breaking news
arrest
-
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక ఆరోపణల కేసులో బెంగళూరులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
డ్రగ్స్ లింక్.. ఉగాండా మహిళ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: దేశ భద్రతకు భంగం కలిగించే అవాంఛనీయ కార్యకలాపాలకు నిరోధించేలా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కీలక చర్యలు చేపట్టింది. ఈ రోజు (బుధవారం) ఉగాండా దేశానికి చెందిన నబంజ శారన్ అనే మహిళను అదుపులోకి తీసుకుంది. ఆ విదేశీయురాలిపై విచారణ జరుపగా, ఆమె వీసా గడువు ఇదివరకే ముగిసిందని అయినప్పటికీ భారతదేశంలో అక్రమంగా నివసిస్తుందని పోలీసులు తెలిపారు. ఈవిషయం సదరు మహిళ సైతం ధృవీకరించినట్లు పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే..టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నబంజ శారన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో హైదరాబాద్లో తన నివాసానికి సంబంధించి ఆమె ఎలాంటి సంతృప్తికరమైన సమాధానాలు గానీ, సరైన పత్రాలు గానీ సమర్పించలేకపోయింది. సమగ్ర విచారణ అనంతరం, తన వద్ద చెల్లుబాటు అయ్యే వీసా లేదని, వీసా గడువు ముగిసినప్పటికీ భారతదేశంలో అక్రమంగా కొనసాగుతున్నానని ఆమె అంగీకరించింది.మరింత లోతుగా దర్యాప్తు చేయగా, ఆమె 06-03-2019న ఈ-టూరిస్ట్ వీసాపై ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా భారతదేశానికి వచ్చినట్లు వెల్లడైంది. అనంతరం ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వెళ్లి, అక్కడ చిన్నచిన్న పనులు చేసింది. ఆ తర్వాత సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో మాదకద్రవ్యాల ముఠాలతో పరిచయాలు ఏర్పరచుకుంది. ఈ క్రమంలో బెంగళూరు, హైదరాబాద్లలో డ్రగ్ పెడ్లర్లతో కలిసి ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది.ఆమె టూరిస్ట్ వీసా గడువు 04-05-2019 నాటికే ముగిసింది; అయితే ఆమె పాస్పోర్ట్ 23-11-2027 వరకు చెల్లుబాటులో ఉంది. వీసా గడువు ముగిసినప్పటి నుండి ఆమె భారతదేశంలో అక్రమంగా నివసిస్తూ, డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఆమెను స్వదేశమైన ఉగాండాకు పంపించేందుకు H-NEW విభాగం హైదరాబాద్లోని ఎఫ్.ఆర్.ఆర్.ఓ (FRRO) ద్వారా బహిష్కరణ (డీపోర్టేషన్) ప్రక్రియను ప్రారంభించింది.బయోమెట్రిక్ వివరాలను పరిశీలించి, చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ ఉన్నప్పటికీ టూరిస్ట్ వీసా గడువు ముగిసినట్లు నిర్ధారించారు. అనంతరం హైదరాబాద్ FRRO నుండి ఎగ్జిట్ పర్మిట్ పొంది, భవిష్యత్తులో ఆమె భారతదేశంలోకి ప్రవేశించకుండా 'బ్లాక్లిస్ట్' చేశారు. ఆమె ప్రయాణానికి సంబంధించి ఈ రోజు (12-08-2026) తేదీన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమాన టికెట్ బుక్ చేశారు.ఇటీవలి కాలంలో కొందరు విదేశీయులు మెడికల్ వీసా, స్టూడెంట్ వీసా, బిజినెస్ వీసా, టూరిస్ట్ వీసాలపై భారతదేశానికి వస్తున్నారు. పాస్పోర్ట్, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా ఇక్కడే ఉంటూ వివిధ రకాల మత్తుపదార్థాల రవాణా, సరఫరా, విక్రయాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీని ఫలితంగా సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం, వ్యసనం పెరిగి కుటుంబాలు, సమాజం తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాయి.హైదరాబాద్ నగర ప్రజలు ఎవరూ కూడా మత్తుపదార్థాల బారిన పడవద్దని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (H-NEW) విజ్ఞప్తి చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు, ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచి, వారు మాదకద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా H-NEW బృందానికి 8712661601 నంబరు ద్వారా తెలియజేయగలరని పోలీసు విభాగం పేర్కొంది.ఈ ఆపరేషన్లో ఇన్స్పెక్టర్ పి. శ్రీధర్, ఇన్స్పెక్టర్ ఎం. మధు బాబు తదితరులు పాల్గొన్నారు. -
అతని మీద ఎలాంటి కేసు పెట్టారంటే.. చింతాడ రవి అరెస్ట్ పై సంచలన నిజాలు
-
దద్దరిల్లిన కర్నూల్.. కొట్టినా.. అరెస్ట్ చేసినా YSRCP నిరసనలు
-
YSRCP చింతాడ రవికుమార్ అరెస్ట్
-
వారే టార్గెట్.. ఫోన్లో 600కి పైగా వీడియోలు!
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్లు, యువకులకు డబ్బు ఆశ చూపి వలలో వేసుకుని.. వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఫోన్లో 600కుపైగా అశ్లీల వీడియోలు, ఫొటోలను పోలీసులు గుర్తించారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రైజింగ్పురాకు చెందిన చేతన్ ప్రకాశ్ కోలి (22).. 2022 నుంచి మైనర్లు, యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డబ్బులు ఇస్తానని నమ్మించి బాధితులను ఆకర్షించిన నిందితుడు.. వారితో అసభ్యకర వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి మొబైల్ ఫోన్ను పరిశీలించగా అందులో పెద్ద సంఖ్యలో అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటపడ్డాయని నందుర్బార్ ఎస్పీ అశ్విని సనప్ వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపినట్లు తెలిపారు. వీడియోల్లో ఉన్న బాధితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం.. నిందితుడు 2022 నుంచి ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
YSR జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత.. MLC రామసుబ్బారెడ్డి అరెస్ట్
-
ఉదయనిధి.. స్టేషన్ బెయిల్ వెనుక విజయ్ మాస్టర్ ప్లాన్
-
మల్లాది విష్ణు అరెస్ట్
-
ట్రంప్ను టార్గెట్ చేశారా?.. గోల్ఫ్ క్లబ్ వద్ద హైటెన్షన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలిఫోర్నియా పర్యటన వేళ తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో నిర్వహించనున్న నిధుల సేకరణ కార్యక్రమానికి (ఫండ్రైజింగ్ డిన్నర్) హాజరుకానున్న నేపథ్యంలో, అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద గన్, బుల్లెట్స్ లభించడం మరింత టెన్షన్కు గురిచేసింది. సదరు వ్యక్తిని జీనైన్ జాన్ టేలే (38)గా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై అధికారుల వివరాల ప్రకారం.. జీనైన్ జాన్ టేలే గోల్ఫ్ కోర్స్లో తిరుగుతూ ఫోటోలు, వీడియోలు తీస్తూ భద్రతా ఏర్పాట్లను గమనిస్తున్నట్లు కనిపించాడు. తనిఖీలో అతని వద్ద దాచిన పిస్టల్, నిషేధిత సామర్థ్యం గల మ్యాగజైన్లు, హాలో-పాయింట్ బుల్లెట్లు లభించాయి. అనంతరం అతని ఇంటిపై జరిపిన సోదాల్లో అక్రమంగా మార్పులు చేసిన AR-శైలి రైఫిల్, మరో పిస్టల్, బాడీ ఆర్మర్, అధిక మొత్తంలో మందుగుండు సామగ్రి, అలాగే ఆందోళన కలిగించే నోట్బుక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎఫ్బీఐ జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్, యు.ఎస్. సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ట్రంప్ పర్యటనతో ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా? దాడి చేసే ఉద్దేశం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. అయితే, ట్రంప్పై దాడి చేయాలనే కుట్ర జరిగినట్లు లేదా నిందితుడు అలాంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చినట్లు ఇప్పటివరకు అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అతనిపై ఆయుధాలకు సంబంధించిన అభియోగాలే నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతోంది. < /p>BREAKING: A HEAVILY ARMED MAN has been arrested outside Trump National Golf Club in California after he CAMPED OUT before 47's visit. ANOTHER WOULD-BE ASSASSINATION ATTEMPT.pic.twitter.com/JPOMSxyYrC— iexclusivenews (@iexclusivenews) August 5, 2026 -
ఉదయనిధి అరెస్ట్ తో పార్లమెంట్లో రాజకీయ రగడ
-
నా అరెస్ట్ ఒక జోక్... అరెస్ట్ పై ఉదయనిధి రియాక్షన్
-
మా నాన్న చేసిన తప్పేంటి నూరి ఫాతిమా ఫైర్
-
భార్య బట్టలు మీరే చింపుకొని... మా నాయకులపై కేసులు పెడతారా?
-
ఉదయ్నిధి బాత్రూంలో ఉన్నారు.. కాస్త ఆగండి
డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్నిధి స్టాలిన్ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చెన్నైలోని నివాసానికి వెళ్లిన సమయంలో చోటుచేసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులను కాస్త ఆగాలంటూ ఉదయ్నిధి భార్య కృతికా విజ్ఞప్తి చేసిన దృశ్యాలు చర్చకు దారితీశాయి.తంజావూరులో కావేరీ నీటి వివాదంపై జరిగిన డీఎంకే నిరసన కార్యక్రమంలో ఉదయ్నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని.. సీఎం విజయ్ను అవమానించేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయ్నిధిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.వైరల్గా మారిన వీడియోలో.. పోలీసులు ఉదయ్నిధిని కలిసేందుకు ఆయన ఇంట్లో వేచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో కృతికా ఉదయ్నిధి, డీఎంకే నేత మా. సుబ్రమణియన్ పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. “ఆయన టాయిలెట్లో ఉన్నారు. కాస్త సమయం ఇవ్వండి” అంటూ కృతికా పోలీసులను కోరారు. మరికొన్ని నిమిషాలు ఆగాలని విజ్ఞప్తి చేశారు.On Cam: Moments Before Udhayanidhi Stalin Arrest- TIMES NOW accesses the sequence of events- On Cam: Udhayanidhi's wife argues with policemen@dharannniii & @DEKAMEGHNA breaks down the details. pic.twitter.com/WMdaMW0r99— TIMES NOW (@TimesNow) August 4, 2026 VIDEO CREDITS:TimesNowదీనికి స్పందించిన ఓ పోలీసు అధికారి.. తాము చట్టపరమైన విధులు నిర్వహించేందుకు వచ్చామని, ఎక్కువ సమయం వేచి ఉండలేమని పేర్కొన్నారు. “ఎంతసేపు వేచి ఉండాలి? ఇది మా విధి. మేం చట్టాన్ని ఉల్లంఘించడం లేదు” అంటూ ఆయన చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది.మా. సుబ్రమణియన్ కూడా పోలీసులను మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఉదయ్నిధి సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలని, న్యాయవాది కూడా వస్తారని చెప్పారు. అలాగే ఉదయ్నిధిని తంజావూరుకు తీసుకెళ్లాల్సి ఉందని.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుందని, బయలుదేరే ముందు కొంత సమయం ఇవ్వాలని మంత్రి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం అనంతంగా వేచి ఉండలేమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.கைது செய்து தஞ்சாவூர் அழைத்து செல்லப்படும் எதிர்க்கட்சி தலைவர்.. ஜன்னல் ஓரத்தில் பெரும் யோசனையோடு அமர்ந்து செல்லும் உதயநிதிDMK | Udhayanidhi Arrest | Udhayanidhi Speech | #NewsTamil24x7 #UdhayanidhiStalin #PoliceArrest pic.twitter.com/6afl9S9XCo— News Tamil 24x7 (@NewsTamilTV24x7) August 4, 2026ఏ కేసులో అరెస్ట్?కావేరీ నీటి సమస్యపై తంజావూరులో జరిగిన డీఎంకే నిరసనలో ఉదయ్నిధి చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి కారణమైంది. నిరసన సమయంలో కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరును ప్రస్తావించగా.. ఉదయ్నిధి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం, ఉద్దేశపూర్వక అవమానం, బెదిరింపులు, కుట్ర తదితర ఆరోపణలతో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్లను కూడా చేర్చినట్లు సమాచారం.రాజకీయంగా ముదిరిన వివాదంఉదయ్నిధి అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త దుమారానికి దారితీసింది. అధికార టీవీకే, బీజేపీ నేతలు ఉదయ్నిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డీఎంకే మాత్రం ఈ కేసును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. కావేరీ సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
తంజావూరులో ఉద్రిక్తత.. విజయ్ దిష్టిబొమ్మ దగ్ధం
సాక్షి, చెన్నై: తమిళనాడు తంజావూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును వ్యతిరేకిస్తూ డీఎంకే కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలను చేపడుతున్నారు. తంజావురులో షాపులని మూయిస్తున్నారు. అరెస్టును నిరసిస్తూ సీఎం విజయ్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు యత్నించారు. దీంతో టీవీకే, డీఎంకే కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.కావేరి ఇష్యూ నుంచి టాపిక్ను డైవర్ట్ చేయడానికి ఉదయనిధిని అరెస్టు చేయించారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.డీఎంకే నిరసనలకు పన్నీర్ సెల్వం నాయకత్వం వహిస్తున్నారు. అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనననలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.కాగా సీఎం, విజయ్ సినీనటి త్రిషపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమిళనాడులో ఉద్రిక్తకర పరిస్తితులు ఏర్పడ్డాయి.మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ డీఎంకే కేంద్రకార్యాలయానికి చేరుకున్నారు. ఉదయనిధి అరెస్టుపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు మరికాసేపట్లో విచారించనున్నట్లు సమాచారం.పార్లమెంటులో చర్చకాగా ఉదయనిధి అరెస్టు అంశం ఉదయనిధి అరెస్టుపై పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. తమిళనాడులో భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆ పార్టీ ఎంపీ తిరిచ్చి శివ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయన్నారు. అయితే లా అండ్ అర్డర్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశంమని రాజ్యసభ స్పీకర్ బదులిచ్చారు. 🚨🇮🇳 #BREAKING — DMK cadres staged a protest in Thanjavur, condemning the arrest of opposition leader Udhayanidhi Stalin.Protesters also burned an effigy of Chief Minister Vijay during the demonstration.#TamilNadu #DMK #Thanjavur #UdhayanidhiStalin pic.twitter.com/G3qUtWQGUm— WarPolitics (@TheWarPolitics0) August 4, 2026 -
అరెస్టుపై ఉదయనిధి ఫస్ట్ రియాక్షన్
-
DMK ఉదయనిధి అరెస్ట్
-
అభిజీత్ దీప్కే అరెస్ట్కు రంగం సిద్ధం?
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై ఢిల్లీ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పూణె, ఔరంగాబాద్లలో తనపై జరిగిన దాడి వెనుక అభిజీత్ దీప్కే మనుషుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించి, దీప్కేను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఫైజాన్ అన్సారీ మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అభిజీత్ దీప్కే తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఎవరూ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకుని, ఢిల్లీలో ఉద్రిక్తతలు తలెత్తకుండా అడ్డుకున్న ఢిల్లీ సీఎం, పోలీసుల చొరవను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.మరోవైపు, అభిజీత్ దీప్కే ఈ ఆరోపణలను ఖండించారు. తమ సంస్థ ఏ ఒక్క ప్రత్యేక రాజకీయ పార్టీని విమర్శించడానికి లేదా సమర్థించడానికి మాత్రమే పనిచేయదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ తమ సంస్థ విద్యార్థుల గొంతుకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రి ఏ పార్టీకి చెందినవారైనా విద్యార్థుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.ఇది కూడా చదవండి: గేదె లేదని పులులకు మేక మాంసం.. షాకిచ్చిన ఖర్చు! -
బంగ్లాదేశ్ ముఠా అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: బంగ్లాదేశ్ దొంగల ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. తొమ్మిదేళ్లుగా నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఆ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా ఇళ్లలో, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడింది. ఇటీవల ఆదిలాబాద్ సమీపంలోని మావల మండలం కైలాస్నగర్లో గల ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో చోరీకి పాల్పడింది. వీరి నుంచి రూ.8 లక్షల విలువైన 73.5 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, ఐఫోన్లు, ఐప్యాడ్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.బంగ్లాదేశ్లోని దీనజ్పూర్ జిల్లా పర్బత్పూర్కు చెందిన మహ్మద్ జాని అలీ, మహ్మద్ రుమాన్ ప్రస్తుతం రాజస్తాన్లోని జైపూర్లో గల ఔట్సైడ్ చార్ దర్వాజాలో ఉంటున్నారు. వీరితోపాటు మధ్యప్రదేశ్లోని భూపాల్లో గల బోగ్మోలియకు చెందిన తరుణ్ సింగ్ 2015 నుంచి రాజస్తాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా జూలై 11న బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించిన తర్వాత సహచరులతో కలిసి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది.వీరు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్టు నటిస్తూ రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్టు విచారణలో వెల్లడైంది. మహ్మద్ జాని అలీ కొన్నేళ్లుగా 12సార్లు బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించినట్టు తెలిపారు. భారత్లో నివసించేందుకు సహకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు, వివిధ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, మావల సీఐ ప్రేమ్కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వేశ్వర్ రెడ్డిని బలవంతంగా ఎత్తుకెళ్లిన పోలీసులు
-
విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..
-
ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్
-
రాడ్లు, కత్తులతో టీడీపీ నేతల దాడి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్..
-
జంతర్ మంతర్ వేదికగా విధ్వంసానికి పాక్ ప్లాన్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసనల్లో పోలీసుల వేషధారణలో చొరబడి అల్లర్లు సృష్టించాలనేది ఈ ఉగ్రవాద కుట్ర ప్రధాన లక్ష్యమని ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శర్మ తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి కదలికలపై నిఘా ఉంచాలని, రక్షణ లేని ప్రాంతాల వివరాలు సేకరించాలని పాకిస్థాన్ హ్యాండ్లర్లు హమిమ్ను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని కోర్టు 14 రోజుల ఎస్టీఎఫ్ కస్టడీకి అప్పగించింది.మరోవైపు, హమిమ్ ప్రియురాలు అర్పితా సర్కార్ను శుక్రవారం జార్ఖండ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. షాజాద్ భట్టీ గ్యాంగ్కు చెందిన పాకిస్థాన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వీరిద్దరూ ఈ కుట్రకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, ప్రముఖులను హానీట్రాప్ చేసి, వారి నుంచి రహస్య సమాచారం రాబట్టడంలో అర్పితా సర్కార్ సిద్ధహస్తురాలని పోలీసుల విచారణలో తేలింది. రాష్ట్ర మంత్రి ఉమేష్ రాయ్ కుమారుడిని హానీట్రాప్ చేసి కిడ్నాప్ చేయడానికి, కుటుంబం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడానికి వారు ప్లాన్ చేశారు.నిందితుల వద్ద నుంచి బ్రిటన్, మెక్సికో దేశాలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ హ్యాండ్లర్లు రానా, ఉజైర్, అబిద్ జాట్, హమాద్లతో ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా వీరు సంభాషణలు జరిపినట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది. సోషల్ మీడియా ద్వారా రాడికలైజ్ అయిన వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రేమలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి ఉగ్రమూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ‘పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణాలే తీశారు’ -
కాపాడాల్సిన పోలీసే కాటేశాడు..!
వరంగల్ క్రైం: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ కటకటలపాలయ్యాడు. ఈమేరకు శుక్రవారం సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014 బ్యాచ్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్. సోషల్ మీడియా వేదికగా మహిళలతో పరిచయం పెంచుకుంటూ.. వారిని మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. 2025లో ఫేస్ బుక్ ద్వారా శ్రీకాంత్ ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఆమెతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. అతడు జమ్మికుంటలో పనిచేస్తుండగా ఆమె వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనంతరం బాధితురాలి వ్యక్తిగత ఫొటోలతో బెదిరించడం, వీడియో కాల్స్ ద్వారా అసభ్యకరంగా వేధించి, డబ్బులు వసూలు చేశాడు. ఇచ్చిన డబ్బులు అడిగితే బెదిరించాడు. ఈమేరకు బాధితురాలు హనుమకొండలోని సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ కొనసాగుతుండగా.. నాలుగు నెలల నుంచి నిందితుడు అరెస్ట్కు భయపడి గోవా, హైదరాబాద్, నిజామాబాద్ పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ తిరిగినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ వెల్లడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చివరికి సిమ్కార్డులు కూడా ధ్వంసం చేసి వై–ఫై ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించాడు. సాంకేతిక «ఆధారాలు, విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా, హనుమకొండ మూడో అదనపు కోర్టు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్కు తరలిస్తున్న ట్లు ఉత్తర్వులు జారీ చేశారని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
సువేందు పీఏ కేసులో బీజేపీ కార్యకర్తల అరెస్ట్!?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణంలో కేసు దర్యాప్తు కొనసాగగా.. తాజాగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలనే సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.అరెస్టైన వారిని సాగర్ సోంకర్, సాహెబ్ సోంకర్గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, గతంలో చంద్రనాథ్ రథ్ టీమ్లో పనిచేసిన వారేనని సీబీఐ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీళ్లు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. హత్యకు ముందు రెక్కీ నిర్వహించడం, దాడికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, షూటర్లతో మాట్లాడుకుని ప్లాన్ చేయడం వీళ్లిద్దరి పనేనని గుర్తించారు. అయితే హత్యకు అసలు కారకులు ఎవరు? కారణం ఏంటి? అనేది ఇంకా తేలాల్సి ఉంది.సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.హత్యకు ముందే వ్యూహం?సీబీఐ దర్యాప్తులో భాగంగా హత్యను పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ముందుగానే షూటర్లను ఎంపిక చేయడం, వారికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఘటనకు ముందు ప్రాంతాన్ని పరిశీలించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది. బీజేపీ కార్యకర్తలే ఎందుకు అనుమానితులు?తాజా పరిణామాల్లో ప్రధాన అంశం.. అరెస్టైన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు కావడం. వీరు ఒకప్పుడు చంద్రనాథ్ రథ్తో కలిసి పనిచేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా వీరికి ప్రత్యర్థి రాజకీయ వర్గాలతో కూడా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజకీయ విభేదాలా? వ్యక్తిగత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం వాళ్లు గతంలో సువేందు టీఎంసీలో ఉన్నప్పుడు.. చంద్రనాథ్ రథ్ టీంలో పని చేశారని అంటున్నారు. అప్పట్లో సువేందు ఆరోపణలు.. చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.కొత్త మలుపు.. అసలు కుట్రదారులు ఎవరు?తాజా అరెస్టులతో చంద్రనాథ్ రథ్ హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు రాజకీయ కుట్ర కోణం, మరోవైపు సొంత వర్గంలో ఉన్న వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం.. కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. -
కెనడా: వేధింపుల కేసులో పంజాబ్ యువకుడు అరెస్ట్!
బర్లింగ్టన్: కెనడాలోని బర్లింగ్టన్లో ఉబర్ డ్రైవర్గా పనిచేస్తున్న పంజాబ్కు చెందిన మన్దీప్ సింగ్ (25) లైంగిక దాడి ఆరోపణలపై అరెస్టయ్యాడు. హాల్టన్ ప్రాంతీయ పోలీసు సేవల (హెచ్ఆర్పీఎస్)వివరాల ప్రకారం, గత నెల జూన్ 16న సాయంత్రం 5:15 గంటలకు బర్లింగ్టన్ గో స్టేషన్ పార్కింగ్ స్థలంలో ఈ సంఘటన జరిగింది. మన్దీప్ సింగ్ బాధితురాలితో మాట్లాడే సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి మహిళ వెంటనే పారిపోవడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆమెను సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం వరకు వెంబడించి రెండోసారి కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.ఈ సంఘటనలో బాధితురాలికి ఎలాంటి శారీరక గాయాలు కాకపోయినప్పటికీ, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు దర్యాప్తును చైల్డ్ అబ్యూజ్ అండ్ సెక్సువల్ అసాల్ట్ యూనిట్ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఎటోబికోక్ నివాసి అయిన మన్దీప్ సింగ్ను జూలై 26న పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై లైంగిక దాడి అభియోగాలను మోపి, మిల్టన్లో బెయిల్ విచారణ నిమిత్తం అదుపులో ఉంచారు. నేరం జరిగిన సమయంలో నిందితుడు ఉబర్ డ్రైవర్గా పనిచేస్తున్నందున, మరికొందరు బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరారు. -
ఇవాళే డెడ్లైన్! కేంద్రానికి సీజేపీ మరో వార్నింగ్
నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరోసారి ఉత్కంఠకు దారితీస్తోంది. కేంద్రంతో చర్చల అనంతరం ఆందోళనను విరమించిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు ఆ హామీలు అమలు కావడం లేదని ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో కేంద్రానికి మరోసారి అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేరుస్తూ ఇవాళ గనుక రాతపూర్వక హామీ ఇవ్వకుంటే.. మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించింది. నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జులై 25న తాత్కాలికంగా ముగిసింది. అదే సమయంలో ఈ నిరసనలకు మద్దతుగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యమించారు. అయితే వాళ్లపైనా ఆయా చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నీట్ నిరసనలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మళ్లీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో జరిగిన చర్చల్లో.. నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇచ్చారని సీజేపీ పేర్కొంది. ఆ తర్వాత కూడా బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల అరెస్టులు కొనసాగుతున్నాయని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారంటూ ఆరోపించింది.‘‘హామీ ఉల్లంఘిస్తే నమ్మకద్రోహమే’’సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు కేంద్రానికి డిమాండ్లు పెట్టారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చిన హామీలపై లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు కాకపోతే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చర్చలను నమ్మి ఉద్యమాన్ని విరమించారని.. ఇప్పుడు మాట తప్పడం లక్షలాది మంది యువత నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.వార్నింగ్ ఎఫెక్ట్.. బిహార్ ప్రభుత్వ హామీసీజేపీ హెచ్చరికల తర్వాత బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 26 సాయంత్రం 6 గంటల వరకు నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది. అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేస్తామని, భవిష్యత్తులోనూ వారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది.బిహార్లో నిరసనల సందర్భంగా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. మొత్తం 335 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆందోళనల సమయంలో హింస, ఆస్తుల నష్టం, పోలీసులపై దాడుల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.ఏకే-47 ఘటనపై దుమారంబిహార్లోని సివాన్లో నిరసనల సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. జేపీ చౌక్ వద్ద భారీగా చేరుకున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఆందోళనల్లో మొత్తం 694 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో 339 మందిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసనల్లో పోలీసు అధికారులు సహా 91 మంది గాయపడ్డారని, 14 ప్రభుత్వ వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.బెంగాల్లోనూ కేసులు.. 16 మంది అరెస్టుఇటు పశ్చిమ బెంగాల్లో నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోల్కతాలోని డొరినా క్రాసింగ్ వద్ద అనుమతి లేకుండా గుమిగూడి, పోలీసులపై రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరారని పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుల ఉపసంహరణపై బెంగాల్ ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కొన్ని కేసుల విషయంలో నేరుగా ఉపసంహరణ సాధ్యం కాకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.అసోంలోనూ అరెస్టులు.. కేసుల ఉపసంహరణకు నిర్ణయంఅసోంలోనూ నిరసనలకు సంబంధించి చర్యలు తీసుకున్నారు. ప్రజా శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణలతో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. లఖింపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ద్వారా నిరసనకు మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే.. సీజేపీ హెచ్చరికల నేపథ్యంలో అసోం ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన ఐదు కేసులను ఉపసంహరించేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అరెస్టైన 13 మందిని విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలిపింది. నిరసనల్లో పాల్గొన్న వారిపై భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చట్టపరమైన చర్యలు ఉండవని స్పష్టం చేసింది.ఢిల్లీ, మధ్యప్రదేశ్లో సోషల్ మీడియాపై నిఘాఇదిలా ఉండగా.. నిరసనల సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపినట్లు సమాచారం. మధ్యప్రదేశ్లోని నివారీ జిల్లాలో ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్పై మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ, ఢిల్లీ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది.ముంబైలో కొనసాగుతున్న పోలీసుల నోటీసులుసీజేపీ ప్రకటన తర్వాత కూడా.. ముంబైలో కొంతమంది నిరసనకారులకు పోలీసుల నోటీసులు కొనసాగుతున్నాయి. కేసుల దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే నోటీసులు ఇస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అధికారికంగా కేసుల ఉపసంహరణ ఉత్తర్వులు వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.విద్యార్థుల న్యాయ పోరాటానికి సిబల్ చేయూతనీట్ నిరసనల్లో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ముందుకొచ్చారు. సీజేపీ ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ ఫండ్కు రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయవాదులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.పైన పేర్కొన్న రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సహా పలు ప్రాంతాల్లో నీట్ నిరసనలకు సంబంధించి కేసులు, అరెస్టుల ప్రక్రియ కొనసాగింది. అయితే కేవలం ప్రకటనలతోనే ఈ వివాదం ముగిసిపోతుందా? కేసుల ఉపసంహరణ, అరెస్టయిన విద్యార్థుల విడుదల అంత సులువైన ప్రక్రియేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు, దర్యాప్తు దశలో ఉన్న కేసులు, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు కీలకంగా మారాయి.తమ డిమాండ్లు నెరవేరకపోతే మళ్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు దిగుతామని సీజేపీ స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయి? విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? లేక ఈ వ్యవహారం మరోసారి దేశవ్యాప్త ఉద్యమానికి దారితీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేంద్రం తదుపరి చర్యలపైనే నీట్ ఉద్యమం భవిష్యత్ ఆధారపడి ఉంది. -
జంటహత్యల కేసులో నిందితుల అరెస్టు
కృత్తివెన్ను: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మామాఅల్లుళ్లను హతమార్చిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బందరు డీఎస్పీ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. జూన్ 27వ తేదీ రాత్రి పాతగొడవల నేపథ్యంలో చినగొల్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన మామాఅల్లుళ్లు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పను దారుణంగా హత్యచేశారు. అదే గ్రామానికి చెందిన శంకరపు శ్రీనుకు సుబ్బన్న, అయ్యప్పలతో చేపలవేట వద్ద ఘర్షణ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీను అదే గ్రామానికి చెందిన జల్లా నాగరాజు, గుడివాడకు చెందిన నలుగురు స్నేహితుల సహకారంతో సుబ్బన్న, అయ్యప్పలపై కర్రలు, రాడ్డు, కత్తితో దాడిచేశారు. వారిద్దరినీ హతమర్చారు. అనంతరం మృతదేహాలను వారి ద్విచక్ర వాహనానికే కట్టి నీటిలో పడేశారు. కంకిపాడు సీఐ బి.బి.రవికుమార్, ఆర్పేట సీఐ కె.ఏసుబాబు, పెడన సీఐ నాగేంద్రప్రసాద్ మూడు బృందాలుగా ఏర్పడి దాదాపు నెలరోజుల పాటు సాంకేతిక అంశాల సాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు హత్యచేసింది శంకరపు శ్రీను, జల్లానాగరాజు, పెదఎరుకపాడుకు చెందిన కటికల కల్యాణ్, అబ్బూరి విజయరత్నం (దాస్), యలవర్తిపాడుకు చెందిన డొక్కుమాల శ్రీకాంత్, గుడివాడ కార్మికనగర్కు చెందిన అబ్దుల్ఖాదర్జిలానీ అని గుర్తించారు. ఈ నెల 26వ తేదీ రాత్రి లక్ష్మీపురం సెంటర్లో ఉండగా వారందరినీ పెడన సీఐ నాగేంద్రప్రసాద్, కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఒక కారు, ద్విచక్రవాహనం, ఏడు మొబైల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఇనుపరాడ్డు, కర్రను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నెలరోజులపాటు ఎంతో శ్రమించి కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్నాయుడు అభినందించారు. అధికార పార్టీ అండతోనే.. జంటహత్యల కేసులో నిందితులు అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. చినగొల్లపాలెంకు చెందిన నిందితులు ఆ పార్టీకి అత్యంత సానుభూతి పరులు. ఈ కారణంగానే హత్య జరిగినప్పటి నుంచి స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకులు నిందితులు శ్రీను, నాగరాజు, కటికల కల్యాణ్ను రక్షించేందుకు అనేక యత్నాలు చేశారని ప్రచారం జరుగుతోంది. శ్రీనుతో పాటు నాగరాజును అనుమానించిన పోలీసులు కొద్ది రోజుల క్రితం విచారణ పేరుతో తీసుకెళ్లారు. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అనంతరం వారిని వదిలేశారని సమాచారం. చివరికి అసలు నిందితులు వారే కావడంతో అరెస్టు చేయక తప్పలేదని తెలుస్తోంది. -
‘నన్ను అరెస్ట్ చేస్తారా?’.. మమ్దానీపై విరుచుకుపడ్డ నెతన్యాహు
వాషింగ్టన్/జెరూసలేం: అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం (ఐసీసీ) జారీ చేసిన అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి (యూఎన్జీఏ)హాజరైతే అరెస్టు చేస్తామంటూ న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్దానీ వ్యాఖ్యలు సమాజంలో ద్వేషాన్ని నూరిపోసేలా ఉన్నాయని ఆరోపించారు. మేయర్గా ఉన్న వ్యక్తి యూదులు, క్రైస్తవులు, ముస్లింలతో సహా పౌరులందరికీ ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.‘ఫాక్స్ న్యూస్’ ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘మమ్దానీ తీరు వల్ల ప్రస్తుతం యూదు అమెరికన్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, సెప్టెంబరు 8న ప్రారంభమయ్యే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి నేను హాజరై, ఇజ్రాయెల్ తరఫున, ఇజ్రాయెల్-అమెరికా భాగస్వామ్యం తరఫున సత్యాన్ని చాటిచెబుతాను’ అని స్పష్టం చేశారు. ఐసీసీ తనపై మోపిన యుద్ధ నేరాల ఆరోపణలను ఆయన ‘న్యాయ ప్రక్రియకే వికృత రూపం’ అని అభివర్ణించారు. ఆ కోర్టుకు ఇజ్రాయెల్ లేదా అమెరికాపై ఎటువంటి అధికార పరిధి లేదని, అది ఒక ‘కంగారూ కోర్టు’ అని కొట్టిపారేశారు.గాజా యుద్ధంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 2024 నవంబరులో నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్లపై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అంతర్జాతీయ చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలని, ఈ వారెంట్ను తీవ్రంగా పరిగణించాలని మమ్దానీ పేర్కొనగా, నెతన్యాహు అరెస్టు కాకుండా చూస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. గాజాలో నెరపిన మిలిటరీ చర్యలపై వచ్చిన అన్ని ఆరోపణలను, ఐసీసీ పరిధిని ఇజ్రాయెల్ ఇప్పటికే తోసిపుచ్చింది.ఇది కూడా చదవండి: ఎన్డీఏ పాలనలో విద్యాశాఖ వివాదాలు -
చంద్రబాబు సర్కార్ కు బిగ్ షాక్.. ఎకోరెన్ బాస్ అరెస్ట్
-
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ సూత్రధారి.. బిహార్లో దొరికాడు
గత కొంతకాలంగా పరారీలో ఉన్న మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు బిజేంద్ర గుప్తా ఎట్టకేలకు మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. బీహార్లో అదుపులో తీసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అతడు బీహార్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గుప్తా భార్యతో పాటు మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుప్తా మాత్రం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం పరారీలో ఉండటంతో మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలించారు. పేపర్ లీక్ రాకెట్తో బిజేంద్ర గుప్తా భార్యకు కూడా సంబంధం ఉందని.. సిండికేట్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఈమె సమక్షంలోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, పాట్నాలలో ఆస్తుల కొనుగోలుపై దర్యాప్తు చేస్తున్నారు.బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా అనేక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులతో బిజేంద్ర గుప్తాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.జూన్ 28న జరగాల్సిన మహారాష్ట్ర టెట్ పరీక్షకు ముందు థానేలోని కొంగావ్ ప్రాంతంలో లీకైన ప్రశ్నపత్రాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఆకాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధీరజ్ సింగ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ పరీక్షను వాయిదా వేసింది. ఆరు లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు బిజేంద్ర గుప్తాను ట్రాన్సిట్ రిమాండ్పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. -
శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. చింతాడ రవి అరెస్ట్
-
అనంతపురంలో హైటెన్షన్.. విద్యార్థులు అరెస్ట్
-
సీదిరి అప్పలరాజు అరెస్ట్ పై YSRCP మహిళా నేతలు ఫైర్
-
ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయం చేయడానికి సిగ్గుగా లేదా చంద్రబాబు..
-
సీదిరి అప్పలరాజు అరెస్ట్.. YSRCP నేతలు సీరియస్ వార్నింగ్
-
కొడుకు ఆక్సిడెంట్ చేయడం ఏంటి.. తండ్రిని అరెస్ట్ చేయడం ఏంటి
-
సీదిరి అప్పలరాజు అరెస్ట్ పై వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్
-
సీదిరి అప్పలరాజు అరెస్ట్ పై భార్య రియాక్షన్
-
ప్రశ్నించే నాయకుల గొంతునొక్కాలన్న కుట్ర!
‘‘అరెస్టులతో వైఎస్సార్సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది.’’ ‘‘ఒక వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా?’’ ‘‘చంద్రబాబు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే?’’ సాక్షి, అమరావతి: ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వం నీచంగా దిగజారిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరెస్టులతో తమ పార్టీని భయపెట్టలేరని, ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియాలో రాయించిందే ఆ తర్వాత కేసులా మారిపోతోందని, రాష్ట్రంలో నడుస్తున్న కొత్త చట్టవ్యవస్థ ఇదేనని జగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ నేపధ్యంలో బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా జగన్ స్పందించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అరెస్టుల వెనుక కుట్ర ‘‘అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై, యాక్సిడెంట్కు సంబంధించిన సెక్షన్లు కాకుండా, ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి, రిమాండ్కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైఎస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజుగారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? మరి, టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా? టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే, మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర. నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం దుర్మార్గం సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైఎస్సార్సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆవ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు, ఇది అన్యాయం కాదా? అరెస్టులతో భయపెట్టలేరు అరెస్టులతో వైఎస్సార్సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. చంద్రబాబూ..అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం..వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు.’’ అని జగన్ పేర్కొన్నారు. -
సీదిరి అప్పలరాజు అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,అమరావతి: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుప్రమాదాన్ని కక్షసాధింపు కోసం వాడుకోవడంపై ఫైరయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం నీచంగా దిగజారిపోయిందని సీదిరి అప్పలరాజు చేసిన తప్పేంటని చంద్రబాబు అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరపున నిలబడడమా? డాక్టర్గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబు తన రాజకీయ అజెండాను ఎల్లో మీడియాతో రాయించడం... ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్జగన్ మాట్లాడుతూ... సీదిరి అప్పలరాజు కుమారుడు కేవలం 18 ఏళ్ల కుర్రాడని బైక్ నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై యాక్సిడెంట్కు సంబంధించిన చట్టాలు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేశారు. ఆ పిల్లాడిని రిమాండ్కు పంపడం.. ఇప్పుడు ఏకంగా తన తండ్రిని కూడా అరెస్టు చేయడం. ఇవన్నీ చూస్తే ఆయనను రాజకీయంగా వేదించడమే చంద్రబాబు టార్గెట్గా మారింది. అని వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారన్నారు. వైఎస్సాఆర్సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గమన్నారు. ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆ వ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు?, ఇది అన్యాయం కాదా? అని ప్రశ్నించారుకూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టలేదని . ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబూ.. అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం.. వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు. అని కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేశారు. -
ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ని అరెస్ట్ చేసింది. భారీ స్థిర, చర ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. రూ.400 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.10 అపార్ట్మెంట్లలో రూ.20 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. శేరిలింగంపల్లి, కూకట్పల్లిలో పాట్లను గుర్తించారు. ఆంజనేయనగరంలో జీప్లస్ త్రీ కమర్షియల్ భవనం, బేగంపేటలో జీప్లస్ 5 కమర్షియల్ భవనాన్ని అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భార్య పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు కూడా గుర్తించారు. 2 కిలోల బంగారం, బ్యాంక్ ఖాతాల్లో రూ.52 లక్షలు ఫ్రీజ్ చేశారు. మొత్తం తొమ్మిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
పొరేల్ అరెస్ట్కు రంగం సిద్ధం!
కోల్కతా: బెంగాల్ క్రికెటర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ పొరేల్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఒక రేప్ కేసులో నిందితుడిగా 24 ఏళ్ల పొరేల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని మొబైల్ ఫోన్ తదితర ఎల్రక్టానిక్ వస్తువులను వెంటనే సీజ్ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పొరేల్ బయటపెట్టే ప్రమాదం ఉండటంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పొరేల్ ఎక్కడున్నా అతడిని అదుపులోకి తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. గత నెలలో రేప్ ఆరోపణలతో మోగ్రా పోలీస్ స్టేషన్లో పొరేల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటాననే హామీతో పొరేల్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని... తమ ఇద్దరికి సంబంధించి వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి ఇప్పుడు బెదిరిస్తున్నాడని ఒక అమ్మాయి ఫిర్యాదు చేసింది. 2023 నుంచి తమ మధ్య సంబంధం ఉందని ఆమె పేర్కొంది. -
నెతన్యాహు అరెస్టుకు మమ్దానీ కసరత్తు!
న్యూయార్క్: సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ నగరానికి వస్తే, ఆయన్ని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) యుద్ధ నేరాల ఆరోపణలు మోపిన నెతన్యాహును అరెస్టు చేసే అధికారం తనకు ఉందో లేదో తెలుసుకోవడానికి నగర న్యాయ విభాగంతో చర్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ విషయమై ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమ్దానీ మాట్లాడుతూ ‘నెతన్యాహు ఒక యుద్ధ నేరస్థుడు, ఆయన హేగ్లో ఉండాల్సిన వ్యక్తి. ప్రస్తుతం చట్టం తనకు కల్పించిన అధికారాల పరిధిలోనే చర్యలు తీసుకుంటాం. ఈ అరెస్టు కోసం కొత్త చట్టాలేవీ తీసుకురావడం లేదు’ అని స్పష్టం చేశారు. నెతన్యాహు అరెస్టు కోసం న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించే అధికారం తనకున్నదో లేదో స్పష్టత కోసం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.గతంలో కూడా ఇజ్రాయెల్ను ‘అపార్థీడ్ (వర్ణవివక్ష) పాలన’ అని అభివర్ణించిన మమ్దానీ, ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్లను అమలు చేసేలా పోలీసులను ఆదేశిస్తానని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు నెతన్యాహు బాధ్యత వహించాల్సి ఉందని ఐసీసీ గతంలోనే పేర్కొంది. -
నిందితుడి అరెస్టుకి 'మమ్మీ–డాడీ’ టాటూనే కీలక ఆధారం..
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్తో సంబంధాలున్నట్లు నమ్మించి, ఫారెక్స్ వ్యాపారికి చెందిన ముగ్గురు ఉద్యోగులను మోసం చేసి, ముంబైలో నిర్భంధించిన ఓ ముఠా వారి యజమాని నుంచి రూ.55 లక్షలు వసూలు చేసింది. ఆ మొత్తాన్ని హైదరాబాద్లోని తన అనుచరుడికి ఇచ్చేలా చేసి బందీలను వదిలి పారిపోయి వచ్చింది. దీనిపై ముంబైలోని వకోల పోలీసుస్టేషన్లో కేసు నమోదు కాగా... దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ యూనిట్–8 అధికారులు సోమవారం హైదరాబాద్లో దాడులు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మంగళవారం ముంబైకి తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముంబైతో పాటు సిటీలోనూ గాలిస్తున్నారు. ఈ కేసు కొలిక్కి రావడానికి ఓ నిందితుడి చేతిపై ఉన్న ‘మమ్మీ–డాడీ’ టాటూనే కీలక ఆధారమైంది.బాలీవుడ్ ఫైనాన్సియర్లుగా నమ్మించి...ఢిల్లీకి చెందిన మయాంక్ శర్మ అలియాస్ లడ్డూ కొన్నేళ్లుగా ముంబైలో ఉంటున్నాడు. తాను బాలీవుడ్కు చెందిన ఫైనాన్సియర్ కృష్ణగా వకోల ప్రాంతానికి చెందిన ఫారెక్స్ వ్యాపారిని పరిచయం చేసుకున్నాడు. దేశవిదేశాల్లో జరిగే షూటింగ్స్ను అవసరమైన నగదు అందిస్తూ ఉంటానని, తనతో కలిసి పని చేస్తే భారీ లాభాలు ఉంటాయని చెప్పాడు. ఫారెక్స్ వ్యాపారి ఇది నమ్మడంతో ఈ నెల 8న అతడిని సంప్రదించిన మయాంక్ హైదరాబాద్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతోందని, దాని నిర్మాతకు అక్కడ రూ.55 లక్షలు ఇవ్వాల్సి ఉందని చెప్పాడు. ఆ మొత్తాన్ని తాను ముంబైలో అప్పగిస్తానని నమ్మబలికాడు. దీనికి అంగీకరించిన వ్యాపారి ముంబైలో నగదు తీసుకునే బాధ్యతల్ని తన ఉద్యోగి ఖుష్పాల్ మోహన్ సింగ్కు అప్పగించాడు.ఓ ఫ్లాట్లో నిర్భంధించి, బెదిరించి...ఈ నెల 9న ఖుష్పాల్ను సంప్రదించిన మయాంక్ ఆ రోజు మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు కలీనా ప్రాంతంలోని సీఎస్టీ రోడ్డులో ఉన్న నవరత్న భవనానికి రావాలని సూచించాడు. అందులోని రూమ్ నం.901లో తాను బస చేశానని, వస్తే రూ.55 లక్షలు ఇస్తానని, వెంటనే హైదరాబాద్లో డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు దీనికి అంగీకరించిన ఖుష్పాల్ తన సహోద్యోగులు విక్రమ్, మహావీర్లతో కలిసి అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ తన అనుచరులు ఉత్తరప్రదేశ్కు చెందిన మజీద్ ఖాన్ అలియాస్ మన్ను, థానే నివాసి ఆకాశ్ అగర్వాల్ అలియాస్ కబీర్లతో కలిసి వేచి ఉన్న మయాంక్ ఆ ముగ్గురినీ నిర్భంధించాడు. ఇక్కడ రూ.55 లక్షలు ముట్టినట్లు తమ యజమానికి ఫోన్ చేసి చెప్పాలని, అలా కాకుంటే చంపేస్తామంటూ తుపాకీతో బెదిరించారు. దీంతో ఖుష్పాల్ అలానే చేశాడు.నగరానికి పారిపోయి వచ్చిన గ్యాంగ్...ఇది నమ్మిన ఫారెక్స్ సంస్థ యజమాని హైదరాబాద్లో వేచి ఉన్న ఇద్దరు మయాంక్ అనుచరులకు రూ.55 లక్షలు అందేలా చేశాడు. నగదు ముట్టినట్లు ఖరారు చేసుకున్న ఆ ముగ్గురూ బందీలను వదిలిపెట్టి హైదరాబాద్ పారిపోయి వచ్చేశారు. తన అనుచరుల నుంచి నగదు తీసుకుని, వారి కొంత ఇచ్చి ముంబై పంపేశారు. మయాంక్, మజీద్, ఆకాశ్ మాత్రం కొన్నాళ్లు షెల్టర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి ఓ గెస్ట్హౌస్లో బస చేశారు. ఖుష్పాల్ ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న ఫారెక్స్ వ్యాపారి దీనిపై వకోల పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఆ ఠాణాలో కేసు నమోదు కాగా... ఈ గ్యాంగ్ కోసం క్రైమ్ బ్రాంచ్ యూనిట్–8కు చెందిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ సాలుంఖే నేతృత్వంలోని టీమ్ దర్యాప్త చేపట్టింది.‘మమ్మీ–డాడీ’ టాటూని చూసి...ఈ బృందం నవరత్న భవనానికి వెళ్లి అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించింది. అందులో దుండగుల కదలికలు రికార్డు కాగా... ఆకాశ్ చేతిపై ఉన్న ‘మమ్మీ–డాడీ’ అనే టాటూని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గమనించారు. అతడిపై గతంలోనూ కొన్ని కేసులు ఉండటంతో అధికారులు వెంటనే అతడిని గుర్తించారు. ఎక్కడ ఉన్నాడనే అంశాన్ని సాంకేతికంగా ఆరా తీయగా హైదరాబాద్లో ఉన్నట్లు తేలింది. దీంతో సోమవారం సిటీకి చేరుకున్న ప్రత్యేక బృందం గెస్ట్హౌస్పై దాడి చేసి ఆకాశ్తో పాటు మయాంక్, మజీద్లను పట్టుకుంది. వీరిని మంగళవారం ముంబై తరలించి కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం పోలీసు కస్టడీకి ఇవ్వడంతో విచారిస్తోంది. పరారీలో ఉన్న అజీజుద్దీన్ ఖాన్, గంగా రాజీవ్ కోసం గాలిస్తున్నారు. -
చిరుతలను చంపిన వ్యక్తుల అరెస్టు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లాలో రెండు చిరుతలను చంపిన పదిమందిని అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. గురువారం ఆయన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భీమ్గల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మాలవత్ సంజీవ్ నెలక్రితం తన మేకల మందను అడవికి తీసుకువెళ్లగా చిరుత దాడిచేసి మేకను చంపింది. ఈ విషయం దేవక్కపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు తెలుసుకుని సంజీవ్తో మాట్లాడాడు. చిరుతను చంపి దాని శరీర భాగాలు అమ్ముకుంటే లక్షల రూపాయలు వస్తాయని ఆశచూపాడు. అనంతరం సంజీవ్ మేక కళేబరంలోకి సిరంజీ ద్వారా గడ్డిమందును ఎక్కించాడు. దానిని తిని చిరుత చనిపోయింది. సంజీవ్, రాములుతోపాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి దాని కళేబరాన్ని దాచిపెట్టి కొనుగోలుదారులు దొరికిన తర్వాత అమ్ముకుందామని నిర్ణయించారు. అయితే చిరుత కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించి విచారణ చేపట్టగా.. సిరిసిల్ల రాములు ఇంట్లో నాటు తుపాకీ లభించింది. చిరుతను చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారని, దీంతో సంజీవ్, రాములును రిమాండ్కు తరలించామని సీపీ తెలిపారు. ఇందల్వాయి ప్రాంతంలో మరో చిరుతను.. నిజామాబాద్ అటవీ డివిజన్ పరిధిలోని ఇందల్వాయి అటవీ క్షేత్రం అన్సన్పల్లి బీట్ పరిధిలో మూడు నెలల క్రితం చిరుతను వేటాడి చంపిన ఘటననూ పోలీసులు ఛేదించారని సీపీ తెలిపారు. వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకున్న చిరుతపులిని కొందరు వ్యక్తులు కొట్టిచంపారని పేర్కొన్నారు. నిందితులు చిరుత మృతదేహాన్ని ధర్పల్లి గ్రామ శివారులోని ఓ మామిడితోటకు తరలించి నాలుగు పంజాలను వేరుచేసి మిగిలిన శరీర భాగాలను సమీపంలోని బావిలో పడేశారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారని, మరొకరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. -
డ్రగ్స్ పార్టీ...! ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
-
అత్తపై ఫన్నీ రీల్.. కోడలికి ఊహించని షాక్!
తమిళనాడు: రీల్స్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టడం వల్ల గొడవ జరగడంతో భార్యపై దాడి చేసిన ఐటీ కంపెనీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. సేలంకు చెందిన శ్రీకాంత్ (24), అభిరామి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు చెన్నైలో నివసిస్తున్నారు. అభిరామి తన వాట్సాప్ స్టేటస్లో అత్తని కోడలు పని చేయమని పురమాయించేలా ఉన్న ఒక ఫన్నీ రీల్ను పోస్ట్ చేసింది. దీన్ని చూసిన శ్రీకాంత్ సోదరి అతనికి సమాచారం అందించింది.దీనిపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో అభిరామి తన పుట్టింటికి వెళ్లిపోయింది. జూలై 9న శ్రీకాంత్ అక్కడికి వెళ్లి మళ్లీ గొడవ పడి, ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అభిరామి ఆసుపత్రిలో చేరింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు. -
రష్యాను షేక్ చేస్తున్న ‘బోరిస్ నదెజ్దిన్’ ఎవరు?
మాస్కో: రష్యాలో పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న ప్రముఖ యుద్ధ వ్యతిరేక రాజకీయ నేత బోరిస్ నదెజ్దిన్ను రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో ‘తీవ్రవాద చిహ్నాలను’ ప్రదర్శించారనే ఆరోపణలపై అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఆ వీడియోలో దివంగత ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ ఫోటో ఉండటమే ఇందుకు కారణం.రాబోయే ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు మద్దతు కూడగడుతున్న తరుణంలో నదెజ్దిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ పరిపాలనను బహిరంగంగా విమర్శించడంతో 2024లో నదెజ్దిన్ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చారు. సోమవారం ఆయన తన టెలిగ్రామ్ ఖాతాలో ‘పోలీసులు వచ్చారు’ అని పోస్ట్ చేశారు. ఆ తర్వాత, 2023 వీడియో ఆధారంగా తనపై తీవ్రవాద చిహ్నాల ప్రదర్శన కేసు నమోదు చేసినట్లు ధృవీకరించే పత్రాన్ని ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఆయనను జైలుకు పంపుతారా లేదా దేశం నుండి బహిష్కరిస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు. కాగా ఈ అరెస్ట్కు మూడు రోజుల ముందు రష్యా అధికారులు ఆయనను విదేశీ ఏజెంట్గా ప్రకటించారు.ఎవరీ బోరిస్ నదెజ్దిన్?నదెజ్దిన్ దాదాపు 30 ఏళ్ల పాటు మాస్కో ప్రాంతంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. 1999 నుండి 2003 వరకు ‘యూనియన్ ఆఫ్ రైట్ ఫోర్సెస్’ (ఎస్పీఎస్)పార్టీ తరఫున రష్యా పార్లమెంట్ (స్టేట్ డుమా) సభ్యుడిగా సేవలందించారు. వరుస ఎన్నికల ఓటముల తర్వాత ఈ పార్టీ 2008లో రద్దయింది. 1990ల చివరలో ఆయన దివంగత ప్రతిపక్ష నాయకుడు బోరిస్ నెమ్త్సోవ్కు సలహాదారుగా, సెర్గీ కిరియెంకోకు సహాయకుడిగా పనిచేశారు. వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన రష్యా ప్రభుత్వ టెలివిజన్ టాక్ షోలలో తరచూ కనిపించారు. క్రెమ్లిన్ తనపై వచ్చే స్వల్ప ఉదారవాద విమర్శలను నియంత్రిత పద్ధతిలో వినిపించడానికి ఆయనను ఒక నిపుణుడిగా ఉపయోగించుకునేదని నివేదికలు చెబుతున్నాయి.పూర్తిగా మారిన వైఖరిఅయితే, 2023లో నదెజ్దిన్ వైఖరి పూర్తిగా మారింది. ఆయన అనూహ్యంగా పుతిన్కు వ్యతిరేకంగా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్పై పుతిన్ చేపట్టిన ప్రత్యేక సైనిక చర్య ఒక ఘోరమైన పొరపాటు అని పేర్కొంటూ యుద్ధ వ్యతిరేక నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన ప్రచారానికి సాధారణ రష్యన్ల నుండి ఊహించని మద్దతు లభించింది. ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడానికి వేలాది మంది ప్రజలు భారీ క్యూలలో నిలుచున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన దానికంటే రెట్టింపు సంతకాలను ఆయన సేకరించారు. అయితే ఒక నెల తర్వాత రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయన సమర్పించిన సంతకాలలో 15 శాతానికి పైగా సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన పోటీ చేయకుండా నిషేధించింది. తాజాగా జూలై 2026లో ఆయనను విదేశీ ఏజెంట్గా ముద్ర వేశారు.యూట్యూబ్లో విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ... ‘రష్యాలో పోటీ చేయడానికి సంతకాలు సేకరిస్తున్న ఏకైక స్వతంత్ర ప్రతిపక్ష అభ్యర్థిని నేనే. యుద్ధం వల్ల వస్తున్న పరిణామాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 25 ఏళ్లుగా పుతిన్ దేశాన్ని నడిపిస్తున్న తీరు మిలిటరైజేషన్ వైపు సాగుతోంది. ఈ మార్గం దేశాన్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఇది 1917 రష్యా విప్లవం లాంటి పరిస్థితులకు దారితీస్తుంది’ అని వ్యాఖ్యానించారు. రష్యాలో పార్లమెంటు ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరగనున్నాయి.ఇది కూడా చదవండి: 11 ఫ్లాప్లతో కెరీర్ క్లోజ్ అనుకున్న వేళ.. -
వైసీపీ అయితే లోపలేస్తావా..? నీకు టైమ్ దగ్గరపడింది లోకేశ్..! మాస్ వార్నింగ్
-
బద్రీనాథ్ విరాళాల చోరీ: సస్పెండైన ఉద్యోగి అరెస్ట్
డెహ్రాడూన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయ విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కీలక పురోగతి సాధించింది. బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ)కి చెందిన సస్పెండైన ఉద్యోగి ప్రమోద్ నౌటియాల్ను ‘సిట్’ సోమవారం అరెస్ట్ చేసింది. డెహ్రాడూన్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని, సుమారు గంటపాటు విచారించిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గోపేశ్వర్ కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరనున్నట్లు పోలీసులు తెలిపారు.జూలై 2న ఆలయ విరాళాల లెక్కింపు సమయంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై బీకేటీసీ ఇన్ఛార్జ్ టెంపుల్ ఆఫీసర్ యుధ్వీర్ పుష్పవాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బద్రీనాథ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆలయ సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా.. నిందితుడు నౌటియాల్ రూ.500, రూ.100 కరెన్సీ నోట్ల కట్టలు, బంగారు, వెండి నాణేలు, శాలిగ్రామ శిలలు, భక్తుల కానుకల కవర్లను అనుమానాస్పదంగా దాచడం, దొంగిలించడం బయటపడింది. లెక్కింపు గదికి, తన కార్యాలయానికి మధ్య నిందితుడు పలుమార్లు తిరిగినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైంది.మరోవైపు, తన సస్పెన్షన్ను, ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ నౌటియాల్ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని బీకేటీసీని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసుపై రాష్ట్ర పోలీసులు, ‘సిట్’తో పాటు గర్వాల్ కమిషనర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు జరుపుతున్నాయి.ఇది కూడా చదవండి: ‘కార్తికేయ’ నటుడి వ్యాఖ్యలపై మాజీ సీఎం ఫైర్! -
'బిగ్బాస్' ఫేమ్ వాటర్మెలన్ స్టార్ అరెస్ట్
తమిళనాట 'వాటర్మెలన్' స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దివాకర్ వివాదంలో చిక్కుకున్నాడు. గతేడాది జరిగిన తమిళ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొన్న ఇతడు.. రీసెంట్ టైంలో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)తన వీడియోల ద్వారా యూట్యూబ్ ఛానెల్కి చాలా ఆదాయం వస్తున్నందున, రూ.లక్ష డిమాండ్ చేస్తూ దివాకర్ బెదిరించాడనే ఆరోపణలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూ సంధర్భంగా జరిగిన గొడవలో దివాకర్.. ఖరీదైన కెమెరాని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. కంపెనీ తరఫున సంబంధిత ఆధారాలతో కిల్పాక్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా పోలీసులు, దివాకర్పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.మరోవైపు యూట్యూబ్ ఛానెల్ ఉద్యోగులు తనని అక్రమంగా ఓ గదిలో బంధించి, దాడి చేశారని చెబుతూ వీడియోలని సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతూ దివాకర్ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఇందులో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దివాకర్ కోరాడు. ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దివాకర్ తన వీడియోలో పేర్కొన్నాడు. ఆ విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో హీరో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి) -
మా ఫోన్లు లాక్కొని నాగార్జునను అరెస్ట్ చేశారు..
-
రెండేళ్ల క్రితం విమర్శించారని ఇప్పుడు కేసు
గుంటూరు రూరల్/సాక్షి, హైదరాబాద్: తన ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో వెనకడుగుపై ప్రశి్నస్తున్న వారిపై అక్రమ కేసులతో తీవ్ర కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. పొరుగు రాష్ట్ర సీఎంగా ఉన్న తన శిష్యుడి ప్రభుత్వం అండతో మరింతగా రెచ్చిపోతూ వేధింపులకు గురిచేస్తోంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం తెలంగాణ సీఎంను విమర్శించారనే నెపంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను ముప్పుతిప్పలు పెట్టేలా ఇప్పుడు వ్యూహం రచించింది.అక్కడ కేసు పెట్టించి, ఇక్కడికొచ్చి పట్టుకుపోయేలా స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ఆదివారం చెప్పాపెట్టకుండా వచ్చిన తెలంగాణ పోలీసులు.. నాగార్జున యాదవ్ను అదుపులోకి తీసుకుని గుంటూరు నల్లపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. ఆపై హైదరాబాద్ పురానాహవేలిలోని టాస్్కఫోర్స్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటలు నిర్బంధించారు. అనంతరం బేగంబజార్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఇలా ఒక్క రోజులోనే మూడు పోలీస్స్టేషన్లు తిప్పి తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంలో కర్త, కర్మ, క్రియ ఏపీ ప్రభుత్వమేనన్నది బహిరంగ రహస్యం. సివిల్ డ్రెస్లో వచ్చి లాక్కెళ్లారు గుంటూరులోని తన మామ ఇంట్లో ఉన్న నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్టు చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా, నోటీసులు సైతం ఇవ్వకుండా సివిల్ డ్రెస్లో వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తాము హైదరాబాద్ సిటీ బేగంబçజారు పోలీస్స్టేషన్ నుంచి వచ్చామని, అరెస్టు విషయంపై నల్లపాడు పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చామన్నారు. అయితే, విషయం తమకు స్పష్టంగా చెప్పాలని కుటుంబ సభ్యులు అడ్డుకోబోతే.. బూతులు తిడుతూ నాగార్జున యాదవ్ను లాక్కెళ్లారని ఆయన భార్య వాపోయారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇంతగా దౌర్జన్యం చేస్తూ.. వేధిస్తారా అని ఆమె మండిపడ్డారు. వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందనలేదని నాగార్జున మామ అన్నారు. తెలంగాణ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఆయన్ను అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. టీపీసీసీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో బేగంబజార్ పోలీసులు బీఎన్ఎస్లోని 192, 352, 353 (1), 353 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాగార్జున యాదవ్ను సోమవారం న్యాయస్థానంలో హాజరు పరుస్తామని ఓ అధికారి తెలిపారు. అయితే, వచ్చిన వారు తెలంగాణ పోలీసులా లేక ఏపీ పోలీసులా అని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కనీసం మహిళ అని కూడా చూడకుండా నాగార్జున యాదవ్ భార్యను సైతం బూతులు తిట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
బేగం బజార్ పీఎస్కు నాగార్జున యాదవ్ తరలింపు
హైదరాబాద్, సాక్షి: అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో యర్రగొండపాలెం ఎంఎల్ఏ తాటిపర్తి చంద్రశేఖర్ బేగం బజార్ పీఎస్ వద్దకు చేరుకుని నాగార్జున యాదవ్ అరెస్ట్ను ఖండించారు. 41(ఎ) నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. నాగార్జున యాదవ్ను వెంటనే విడుదల చేయాలన్నారు.అలాగే నాగార్జున యాదవ్ అరెస్ట్ను మాజీ మంత్రి జోగి రమేష్ ఖండించారు. చంద్రబాబు బీసీలను వేధిస్తున్నారని, చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే అక్రమ అరెస్ట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలను అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారన్నారు. -
నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..
-
షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?
-
YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..
-
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగార్జున యాదవ్ని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు.. తెలంగాణ పోలీసులమంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాగార్జున యాదవ్ని పోలీసులు తీసుకెళ్లారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు.నాగార్జున యాదవ్ అరెస్ట్పై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రఘురాం, నాగార్జున యాదవ్ భార్య.. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. -
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్ల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ పరిధిలోని రోహిణి జిల్లా ప్రత్యేక పోలీసు దళం తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ముగ్గురు షూటర్లను అరెస్ట్ చేసింది. వీరు ఢిల్లీలో టార్గెట్ కిల్లింగ్కు పథక రచన చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పక్కా సమాచారం ముందుగా అందడంతో రోహిణి జిల్లా స్పెషల్ స్టాఫ్ వీరి కదలికలపై నిఘా ఉంచి, చివరకు అదుపులోకి తీసుకుంది.భారీ నేరానికి కుట్రవిదేశాల్లో ఉన్న నెట్వర్క్ ద్వారా ఈ షూటర్లకు ఆదేశాలు అందుతున్నాయని, వాటి ఆధారంగానే వీరు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని సమాచారం. ఢిల్లీలో గతంలో జరిగిన పలు నేరాల్లో ఈ షూటర్లు నిందితులుగా ఉన్నారు. గతంలోనూ వీరు నిర్దేశిత లక్ష్యాలపై కాల్పులు జరిపిన ఘటనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.అమెరికాలోనూ లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై నిఘాఇటీవలే అమెరికాలోనూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్పై అక్కడి దర్యాప్తు సంస్థలు గట్టి నిఘా పెట్టాయి. జూలై 7 నుంచి అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)ఈ ముఠాపై ‘ఆపరేషన్ హార్డ్ బాల్’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో పాటు, అతడి ప్రధాన అనుచరులైన గోల్డీ బ్రార్, జగ్గూ భగవాన్పురియా నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపడుతున్నారు.గోల్డీ బ్రార్పై నజరానాఅమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ గోల్డీ బ్రార్పై కఠిన చర్యలకు సిద్ధమైంది. సతీందర్జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అరెస్టుకు అవసరమైన సమాచారం అందించిన వారికి 50,000 డాలర్ల (సుమారు రూ. 43 లక్షలు) బహుమతిని అందజేస్తామని ప్రకటించింది. లారెన్స్ బిష్ణోయ్పై హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు వంటి అనేక కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతను జైల్లోనే ఉన్నప్పటికీ, అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. అతడి గ్యాంగ్లో పెద్ద సంఖ్యలో షూటర్లు ఉన్నారు. -
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకు అనర్హుడు..! ప్రశ్న రావణ్ పై పెట్టిన కేసు నిలవదు
-
అరెస్ట్కు కారణాలు తెలపాల్సిందేనా?
సాక్షి, న్యూఢిల్లీ: నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అందుకు గల కారణాలను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై స్పష్టతనిచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ విషయంలో గతంలో వెలువడిన తీర్పులు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో, చట్టపరమైన స్పష్టత కోసం ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశముందని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. మేఘాలయలో సంచలనం సృష్టించిన ‘హనీమూన్ మర్డర్’కేసులో నిందితురాలికిచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే.. మేఘాలయలో విహారయాత్రకు వెళ్లి భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి కింది కోర్టులు మంజూరు చేసిన బెయిల్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ల ధర్మాసనం ఎదుట మేఘాలయ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితురాలికి అరెస్ట్ కారణాలను ముందుగానే రాతపూర్వకంగా ఇచ్చామని, అయితే అందులో బీఎన్ఎస్ సెక్షన్ 103కి బదులుగా ఉనికిలో లేని సెక్షన్ 403 అని టైపింగ్ పొరపాటు జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఈ క్లరికల్ తప్పిదాన్ని సాకుగా చూపుతూ కింది కోర్టులు నిందితురాలికి బెయిల్ మంజూరు చేశాయని ఆయన వివరించారు.ఇది చాలా తీవ్రమైన కేసు సొలిసిటర్ జనరల్ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. అరెస్ట్కు కారణాలను లిఖితపూర్వకంగా ఇవ్వడంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో వైరుధ్యాలు ఉన్నాయని జస్టిస్ మనోజ్ మిశ్రా గుర్తు చేశారు. పంకజ్ బన్సాల్, డాక్టర్ రాజిందర్ రాజన్ కేసుల్లో అరెస్ట్కు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారని న్యాయమూర్తి ప్రస్తావించారు. కానీ, విహాన్ కుమార్ కేసులో మాత్రం అరెస్ట్ కారణాలు తెలియజేస్తే సరిపోతుందని, లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుల మధ్య ఉన్న వైరుధ్యాన్ని పరిష్కరించేందుకు, అవసరమైతే కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తామని స్పష్టం చేసింది. అలాగే, నిందితులను అరెస్ట్ చేసేటప్పుడు కేవలం సెక్షన్లు నమోదు చేయడం మాత్రమే కాకుండా, ఏ నేరం కింద అరెస్ట్ చేస్తున్నారనే పూర్వాపరాలను స్పష్టంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. భర్తను హత్య చేసిన ఈ ఉదంతాన్ని తీవ్రమైన కేసుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ప్రణాళిక ప్రకారం భర్తను మేఘాలయను తీసుకెళ్లి చేసిన హత్య. భర్తను చంపి, మృతదేహాన్ని లోయలోకి తోసేయడం అత్యంత తీవ్రమైన నేరమని వ్యాఖ్యానించింది. పిటిషన్పై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈలోగా అరెస్ట్ సమయంలో నిందితురాలికి అందించిన అసలైన పత్రాలకు సంబంధించిన స్పష్టమైన కాపీలను దాఖలు చేయాలని మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 3వ తేదీన సోనమ్కు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ శీల్ నాగుల ధర్మాసనం కొట్టివేయడం తెల్సిందే. -
తోపుదుర్తికి ప్రాణహాని.. అన్నకు ఏమైనా అయితే రక్తపాతం రక్తపాతం చూస్తారు...
-
రాప్తాడులో హైటెన్షన్ తోపుదుర్తి అరెస్ట్
-
మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అరెస్ట్
-
జైల్లో ప్రశ్న రావణ్ ఇప్పటికి కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు.. ఎందుకంటే..
-
ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం.. ప్రశ్న రావణ్ అరెస్ట్ పై కొడలి నాని స్ట్రాంగ్ రియాక్షన్
-
రావణ్ అరెస్ట్పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి,కృష్ణ: రావణ్ అరెస్ట్పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నరావణ్ టీడీపీ మద్దతుదారుడు. బాబు,లోకేష్, బాలకృష్ణలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. అందుకే టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు.రావణ్పై టీడీపీ నేతలు ఎక్కడా కేసు పెట్టలేదు. పవన్ను ప్రశ్నించాడనే రావణ్ను అరెస్ట్ చేశారు. ఎల్లోమీడియా వైఎస్సార్సీపీపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అంటే నచ్చని వ్యక్తులను పోలీస్స్టేషన్లలో తగలబెట్టే బూడిద పార్టీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజల నోరు నొక్కే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది’అని వ్యాఖ్యానించారు. -
ప్రశ్న రావణ్ ఉన్న పోలీస్ స్టేషన్ లపై జనసేన వాళ్ళు తప్ప టీడీపీ వాళ్ళు దాడులు ఎందుకు చేయలేదంటే?
-
ఆ లాక్కెళ్లడం ఏంటండీ.. అరెస్ట్ప శృంగారపాటి సందీప్ రియాక్షన్
-
శృంగరపాటి సందీప్ అరెస్ట్.. కారణం ఏంటి?
-
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై కర్నూల్లో భారీ నిరసన
-
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్
-
ప్రశ్న రావణ్ పై దేశద్రోహం కేసు.. అంబటి సంచలన ప్రెస్ మీట్
-
పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?
-
Liveలో పవన్ కళ్యాణ్ వీడియో.. ఉపా కేసు వెయ్యాల్సింది పవన్ కళ్యాణ్ పైనే!
-
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్
-
రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టి రిమాండ్ కు పంపిస్తున్నావ్.. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో...
-
గుర్తుపెట్టుకోండి.. మీరు భయపెడితే భయపడే మనిషి కాదు అతను..
-
ఇంకా ఎంత దిగజారుతార్రా.. నాలుగోసారి బెయిల్, ఐదోసారి అరెస్ట్...
-
ఏంటి నన్ను చంపేస్తారా.. భయపడకుండా సంచలన వీడియో రిలీజ్ చేసిన ప్రశ్న రావణ్
-
రిలీజ్ మళ్లీ అరెస్ట్.. గన్నవరం పోలీస్ స్టేషన్ లో రావణ్
-
రావణ్ పై కుట్రప్లాన్ పవన్ ఆఫీసులోనే..!
-
ఎలాగైనా.. రావణ్ పై పవన్ మాస్టర్ స్కెచ్
-
రావణ్ అరెస్ట్ కేసుపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు!
-
కార్యకర్తలా, గుండాలా..? ప్రశ్నిస్తే చంపేస్తారా.? ప్రకాష్ రాజ్ వైరల్ వీడియో
-
సాయికృష్ణ ను జైల్లో చంపినట్లే... ప్రశ్న రావణ్ ను కూడా చంపడానికి మాస్టర్ ప్లాన్..!
-
బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ మళ్ళీ అరెస్ట్...
-
రావణ్ అంటే పవన్ కు ఎందుకంత భయం..
-
పవన్ గుట్టు రట్టు.. రావణ్ పై దాడికి ప్లాన్.. జనసేన నేత ఆడియో లీక్
-
పవన్ వస్తా.. నీ అంతు తెలుస్తా.. రావణ్ అరెస్ట్ పై సుగాలి పార్వతి రియాక్షన్..
-
అవినీతి తిమింగలం.. 2కిలోల బంగారం.. 20 కిలోల వెండి..
-
ప్రశ్న రావణ్ పై మచిలీపట్నం PS లో మరో కేసు.. మీ పోలీసులకు శతకోటి వందనాలయ్య
-
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు?.. ప్రకాశ్ రాజ్
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. హైదరాబాద్లో రావణ్ని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అతడిని కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే విచారణ తర్వాత పిఠాపురంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలోనే వెంటనే మరో కేసులో రావణ్ని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర హైడ్రామా నెలకొంది. ప్రస్తుతం రావణ్ని మచిలీపట్నం తరలించారు.(ఇదీ చదవండి: నా భర్తకు ఏమైనా జరిగితే ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత)ఇక రావణ్ అరెస్ట్ వివాదంపై ఓ వీడియో విడుదల చేసిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలెందుకు? అని ప్రశ్నిస్తూ యూట్యూబర్ ప్రశ్న రావణ్పై వరుస కేసులు పెట్టడాన్ని తప్పు పట్టాడు. ఈ కేసులో అరెస్ట్ చేయలేమని కోర్టులు బెయిల్ ఇస్తున్నా మరో కేసు వేసి మళ్లీ అరెస్ట్ చేస్తున్నారు. ఓ 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా? ఇలా అధికారాన్ని దుర్వినియోగంతో ఎంత దూరం వెళ్తారు? ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలు దేనికి? ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో రావణ్ని వదిలేస్తారని ఆశిస్తున్నా అని సోషల్ మీడియాలో వీడియోని పంచుకున్నారు.(ఇదీ చదవండి: బెయిల్.. అరెస్ట్.. రిపీట్)How low will you stoop down and missuse power and government machinery.. do you realise you are getting Naked day by day . #justasking pic.twitter.com/f3dDPw2ZAk— Prakash Raj (@prakashraaj) July 2, 2026 -
బెయిల్.. అరెస్ట్.. రిపీట్
తెలుగు యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. పవన్ కల్యాణ్ను దూషించాడని ఆరోపిస్తూ జనసేన నేతలు వరుస ఫిర్యాదులు చేస్తుండడంతో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కోర్టులు వరుసగా అతనికి బెయిల్ ఇస్తుండగా.. ఒక్కో కేసును తెర మీదకు తెస్తూ నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామంపై రాజకీయ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సర్పవరం పీఎస్ కేసులో.. యూట్యూబర్ రావణ్కు గురువారం రాత్రి కాకినాడ మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్పై బయటికొచ్చిన రావణ్ను కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుడివాడ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తరలించారు. అంతకు ముందు.. బుధవారం రాత్రి కూడా ఇదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రశ్న రావణ్ను అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రావణ్ ఏ తప్పు చేయలేదని.. ప్రశ్నించడమే అతను చేసిన నేరమా? అని కొందరు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.ఈ పరిణామాలపై రావణ్ తరఫున వాదనలు వినిపిస్తున్న జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ భగ్గుమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి “అంతిమ దినం”లా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లో ఉన్నా, దాని అమలుపై మరోసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.పిఠాపురం మెజిస్ట్రేట్ వాదనలు విని రావణ్కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కేవలం ఐదు నిమిషాల్లోనే సర్పవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు చూపిస్తూ మళ్లీ అరెస్ట్ చేయడం ఆందోళనకరమని ఆయన అన్నారు. కనీస సమాచారం కూడా కుటుంబానికి ఇవ్వకుండా అరెస్ట్ చేసి కాకినాడ కోర్టులో హాజరుపరిచారని ఆరోపించారు. మూడు గంటల పాటు వాదనలు విన్న తర్వాత కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. ఇది ప్రజాస్వామ్యంలో రెండవ విజయం అని ఆయన అభివర్ణించారు. అయితే బెయిల్ వచ్చినప్పటికీ మళ్లీ ఇతర కేసుల్లో అదుపులోకి తీసుకోవడం అన్యాయమని అన్నారు. రావణ్పై జరుగుతున్న చర్యలు రాజకీయ కక్షసాధింపుగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకులను గౌరవించాల్సిన అవసరం లేదని, చట్టాలు, రాజ్యాంగం శాశ్వతమని పోలీసులు గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 కేసులు నమోదైనట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో జర్నలిస్టుల సంఘాలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై స్పందించకపోవడం పట్ల ఆయన ప్రశ్నించారు.రావణ్ ప్రయాణిస్తున్న వాహనంపై జనసేన శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశాయని.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వ పెద్దలు ఖండించాలా? లేదా? అని ప్రశ్నించారు. తాను కూడా అవసరమైతే మళ్లీ మచిలీపట్నం వెళ్లి వాదనలు వినిపిస్తానని, ప్రభుత్వ చర్యలపై చివరివరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని పేర్కొన్నారు.“నన్ను జైలుకు పంపితే అది ప్రభుత్వానికి ఎదురుదెబ్బలా మారుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను వెనక్కి తగ్గబోనని జడ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. -
పోలీసులతో వాగ్వాదం KTR అరెస్ట్
-
పిఠాపురం టూ సర్పవరం.. ఇలా బెయిల్.. అలా అరెస్ట్..
-
రావణ్ కి ఏమి జరిగినా పవన్ దే బాధ్యత..
-
లాటరీ టిక్కెట్ల దొంగ అరెస్ట్.. దివ్యాంగుల హర్షం!
త్రిసూర్: కేరళలోని త్రిసూర్ జిల్లాలో దివ్యాంగులైన లాటరీ విక్రేతలను మోసం చేసి, డబ్బులు చెల్లించకుండా లాటరీ టిక్కెట్లతో పరారైన 57 ఏళ్ల వ్యక్తిని అంతికాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడని చొవ్వల్లూరుకు చెందిన కబీర్గా గుర్తించారు. గురువాయూర్లో పోలీసులు కబీర్ను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 21న ఉదయం అంతికాడ్కు చెందిన దివ్యాంగులైన నటరాజన్, ప్రియ అనే ఇద్దరు లాటరీ విక్రేతల వద్దకు నిందితుడు కస్టమర్గా వచ్చి ఈ మోసానికి పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కబీర్ స్కూటర్పై వచ్చి, టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి వారి నుండి లాటరీ టిక్కెట్లను సేకరించాడు. ఆ తర్వాత వాటికి డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుండి స్కూటర్పై వేగంగా పరారయ్యాడు. బాధితుడైన నటరాజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అంతికాడ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సేకరించిన సమాచారంతో నిందితుడిని గురువాయూర్లో గుర్తించి అరెస్ట్ చేశారు. అంతికాడ్ సబ్-ఇన్స్పెక్టర్ విష్ణు నేతృత్వంలోని పోలీస్ బృందం అతనిని అదుపులోనికి తీసుకుంది. నిందితుడు కబీర్ గతంలోనూ ఇదే పద్ధతిలో లాటరీ విక్రేతలను లక్ష్యంగా చేసుకుని టిక్కెట్లు దొంగిలించేవాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. -
పవన్ కళ్యాణ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు..? జర్నలిస్ట్ KVR అరెస్ట్ పై కవిత రియాక్షన్
-
జర్నలిస్ట్ KVR ని చూపించండి అంటే... సీఐ తన సొంత ప్రాపర్టీలా ఫీల్ అయిపోతున్నాడు
-
‘జగన్ను రెండు నిమిషాల్లో అరెస్టు చేయగలను’
చిల్లకూరు/వరదయ్యపాళెం : ‘నేను అనుకుంటే జగన్మోహన్రెడ్డిని రెండు నిమిషాల్లో అరెస్టుచేసి జైలుకు పంపగలను’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాళెం సమీపంలో ఏర్పాటుచేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, చంద్రబాబు మరోసారి సొంత డబ్బా కొట్టుకున్నారు. ప్రజావేదికపై చంద్రబాబు మాట్లాడుతూ..‘అభివృద్ధి, సంక్షేమానికే తాను బ్రాండ్ అంబాసిడర్నని, హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని మరోసారి చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో, చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంకెన్ని రోజులు ఇలా డబ్బా కొట్టుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
1,450 అడుగుల ఎత్తులో ప్రపోజల్.. ఇంతలో ఊహించని ట్విస్ట్!
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత ఎత్తైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (1,454 అడుగులు) పైభాగాన ఉన్న ట్రాన్స్మిషన్ టవర్ను ఎక్కిన ఒక జంట అక్కడ ఒక శాంతి సందేశం బ్యానర్ను ప్రదర్శించి సంచలనం సృష్టించింది. నలుపు రంగు దుస్తులు ధరించిన ఈ జంట టవర్ పైకి చేరి, ‘అధికారంపై ప్రేమ అజమాయిషీ చేసినప్పుడు ప్రపంచంలో శాంతి వర్ధిల్లుతుంది’ అని రాసి ఉన్న బ్యానర్ను ప్రదర్శించింది.ఈ సాహసం తర్వాత వారు టవర్ కింద ఉన్న ఒక ప్లాట్ఫారమ్కు చేరుకున్నాక, సదరు వ్యక్తి ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుని తనతో ఉన్న మహిళకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. దానిని ఆమె అంగీకరిస్తూ తన ముఖానికి ఉన్న ముసుగును తొలగించి, అతడిని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యాలను చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. WATCH: Masked individuals climb Empire State Building and unfurl banner reading ‘When the power of love beats the love of power the world knows peace’ pic.twitter.com/rLohX2VeOE— Rapid Report (@RapidReport2025) July 1, 2026సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ హెలికాప్టర్ వెంటనే రంగంలోకి దిగింది. మధ్యాహ్నం 12:35 గంటల సమయంలో ఆ జంట కిందకు దిగుతుండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను న్యూజెర్సీకి చెందిన ఇవాన్ కుజ్నెత్సోవ్ (32), ఏంజెలీనా నికోలావ్ (33)గా గుర్తించారు. వీరు గతంలో కూడా ఇలాంటి సాహసాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా భవనంలో ఉన్న సందర్శకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రతినిధి తెలిపారు.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడి.. ‘కీవ్’ అతలాకుతలం -
KVR అరెస్ట్ వెనుక కుట్ర..! లాకప్ డెత్ కు స్కెచ్?
-
ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు.. విడుదల అయిన వెంటనే మళ్ళీ...
-
కూటమి అరాచకాలకు మరో జర్నలిస్ట్ అరెస్ట్
-
పిఠాపురంలో ప్రశ్న రావణ్ అరెస్ట్
-
జర్నలిస్ట్ KVR అరెస్ట్ పై నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
అర్థరాత్రి ఈడ్చుకెళ్లిన ఏపీ పోలీసులు.. జర్నలిస్ట్ కేవీఆర్ ఎక్కడ?
తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు కే. వెంకట్ రామ్రెడ్డి (KVR) అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అర్థరాత్రి సమయంలో ఆయన నివాసానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేవీఆర్ను అదుపులోకి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆయనను ప్రస్తుతం ఎక్కడ ఉంచారు? ఏ పోలీస్ స్టేషన్కు తరలించారు? అనే విషయాలపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసుల బృందం మఫ్టీలో, ప్రైవేట్ వాహనంలో తెలంగాణలోని కేవీఆర్ నివాసానికి వెళ్లింది. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేవీఆర్ భార్య పోలీసులను వేడుకున్నా.. చిన్నారుల ముందే ఆయనను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.సమాచారం ప్రకారం.. ఏపీ మంత్రి నారా లోకేష్పై కేవీఆర్ చేసిన రాజకీయ విశ్లేషణకు సంబంధించి నమోదైన కేసులో ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 152, 196, 353 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదే కేసులో ఈ ఏడాది మార్చి 11న కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చి కేవీఆర్ను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదని తెలుస్తోంది.తాజాగా మరోసారి ప్రత్యేక బృందం తెలంగాణకు చేరుకుని కేవీఆర్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తొలుత మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పీఎస్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారన్నుదానిపై స్పష్టత లేదు. దీంతో ఆయన ఆచూకీపై కుటుంబ సభ్యులు, సహచర జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కేవీఆర్ భార్య ఫిర్యాదుఅయితే ఈ ఎపిసోడ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ పోలీసులపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో జర్నలిస్ట్ కేవీ రెడ్డి భార్య ఫిర్యాదు చేశారు. సివిల్ డ్రెసులో వచ్చిన ఏపీ పోలీసులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారామె.ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒక జర్నలిస్టును అర్థరాత్రి సమయంలో మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకెళ్లడం, కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా తరలించడం పట్ల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేవీఆర్ను ఎక్కడ ఉంచారు? ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు? అనే వివరాలను వెంటనే వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అరెస్టుకు గల పూర్తి కారణాలు, కేసు వివరాలు, కేవీఆర్ను ఏ పోలీస్ స్టేషన్కు తరలించారన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అంతవరకు ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
భార్యను నెట్టేసి.. జర్నలిస్ట్ KVR అరెస్ట్
-
జర్మనీలో కాల్పులు కలకలం.. ఐదుగురు పౌరులు మృతి
బెర్లిన్ : జర్మనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండుగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. ఏఎఫ్పీ మీడియా కథనం ప్రకారం.. ఉత్తర జర్మనీలోని స్టేడ్ నగరంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులకు తెగబడ్డ ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఇండోర్ గేమ్స్ నిర్వహించే ప్రాంతం సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. ప్రస్తుతం భద్రతా బలగాలు పట్టణ కేంద్రానికి వెలుపల పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని వదిలేసి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పోలిస్తే జర్మనీలో తుపాకీ నియంత్రణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందువల్ల అక్కడ ఇలాంటి సామూహిక కాల్పుల ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. హాంబర్గ్ నగరానికి పశ్చిమంగా ఉన్న ఈ స్టేడ్ పట్టణ జనాభా సుమారు 50,000 వరకు ఉంటుంది. -
గోల్డ్మేన్ సూర్యభాయ్పై కేసు
హిమాయత్నగర్: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని పాతబస్తీకి చెందిన పల్లపు సురేష్ కుమార్ అలియాస్ ‘గోల్డ్మేన్’సూర్యభాయ్ నమ్మబలికి బాధితుల నుంచి రూ.30 లక్షలు తీసుకున్న ఘటనపై కేసు నమోదైంది. శుక్రవారం నారాయణగూడ ఇన్స్పెక్టర్ సైదేశ్వర్ వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 10న కృష్ణమాచారి, మరో ఇద్దరు వ్యక్తులు సూర్యను హిమాయత్నగర్లోని ఓ హోటల్లో కలిశారు. తనకు బంగారం వ్యాపారులతో సత్సంబంధాలు ఉన్నాయని, మార్కెట్ ధర కంటే తక్కువకు ఇప్పిస్తానని వారిని నమ్మబలికాడు. మా ర్కెట్లో కిలో బంగారం ధర సుమారు రూ.1.5 కోట్లుకాగా, దానిని కేవలం రూ.1 కోటికే అందిస్తానని ఆశ చూపి బాధితుల నుంచి పలు దఫాలుగా మొత్తం రూ.30 లక్షలు తీసుకున్నాడు. అయితే సూర్యభాయ్ను కూడా ప్రశ్నించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. -
గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అరెస్ట్
-
కేతిరెడ్డిని లాక్కెళ్లిన పోలీసులు
-
‘బబితా’ కాదు ‘ఖదీజా’.. స్లీపర్ సెల్ నెట్వర్క్ గుట్టురట్టు
జైపూర్: రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) తాజాగా ఒక అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ను ఛేదించింది. పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహమ్మద్’తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై బబితా ధాకడ్ అలియాస్ ఖదీజా అనే మహిళను అధికారులు జైపూర్లో అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్, ఆమె దేశ వ్యతిరేక శక్తులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించింది. ప్రస్తుతం జూన్ 27 వరకు ఆమెను ఏటీఎస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.పాకిస్తాన్ చేతుల్లో సోషల్ మీడియా ఖాతాలుసవాయ్ మాధోపూర్ జిల్లాకు చెందిన బబితా ధాకడ్ జైపూర్లోని వాటికా ప్రాంతంలో తండ్రితో కలిసి నివసిస్తోంది. గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియా, వాట్సాప్ ఖాతాలను పాకిస్తాన్ నుంచే ఆపరేట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. తన మొబైల్ సిమ్ కార్డుకు సంబంధించిన యాక్సెస్ క్రిడెన్షియల్స్ (రహస్య సమాచారం) మొత్తాన్ని ఆమె సరిహద్దు అవతలి ఉన్న హ్యాండ్లర్లకు అప్పగించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిఘా నీడలో ఉన్న కాలంలో ఆమె జైపూర్లోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినట్లు ఏటీఎస్ పేర్కొంది.మసూద్ అజహర్ కుటుంబంతో కనెక్షన్?పాకిస్తాన్లోని బహావల్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న పలువురు ఉగ్రవాద హ్యాండ్లర్లతో ఈమె టచ్లో ఉన్నట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. వారు ఆమెకు మతపరమైన బ్రెయిన్వాష్ (ఇండోక్ట్రినేషన్) చేసినట్లు తెలుస్తోంది. విచిత్రమేమిటంటే, ఆమెతో మాట్లాడిన వారిలో ఒకరు తాను జైష్-ఎ-మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ కుటుంబ సభ్యుడినని, బహావల్పూర్ నుండి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. ఈ వ్యవహారం వెనుక భారతదేశంలో పెద్ద ఎత్తున ‘స్లీపర్ సెల్’ నెట్వర్క్ను నిర్మించేందుకు, కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టేందుకు జైష్ ముఠా ప్రయత్నించిందని అధికారులు అనుమానిస్తున్నారు.మత మార్పిడి.. పాక్కు వెళ్లేందుకు ప్లాన్ఏటీఎస్ అధికారుల విచారణలో బబితా పలు సంచలన విషయాలను అంగీకరించింది. ఒక పాకిస్తానీ మత గురువు (మౌల్వీ) ఫోన్ ద్వారా చేసిన బోధనలకు ఆకర్షితురాలై తాను ఇస్లాం మతాన్ని స్వీకరించి, తన పేరును ‘ఖదీజా’గా మార్చుకున్నట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా, ఆమెను గుట్టుచప్పుడు కాకుండా పాకిస్తాన్కు తీసుకువెళ్లేందుకు అవతలి వైపు ఉన్న వ్యక్తులలో చర్చించినట్లు ఒప్పుకుంది. ప్రస్తుతం ఆమెపై ఉగ్రవాద నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసి, డిజిటల్ సాక్ష్యాలను ల్యాబ్కు పంపారు.ఇది కూడా చదవండి: మొహర్రం సెలవుపై క్లారిటీ.. ఇక ‘లాంగ్ వీకెండ్’.. -
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం కీసర పోలీస్ స్టేషన్లో ఏసీపీ చక్రపాణి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి భార్య జ్యోతి, కుమారుడితో కలిసి చీర్యాలలోని ఈడెన్ గార్డెన్లో ఉంటున్నారు. జ్యోతికి తుర్కపల్లికి చెందిన నవీన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది.గత నెల 29న నవీన్.. జ్యోతి ఇంటికి వచ్చాడు. తమ వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని జ్యోతి సహకారంతో నవీన్ బాలుడిని నేలపై బలంగా కొట్టగా మృతిచెందాడు. బాలుడు ప్రమాదవశాత్తు మంచంపై నుండి పడిపోవడం వల్ల మృతిచెందాడని నిందితురాలు భర్తను నమ్మించింది. ఆ తరువాత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖననం బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఫొరెన్సిక్ పరీక్షలు చేశారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర సాక్షాల ప్రకారం తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు. -
NEET రీ-ఎగ్జామ్.. వెలుగులోకి భారీ కుంభకోణం!
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నీట్-యూజీ రీ-ఎగ్జామ్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అభ్యర్థులకు బదులుగా వేరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన వ్యవహారాలు సంచలనంగా మారాయి. ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా, ఒక్క బీహార్లోనే ఇప్పటివరకు 30 మందిని అరెస్ట్ చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, నెట్వర్క్ను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.బిహార్లో నీట్ రీటెస్ట్-2026 సందర్భంగా భారీ అక్రమాలు వెలుగు చూశాయి. పరీక్ష రాస్తున్న వారి స్థానంలో ఇతరులు హాజరయ్యిన ఘటనలు బయటపడటంతో అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 30 మంది అరెస్టు కాగా, అందులో 9 మంది నకిలీ అభ్యర్థులుగా పరీక్ష రాస్తూ పట్టుబడటం కలకలం రేపింది. లఖిసరాయ్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. కేఆర్కే హైస్కూల్ పరీక్ష కేంద్రం నుంచి ఒకరు, కేంద్రీయ విద్యాలయం నుంచి ఏడుగురు, హసన్పూర్ స్కూల్ నుంచి మరో వ్యక్తి.. నకిలీగా పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. వీరంతా వేరే అభ్యర్థుల స్థానంలో పరీక్షకు హాజరైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో పాటు మరో 21 మందిని కూడా అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరి పాత్ర ఈ మోసపూరిత నెట్వర్క్లో ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మొత్తం అరెస్టుల సంఖ్య 30కి చేరగా.. ఆ సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.అరెస్టయిన వారిని ఎస్డీఎం ప్రభాకర్ కుమార్, ఎస్డీపీవో శివమ్ కుమార్ పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్నారు. విచారణలో వెలుగులోకి వస్తున్న సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు సంబంధిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ మోసానికి వెనుక పెద్ద నెట్వర్క్ ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్, ఎస్పీ ప్రేరణ కుమార్ ఈ కేసు విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. మరింత మంది ఈ రాకెట్లో భాగమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే NEET పరీక్షలో ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి నెట్వర్క్ను బయటకు తీసేందుకు విచారణ కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ స్పందించాల్సి ఉంది. -
రష్యా నుంచి భారత్కు చమురు.. నావికుడు అరెస్టు
రష్యా నుంచి భారతదేశానికి వస్తూ ఇంగ్లీష్ ఛానెల్ను దాటుతున్న షాడో- ప్లీట్ అనే ఆయిల్ ట్యాంకర్ను బ్రిటన్ అధికారులు అడ్డుకున్నారు. ఆ నౌక కెప్టెన్నైనా అజయ్ పంత్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆ కెప్టెన్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఆయనను విడిపియ్యాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు."రష్యా (ఆంక్షలు) నిబంధనలు 2019" లోని 'రెగ్యులేషన్ 46Z9B' ని ఉల్లంఘిస్తూ.. రష్యా చమురును ఇతర దేశానికి ఓడ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సరఫరా చేసినట్లు ఆయనపై కేసు నమోదు చేశారు.అయితే ఆయన తరపున కేసు వాదించిన "ఈ నౌక ఎక్కడికి వెళ్లాలి, ఎలాంటి సరుకును తీసుకెళ్లాలి అనేది ఆయన నిర్ణయం కాదు. ఆయన కేవలం కార్పొరేషన్ (కంపెనీ) ఆదేశాలను మాత్రమే పాటించారు. ఆయన తన ఉద్యోగాన్ని చేసుకుంటున్న ఒక ఉద్యోగి మాత్రమే, ఇప్పుడు బ్రిటీష్ కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది" అని పేర్కొన్నారు.ఇరు వాదనలు విన్న అక్కడి కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది.భార్య ఆవేదనఅజయ్ పంత్ భార్య.. రీతు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బ్రిటీష్ మీడియా నివేదికల ద్వారానే తన భర్త అరెస్ట్ విషయం తెలిసింది. UK లేదా భారత అధికారుల నుండి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని చెప్పారు. ఆయన కేవలం కంపెనీ ఆదేశాల మేరకే నౌకను నడిపారని, ఇందులో ఆయన తప్పేమీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందనదీనిపై ఉత్తరాఖండ్ హోం సెక్రటరీ శైలేష్ బగౌలీ స్పందిస్తూ.. పంత్ విడుదల మరియు పునరాగమనం కోసం సహాయం చేయాలని కోరుతూ రెండు రోజుల క్రితమే భారత విదేశాంగ శాఖ కు లేఖ రాశామని తెలిపారు. ఢిల్లీలోని తమ ప్రాంతీయ కమిషనర్ కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని చెప్పారు. కాగా UKలోని భారత హైకమిషన్కు పంత్ను కలుసుకునేందుకు అనుమతి లభించింది..కాగా బ్రిటన్ చరిత్రలో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారి. రాయల్ మెరైన్ కమాండోలు రాత్రి వేళల్లో 'చినూక్' హెలికాప్టర్ ద్వారా నౌకపైకి దిగారు. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అధికారులు నౌకలోని పత్రాలను తనిఖీ చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ ఆపరేషన్ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని చెబుతూ, ఇది "రష్యాకు తగిలిన మరో దెబ్బ" అని అభివర్ణించారు. -
రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్
లండన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అంతర్జాతీయంగా సంచలనం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఆంక్షలను ఉల్లంఘించి రష్యా ముడి చమురును రవాణా చేస్తోందనే అనుమానంతో, బ్రిటన్ సైనిక బలగాలు ఇంగ్లీష్ ఛానల్లో ఒక రష్యన్ చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నాయి. బ్రిటన్ చరిత్రలోనే రష్యాకు చెందిన ‘షాడో ఫ్లీట్’ (రహస్య నౌకాదళం) నెట్వర్క్పై జరిగిన మొట్టమొదటి భారీ దాడి ఇది. ఈ ఆపరేషన్ అనంతరం బ్రిటన్ జాతీయ నేర విభాగం (ఎన్సీఏ) అధికారులు ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై ఒక భారతీయ పౌరుడిని అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.మిడ్నైట్ రైడ్.. బ్రిటన్ ప్రధాని హెచ్చరికఆదివారం (జూన్ 15) రాత్రి ఇంగ్లీష్ ఛానల్ గుండా వెళ్తున్న ‘స్మిర్టోస్’ అనే ట్యాంకర్ను బ్రిటీష్ దళాలు చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగించడానికి రష్యాకు అందుతున్న నిధుల వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విజయవంతమైన ఆపరేషన్పై బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ స్పందిస్తూ.. ఇది రష్యాకు గట్టి ఎదురుదెబ్బ అని అభివర్ణించారు. పుతిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ లాభపడుతున్న వారు ఎవరూ ఇకపై తప్పించుకోలేరని, వారిని దాక్కోనివ్వబోమని సోషల్ మీడియా వేదికగా ఆయన హెచ్చరించారు.7 లక్షల బ్యారెళ్ల చమురు.. దొరికిన కీలక ఆధారాలుమెరైన్ ట్రాఫిక్ వెబ్సైట్ సమాచారం ప్రకారం, హాంగ్ కాంగ్ ఆధారిత ‘జావో యావో షిప్పింగ్ లిమిటెడ్’ సంస్థకు చెందిన ఈ ట్యాంకర్, కామెరూన్ జెండాతో ప్రయాణిస్తోంది. జూన్ 5న రష్యాలోని ఉస్త్-లుగా పోర్ట్ నుండి బయలుదేరిన ఈ నౌకలో దాదాపు 7 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నౌకను డోర్సెట్ తీరంలో నిలిపి ఉంచారు. ఇందులో ఉన్న 24 మంది జార్జియా, భారతీయ సిబ్బంది ప్రస్తుతం నౌకలోనే ఉన్నట్లు ఎన్సీఏ తెలిపింది. బ్రిటన్ తీసుకున్న ఈ సాహసోపేత చర్యను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభినందించగా, రష్యా మాత్రం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.షాడో ఫ్లీట్ అంటే ఏమిటి? అంతర్జాతీయ ఆంక్షల నుండి తప్పించుకుని రష్యా చమురును ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి వాడుతున్న వందలాది రహస్య నౌకల నెట్వర్క్ను ‘షాడో ఫ్లీట్’ అని పిలుస్తారు. యుద్ధ నిధుల కోసం రష్యా ప్రధానంగా ఈ చమురు విక్రయాలపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ సహా పాశ్చాత్య దేశాలు ఈ నౌకలపై నిషేధం విధించాయి. ప్రస్తుత ట్యాంకర్ సీజ్ వల్ల రష్యా చమురు ఎగుమతులు పూర్తిగా ఆగిపోకపోయినప్పటికీ, రష్యాకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని, అలాగే పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి నౌకలు సుదీర్ఘ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: నాలుగు ఏఐ మోడల్స్ ఫెయిల్.. 10/10 స్కోర్ చేసిన మానవ మేథ! -
నీట్ రీ ఎగ్జామ్కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్
ముజఫర్పూర్: నీట్ యూజీ రీ ఎగ్జామ్కు కౌంట్డౌన్ ప్రారంభమైన వేళ బీహార్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష వివాదం సర్దుమణగక ముందే, అభ్యర్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు గుంజాలని చూసిన నలుగురు నిందితులను ముజఫర్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మాకు డబ్బులు అందాయి, నీట్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ పంపుతున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను బురిడీ కొట్టించిన ఈ గ్యాంగ్ నెట్వర్క్ను పోలీసులు చేధించారు.సోషల్ మీడియా వేదికగా ఫేక్ పేపర్ల దందాబీహార్లోని ముజఫర్పూర్లో పట్టుబడిన ఈ ముఠా.. ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా నీట్ అభ్యర్థులను ట్రాప్ చేసినట్లు ఎస్ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా వెల్లడించారు. వివిధ పోటీ పరీక్షల నకిలీ ప్రశ్నపత్రాలను చూపిస్తూ, అవే అసలైన పేపర్లు అని నమ్మించి నిందితులు ఆన్లైన్ ద్వారా భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయించుకుని ఆపై చేతులెత్తేయడం ఈ ముఠా ప్రధాన వ్యూహం.మనీష్ ఇచ్చిన సమాచారంతో గ్యాంగ్ అరెస్ట్ఈ నెల జూన్ 2వ తేదీన సికింద్పూర్ పోలీసులు మనీష్ అనే వ్యక్తిని నకిలీ పేపర్లు విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, ఈ నీట్ ఫేక్ పేపర్ల స్కామ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటపడ్డాయి. మనీష్ ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ముజఫర్పూర్ పోలీసులు.. హర్ష్, అమన్ కుమార్, కన్హయ్య కుమార్, హర్ష్ కనేడియా అనే మరో నలుగురు నిందితులను వేటాడి పట్టుకున్నారు.జూన్ 21న కట్టుదిట్టంగా నీట్ రీ-ఎగ్జామ్మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా రద్దయిన ఈ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), విద్యా మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్ష పారదర్శకత కోసం అధికారులు ‘పరీక్ష కర్మయోగి’ అనే ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. -
బ్యాగ్ తో టిప్ టాప్ గా ఫ్లైట్ దిగింది.. అడ్డంగా బుక్కైంది..
-
మాజీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
-
రూ.5 వేల కోట్ల స్కామ్కు స్కెచ్!
సాక్షి, హైదరాబాద్: గోల్డ్క్వెస్ట్, క్వెస్ట్నెస్ట్, క్యూనెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో దేశ వ్యాప్తంగా 25 ఏళ్లు మల్టీ లెవల్ మార్కెటింగ్ దందా చేసి, లక్షల మంది నుంచి రూ.వేల కోట్లు కాజేసిన సంస్థ ఈసారి ఇగ్నైట్ పేరుతో వచ్చింది. చండీగఢ్లోని ఆర్వోసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్)లో ‘ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గత నెల 18న రిజిస్టర్ చేసుకుని, డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో రూ.5 వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా కుట్ర పన్నింది.ఇది రిజిస్టరైన 18 రోజులకే మూలాలు కనిపెట్టిన హైదరాబాద్ పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో దాడులు చేసి ఆరుగురు కీలక నిందితు లను అరెస్టు చేసినట్లు కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ తెలిపారు. అదనపు, సంయుక్త సీపీలు ఎం.శ్రీనివాసులు, ఎస్.చైతన్యకుమార్, ఎస్ఎం విజయ్కుమార్లతో కలిసి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. హాంగ్కాంగ్ కేంద్రంగా..ఇగ్నైట్ హాంగ్కాంగ్ కేంద్రంగా నడుస్తోంది. దీని వ్యవస్థాపకుడు తమిళనాడు గోల్డ్క్వెస్ట్ కేసులో ప్రధాన నిందితుడు, ఇగ్నైట్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్లీ హసన్ గతంలో క్యూనెట్ సంస్థ తరఫున పని చేశాడు. ఇందులో పని చేస్తున్న వాళ్లూ క్యూనెట్కు సంబంధించిన వాళ్లే. కంపెనీ అధికారికంగా రిజిస్టర్ కావడానికి తొమ్మిది రోజుల ముందే దాని వెబ్సైట్ డొమైన్లో రిజిస్టరైంది. ఈ సంస్థ చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేలా చేస్తుందని చెప్పే ‘సిమెట్రా’ అనే అయస్కాంత పెన్, శరీరంలో శక్తిని సమతుల్యం చేస్తుందని నమ్మించే ‘యాక్టివా’ అనే చతురస్రాకార గాజు ముక్క, భారతీయ రిటైల్ మార్కెట్లో రూ.600 కంటే తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ టూత్బ్రష్ ’బ్రష్–ఓ’లను విక్రయిస్తోంది. గరిష్టంగా రూ.వెయ్యి ఉండే వీటిని 680 అమెరికన్ డాలర్లకు (సుమారు రూ.60 వేలు) విక్రయిస్తున్నారు. తమ సంస్థలో చేరాలంటూ ఆన్లైన్లో ప్రచారం చేస్తున్న ఇగ్నైట్ జూమ్ మీటింగ్ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది. నగరవాసుల ఫిర్యాదుతో..ఇగ్నైట్ మాటలు నమ్మి రూ.1.87 లక్షలు మోసపోయిన ముగ్గురు పంజగుట్ట, ఎస్సార్నగర్, కాచిగూడల్లో ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరిని ఆఫ్రికాకు చెందిన వాట్సాప్ నంబర్ ద్వారా, మరొకరిని జూమ్ ప్రెజెంటేషన్, ఇంకొకరిని హైదరాబాద్ సెంట్రల్ మాల్లో ముఖాముఖిగా కలిసి నమ్మించారు. ముగ్గురు చెల్లించిన డబ్బు మాత్రం ఒకే బ్యాంకు ఖాతాలోకి వెళ్లింది. కోల్కతాలోని భవానీపూర్ శాఖకు చెందిన ‘పారస్నాథ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్’కు చేరింది. అలా వచ్చిన సొమ్ము అట్నుంచి బెంగళూరుకు చెందిన జ్ఞానేష్ పీఎన్ అనే వ్యక్తికి, ఆపై ఢిల్లీ, చండీగఢ్లకు బదిలీ అవుతోందని గుర్తించారు. అక్కడ నుంచి హవాలా మార్గంలో మలేసియాకు తరలించి, ఆపై ఆఫ్రికా ద్వారా ఈ నిధులను యూఎస్డీటీ క్రిప్టో కరెన్సీ రూపంలోకి మారుస్తున్నారు. చివరగా ఏడో దశలో ఈ సొమ్ము హాంగ్కాంగ్లోని ఇగ్నైట్ ప్రధాన నిర్వాహకుల ఈ–వాలెట్కు చేరుకుంటోంది.ఇది వ్యవస్థీకృత నేరమని నిర్థారించిన పోలీసులు ఈ మూడు కేసుల్నీ సీసీఎస్కు బదిలీ చేశారు. ఏసీపీలు నర్సింహారెడ్డి, హరీశ్ లోతుగా దర్యాప్తు చేసి కేరళ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సిబ్బందితో దాడులు చేశారు. ఒనియల్ గుప్తా (ఇగ్నైట్ టీమ్ లీడర్ / రిక్రూటర్), దినేశ్ కుమార్ సాహిల్ (డైరెక్టర్), ప్రియాన్షు సక్సేనా (డైరెక్టర్), ప్రవీణ్ కుమార్ దకాలియా (డైరెక్టర్), పరితోష్ కుమార్ దకాలియా (డైరెక్టర్), రియాజ్ (ఫీల్డ్ రిక్రూటర్)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
రూ. 954 కోట్ల స్కాం :భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్
సుమారు రూ. 954 కోట్లకు పైగా కుంభకోణ ఆరోపణలతో 44 ఏళ్ల భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అమెరికాలో అరెస్టు చేశారు. బుధవారం ఉదయం న్యూపోర్ట్ బీచ్లోని అతని విలాసవంతమైన భవనంలో అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే అతనికి గరిష్టంగా 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మఖిజాని తన కంపెనీ (క్యాంటర్ గ్రూప్ V LLC) ద్వారా రియల్ ఎస్టేట్ లోన్ల కోసం తాకట్టు పెట్టిన ఆస్తుల విలువను పెంచి చూపారు. టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఫోర్జరీ చేసి, మెటాడేటాను మార్చడం ద్వారా అసలు అప్పులను దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.కరోనా డెల్ మార్లో నివసిస్తున్నగ్రీన్ కార్డ్ హోల్డర్ మహేందర్ మఖిజానిని, ఒక బ్యాంకును దాదాపు 100 మిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్లు వచ్చిన ఫెడరల్ క్రిమినల్ ఫిర్యాదు ఆధారంగా బుధవారం ఉదయం అరెస్ట్ చేశామని సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా ఫస్ట్ అసిస్టెంట్ యూఎస్ అటార్నీ బిలాల్ ఎస్సాయిలీ తెలిపారు. తమ స్పెషల్ ఏజెంట్లు వివిధ ఖాతాల ద్వారా జరిగిన నిధుల బదిలీలను నిశితంగా పరిశీలించి, ఈ భారీ కుంభకోణాన్ని ఛేదించారు. సొంత లాభం కోసం పత్రాలను తారుమారు చేసి, ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేసే వారిని వదిలిపెట్టేది లేదు. నిజాలను వెలికితీసి, చట్టానికి అప్పగిస్తామన్నారు.Mahender Makhijani, 44, a lawful permanent resident from India living in Corona del Mar, was arrested this morning on a federal criminal complaint charging him with defrauding a bank out of nearly $100 million.Makhijani controlled Cantor Group V LLC, a Newport Beach-based… pic.twitter.com/wEcSe5mQpW— F.A. United States Attorney Bill Essayli (@USAttyEssayli) June 10, 2026ఐఆర్ఎస్ ప్రకారం మఖిజాని టైటిల్ ఇన్సూరెన్స్ రికార్డులను తప్పుగా సృష్టించాడు,నిజమైన తాకట్టు స్థానాలను దాచిపెట్టాడు. ఫెడరల్ ఇన్సూరెన్స్ ఉన్న ఒక బ్యాంకును తప్పుదోవ పట్టించడానికి షెల్ కంపెనీల నెట్వర్క్ను ఉపయోగించాడు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక సంపన్న ప్రాంతంలో హోటళ్లు, ఒక రెస్టారెంట్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి సాయుధ గుండాలను పంపడం, డ్రగ్స్ , సెక్స్ పార్టీలను నిర్వహించడం వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా ఇతనిపై ఉన్నాయి. 2024 సెప్టెంబర్- 2025 ఏప్రిల్ 2025 వరకు, మఖిజాని భీమా పత్రాలను ఫోర్జరీ చేసి, తాకట్టు పెట్టిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులపై కాంటర్ సంస్థకే మొదటి హక్కు (First Lien Position) ఉన్నట్లు చూపించాడు. ఈ నకిలీ పత్రాలను తన ఉద్యోగి ద్వారా బ్యాంకుకు సమర్పించేలా చేశాడు. అంతేకాకుండా, బ్యాంకు ప్రతినిధులతో ఫోన్ కాల్స్లో మాట్లాడుతూ, బ్యాంకు గుర్తించిన పత్రాల లోపాల గురించి అబద్ధాలు చెప్పి నమ్మించాడు.సెక్స్ వర్కర్లతో ప్రైవేట్ పార్టీలను నిర్వహించేవాడని, ఈ పార్టీలకు కొంతమంది బ్యాంకు ఉద్యోగులు కూడా హాజరయ్యారని కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. ఆ పార్టీలలో జరిగిన ఉదంతాల ఆధారంగా అతను బ్యాంకు సిబ్బందిని, తన భాగస్వాములను బ్లాక్మెయిల్ చేస్తూ తన నియంత్రణలో ఉంచుకున్నాడు. అంతేకాదు తన కింద పనిచేసే సిబ్బందిని బెదిరిస్తూ, తనకు వ్యతిరేకంగా పనిచేస్తే, చంపేస్తామని, కుటుంబాలను, పిల్లల్ని రోడ్డు పడేస్తానని బెదిరించేవాడు.అలాగే గత నెలలో జరిగిన ఒక మధ్యవర్తిత్వ విచారణలో వ్యాపారవేత్త మొహమ్మద్ హోనార్కర్తో జరిపిన రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మఖిజాని అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. దీనికిగాను సుమారు రూ. 12,391.6 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. -
బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
-
ఢిల్లీ అగ్నిప్రమాదం: కుక్ నిర్లక్ష్యమే కొంపముంచిందా?
