
మూసీకి 532 క్యూసెక్కుల ఇన్ఫ్లో
మూసీ రిజర్వాయర్
కేతేపల్లి : జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది యాసంగిలో ఆయకట్టులో పంటల సాగుకు ఈనెల మొదటి వారంలో నీటి విడుదల నిలిపి వేసే నాటిని రిజర్వాయర్లో నీటిమట్టం 622 అడుగుల డెడ్స్టోరేజీకి (గరిష్ట నీటిమట్టం 645 అడుగులు) తగ్గిపోయింది. ఇరవై రోజుల నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మూసీకి ఇన్ఫ్లో ప్రారంభమైంది. ఇరవై రోజుల వ్యవధిలో ప్రాజెక్టు నీటిమట్టం ఎనిమిది అడుగులు పెరిగి శనివారం సాయంత్రానికి 630.50 అడుగులకు చేరుకుంది. శనివారం మూసీకి ఎగువ నుంచి 532 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఆవిరి, లీకేజీల రూపంలో 52 క్యూసెక్కుల నీరు వృథా అవుతోందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. 4.46 టీఎంసీల గరిష్ట నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్లో ప్రస్తుతం 1.43 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.