మేడేను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మేడేను జయప్రదం చేయాలి

Apr 28 2025 1:40 AM | Updated on Apr 28 2025 1:40 AM

మేడేను జయప్రదం చేయాలి

మేడేను జయప్రదం చేయాలి

మిర్యాలగూడ : ప్రపంచ కార్మికుల దినోత్సవమైన మే డేను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో మేడే కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల హక్కులను, చట్టాలను రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా రూపొందించాలని చూస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు అమల్లోకి వస్తున్నాయని, వీటిని తిప్పికొట్టేందుకు కార్మికులు ఐక్యంగా ఉండి బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేయాలని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హక్కుల సాధనకు కార్మికులు ఐక్యంగా పోరడాలని పిలుపునిచ్చారు. మేడే రోజు సాయంత్రం మిర్యాలగూడ పట్టణంలో జరిగే భారీ ర్యాలీకి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, నాయకులు నూకల జగదీశ్ఛంద్ర, సత్యనారాయణరావు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్‌, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, శశిధర్‌రెడ్డి, వినోద్‌నాయక్‌, రొండి శ్రీనివాస్‌, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement