రేపు దేవరకొండలో వాహనాల వేలం | - | Sakshi
Sakshi News home page

రేపు దేవరకొండలో వాహనాల వేలం

Apr 21 2025 8:17 AM | Updated on Apr 21 2025 8:17 AM

రేపు

రేపు దేవరకొండలో వాహనాల వేలం

దేవరకొండ : దేవరకొండ ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలను జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 22న వేలం వేయనున్నట్లు దేవరకొండ ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ద్విచక్ర వాహనాలకు రూ.10 వేలు, ఫోర్‌ వీలర్‌కు రూ.30 వేలు డిపాజిట్‌ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వేలంలో ఎలాంటి వాహనం కొనని పక్షంలో డిపాజిట్‌ తిరిగి ఇస్తామని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే వారు 22వ తేదీ ఉదయం 10గంటల లోగా తమ పేరును నమోదు చేసుకోవాలని సీఐ సూచించారు.

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌

పరీక్షలు ప్రారంభం

నల్లగొండ : ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఇంటర్‌ తెలుగు పరీక్షకు 1,813 మందికిగాను 1545 మంది హాజరయ్యారు. 268 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్‌ అరబిక్‌ పరీక్షకు 42 మందికి 33 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. టెన్త్‌ తెలుగు పరీక్షకు జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,310 మందికి 1,137 మంది హాజరయ్యారు. 173 మంది పరీక్ష రాయలేదు. పరీక్ష కేంద్రాలను డీఈఓ భిక్షపతి, ప్లయింగ్‌ స్క్యాడ్‌ బృందాలు తనిఖీ చేశాయి.

సాగర్‌లో పర్యాటకుల

సందడి

నాగార్జునసాగర్‌ : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకుల వచ్చారు. బుద్ధవనాన్ని సందర్శించారు. లాంచీలో నాగార్జున కొండకు వెళ్లి బుద్ధుడికి సంబంధించిన చైత్యాలు, బుద్ధుని విగ్రహాలు, అలనాటి నదీలోయ నాగరికత పనిముట్లను, మ్యూజియాన్ని సందర్శించారు.

ఉద్యోగ నోటిఫికేషన్‌

విడుదల చేయాలి

చిట్యాల: రాష్ట్రంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్‌ డిమాండ్‌ చేశారు. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఆ సంఘం మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోమవారం ఇండియాకు అమెరికా ఉపాధ్యక్షుడు రానుండడంతో శ్రీగో బ్యాక్‌శ్రీ నినాదంతో నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మహాసభలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జిట్ట రమేష్‌, మండల అధ్యక్షుడు పంది నరేష్‌, మండల కార్యదర్శి వడ్డెగాని మహేష్‌, మెట్టు పరమేష్‌, అవిశెట్టి కిరణ్‌, దేశబోయిన నర్సింహ, కూనురు గణేశ్‌, బాతరాజు గోపాల్‌ పాల్గొన్నారు.

రేపు దేవరకొండలో  వాహనాల వేలం1
1/1

రేపు దేవరకొండలో వాహనాల వేలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement