
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
నల్లగొండ : పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ శరత్చంద్రపవార్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. కేసులను పారదర్శకంగా విచారణ చేయాన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలని సూచించారు. ప్రతి అధికారికి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్పై అవగాహన ఉండాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు రోజూ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. సైబర్ క్రైం, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ.. వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని తెలిపారు. రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్ రాజు, లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఏడుగురికి పదోన్నతి
పదోన్నతి పొందిన వారికి బాధ్యతలు పెరుగుతాయని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్మర్డ్ రిజర్వు విభాగంలో పనిచేస్తున్న ఏడుగురు కానిస్టేబుళ్లు.. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా ఎస్పీ వారికి పట్టీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విధులను క్రమశిక్షణ, బాధ్యతతో నిర్వర్తించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ సంతోష్ పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్

పెండింగ్ కేసులను పరిష్కరించాలి