సస్యశ్యామలం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

సస్యశ్యామలం చేస్తాం

Apr 29 2025 9:37 AM | Updated on Apr 29 2025 9:37 AM

సస్యశ

సస్యశ్యామలం చేస్తాం

నల్లగొండ : ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పలు ఎత్తిపోతల పథకాలకు, కలెక్టరేట్‌లో రూ.36 కోట్లతో నిర్మించనున్న అదనపు బ్లాక్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జిల్లాలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి డిండి లిప్టు ఇరిగేషన్‌కు ఎదుల ద్వారా నీరు అందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.1800 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. పిల్లాయిపల్లి, శివన్నగూడెం నుంచి నారాయణపురం, చౌటుప్పల్‌ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్టు నిర్మాణం చేపడతామన్నారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్షించి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వానాకాలం, యాసంగి కలుపుకుని 2.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించి రికార్డు సృస్టించామన్నారు. తాము రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. జిల్లా నుంచి పిలిిప్పిన్స్‌కు బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు.

ప్రణాళికా బద్ధంగా జిల్లా అభివృద్ధి..

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రూ.36 కోట్లతో కలెక్టరేట్‌ అదనపు బ్లాక్‌, రూ.50 కోట్లతో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టరేట్‌ నిర్మించారని.. ఇప్పుడు పథకాలు పెరగడం, కార్యాలయాల పెంపు వల్ల కలెక్టరేట్‌ సరిపోవడం లేదన్నారు. ప్రస్తుతం నిర్మించే అదనపు భవనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి బయట ఉన్న డీఈఓ, డీఎంహెచ్‌ఓ కార్యాలయాలను కూడా కలెక్టరేట్‌కు తీసుకొస్తామన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రణాళికా బద్ధంగా జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నామన్నారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రులు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉద్యోగులు ఇంట్లో కంటే ఎక్కువ సమయం కార్యాలయాల్లో ఉంటారని తెలిపారు. ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా విశాల భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్‌, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బాలునాయక్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం మాట్లాడారు. అనంతరం ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు తొలి విడత రూ.లక్ష చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, మందుల సామేల్‌, డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్‌, రాజ్‌కుమార్‌, నీటిపారుదల సీఈ అజయ్‌కుమార్‌, డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి, ఉదయసముద్రం ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈఈ సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఫ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్ష

ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఫ రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణం

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఫ కలెక్టరేట్‌లో అదనపు భవన సముదాయం, ఎత్తిపోతల పనులకు శంకుస్థాన

సస్యశ్యామలం చేస్తాం1
1/1

సస్యశ్యామలం చేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement