29 ఏళ్ల తర్వాత దండుపాళ్యం ముఠా సభ్యుడి అరెస్టు | Dandupalyam gang member arrested after 29 years | Sakshi
Sakshi News home page

29 ఏళ్ల తర్వాత దండుపాళ్యం ముఠా సభ్యుడి అరెస్టు

Jan 24 2026 5:24 AM | Updated on Jan 24 2026 5:24 AM

Dandupalyam gang member arrested after 29 years

దొడ్డబళ్లాపురం: దండుపాళ్యం ముఠా సభ్యుడిని 29 ఏళ్ల తర్వాత మంగళూరులోని ఉర్వ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటె తాలూకా దండుపాళ్యంకి చెందిన నిందితుడు చిక్కహనుమ అలియాస్‌ చిక్క హనుమంతప్ప అలియాస్‌ కృష్ణప్ప (55) ప్రస్తుతం ఏపీలోని మదనపల్లె విజ­య­నగర కాలనీలో కె.కృష్ణగా పేరు మార్చుకుని నివసిస్తున్నాడు. 

మంగళూరు మారి­గుడి క్రాస్‌ వద్ద అన్వర్‌ మహల్‌ అనే వ్యక్తి ఇంట్లోకి 1997 అక్టోబర్‌ 14న అర్ధరాత్రి దండు­పాళ్యం ముఠా సభ్యులు ఎనిమిది మంది చొరబడ్డారు. లూవిస్‌ డిమెల్లో(80), రంజిత్‌ వేగస్‌(19) అనే ఇద్దరిని హత్య చేసి దోపిడీకి పాల్ప­డ్డారు. 

కేసు నమోదు చేసుకున్న ఉర్వ పోలీ­సులు ప్రధాన నిందితుడైన చిక్క­హనుమ మినహా మిగతా నిందితులను అరెస్టు చేశా­రు. పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని ఏపీలో గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. ఇతనిపై 13 హత్య­లు, దోపిడీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement