మానవాళికి సోషలిజమే ప్రత్యామ్నాయం | - | Sakshi
Sakshi News home page

మానవాళికి సోషలిజమే ప్రత్యామ్నాయం

Apr 22 2025 1:56 AM | Updated on Apr 22 2025 1:56 AM

మానవాళికి సోషలిజమే ప్రత్యామ్నాయం

మానవాళికి సోషలిజమే ప్రత్యామ్నాయం

ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి

మిర్యాలగూడ : మానవాళికి సోషలిజమే ప్రత్యామ్నాయమని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో నిర్వహించిన సీపీఎం జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎర్రజెండాకు ఆదరణ పెరుగుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎజెండా లేకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మత రాజకీయం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. ఎర్రజెండా ఒక్కటే నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. మేడే రోజున మిర్యాలగూడలో జరిగే మహా ప్రదర్శనకు కార్మికులు, పేదలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు నూకల జగదీశ్ఛంద్ర, గాదె పద్మ, ముడావత్‌ రవినాయక్‌, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, శఽశిధర్‌రెడ్డి, వినోద్‌నాయక్‌, రొండి శ్రీనివాస్‌, రెమడాల పరుశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, అయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement