
పాఠ్య పుస్తకాలు వచ్చేస్తున్నాయ్!
50 శాతం వచ్చాక పంపిణీ
50 శాతం పాఠ్య పుస్తకాలు జిల్లాకు వచ్చిన తర్వాత వాటిని ఆయా మండలాల వారీగా పంపిణీ చేస్తాం. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – భిక్షపతి, డీఈఓ
నల్లగొండ : పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు అందించే విధంగా విద్యా శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యార్థులకు యూనిఫామ్కు సంబంధించి క్లాత్ రావడంతో మహిళా సంఘాలకు అప్పగించి కుట్టిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు కూడా చేరుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 1483 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మొత్తం 5,89,970 పాఠ్యపుస్తకాలు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 1,98,100 పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరాయి. అంటే 33.57 శాతం పుస్తకాలు వచ్చాయి. వాటిని జిల్లా కేంద్రంలోని బుక్ డిపోలో భధ్రపరుస్తున్నారు. ఇంకా 3,91,870 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది.
మీడియంల వారీగా..
పాఠ్యపుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో ముద్రించారు. ఇక, పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై ప్రత్యేక నంబర్లను ముద్రిస్తున్నారు. ఆ నెంబర్ల ఆధారంగా వచ్చిన పుస్తకాలను బుక్డిపోలో నమోదు చేస్తున్నారు. ఏ నంబర్ పుస్తకాలు ఏ మండలాలకు వెళ్తున్నాయో అని నమోదు చేస్తారు. ఇలా పుస్తకాలపైనే నంబర్లు ముద్రించడం వల్ల వాటిని బయట విక్రయించేందుకు అవకాశం ఉండదు.
ఫ జిల్లాకు చేరిన 1.85 లక్షల పుస్తకాలు
ఫ ప్రత్యేక నంబర్తో ముద్రణ
ఫ పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు అందించేలా ప్రణాళిక

పాఠ్య పుస్తకాలు వచ్చేస్తున్నాయ్!