
జైలును పరిశుభ్రంగా ఉంచాలి
జైలును శుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ షమీం అక్తర్ సూచించారు.
శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఫ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఫ 42 డిగ్రీలకుపైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
ఫ మే నెలలో 46 డిగ్రీలకు చేరే అవకాశం
ఫ ఇప్పటికే ఆల్ట్రా వైలెట్ (యూవీ) 10 శాతం నమోదు
ఫ ఈ పరిస్థితుల్లో జనంతోపాటు.. పశుపక్షాదుల రక్షణ తప్పనిసరి
ఫ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కాపాడుకోవాలి
ధాన్యం కొనుగోళ్లను
వేగవంతం చేయాలి
పెద్దవూర : ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. పెద్దవూర మండలంలోని చలకుర్తి, పులిచర్ల, చింతపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఏఈఓలు సర్టిఫైడ్ చేసిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలన్నారు. రైతులు ధాన్యాన్ని ఇళ్ల వద్దనే ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఏపీఎం గంజి లలిత, సీసీలు సత్యనారాయణ, లింగయ్య తదితరులు ఉన్నారు.
యాదగిరి క్షేత్రంలో
ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం చేపట్టారు.అంతకుముందు ప్రధానాలయంలో నిత్యపూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన చేశారు. ఇక ప్రాకార మండపపం, ముఖ మండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవంత తదితర పూజలు నిర్వహించారు.
పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి
సూర్యాపేట అర్బన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని నిర్వహించి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో ఆ జేఏసీ జిల్లా చైర్మన్ షేక్ జానీమియా, అడిషనల్ జనరల్ సెక్రెటరీ తంగెళ్ల జితేందర్రెడ్డి, ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ పాండు నాయక్, డిప్యూటీ సెక్రెటరీ జనరల్ దున్న శ్యామ్, కో చైర్మన్లు వీరన్న, డిప్యూటీ సెక్రటరీ జనరల్ లక్కపాక ప్రవీణ్, జహంగీర్, జాయింట్ సెక్రెటరీ డి.స్వప్న, సీటీఓ డిపార్ట్మెంట్ చైర్మన్ రవీందర్ బాబు, నాయిని ఆకాష్ వర్మ, ఎం.సైదులు, బి.వెంకన్న, సతీష్, రవి, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ : వాతావరణ మార్పుల కారణంగా ఎండలు మండుతున్నాయి. ఓజోన్ పొర దెబ్బతిని సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి పెరిగి జనం అల్లాడుతున్నారు. డీ హైడ్రేషన్కు గురవుతున్నారు. దీనికి తోడు ఏసీల వాడకం పెరగడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఈ కారణంగా జిల్లాలో ఆల్ట్రా వైలెట్ (యూవీ) పది శాతం నమోదవుతోంది. ఆకాశంలో తెల్లటి మేఘాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనం జాగ్రతలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి మంగ్యానాయక్ సూచిస్తున్నారు.
కోదాడ, రామగిరి(నల్లగొండ), నకిరేకల్ : వేసవిలో జంతు ప్రేమికులు వారి పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.
● ఎప్పటికప్పుడు శుభ్రమైన, చల్లటి నీటిని
అందుబాటులో ఉంచాలి.
● పెంపుడు జంతువు ఉండే ప్రాంతం చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. గాలి వేగంగా వెళ్తున్న స్థలాన్ని ఎంచుకోవాలి.
● మధ్యాహ్నం సమయంలో నేలపై నడవనివ్వకూడదు.
● ఊపిరాడకపోవడం, అలసట, అధిక నిద్ర లాంటి లక్షణాలను గ్రహించాలి. వాటి శరీరానికి తగినంత గాలితీసుకునే అవకాశం ఇవ్వాలి.
● పెంపుడు జంతువులు ఉండే ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయకుండా.. గాలి మార్పిడి ఉండేలా చూసుకోవాలి.
● తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి.
● వేసవి ఒత్తిడిని తగ్గించడానికి వాటికి టానిక్లను తాగించాలి.
● పక్షుల సంరక్షణకు ఇంటి గోడలు, వరండాలు, డాబాలపై చిన్నచిన్న చిప్పల్లో నీళ్లు పోసి ఉంచాలి.
● వీటి పక్కనే చిరుధాన్యపు గింజలు పోసి ఉంచాలి.
● రోడ్ల వెంట ఉండే చెట్ల మొదళ్ల వద్ద కూడా నీటి వసతులు కల్పించాలి.
సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్లో పాల్గొనాలి
వేసవిలో పక్షులు దాహార్తి తీర్చడానికి ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కానీల్లో నీటి చిప్పలు, కృతిమ గూళ్లను, ఫీడర్లను ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కనీల్లో పిట్టగోడలపై పిల్లల చేత నీటి కుప్పలను ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. ధాన్యపు చిప్పలను కూడా ఏర్పాటు చేసి పక్షుల మనుగడకు దోహదపడాలి. సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్లో అందరూ భాగస్వాములు కావాలి.
– కనుకుంట్ల విద్యాసాగర్రెడ్డి, ఉపాధ్యాయుడు, నకిరేకల్
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్
నల్లగొండ టౌన్ : దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి నిర్మూలనకు దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంబించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాధి అనాఫిలస్ అనే దోమ కుట్టడం ద్వారా వస్తుందని.. డెంగీ, చికున్ గున్యా, బోధకాలు, మెదడువాపు వ్యాధి కూడా దోమ కుట్టడం ద్వారానే వస్తాయన్నారు. నీటి నిల్వ లేకుండా చూసుకోవడం వల్ల దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కళ్యాణచక్రవర్తి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ పద్మ, డాక్టర్ కృష్ణకుమారి, డాక్టర్ గీతావాణి, విష్ణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా నిత్యకల్యాణం
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. ముందుగా వేకువజామున సుప్రభాత సేవల, తోమాల సేవ, సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారికి కల్యాణం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కుంకుమార్చన నిర్వహించారు.
మే 3 వరకు పింఛన్ల పంపిణీ
నల్లగొండ : ఆసరా పింఛన్లను మే 3వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల, చేయూత పింఛన్లను ఆయా పోస్టాపీసుల్లో అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
న్యూస్రీల్
పెంపుడు జంతువులు – జాగ్రత్తలు..

జైలును పరిశుభ్రంగా ఉంచాలి

జైలును పరిశుభ్రంగా ఉంచాలి

జైలును పరిశుభ్రంగా ఉంచాలి

జైలును పరిశుభ్రంగా ఉంచాలి

జైలును పరిశుభ్రంగా ఉంచాలి

జైలును పరిశుభ్రంగా ఉంచాలి