
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు
కేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన చల్లా రఘురాములు, చల్లా అశోక్, దిలీప్ కలిసి ఖమ్మంలో తమ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తున్నారు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ జంక్షన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రఘురాములు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
కారు ఢీకొని..
బీబీనగర్: బైక్ను కారు ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూరుకు చెందిన వినయ్, గౌతమ్ బైక్పై హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్తుండగా.. బీబీనగర్ మండల కేంద్రంలోకి రాగానే వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినయ్, గౌతమ్కు గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.