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలోని మాలవీయ నగర్ ‘ఫ్లరిష్ ఇన్’ హోటల్లో 21 మందిని బలితీసుకున్న అగ్నిప్రమాదం కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ వంటవాడు (కుక్) కేశవ్ నేగిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇతని నిర్లక్ష్యం కారణంగానే మంటలు వేగంగా వ్యాపించడమే కాకుండా, హోటల్లోని ఎలక్ట్రానిక్ తలుపులు లాక్ అయిపోయి, పెను విషాదానికి దారితీసిందని పోలీసు వర్గాల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.ఒకే ఒక్క స్విచ్ కారణంగా..పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కిచెన్లో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన కుక్ కేశవ్ నేగి, హోటల్ మెయిన్ పవర్ స్విచ్ (ఎలక్ట్రిసిటీ సప్లై)ను పూర్తిగా ఆఫ్ చేసి, దట్టమైన పొగల మధ్య నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పారిపోయాడు. ఆయన తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే హోటల్లో ఉన్నవారికి మృత్యుపాశంగా మారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్లోని సెన్సార్ ఆధారిత ఎలక్ట్రానిక్ తలుపులన్నీ జామ్ అయిపోయాయి. లోపల ఉన్న బాధితులు బయటకు వచ్చే మార్గం లేక లోపలే చిక్కుకుపోయారు.బాత్రూమ్లోనే భార్యాభర్తల సజీవ దహనంఈ ప్రమాదంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు వెలుగుచూశాయి. పవర్ కట్ కావడంతో తలుపులు తెరుచుకోక, దట్టమైన పొగలు హోటల్ అంతటా కమ్మేశాయి. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ పాయింట్ ఉండటం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి (సీల్డ్) ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకోలేక విలవిలలాడారు. ఓ జంట (భార్యాభర్తలు) ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్రూమ్లోకి వెళ్లగా, అక్కడ కూడా డోర్ లాక్ అయిపోయింది. బయటకు రాలేక, ఊపిరాడక వారు అక్కడికక్కడే మరణించారు. నేగి చేసిన నిర్లక్ష్యపు పనే ఇంతమంది ప్రాణాలు గాల్లో కలవడానికి ప్రధాన కారణమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు.ముమ్మరంగా సాగుతున్న పోలీసు విచారణఅగ్ని ప్రమాదం జరిగిన ఐదు అంతస్తుల ఈ ఇరుకైన భవనంలో మొత్తం 22 గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ నడుస్తుండగా, బేస్మెంట్, పై అంతస్తులను హోటల్గా ఉపయోగిస్తున్నారు. హోటల్ యజమాని లవకేష్ బజాజ్ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేయగా, తాజాగా కుక్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయడానికి హోటల్ సిబ్బందిని, ఇతర నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. -
లైంగిక దాడి, అశ్లీల ఫోటోలు, వీడియోలు : ఐఐటీ బాబా గలీజు దందా
ఐఐటీ (IIT) గ్రాడ్యుయేట్ మథురై బాబాగా పేరొందిన అభిషేక్ మిశ్రా అలియాస్ అధికార్త నారాయణ్ దాస్ (29) గుట్టు రట్టైంది. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో 29 ఏళ్ల స్వీయ-ప్రకటిత ఆధ్యాత్మిక గురువు చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆధ్యాత్మిక గురువుగా నటిస్తూ యువతులను లైంగికంగ దోచుకోవడం, వారిని, వారి కుటుంబాలను బ్లాక్మెయిల్ చేయడం లాంటి ఆరోపణలతో పోలీసులు అతగాడిని అరెస్ట్ చేశారు.ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపి విద్యావంతులైన యువతులను లైంగికంగా దోపిడీ చేస్తున్న ఆరోపణలపై మిశ్రాను సోమవారం రాధా కుండ్లోని అతని ఆశ్రమంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతులను లైంగికంగా వేధించడమే కాకుండా వారి నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులు ఆ ప్రాంగణం నుంచి ఇద్దరు యువతులను, ఒక యువకుడిని కూడా రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు.మే 25న ఛత్తీస్గఢ్కు చెందిన 22 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని గోవర్ధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మిశ్రా తనకు 'ప్రసాదం' అని చెప్పి పాలు ఇచ్చాడని, అందులో మత్తు కలిగించే పదార్థం ఉందని నర్సింగ్ విద్యార్థిని ఆరోపించింది. పాలు తాగిన తర్వాత తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత అతను తనపై అత్యాచారం చేసి, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడని ఆ మహిళ ఆరోపించింది. ఈమె ఫిర్యాదు మేకు కేసు నమోదైంది.ఇదీ చదవండి: విమానయాన, ఇంధన సంస్థలకు గుడ్ న్యూస్: కేబినెట్ కీలక నిర్ణయండీఎస్పీ అనిల్ కుమార్ సింగ్ సమాచారం ప్రకారం నిందితుడు బాధితురాలిని బెదిరించి, డబ్బు చెల్లించకపోతే ఆమె వీడియోలను ప్రచారం చేస్తానని హెచ్చరిస్తూ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. దర్యాప్తులో భాగంగా, నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి పోలీసులు వివిధ పురుషులు, మహిళలకు చెందిన డజనుకు పైగా అశ్లీల ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. మిశ్రా ఆన్లైన్లో ప్రసంగాలతో అనుచరులను ఆకర్షించేవాడని, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా అభిషేక్ మిశ్రా మథురలోని రాధాకుంజ్ ప్రాంతంలో నివసిస్తూ, తనను తాను ఒక 'కథావాచక్' (ఆధ్యాత్మిక ప్రవచనకారుడు) గా పరిచయం చేసుకున్నాడు. యూట్యూబ్లో "రాధా కృప అమృత" (Radha Kripa Amrita) అనే ఛానెల్ ద్వారా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రవచనాలు చెబుతూ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రత్యేకంగా విద్యావంతులైన మహిళలను, ముఖ్యంగా ఇంజనీర్లు, పెద్ద కంపెనీలలో పనిచేసే నిపుణులను లక్ష్యంగా చేసుకుని, వారిని లైంగికంగా వేధించి, బ్లాక్మెయిల్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగుతోందని, నిందితుడిని జైలుకు తరలించామని ఎస్పీ (గ్రామీణ) సురేష్ చంద్ర రావత్ తెలిపారు. మిశ్రా నేపథ్యం, బాధితులపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : షాకింగ్ విషయాలు వెలుగులోకివిచారణ సమయంలో మిశ్రా పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, అతను సుమారు ఐదేళ్ల క్రితం ఐఐటి రూర్కీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. మధురకు వెళ్లడానికి ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో సంవత్సరానికి రూ. 20 లక్షల జీతంతో పనిచేశాడు. ఇదీ చదవండి: హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్ -
ప్రియురాలి కోసం ప్రియుడి సాహసం.. కట్ చేస్తే
ప్రియురాలి కోసం సరిహద్దులు దాటే సాహసం చేసిన ఒక యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆన్లైన్లో పరిచయమైన జమ్మూ కాశ్మీర్ యువతిని కలవడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ముజఫ్ఫరాబాద్కు చెందిన యువకుడు జీషాన్ మిర్ (22)ని నియంత్రణ రేఖ (LoC) భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణలో అసలు విషయం చెప్పాడు. దీంతో ఈ స్టోరీ నెట్టింట్ వైరల్గా మారింది.జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్కు చెందిన ప్రియురాల్ని కలవాలన్న అతని కోరికకు సరిహద్దు గీత వద్దే ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ పరిధిలోని 'సిలికోట్' ప్రాంతంలో ఒక వ్యక్తి నియంత్రణ రేఖ దాటి రావడాన్ని సైనికులు గమనించారు. అతను భారత భూభాగంలోకి అడుగుపెట్టిన వెంటనే సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను పీఓకేలోని ముజఫరాబాద్కు చెందిన పెయింకాడి నివాసి జీషాన్ అహ్మద్ మీర్ (తండ్రి లాల్ దిన్ మీర్) గా గుర్తించారు. అతని వద్ద ఉన్న పాకిస్తానీ గుర్తింపు కార్డు (ID Card)ద్వారా అతని వివరాలను ధృవీకరించారు. సోషల్ మీడియా ద్వారా ఉరి ప్రాంతానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆమెను కలుసుకోవడానికే తాను ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటానని జీషాన్ భద్రతా సిబ్బందికి తెలిపాడు. ప్రస్తుతం జీషాన్తో పాటు అతను చెప్పిన యువతిని కూడా భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. వారి మధ్య జరిగిన డిజిటల్ సంభాషణలను (చాట్స్) అధికారులు పరిశీలిస్తున్నారు.సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు సోపోర్ యువకుల అరెస్ట్మరొక ఘటనలో, శనివారం మరియు ఆదివారం మధ్య రాత్రి హత్లంగా-నంబ్లా మార్గం ద్వారా పీఓకేలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు సోపోర్ నివాసితులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ (TA-161) సిబ్బంది కావడం గమనార్హం.వారు నియంత్రణ రేఖను చేరుకోవడానికి ముందే నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ వారిని పట్టుకుంది. వీరు సరిహద్దు దాటడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్ -
ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు.. 8 మంది అరెస్ట్
ఢిల్లీ పోలీసులు పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం, షాజాద్ భట్టి నెట్వర్క్తో సంబంధం ఉన్న ఎనిమిది మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేశారు. వారి వద్ద కీలకమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం, విజయ్ అలియాస్ షూటర్కు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లలో ఉగ్రవాద, నేర కార్యకలాపాలు నిర్వహించే కీలక బాధ్యతను పాక్ ఉగ్రవాద సంస్థ అప్పగించింది. దీంతో ఢిల్లీ-ఎన్సిఆర్లోయూలో ఉగ్రవాదులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పంజాబ్, చండీగఢ్లలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, మంత్రిత్వ శాఖలు, భద్రతా దళాలపై దాడులకు వారు కుట్ర పన్నుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరూ పాకిస్తాన్, దుబాయ్లలోని హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. వీరిలో ప్రధాన నిందితుడి కోసం గాలింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన విజయ్ అలియాస్ షూటర్, జార్ఖండ్కు చెందిన నితీష్ పాశ్వాన్, మహారాష్ట్రకు చెందిన తౌకీర్ రిజ్వాన్ అహ్మద్ షేక్ మరియు సాజిద్ మెహబూబ్ షేక్ అలియాస్ అర్బాజ్ ఖాన్, పంజాబ్కు చెందిన హర్విందర్ సింగ్, గగన్దీప్ సింగ్, మంజీత్ సింగ్, నేపాల్ పౌరుడు అంగ్ కమీ లామాలు ఉన్నారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఒక పిస్తోల్, మందుగుండు సామాగ్రి, గ్రానైట్లు, బైకులు, మెుబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్
-
MLA తోపుదుర్తి సోదరుడు అరెస్ట్
-
రెచ్చిపోయిన పొన్నూరు CI.. YSRCP నేత అశోక్ బాబుని ఎత్తుకెళ్ళి
-
‘నీట్’ కేసు: 40 రోజుల్లో రిటైర్మెంట్.. ఇంతలోనే అరెస్ట్!
పూణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్-యూజీ - 2026’ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. ఈ క్రమంలో పూణెలోని సేథ్ హీరాలాల్ సరాఫ్ పాఠశాల ప్రిన్సిపల్ మనీషా సంజయ్ హవాల్దార్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం విద్యాశాఖ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆమె మరో 40 రోజుల్లో పదవీ విరమణ చేయనుండగా ఇంతలోనే ఈ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.పాఠశాల యాజమాన్యం షాక్సీబీఐ చర్య దరిమిలా విద్యా ప్రసరిణి సభ ట్రస్ట్.. మనీషా హవాల్దార్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాల 102 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వివాదం జరగడం ఇదే మొదటిసారని ట్రస్ట్ కార్యదర్శి సతీష్ గవాలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ అక్రమ కార్యకలాపాలపై తమకు ముందస్తు సమాచారం లేదని, నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.అంకితభావం కలిగిన ఉపాధ్యాయురాలిగా గుర్తింపు1992లో అసిస్టెంట్ టీచర్గా వృత్తిని ప్రారంభించిన మనీషా హవాల్దార్, తన విద్యా అర్హతలతో పాఠశాలలో క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయురాలిగా పేరు తెచ్చుకున్నారు. 2024లో ఆమె ప్రిన్సిపల్గా పదోన్నతి పొందారు. సుదీర్ఘకాలం పనిచేసిన ఆమె ఇలాంటి నేరంలో చిక్కుకోవడం నమ్మశక్యంగా లేదని తోటి ఉపాధ్యాయులు అంటున్నారు. ఒక సీనియర్ విద్యావేత్త ఇటువంటి క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం శుక్రవారం ఉదయం మనీషా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి, ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అదే సమయంలో పాఠశాలలోనూ సోదాలు జరిపి, కీలకమైన కంప్యూటర్ హార్డ్ డిస్కులు, అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నీట్ పరీక్షకు ముందే గోప్యమైన సమాచారం లీక్ అయ్యిందా లేదా అనే కోణంలో సీబీఐ ఫోరెన్సిక్ విశ్లేషణను ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో ఇటువంటి అక్రమాలు వెలుగుచూడటం పరీక్షల భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. -
సికింద్రాబాద్ బోయిన్పల్లి SI అరెస్ట్ కేసులో కొత్త ట్విస్ట్
-
సీసీటీవీతో పాక్కు కీలక సమాచారం.. గుట్టురట్టు
చండీగఢ్: పంజాబ్ పోలీసులు పాకిస్థాన్ కుతంత్రాన్ని తిప్పికొట్టారు. పఠాన్కోటలో భారత సైన్యం, పారామిలటరీ దళాల సమాచారాన్ని సీసీటీవీ నిఘాచిత్రాల ద్వారా లాహార్కు చేరవేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.పంజాబ్లోని చక్ ధరివాల్ గ్రామానికి చెందిన బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు అనే వ్యక్తి భారత సైన్యం, పారామిలిటరీ దళాల కదలికలపై నిఘా పెట్టేందుకు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారి-44లోని పఠాన్కోట్-జమ్మూ మార్గంలో ఒక వంతెన సమీపంలోని దుకాణంలో రహస్యంగా సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. దానిలోని నిఘా సమాచారాన్ని పాకిస్థాన్, విదేశాల్లోని ఆపరేటివ్లకు ఎలక్ట్రానిక్గా పంపినట్లు పేర్కొన్నారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిందితుడు దీనిని ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇందుకు గానూ దుబాయ్లోని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి రూ. 40 వేల అందుకున్నాడని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక సీసీటీవీ కెమెరాతో పాటు ఇంటర్నెట్ వైఫై రౌటర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అతనితో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశామని వారందరూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణ తేలిందన్నారు. ఈ నెట్వర్క్ సరిహద్దు సంబంధాలను గుర్తించడానికి గూఢచర్యాన్ని గుర్తించడానికి విచారణ వేగవంతం చేశామని పోలీసులు పేర్కొన్నారు.కాగా గత నెలలో పాకిస్థాన్ మద్దతు ఉన్న రెండు గూఢచార ముఠాలను పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలు, చైనాలో తయారైన అత్యాధునిక సౌరశక్తితో పనిచేసే సీసీటీవీ కెమెరాలను ఉపయోగించి, కీలకమైన సైనిక స్థావరాల లైవ్ విజువల్స్ను పాకిస్తాన్లోని తమ హ్యాండ్లర్లకు ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. దేశ భద్రతకు ఎంతో కీలకమైన సమాచారం పాక్కు చేరడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. -
జోగి రమేష్ అరెస్ట్
-
గంగాతీరంలో హై అలర్ట్.. అసలేం జరిగింది?
హరిద్వార్: లక్షలాది మంది భక్తులు నిత్యం పుణ్యస్నానాలు ఆచరించే పవిత్ర పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రసిద్ధ ‘హర్ కీ పౌరి’ ఘాట్ను బాంబులతో పేల్చేస్తామంటూ సోమవారం పోలీసులకు వచ్చిన ఒక బెదిరింపు ఫోన్ కాల్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ఆధ్యాత్మిక ప్రాంతంలో బాంబు హెచ్చరికల వార్త తెలియగానే నగరవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.పోలీసులను పరుగులు పెట్టించిన ఫోన్ కాల్పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఒక వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేశాడు. నాలుగు రోజుల్లో హర్ కీ పౌరి సహా హరిద్వార్లోని పలు కీలక ప్రాంతాలను బాంబులతో పేల్చేస్తామని బెదిరించాడు. ఈ హెచ్చరికతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసి, నగరం నలుమూలల హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు బహుళ పోలీస్ బృందాలను ఏకకాలంలో రంగంలోకి దించారు.లోకేషన్ ట్రేసింగ్.. నిందితుడి అరెస్ట్బెదిరింపు కాల్ రాగానే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్, దర్యాప్తు బృందాలు ఆ ఫోన్ నంబర్, లొకేషన్ను ట్రేస్ చేశాయి. నిందితుడిని పౌరీ జిల్లాలోని యమకేశ్వర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల సోహన్ సింగ్ రావత్గా గుర్తించి, వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల విచారణలో ఊహించని వాస్తవం వెలుగుచూసింది. తాను పీకలదాకా మద్యం సేవించి ఉన్నానని, కేవలం మత్తులోనే ఈ బాంబు బెదిరింపు కాల్ చేశానని నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.హర్ కీ పౌరి ప్రాముఖ్యతశ్రీ మహావిష్ణువు పాదముద్రలు ఉన్నాయని భావించే హర్ కీ పౌరి ఘాట్కు ఎంతో ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. ఇక్కడ సాయంత్రం జరిగే గంగా హారతికి, 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తుతారు. ఇంతటి పవిత్రమైన ప్రదేశంపై బెదిరింపులు రావడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితుడు సోహన్ సింగ్పై హరిద్వార్ నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు హరిద్వార్ ఎస్ఎస్పీ నవనీత్ సింగ్ భుల్లర్ తెలిపారు.ఇది కూడా చదవండి: రైలు బోగీలో మహిళ మొండెం.. లక్నోలో దారుణం -
మసాజ్ పేరుతో 61 మందిపై లైంగిక దాడి.. భారత సంతతి అరెస్ట్
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సుమిత్ అనే వ్యక్తి 61మందిని మసాజ్ పేరుతో వేధించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నేరం రుజువు కావడంతో అతనికి 13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అనంతరం దేశబహిష్కరణ చేసింది.అక్కడి అధికారులు వివరాల ప్రకారం 39 ఏళ్ల సుమిత్ అనే వ్యక్తి 2011లో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అతను అక్టోబర్ 2021 నుంచి జూలై 2022 మధ్య ఒక మసాజ్ పార్లర్లో పని చేశారు. కాగా ఆ సమయంలో మసాజ్ పేరుతో మహిళలను లైంగికంగా వేధించాడు. మహిళల రహస్య వీడియోలు తీసి వారని లైంగికంగా వేదించాడు.కాగా ఈ కేసులో అతనిపై 97 అభియోగాలను నమోదు కాగా అన్నింటిని కోర్టులో అంగీకరించాడు.అయితే ఈ కోసును విచారించిన కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. 61 మంది మహిళలపై లైంగిక దాడి చేసినందుకు గాను సుమిత్కు 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించింది. అతను మహిళల నమ్మకాన్ని ఉల్లంఘించి, మసాజ్ల సమయంలో అనుచితమైన చర్యలకు పాల్పడ్డాడని కోర్టు వ్యాఖ్యానించింది. చికిత్స కోసం వచ్చని మహిళలను వారి నమ్మకాన్ని, భద్రతను దుర్వినియోగం చేశాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే సుమిత్కు సుమిత్కు మసాజ్ థెరపీలో ఎలాంటి అధికారిక అర్హతలు లేనప్పటికీ అక్రమంగా మసాజ్ సెంటర్లో విధులు నిర్వహస్తున్నారని శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడిని ఆస్ట్రేలియా బహిష్కరించవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. -
బండి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్
-
తొలిసారి ‘జిహాదీ డ్రగ్’ పట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా భారీ స్థాయిలో ‘క్యాప్టగాన్’ డ్రగ్ పట్టుబడింది. ‘జిహాదీ డ్రగ్’గా పిలిచే ఈ మత్తుపదార్థాన్ని అంతర్జాతీయ మార్కెట్కు తరలించేందుకు స్మ గ్లర్లు చేసిన యత్నాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమర్థవంతంగా భగ్నం చేసింది. ‘ఆపరేషన్ రేజ్ పిల్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో రూ.182 కోట్ల విలువైన 227.7 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకు న్నారు. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న ఓ సిరియా జాతీయుడిని అరెస్ట్ చేశారు.చపాతీ మిషన్.. గొర్రెల ఉన్ని.. భారత్ ట్రాన్సిట్ హబ్గా క్యాప్టగాన్ డ్రగ్స్ రవాణా జరుగుతోందని ఓ విదేశీ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎన్సీబీకి సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మే 11న న్యూఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఓ ఇంట్లో సోదాలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు వాడే చపాతీలు కట్ చేసే యంత్రంలో అత్యంత రహస్యంగా దాచిన 31.5 కిలోల క్యాప్టగాన్ మాత్రలను గుర్తించి సీజ్ చేశారు. వీటిని సౌదీ అరేబియాలోని జెడ్డాకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. ఈ దాడుల్లో సిరియా జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు 2024 నవంబర్ 15వ తేదీన పర్యాటక వీసాపై భారత్కు వచ్చాడు. 2025 జనవరి 12వ తేదీతో అతడి వీసా గడువు ముగిసింది. అప్పటినుంచి నెబ్ సరాయ్లో అక్రమంగా అద్దెకు ఉంటూ ఈ దందాకు తెరతీశాడు. అతడిచ్చిన సమాచారంతో మే 14న గుజరాత్లోని ముంద్రా కంటైనర్ ఫెసిలిటేషన్ స్టేషన్ (సీఎఫ్ఎస్)లో ఎన్సీబీ తనిఖీలు చేపట్టింది. సిరియా నుంచి గొర్రెల ఉన్ని పేరుతో వచ్చిన ఓ కంటైనర్ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా మూడు బ్యాగుల్లో దాచిన 196.2 కిలోల క్యాప్టగాన్ పౌడర్ లభ్యమైంది. ఈ డ్రగ్స్ను భారత్ మీదుగా సౌదీ అరేబియా సహా గల్ఫ్, పశ్చిమాసియా దేశాలకు తరలించేందుకు స్మగ్లర్లు కుట్ర పన్నారని వెల్లడైంది.ఎవరినీ ఉపేక్షించేది లేదు: అమిత్ షాఆపరేషన్ రేజ్ పిల్ విజయవంతం కావడంపై హోంమంత్రి అమిత్ షా ఎన్సీబీ అధికారులను అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవాణా, వాడకాన్ని ఏమాత్రం సహించేదిలేదని, భారత్ను రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే ఒక్క గ్రాము డ్రగ్స్ను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం క్యాప్టగాన్ (ఫెనెథిల్లిన్ అనే రసాయన సమ్మేళనం) సైకోట్రోపిక్ డ్రగ్. పశ్చిమాసియా దేశాల్లో దీని వాడకం తీవ్రంగా ఉంది. భయం, అలసట, నిద్రను ఎక్కువ కాలంపాటు దరి చేరనివ్వకుండా యుద్ధ క్షేత్రంలో దూకుడుగా వ్యవహరించేందుకు తీవ్రవాదులు దీనిని వాడతారని, అందుకే దీనికి ‘జిహాదీ డ్రగ్’అనే పేరు వచ్చిందని చెప్పారు. భారత్లో ఈ డ్రగ్ పట్టుబడటం ఇదే తొలిసారి. -
నీట్ పేపర్ లీకేజీ కేసులో కింగ్పిన్ అరెస్ట్
న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ వెనుక మాస్టర్ మైండ్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నీట్ పేపర్ తయారీలో కీలక పాత్ర పోషించిన పూణేకి చెందిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణీని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లోనే ఇనిస్టిట్యూట్ నడుపుతున్న పీవీ కులకర్ణి .. ఎన్టీఏ ఏర్పాటు చేసిన క్వశ్చన్ పేపర్ కమిటీలో సబ్జెట్ ఎక్స్పర్ట్గా ఉన్నారు. నీట్ ఎగ్జామ్కు ముందే క్వశ్చన్ పేపర్ ఆయనకు అందింది. ఆ క్వశ్చన్ పేపర్ను తాను ఇంట్లో నడిపే ఇనిస్ట్యూట్ విద్యార్థికి లీక్ చేశాడు. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి సమాధానాలను కాపీ చేసి గుర్తుంచుకునేలా తన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఈ భారీ పేపర్ లీక్ నెట్వర్క్కు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.మరోవైపు నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుమని కేంద్రం ప్రకటించింది. పేపర్ లీకేజీ దుమారం తర్వాత ఈనెల 3వ తేదీనాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ అయ్యారు. -
తమిళనాడు ఎన్నికల్లో నకిలీ ఓటర్లు..?
చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓటు వేశారనే ఆరోపణలతో 25 మంది విదేశీ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైతో పాటు మదురై విమానాశ్రయాల్లో వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకుల నడుమ మిత్రపక్షాల మద్దతుతో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడు ఆ ఎన్నికల్లో నకీలీ ఓట్లు వేసిన 25 మంది విదేశీయులను అధికారులు పట్టుకున్నారు.ఎయిర్పోర్టులో అంతర్జాతీయ విమానం ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులకు చేతిపై ఎలక్షన్ సిరా ఉండడం గుర్తించారు. దీంతో అనుమానం వచ్చన అధికారులు ఇది ఎలా చేతికి వచ్చిందని విచారణ చేయగా వారు అక్రమంగా ఓటు వేసినట్లు తేలింది. వీరంతా శ్రీలంక, కెనడా, ఆస్ట్రేలియా బ్రిటన్ వంటి దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తులు. విదేశీ పాస్పోర్ట్లు ఉన్నప్పటికీ, పాత ఓటర్ ఐడిలను ఉపయోగించి వీరు ఓటు వేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.వీరు చెన్నైలోని పెరంబూర్, కె.కె. నగర్ మరియు పట్టుక్కోట్టై వంటి నియోజకవర్గాల్లో ఓట్లు వేసినట్లు మరికొందరు పుదుచ్చేరిలో సైతం ఓట్లు వేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.వీరిపై 'భారతీయ న్యాయ సంహిత, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విదేశీ పౌరసత్వం తీసుకున్న తర్వాత కూడా భారత ఎన్నికల్లో పాల్గొనడం చట్టరీత్యా నేరం. -
రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్ ‘ది స్కిన్ డాక్టర్’ కి షాక్
నటి కరిష్మా కపూర్ మాజీ భర్త ఆటో విడిభాగాల కంపెనీ సోనా కామ్స్టార్ ఛైర్మన్ సంజయ్ కపూర్ ఆకస్మిక మృతిలో కీలక పరిణామం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో "ది స్కిన్ డాక్టర్" (The Skin Doctor) గా పేరుగాంచిన డాక్టర్ నీలం సింగ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది. దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు.డాక్టర్ నీలం సింగ్ వృత్తిరీత్యా డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధి నిపుణుడు). కేవలం వైద్య విషయాలే కాకుండా రాజకీయాలు, సామాజిక అంశాలు , కరెంట్ అఫైర్స్పై తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. తన యూట్యూబ్ ఛానెల్లో "సామాజిక సమస్యలపై మాట్లాడే చర్మవ్యాధి నిపుణుడు"గా అని తనను తాను అభివర్ణించుకుంటారు. అయితే అతని ఎక్స్ బయోలో, "నేను ముఖ్యం కాదు; నేను చెప్పేదే ముఖ్యం" అని రాసి ఉంటుంది. ఆన్లైన్లో అతనికి భారీ ఫాలోయింగ్ మాత్రమే కాదు, ఆయన పోస్టులు తరచుగా తీవ్రమైన చర్చలు , విమర్శలకు దారితీస్తాయి. తాజా అరెస్ట్ కూడా అందులో భాగమే.అరెస్ట్కు కారణం ఏమిటి?సంజయ్ కపూర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలోని వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్టు సమాచారం.గత ఏడాదిలో జూన్లో సంజయ్ కపూర్ లండన్లో పోలో ఆడుతూ మరణించారు. వైద్య నివేదికల ప్రకారం పోలో ఆడుతుండగా తేనెటీగ మింగిడం వల్ల, అది గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం తర్వాత రూ. 30,000 కోట్ల ఆస్తి వారసత్వం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ మరణం వెనుక ఉన్న పరిస్థితులను ప్రశ్నిస్తూ, ఆయన ఆస్తి , వారసత్వానికి సంబంధించిన అంశాలపై డాక్టర్ సింగ్ ఒక పోస్ట్ పెట్టారు. Yesterday was a long day.I was called for questioning in connection with a case that I believed had no merit, and I attended the questioning to present my version. However, the police arrested me at 5.30 PM.I was granted bail at 10 PM, and the Hon’ble Duty Judge clearly…— THE SKIN DOCTOR (@theskindoctor13) May 14, 2026సంజయ్ కపూర్ భార్య ప్రియా కపూర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, అలాగే మరణానికి కొద్దిరోజుల ముందే ఆయన వీలునామా (Will) రాయడంపై కూడా సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, కల్పితాలని ప్రియా కపూర్ పేర్కొన్నారు. అయితే, స్క్రీన్షాట్లు మరియు తొలగించిన పోస్టుల ప్రామాణికతను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయారు.డాక్టర్ స్పందన బెయిల్పై విడుదలైన తర్వాత డాక్టర్ నీలమ్ సింగ్ ఎక్స్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని నమ్మాను, అందుకే విచారణకు హాజరయ్యానని, బెయిల్ మంజూరైందని తెలిపారు. ఈ కేసులో అసలు నేరమేమీ కనిపించడం లేదని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదని జడ్జి వ్యాఖ్యానించారని కూడా తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులకు, అనుచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో భావప్రకటనా స్వేచ్ఛ మరియు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం, సుప్రీంకోర్టు అసహనం -
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో..
ఢిల్లీ: ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. స్లీపర్ బస్సులో ఓ మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. బస్సులో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలు పీతంపురలోని మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తోంది. మే 11వ తేదీ రాత్రి సదరు మహిళ పని ముగించుకుని ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో సరస్వతి విహార్లోని బస్టాప్ వద్ద ఓ స్లీపర్ బస్సు ఆగింది. బస్సు తలుపు వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె సమయం ఎంత అని అడిగింది. ఆ సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.అనంతరం నిందితులు బస్సును నాంగ్లోయ్ వైపు నడిపారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. బస్సును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుగుతోందని.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. -
ఒబామాను అరెస్టు చేయాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అరెస్టు చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన పరోక్ష పిలుపునిచ్చారు. 2016 ఎన్నికల సమయంలో రష్యా జోక్యంపై జరిగిన దర్యాప్తును ఒక ‘కుట్ర’గా అభివర్ణిస్తూ, ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్టును ట్రంప్ రీ-షేర్ చేశారు.2016లో తన ఎన్నికల ప్రచారాన్ని దెబ్బతీసేందుకు ఒబామా నేతృత్వంలోని యంత్రాంగం కల్పిత ఇంటెలిజెన్స్ సమాచారంతో ‘మోసపూరిత’ దర్యాప్తుకు తెరలేపిందని సదరు పోస్టులో పేర్కొన్నారు.రష్యా దర్యాప్తును అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుంభకోణంగా ట్రంప్ పదేపదే అభివర్ణిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక పత్రాలను వెల్లడించినందుకు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ను ఆయన ప్రశంసించారు.కాగా ట్రంప్ చర్యను డెమొక్రాట్లు, న్యాయ నిపుణులు తీవ్రంగా ఖండించారు. ఒబామా తప్పు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఇవన్నీ కేవలం ‘కుట్ర సిద్ధాంతాలే’నని కొట్టిపారేశారు. రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.మరోవైపు, ట్రంప్ మద్దతుదారులు ఈ పోస్టును స్వాగతించారు. ‘డీప్ స్టేట్’ అవినీతిని అంతం చేసే ప్రక్రియలో భాగంగా దీన్ని చూస్తున్నారు. దీని ప్రభావంతో సోషల్ మీడియాలో #ArrestObama అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్గా మారింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై వైట్ హౌస్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తాజా పరిణామాలు అమెరికా రాజకీయాల్లో నెలకొన్న లోతైన విభజనను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. -
నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 15మంది అరెస్టయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు నాసిక్లో పేపర్ను ముద్రించినట్లు గుర్తించారు. పరీక్షకు 42గంటల ముందు పేపర్ లీక్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు రాజస్థాన్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SOG) దర్యాప్తులో బయటపడింది. కోచింగ్ సమయంలో విద్యార్థులు సౌలభ్యం కోసం తయారు చేసే గెస్ పేపర్లోని 120 ప్రశ్నలు.. నీట్ పరీక్షలోని అసలు ప్రశ్నాపత్రంతో సరిపోవడంతో లీకేజీ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో నీట్ యూజీ 2026 పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పరీక్షను రద్దు చేసి, రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.పేపర్ లీకేజీ కేసులో రాజస్థాన్ ఎస్వోజీ ఇద్దరిని మాస్టర్మైండ్స్గా అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర) లీక్ నెట్వర్క్పై విచారణ కొనసాగుతోంది.22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యారు. ఎన్టీఏ తెలిపిన ప్రకారం.. కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా రీ-ఎగ్జామ్ త్వరలో నిర్వహించనుంది. ఇప్పటికే చెల్లించిన ఫీజులు రిఫండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే పేపర్ లీకేజీతో విద్యార్థుల్లో అనిశ్చితి, మానసిక ఒత్తిడి పెరిగింది.


