
ఘనంగా భూదాన వజ్రోత్సవాలు
భూదాన్పోచంపల్లి : భూదానోద్యమానికి అంకురార్పణ జరిగి 75వ వసంతంలోకి అడుగిడిన సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో భూదాన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినోబాభావే మందిరంలో ఉదయం శాంతి యజ్ఞం నిర్వహించారు. అనంతరం టూరిజం పార్కు ఆవరణలో ఉన్న భూదానోద్యమపిత ఆచార్య వినోబాభావే, ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలకు తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, భూభారతి రూపకర్త భూమి సునీల్కుమార్, భూదాన యజ్ఞబోర్డు మాజీ చైర్మన్ రాజేందర్రెడ్డి, సర్వోదయ నాయకులు వెదిరె అరవిందారెడ్డి, తడక వెంకటేశం, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్రెడ్డి, భూభారతి సభ్యులు రాంరెడ్డి, గోపాల్రెడ్డి, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భూభారతి–భూదాన భూముల సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భూభారతి చట్టం వల్ల ప్రతి పేదవాడి భూములకు భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం సీత శ్రీరాములు, తడక ముత్యాలు, కరగల్ల నర్సింహకు భూదాన జయంతి పురస్కారాలను కోదండరెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. వెదిరె రాంచంద్రారెడ్డి, జ్యోతిబాపూలే
విగ్రహాల ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన
చౌటుప్పల్ పట్టణ చౌరస్తాలో ప్రతిష్ఠించనున్న భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి, జ్యోతిబాపూలే విగ్రహాల ఏర్పాటు పనులకు వెదిరె రాంచంద్రారెడ్డి మనుమడు వెదిరె అరవిందారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తడక వెంకటేశం, పోచంపల్లి అర్బన్బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, పాక మల్లేశ్, భారత లవకుమార్, సామ మధుసూధన్రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, కొట్టం కరుణాకర్రెడ్డి, పావనిరెడ్డి, గోవర్థన్, కవిరచయిత గోపాల్, వినోబాభావే సేవా సంఘం నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ, నోముల గణేశ్, మోటె రాజు, గునిగంటి రమేశ్, పోతగల్ల దానయ్య, పెద్దల చక్రపాణి, కొమ్ము లక్ష్మణ్, శ్రీను, కుమార్, వేశాల మురళి, మెరుగు శశికళ పాల్గొన్నారు.
ఫ వినోబాభావే మందిరంలో శాంతి యజ్ఞం
ఫ హాజరైన వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, భూదాన యజ్ఞబోర్డు సభ్యులు

ఘనంగా భూదాన వజ్రోత్సవాలు