
తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి
మర్రిగూడ: ప్రస్తుత వేసవిలో మండలంలోని అన్ని గ్రామాలు, తండాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం మర్రిగూడ ఎంపీడీఓ కార్యాలయంలో తాగునీరు, ఉపాధిహామీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే పరిష్కరించాలని, మండల స్థాయిలో వీలుకాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉపాధిహామీ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అన్ని పనులు పూర్తిచేయాలన్నారు. 200 ఇళ్లకు ఒక అధికారి నియామకం, జాబితా పరిశీలన తదితర అంశాలపై సమీక్షించారు. అంతకుముందు కలెక్టర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్యసేవలపై వైద్యులతో మాట్లాడారు. ఓ బాలికకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఆసుపత్రికి రాగా వెంటనే అందించాలని, తమ భూమి తమకు పట్టా చేయడం లేదని ఓ బాధితురాలు కలెక్టర్కు వినతిపత్రం అందించగా ఈ నెల 25లోపు సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఆమె వెంట చండూరు ఆర్డీఓ వి.శ్రీదేవి, తహసీల్దార్ బక్క శ్రీనివాస్, ఎంపీడీఓ జి.చినమునయ్య ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి