
రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు
నల్లగొండ : రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లా వ్యాప్తంగా 41,157 మంది నేరుగా దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 60 వేల మందికిపైగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు సోమవారంతో ముగిసింది.
ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
యువత స్వయం ఉపాధి పొందేలా వారికి ఆర్థిక చేయూత అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రభుత్వం మొదట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఈ నెల 4వ తేదీ చివరి గడువుగా పేర్కొంది. తర్వాత దరఖాస్తు గడువను 14వ తేదీ వరకు పొడిగించి గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయంలో, పట్టణ వాసులు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఆయా చోట్ల ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడే దరఖాస్తు పారాలు అందుబాటులో ఉంచింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు కూడా హార్డ్ కాపీని ఆయా కార్యాలయాల్లో అందజేయాలని సూచించింది. గడువు ముగిసే నాటికి 41,157 మంది నేరుగా దరఖాస్తు చేసుకోగా, ఆన్లైన్లో 60 వేల పైచిలుకే దరఖాస్తులు వచ్చాయి. వాటి పూర్తి వివరాలు ఇంకా తేలలేదు.
ఫ నేరుగా 41,157 మంది..
ఆన్లైన్లో 60వేలకు పైగా..
ఫ ముగిసిన దరఖాస్తుల గడువు
ఆయా కార్పొరేషన్ల వారీగా వచ్చిన ఆఫ్లైన్ దరఖాస్తులు..
కార్పొరేషన్ దరఖాస్తులు
ఎస్సీ 11,375
ఎస్టీ 5,698
బీసీ 20,915
ఈబీసీ 800
మైనార్టీ 2,173
క్రిస్టియన్ 96