రిషబ్ పం‍త్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ | Rishabh Pant fined by BCCI after LSGs defeat to RCB | Sakshi
Sakshi News home page

IPL 2025: రిషబ్ పం‍త్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ

May 28 2025 11:05 AM | Updated on May 28 2025 4:11 PM

Rishabh Pant fined by BCCI after LSGs defeat to RCB

ఐపీఎల్‌-2025 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ప‌రాజ‌యం పాలైంది. అయితే ఓట‌మి బాధలో ఉన్న ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు మ‌రో బిగ్‌ షాక్ త‌గిలింది.

ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ పంత్‌కు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ ఎడ్వైజ‌రీ క‌మిటీ విధించింది. అలాగే జ‌ట్టులో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా అంద‌రూ రూ. 12 ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం జ‌రిమానాగా చెల్లించాల‌ని స‌ద‌రు క‌మిటీ ఆదేశించింది.

ఈ ఏడాది సీజ‌న్‌లో ల‌క్నో జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేట్‌ను న‌మోదు చేయ‌డం ఇది మూడో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జ‌రిమానా విధించారు. "ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సార‌థి రిష‌బ్ పంత్‌కు జరిమానా విధించాం. ఏకానా స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాము. ఇది మూడో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ ప్రకారం పంత్‌ కు రూ. 30 లక్షలు ఫైన్ వేశాము ’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్ అద్బుతమైన సెంచ‌రీతో చెల‌రేగాడు. సీజ‌న్ ఆరంభం నుంచి విఫ‌ల‌మైన పంత్‌.. త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. రిషబ్‌ 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది.  అనంతరం  228 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.
చదవండి: IND Vs ENG: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. దిలీప్‌కు మ‌ళ్లీ పిలుపు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement