ఉమ్మడి జిల్లా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రానికి మార్గదర్శకం కావాలి
ఎంపీ, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు ఏం మాట్లాడారంటే..
● భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణలో మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెట్టకుండా, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులు లేకుండా చూడాలని కోరారు.
● ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఐలయ్య మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ముందుగానే ధాన్యం సేకరణ పూర్తి చేయడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.
● మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఇసుక ఇచ్చేందుకు మిర్యాలగూడలో ఇసుక డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరారు.
● నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి మాట్లాడుతూ రైతులకు వానాకాలం పంటలపై అవగాహన కల్పించాలని కోరారు.
● ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషంగా ఉందన్నారు.
● ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ధాన్యం సేకరణలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.
ఫ పేదల సంక్షేమానికి అధికారులు కట్టుబడి పనిచేయాలి
ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వర్రావు
ఫ సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా
సమీక్ష సమావేశం
ఫ హాజరైన మంత్రులు కోమటిరెడ్డి,
ఉత్తమ్, ఎంపీ, ఎమ్మెల్యేలు
భానుపురి (సూర్యాపేట) : ‘ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి మనందరం పునరంకితమవుదా.. జిల్లా సర్వతోముఖాభివృద్ధి.. రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలవాలి’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భునవగిరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టంపై శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అధికారులు నిర్లిప్తత వదిలేసి పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తూ ఉమ్మడి జిల్లాను అన్నింటా అగ్రస్థానంలో నిలపాలన్నారు. రానున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి ప్రజల సేవకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాకు ఈ సంవత్సరం లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను మంజూరు చేస్తామని, ఇందుకుగాను స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్లను కోరారు. నల్లగొండ జిల్లాకు అదనంగా ఏఈఓలు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఏఈఓలను నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని పేర్కొన్నారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్.. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, వ్యవసాయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు ఆయా జిల్లాలకు సంబంధించిన వివరాలను సమీక్ష సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో సూర్యాపేట ఎస్పీ నరసింహ, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఆయా జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి పునరంకితం