ఇచ్చిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని మంగళవారం సాయంత్రం బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని(No Gang Rape), క్లాస్మేట్ అయిన ఈ స్నేహితుడు మాత్రమే రేప్ చేశాడని ప్రాథమిక అంచనాకు వచ్చామని పోలీసులు చెప్పారు. నిందితులందరి దుస్తులు, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించామని నివేదిక వచ్చాకే కేసులో స్పష్టత వస్తుందని అసన్సోల్–దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌద్రీ చెప్పారు. చౌద్రీ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఘటన జరిగిన రోజు గంటన్నర ఆలస్యంగా తమ కూతురి స్నేహితుడు తమకు సమాచారం ఇచ్చాడని, అతనిపైనా తమకు అనుమానం ఉందని బాధితు రాలి తండ్రి అక్టోబర్ 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చివరకు ఆ స్నేహితుడు సైతం అరెస్ట్కావడం గమనార్హం. దుర్గాపూర్ పట్ణణ శివారులోని ప్రైవేట్ ఎంబీబీఎస్ కళాశాల హాస్టల్ నుంచి దూరంగా ఉన్న ధాబాలో భోజనం చేసేందుకు ఈ స్నేహితుడే బాధితురాలిని బయటకు తీసుకెళ్లగా గ్యాంగ్రేప్ జరిగిందని కేసు నమోద వడం తెల్సిందే. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అభిషేక్ గుప్తా సారథ్యంలోని బృందం సీన్ రీక్రియేషన్ కోసం ఐదుగురు నిందితులను మంగళవారం మధ్యాహ్నం ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రశ్నించింది. ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రించారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితులు విడివిడిగా చెప్పిన సమాధానాలకు పొంతన కుదరలేదు. దీనికితోడు బాధితురాలు ముగ్గురిలో కేవలం ఒక్కరే రేప్ చేశారని తొలుత వాంగ్మూలం ఇవ్వడం, తర్వాత ఐదుగురు రేప్ చేశారని మరోలా వాంగ్మూలం ఇవ్వడం, స్నేహితుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో ఆ స్నేహితుడిని అరెస్ట్చేశామని కమిషనర్ చెప్పారు. ‘‘బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాలు, లభించిన ఆధారాలు, నిందితుల స్టేట్మెంట్లను గమనిస్తే ఇది గ్యాంగ్రేప్ కాదని అర్థమవుతోంది. ఒక్కరు మాత్రమే అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది’’ అని కమిషనర్ వ్యాఖ్యానించారు.వాంగ్మూలాలకు, సీసీటీవీ ఫుటేజీకి కుదరని లంకెనిందితులు, బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలా లకు, సీసీటీవీలో ఉన్న దృశ్యాలకు సైతం పొంతన కుదరకపోవడం ఈ కేసులో సంక్లిష్టతను మరింత పెంచుతోంది. ఐదుగురు నిందితులు తనను లాక్కెళ్లినప్పుడు స్నేహితుడు పారిపో యాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. కానీ బాధితురాలు, స్నేహితుడు అసలేం జరగనట్లు, ముఖాల్లో ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా హాస్టల్కు తిరిగొచ్చినట్లు ఘటన తర్వాత హాస్టల్ గేటు దగ్గరి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. రేప్ వేళ పెనుగులాటలో బాధితురాలి దుస్తులు చిరిగిపోవడమో, జుట్టు చిందరవందరగా ఉండటమో లాంటివి లేకుండా బాధితురాలు ఆ వీడియోలో మా మూలుగానే కనిపించింది. తనకు హాని జరిగిందని బాధితురాలు హాస్టల్ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదుచేసినట్లు ఫుటేజీలో కనిపించలేదు. వాళ్ల సాయం కోరిన ట్లుగా కూడా లేదు. ‘‘ఘటన తర్వాత బాధితు రాలి ఫోన్ నుంచి స్నేహితునికి ఆగంతకులు ఫోన్ చేసి రమ్మన్నారు. ఫోన్ తిరిగి ఇవ్వాలంటే రూ.3,000 ఇవ్వాలని బాధితురాలిని డిమాండ్చేశారు. ఆమె వద్ద ఉన్న రూ. 200 లాగేసుకున్నారు’’ అని కమిషనర్ వెల్లడించారు. ఇదీ చదవండి: బస్సులో.. క్షణాల్లోనే కాలి బుగ్గైన 20 మంది -
నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్ట్
మదనపల్లె: అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసులు శనివారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అయిన ములకలచెరువు నల్లగుట్టకు చెందిన సయ్యద్ కలీం అష్రఫ్ (23)ను అరెస్ట్ చేసి తంబళ్లపల్లె తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరచగా, ఏడు రోజులు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని మదనపల్లె సబ్జైలుకు తరలించారు.తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి చెందిన స్కారి్పయో వాహనంలో సయ్యద్ కలీం అష్రఫ్ నకిలీ మద్యాన్ని బెల్టుషాపులకు సరఫరా చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ నకిలీ మద్యం కేసులో 23 మందిని నిందితులుగా పేర్కొనగా, ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. కాగా, అరెస్ట్ చేసిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్దన్కు రిమాండ్రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడిగాందీనగర్ (విజయవాడసెంట్రల్): నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్కు ఈనెల 17వరకు విజయవాడలోని 6వ ఏజేఎం ఫస్ట్ క్లాస్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అద్దేపల్లిని శుక్రవారం గన్నవరం ఎయిర్పోర్టులో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ నుంచి కోర్టుకు, ఆ తర్వాత న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరు పరిచారు. కోర్డు రిమాండ్ విధించడంతో అద్దేపల్లి జనార్దన్ను నెల్లూరు జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు జనార్దన్ రిమాండ్ రిపోర్టులో తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయనతోపాటు కట్టా సురేంద్ర నాయుడుతో తనకు లిక్కర్ వ్యాపారంలో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ అధిక సంఖ్యలో వైన్షాపులు దక్కించుకున్నారని పేర్కొంటూ, రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ వ్యాపార అనుభవం లేని కారణంగా నష్టాలు రావడంతో తనను సంప్రదించారని తెలిపాడు. వీరికి చెందిన ములకలచెరువులోని రాక్ స్టార్ వైన్స్, చంద్రాయునిపల్లిలోని ఆంధ్రవైన్స్ తానే నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 2025 మే, జూన్ నెలల నుంచి ములకలచెరువులో అద్దేపల్లి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.అదే సమయంలో ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్నార్ బార్తోపాటు శ్రీనివాస వైన్స్లో విక్రయించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్, హీల్స్ బాలాజీ సరఫరా చేసేవాడని, అలాగే లేబుల్స్, బ్రాండ్ స్టిక్కర్స్ రవి సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్లో ఈ–7 అనే బార్లో పార్టనర్గా చేరి అక్కడ చీప్ లిక్కర్ను ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్టనర్స్తో గోవా వెళ్లి.. అప్పటికే లిక్కర్ బిజినెస్లో ఉన్న బాలాజీతో చేతులు కలిపి అతని ద్వారా నకిలీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, హీల్స్, క్యాప్లు, క్యారేమిల్, ఎసెన్స్ తీసుకొని వచ్చి, తయారీ తర్వాత బార్లో విక్రయించాడు.నకిలీ మద్యం తయారీకి ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఐషర్ వాహనాల్లో ఇబ్రహీంపట్నంకు స్పిరిట్ను తరలించేవారు. అలా వచ్చిన మెటీరియల్ను ఉపయోగించి తన సోదరుడు జగన్మోహన్రావుతో కలిసి జనార్దన్ నకిలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. జయచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో లిక్కర్ వ్యాపారం ఉన్న ట్లు గుర్తించారు. ఈ కేసు నుంచి ఆయనను తప్పించేందుకు ముఖ్యనేత యత్నించడం గమనార్హం. -
అనిల్ అంబానీ సహయకుడి అరెస్ట్
అనిల్ అంబానీ సహాయకుడు.. రిలయన్స్ పవర్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అయిన 'అశోక్ కుమార్ పాల్'ను ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ కేసుకు సంబంధించి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.రిలయన్స్ పవర్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్న అశోక్ పాల్కు.. రూ. 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపైనే ఆయనను ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించిన ఈడీ.. గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు, శనివారం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ కోరనున్నట్లు సమాచారం.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన పాల్.. 2023 జనవరి 29న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా నియమితులయ్యారు. ఆయనకు సుమారు ఏడు సంవత్సరాలకు పైగా రిలయన్స్ పవర్తో అనుబంధం ఉంది. అయితే భువనేశ్వర్, కోల్కతాతో సహా పలు ప్రాంతాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ సోదాలు ప్రారంభించిన చాలా రోజుల తరువాత ఈ అరెస్టు చేయడం జరిగింది.ఏమిటి ఈడీ కేసురిలయన్స్ పవర్తో పాటు.. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపైన రూ. 17వేల కోట్ల బ్యాంకు లోన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఆగస్టులో ముంబైలోని 35 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన తర్వాత ED దర్యాప్తు చేపట్టింది. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం.. కింద 50 కంపెనీలు, గ్రూప్తో సంబంధం ఉన్న 25 మంది వ్యక్తులను కవర్ చేసింది. తాజాగా సీఎఫ్ఓ అరెస్ట్ కేసులో మరింత కీలకంగా మారిందని తెలుస్తోంది.ఇదీ చదవండి: అరట్టై ప్రైవసీపై సందేహం: శ్రీధర్ వెంబు రిప్లై ఇలా.. -
Rajasthan: పాక్కు రహస్యాల చేరవేత.. యువకుడి అరెస్ట్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అల్వార్లోని గోవింద్గఢ్ నివాసి మంగత్ సింగ్ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ దర్యాప్తు అనంతరం మంగత్ సింగ్ను అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్టు చేశారు.సీఐడీ అధికారులు అల్వార్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిఘా సారించినప్పుడు మంగత్ సింగ్ కార్యకలాపాలను గుర్తించారు. సింగ్ కొంతకాలంగా అనుమానాస్పద చర్యలకు పాల్పడుతున్నాడని అధికారులు గమనించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్ పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన హ్యాండ్లర్లతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. ఇషా శర్మ అనే మారుపేరుతో పనిచేస్తున్న పాకిస్తాన్కు చెందిన ఒక మహిళా హ్యాండ్లర్ సింగ్ను హనీ-ట్రాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూఢచర్య కార్యకలాపాలలో సహకరించినందుకు ప్రతిగా ఆ హ్యాండ్లర్.. సింగ్కు ఆర్థికసాయం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సింగ్ భారతదేశ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు అందజేసినట్లు తెలుస్తోంది.సింగ్ గత రెండేళ్లుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నాడని, గూఢచర్య కార్యకలాపాలలో అతని ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. మంగత్ సింగ్ అరెస్టు ఆపరేషన్ సిందూర్లో భాగంగా జరిగింది. రాజస్థాన్ ఇంటెలిజెన్స్ ఈ ప్రాంతంలో నిఘా సారించింది. కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గూఢచర్యాన్ని అరికట్టేందుకు, భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ అరెస్టు జరిగిందని పోలీసులు తెలిపారు.గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నవారిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు అక్టోబర్ 10న జైసల్మేర్లో అనుమానిత గూఢచారి మహేంద్ర ప్రసాద్(32)ను అరెస్టు చేశారు. అతను డీఆర్డీఓ గెస్ట్హౌస్ మేనేజర్గా పనిచేస్తూ, సున్నితమైన రక్షణ సంబంధిత సమాచారాన్ని పాక్కు లీక్ చేశాడని తేలింది. 32 ఏళ్ల ప్రసాద్ పాకిస్తాన్ నిఘా నిర్వాహకునితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదేవిధంగా జైసల్మేర్కు చెందిన హనీఫ్ ఖాన్ను ఐఎస్ఐ కార్యకర్తలకు రహస్య సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఇటీవల అరెస్టు చేశారు. -
Fake Liquor Case: నువ్వు వెళ్లి లొంగిపో.. నేను చూసుకుంటా..!
-
లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్
-
కల్తీ దగ్గు మందు కేసులో కీలక పరిణామం
చెన్నై: కల్తీ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 మంది చిన్నారుల మరణాలకు కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ ఫార్మాసూటికల్స్ కంపెనీ యాజమాని జి.రంగనాథన్(73)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జి. రంగనాథన్(G Ranganathan) మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఫార్మసీ గ్రాడ్యుయేట్. గత 40 ఏళ్లుగా ఔషధ తయారీ రంగంలో ఉన్నారు. 80వ దశకంలో ప్రోనిట్(Pronit) అనే పోషక సిరప్ను తయారు చేసి చెన్నైలో ప్రసిద్ధి పొందారు. ఆ తర్వాత లిక్విడ్ నాసల్ ప్రొడక్ట్స్(ముక్కు డ్రాప్స్), చిన్న స్థాయి తయారీ యూనిట్లను చెన్నై పరిసరాల్లో స్థాపించారు. శ్రేసన్తో పాటు సీగో ల్యాబస్, ఇవెన్ హెల్త్కేర్ సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు ఔషధ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశకుడిగా నిలిచారు కూడా. అయితే మధ్యప్రదేశ్ చిన్నారుల మరణాల నేపథ్యంలో.. శ్రేసన్ సంస్థపై కేసు నమోదు అయ్యింది. కోడంబాక్కంలోని రంగనాథన్ కార్యాలయాన్ని సైతం అధికారులు సీజ్ చేశారు. ఆయన అరెస్టును పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఇదిలా ఉంటే..తమిళనాడు కాంచీపురం శ్రేసన్ ఫార్మాసూటికల్స్ యూనిట్ నుంచి మే నెలలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ (Cough Syrup) బ్యాచ్ను పలు రాష్ట్రాలకు పంపింది. ఈ క్రమంలో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కలిపి 20 మంది చిన్నారులు మరణించారు. ఈ నేపథ్యంలో కోల్డ్రిఫ్ను నిషేధించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. మరణాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేసింది. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయితే.. కోల్డ్రిఫ్లో డైఈథిలీన్ గ్లైకాల్ (DEG) అనే పదార్థం మోతాదుకు మించి(500 రేట్లు) 48.6% స్థాయిలో ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఇదే పిల్లల్లో కిడ్నీలను కరాబు చేసి.. వాళ్ల మరణాలకు దారి తీసింది. తమిళనాడు ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ట్మెంట్ తనిఖీల అనంతరం తీవ్ర ఉల్లంఘనలను గుర్తించి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న శ్రేసన్ యూనిట్ను మూసేసింది. 2011లో ఏర్పాటైన ఈ యూనిట్.. ఆ తర్వాతి కాలంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదు. అలాగే అక్కడి అపరిశ్రుభ వాతావరణం, నిబంధనలకు పాటించకుండా కెమికల్స్ కొనుగోలు నేపథ్యంతో ఉత్పత్తి లైసెన్స్నూ రద్దు చేసింది. ఈ క్రమంలో క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం.ఇదీ చదవండి: కోల్డ్రిఫ్.. తయారీ.. యాక్ ఛీ! -
జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్
ప్రఖ్యాత అసోం గాయకుడు జుబీన్ గార్గ్ అకాలమరణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత స్కూబా డైవింగ్ ప్రమదంలో చనిపోయాడని భావించిన ఈ కేసులో ఆ తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. విషప్రయోగం కారణంగా చనిపోయాడని మరోవార్త వెలుగులోకి వచ్చింది. దీంతో జుబీన్గార్గ్కు సంబంధించిన వారిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జుబీన్ మరణానికి ఆయన సమీప బంధువు, పోలీసు అధికారిని అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి గతంలో అరెస్టయిన మరో నలుగురు ఇప్పటికేఈ పోలీసు కస్టడీలో ఉన్నారు. గత నెలలో సింగపూర్లో జుబీన్మరణానికి సంబంధించి జుబీన్ గార్గ్ బంధువు , అస్సాం పోలీసు DSP సందీపన్ గార్గ్ను బుధవారం అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ కేసులో ఇది ఐదో అరెస్టు.VIDEO | Guwahati: Zubeen Garg's cousin and Assam Police DSP Sandipan Garg arrested in connection with singer's death.#ZubeenGarg #AssamNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/BdAfazODSz— Press Trust of India (@PTI_News) October 8, 2025గత నెలలో సింగపూర్లో గాయకుడి మరణంపై పట్టుబడిన పోలీసు అధికారిని గత కొన్ని రోజులుగా అనేకసార్లు విచారించారు. ఈ సంఘటనలో డిప్యూటీ ఎస్పీ, సందీపన్ గార్గ్ అతనితో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. సందీపన్ రిమాండ్ కోరుతామని మరొక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ కేసులో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, గాయకుడి మేనేజర్ సిద్ధార్థ్ శర్మతో పాటు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు శేఖర్ జ్యోతి గోస్వామి ,అమృత్ ప్రభా మహంతాలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.


