మాటకు కట్టుబడి పనిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

మాటకు కట్టుబడి పనిచేస్తాం

Apr 30 2025 12:55 AM | Updated on Apr 30 2025 12:55 AM

మాటకు కట్టుబడి పనిచేస్తాం

మాటకు కట్టుబడి పనిచేస్తాం

శాలిగౌరారం : ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాలిగౌరారంలో మంగళవారం భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకే భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అధికారులే గ్రామాలకు వస్తారని రైతులు వారికున్న భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూభారతి చట్టంలో 80 శాతం భూ సమస్యలు తహసీల్దార్‌ వద్దనే పరిష్కారమవుతాయన్నారు. కాంగ్రెస్‌ది ప్రజా ప్రభుత్వమని రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, భూభారతి చట్టం వంటి అనేక ప్రతిష్టాత్మక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు.

రికార్డుల సవరణకు అవకాశం : కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

భూభారతి చట్టంలో రికార్డుల సవరణకు అవకాశం ఉందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. భూములకు సంబందించిన రికార్డులను ప్రతీ సంవత్సరం డిసెంబర్‌ 31న గ్రామపంచాయతీ పరిధిలో ప్రదర్శిస్తామని.. ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చని తెలిపారు. రైతులు భూ సమస్యలపై అడిగిన సందేహాలను కలెక్టర్‌ వేదికపై ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డుపై విశదీకరిస్తూ అవగాహన కల్పించారు. ఆ సమయంలో కొందరు రైతులు తమ భూ సమస్యలను అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని చెప్పే క్రమంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో వేదికపై ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే రైతుల సమస్యలను పరి ష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మాన్యానాయక్‌, తహసీల్దార్‌ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, మార్కెట్‌ చైర్మన్‌ పాదూరి శంకర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నర్సింహ, పీఏసీఎస్‌ చైర్మన్‌ తాళ్లూరి మురళి, చామల మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement