ఆహార భద్రతను అమలు చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

ఆహార భద్రతను అమలు చేస్తున్నాం

Apr 16 2025 11:04 AM | Updated on Apr 16 2025 11:04 AM

ఆహార భద్రతను అమలు చేస్తున్నాం

ఆహార భద్రతను అమలు చేస్తున్నాం

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నల్లగొండ : జిల్లాలో ఆహార భద్రత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌, సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకంపై పేదలంతా సంతోషంగా ఉన్నారని.. వారికి ఆహార భద్రత అందుతోందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్న బియ్యంతో భోజనం, పప్పు, బాలామృతం, గుడ్డు, పాలతో పౌష్టికాహారం, తృణధాన్యాలతో లడ్డూలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వసతిగృహాల్లో ప్రభుత్వం పెంచిన డైట్‌ చార్జీల ప్రకారం భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. దేవరకొండ ప్రాంతంలో మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు శారద, భారతి, జ్యోతి మాట్లాడుతూ రేషన్‌ దుకాణాల్లో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్‌ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement