బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. దిలీప్‌కు మ‌ళ్లీ పిలుపు | BCCI Reinstates T Dilip As India’s Mens Team Fielding Coach For England Tests, Check Story Inside | Sakshi
Sakshi News home page

IND Vs ENG: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. దిలీప్‌కు మ‌ళ్లీ పిలుపు

May 28 2025 8:47 AM | Updated on May 28 2025 9:59 AM

BCCI reinstates T Dilip as India’s fielding coach for England Tests

భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్‌ మళ్లీ ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) దిలీప్‌ను మరో సారి ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించింది. 2021 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు దిలీప్‌ టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించగా...  ఆ్రస్టేలియాలో ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో సహాయక కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో పాటు దిలీప్‌ను తొలగించింది.

ఫీల్డింగ్‌ కోచ్‌గా విదేశీయుడిని నియమించాలని బోర్డు ప్రయత్నించనా... అది వీలు కాకపోవడంతో జట్టు సభ్యులతో  మంచి అనుబంధం ఉన్న దిలీప్‌ను తిరిగి ఎంపిక చేసింది. "దిలీప్‌ చాలా మంచి కోచ్‌. నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పనిచేశాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. 

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అతడిని తిరిగి నియమించాం"అని బోర్డు అధికారి వెల్లడించారు. ఇక మరోవైపు భారత టెస్టు కొత్త కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్, సుదర్శన్‌  జూన్‌ 6 నుంచి ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగే వార్మప్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ జూన్‌ 20 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: జితేశ్‌ జితాదియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement