breaking news
BCCI
-
మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు ఆర్దిక చేయూత
భారత క్రికెటర్స్ అసోసియేషన్ (ICA) కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు రూ. లక్ష గ్రాంట్ను ప్రకటించింది. ఈ మొత్తాన్ని అర్హులైన వితంతువులకు ఒక్కసారిగా చెల్లిస్తారు. ఈ స్కీమ్ తొలి దఫాలో దాదాపు 50 మందికి లబ్ది చేకూరే అవకాశం ఉంది. మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఈ స్కీమ్ను ప్రవేశపెట్టినట్లు ICA తెలిపింది.ఈ పథకానికి ప్రస్తుతం ఆమల్లో ఉన్న మిగతా పథకాలతో సంబంధం లేదు. అవి కొనసాగుతుండగానే, ఈ కొత్త పథకం అమల్లోకి వస్తుంది. ICA ఇప్పటికే మరణించిన భారత మాజీ టెస్ట్ క్రికెటర్ల భార్యలకు నెలసరి పెన్షన్ ఇస్తుంది. కొత్త పథకానికి ICA వార్షిక సంవత్సర రెండో బోర్డు మీటింగ్లో ఆమోదం లభించింది.కాగా, మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండంగా నిలవడమే ధ్యేయంగా ICA ఏర్పాటు చేయబడింది. దీన్ని 2019లో స్థాపించారు. ICAలో 1750కు పైగా భారత మాజీ క్రికెటర్లు సభ్యులుగా ఉన్నారు. ICA ఇప్పటికే 60 దాటి, పెన్షన్ లభించని మాజీ క్రికెటర్లకు సీనియర్ మెంబర్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ కింద రూ. లక్ష ఆర్దిక సాయం చేస్తుంది. అలాగే సభ్యుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వీటికి అదనంగా ప్రతి సభ్యుడికి ఏడాదికోసారి కంప్లీట్ బాడీ చెకప్ ప్రోగ్రామ్ను కూడా చేపడుతుంది. -
ODIs: ‘కోహ్లిని తప్పించలేరు.. రోహిత్ శర్మపై వేటు వేసేందుకు కుట్ర?’
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి (Manoj Tiwary) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో అంతర్గత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. వన్డే ప్రపంచకప్-2027 నాటికి రోహిత్ తనకు తానుగా తప్పుకొనేలా చేయాలని చూస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.కొత్తగా బ్రోంకో టెస్టు అయితే, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) దగ్గర మాత్రం వారి పప్పులు ఉడకవని మనోజ్ తివారి పేర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే.. బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్షకు కొత్తగా బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రగ్బీ, ఫుట్బాల్ ఆటగాళ్లకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్ను పరీక్షించాలని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (CoE) నిర్ణయించింది.ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. తర్వాత దీనిని 40, 60 మీటర్లకు పెంచుతారు. ఈ మూడూ కలిపి ఒక సెట్ కాగా.. మొత్తంగా ఐదు సెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే.. ఓవరాల్గా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా ఆటగాడు వేగంగా పరుగుతీయాలి. ఇందుకు కేవలం ఆరు నిమిషాల సమయం ఉంటుంది.కోహ్లిని తప్పించలేరు.. రోహిత్పై వేటు వేసేందుకు కుట్రఈ నేపథ్యంలో బ్రోంకో టెస్టు గురించి మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల నుంచి విరాట్ కోహ్లిని తప్పించడం అంత తేలికేమీ కాదు. అయితే, రోహిత్ శర్మపై విషయంలో మాత్రం వారు సఫలమయ్యే అవకాశం ఉంది. భారత క్రికెట్లో ఏం జరుగుతుందో నేను గత కొన్నాళ్లుగా నిశితంగా పరిశీలిస్తున్నా.కొన్ని రోజుల క్రితం బ్రోంకో టెస్టు ప్రవేశపెట్టారు. రోహిత్ శర్మ లాంటి వాళ్లను బయటకు పంపేందుకే ఇలాంటి కఠినమైన ఫిట్నెస్ పరీక్షను తీసుకువచ్చారు. అన్నిటికంటే ఇదే టఫెస్ట్ ఫిట్నెస్ టెస్టు. అయినా.. ఇప్పుడే ఇది ఎందుకు ప్రవేశపెట్టారు? హెడ్కోచ్గా తొలి టెస్టు సిరీస్కు సన్నద్ధమైనపుడే దీనిని తీసుకురావాల్సింది.ఈ ప్రశ్నలకు నాకైతే బదులు తెలియదు. అయితే, నిశితంగా పరిశీలిస్తే మాత్రం రోహిత్ శర్మ ఈ టెస్టు పాస్ కావడం కష్టం. అతడు ఫిట్నెస్పై అంతగా దృష్టి పెట్టడు. బ్రోంకో టెస్టు ద్వారా అతడిని ఆపేయాలనే ఉద్ధేశంతో ఉన్నారని నాకు సందేహం’’ అంటూ మనోజ్ తివారి పరోక్షంగా హెడ్కోచ్ గౌతం గంభీర్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.చదవండి: ఒక్క సిక్స్తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్ -
BCCI:‘డ్రీమ్ 11’తో కటీఫ్!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్షిప్ నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ను తప్పించారు. డ్రీమ్ ఎలెవన్తో ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్’ ప్రకారం ఇకపై ‘డ్రీమ్ 11’ తన కార్యకలాపాలు కొనసాగించే అవకాశం లేదు. దాంతో ఆరి్థకపరంగా ఆ కంపెనీకి భారం కావడంతో పాటు ప్రభుత్వం నిషేధించిన సంస్థతో ఒప్పందాన్ని కొనసాగించరాదని బోర్డు కూడా నిర్ణయించింది. ‘మాకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం డ్రీమ్ 11 లేదా అలాంటి ఏ గేమింగ్ కంపెనీతోనైనా బీసీసీఐ ఒప్పందాన్ని కొనసాగించదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒప్పందం రద్దు చేయాల్సిందే. ప్రధాన స్పాన్సర్గా మరో కొత్త కంపెనీ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రక్రియ ఇంకా ఆరంభ దశలోనే ఉంది’ అని సైకియా వెల్లడించారు. ‘డ్రీమ్ 11తో ఒప్పందం 2026 వరకు ఉంది. అయితే తాజా పరిణామాల్లో డ్రీమ్ 11 వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఉల్లంఘన అనే మాటే తలెత్తదని సైకియా చెప్పారు. ‘ప్రధాన స్పాన్సర్ పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. చెల్లింపుల ఉల్లంఘనలాంటివేమీ వర్తించవు కాబట్టి వారిపై ఎలాంటి జరిమానా కూడా విధించడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి అందరూ పాటించాల్సిందే. వారి వ్యాపారం దెబ్బ తినడమే కాదు, బీసీసీఐ లాభాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటిగా ఉన్న ‘మై సర్కిల్ 11’తో కూడా ఒప్పందం ముగియడం ఖాయమైంది. ‘మై సర్కిల్ 11’ ఏడాదికి రూ. 125 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 625 కోట్లతో బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆసియా కప్లోగా సాధ్యమేనా! ‘డ్రీమ్ 11’ తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఆసియా కప్కు ముందే ఈ ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నా...అది సాధ్యం కాకపోవచ్చు. సెపె్టంబర్ 9 నుంచే టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సర్ కోసం ప్రకటన ఇచ్చి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి ఆసియా కప్లో టీమిండియా ప్రధాన స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇది మరింత ఆలస్యం అయితే వన్డే వరల్డ్ కప్లో మహిళల జట్టు కూడా స్పాన్సర్ లేకుండానే ఆడుతుంది. భారత జట్టుతో జత కట్టేందుకు జపాన్కు చెందిన ప్రఖ్యాత మోటార్ కంపెనీ టయోటా ముందుకు వస్తున్నట్లు సమాచారం. టయోటా ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ టీమ్కు ప్రధాన స్పాన్సర్గా ఉండటంతో పాటు ఆ్రస్టేలియా టీమ్తో కూడా సహ స్పాన్సర్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఫైనాన్షియల్ సర్విస్ కంపెనీ అయిన ‘ఫిన్టెక్’ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో పలు కంపెనీల వద్ద పోటీ ఉండవచ్చు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. బోర్డు కూడా గత ఒప్పందంకంటే ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తోంది. నిజానికి ‘డ్రీమ్ 11’ లోగోతో కూడిన జెర్సీలతో భారత టీమ్ కిట్ సిద్ధంగా ఉంది. అయితే వీటిని వేసుకోరాదని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. -
టీమిండియా జెర్సీ కొత్త స్పాన్సర్గా టొయోటా..?
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ జట్లకు జెర్సీ స్పాన్సర్గా ఉన్న ప్రధాన గేమింగ్ ప్లాట్ఫాం డ్రీమ్11తో(Dream11) ఒప్పందాన్ని ఉన్నపళంగా రద్దు చేసుకుంది.దీంతో ప్రస్తుతానికి భారత క్రికెట్ జట్ల జెర్సీలకు అధికారిక స్పాన్సర్ లేకుండా పోయారు. త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్లో కూడా టీమిండియా జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగవచ్చు. ఈలోపు కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికితే వారి లోగోతో ఉన్న జెర్సీలతో టీమిండియా ఆటగాళ్లు ఆసియా కప్ బరిలోకి దిగుతారు.డ్రీమ్11 స్థానంలో టీమిండియా జెర్సీని స్పాన్సర్ చేసేందుకు టొయోటా మోటార్ కార్పొరేషన్ ఆసక్తి చూపుతోంది. టొయోటాతో పాటు ఓ ఫిన్టెక్ స్టార్టప్, టాటా గ్రూప్, రిలయన్స్, అదానీ గ్రూప్ వంటి సంస్థలు కూడా బీసీసీఐకి తమ ఆసక్తిని తెలిపాయని సమాచారం. జెర్సీ స్పాన్సర్షిప్ను అధికారిక టెండర్ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. బీసీసీఐ త్వరలో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను ఆహ్వానించనుంది.కాగా, 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో డ్రీమ్11 ఒప్పందం కుదుర్చుకుంది. ఎడ్-టెక్ దిగ్గజం బైజూస్ స్థానాన్ని డ్రీమ్11 భర్తీ చేసింది. తాజాగా భారత ప్రభుత్వ నిర్ణయంతో డ్రీమ్11-బీసీసీఐ అగ్రిమెంట్ మధ్యలోనే క్యాన్సిల్ అయ్యింది. -
'డ్రీమ్ 11తో బంధం ముగిసింది'.. బీసీసీఐ అధికారిక ప్రకటన
భారత క్రికెట్ జట్టుకు జెర్సీ స్పాన్సర్గా ఉన్న ఫ్యాంటసీ గేమ్ ఫ్లాట్ ఫామ్ డ్రీమ్ 11(Dream11)తో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంది. 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025 పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. దీంతో సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఆసియా కప్లో టీమిండియా స్పాన్సర్ లేకుండానే ఆడనుంది. కాగా ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆగస్టు 20న లోక్సభ, 21న రాజ్యసభ ఆమోదించింది.ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఈ బిల్ ఇప్పుడు చట్టంగా మారింది. ఫలితంగా భారత జట్టుకు జెర్సీ స్పాన్పర్ లేకుండా పోయింది. కొత్త స్పాన్సర్స్ కోసం బీసీసీఐ త్వరలోనే టెండర్లను ఆహ్హానించనున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో పేర్కొంది."ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు- 2025 ఆమోదించబడిన తర్వాత బీసీసీఐ-డ్రీమ్ 11 మధ్య సంబంధాలను నిలిపివేస్తున్నాము. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోమని" దేవజిత్ సైకియా న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐతో పేర్కొన్నారు. 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో ‘డ్రీమ్ 11’ ఒప్పందం కుదుర్చుకుంది. ఎడ్-టెక్ దిగ్గజం బైజూస్ను ‘డ్రీమ్ 11’ భర్తీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో డ్రీమ్ 11 అగ్రిమెంట్ మధ్యలోనే క్యాన్సిల్ అయింది.ఇప్పుడు డ్రీమ్ 11 మధ్యలోనే నిష్క్రమించినప్పటి.. ఈ సంస్థపై భారత క్రికెట్ మండలి ఎలాంటి జరిమానా విధించడం లేదట. ఒప్పందం ప్రకారం చట్టపరమైన కారణాలతో మధ్యలో స్పాన్సర్షిప్ను వదిలేసినా.. ఎలాంటి జరిమానా పడకుండా నిబంధన ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయింది. -
సెలక్షన్ కమిటీలో మార్పులు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీలో త్వరలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ చైర్మన్గా ఉన్న ఈ బృందంలో ఐదు జోన్ల నుంచి ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. టీమిండియా సెలక్టర్ పదవి కోసం బీసీసీఐ తాజాగా దరఖాస్తులు కోరింది. చీఫ్ సెలక్టర్ అగార్కర్ కాంట్రాక్ట్ 2026 టి20 వరల్డ్ కప్ వరకు ఉండగా, అజయ్ రాత్రా గత అక్టోబర్లోనే ఇందులోకి వచ్చాడు. కాబట్టి మిగిలిన ముగ్గురు శివ్సుందర్ దాస్ (సెంట్రల్ జోన్), సుబ్రతో బెనర్జీ (ఈస్ట్), ఎస్. శరత్ (సౌత్జోన్)లలో ఇద్దరు తప్పుకోనున్నారు. వీరిలో ఏ ఇద్దరు అనేది స్పష్టంగా తెలియికపోయినా... ఎస్.శరత్ను గతంలో అతను సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుత జూనియర్ కమిటీ చైర్మన్ తిలక్ నాయుడు పనితీరుపై బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ కమిటీ నుంచి శరత్ తప్పుకుంటే సౌత్జోన్ నుంచి ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్, హైదరాబాద్కు చెందిన ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తిగా ఉన్నాడు. సెంట్రల్ జోన్ కోటాలో సెలక్టర్ పదవిని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా ఆశిస్తున్నాడు. సెలక్టర్ ఎంపిక కోసం సెపె్టంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ బోర్డు గడువు విధించింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల క్రితం రిటైర్ అయినవాళ్లు మాత్రమే దరఖాస్తు చేయాలి. కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు...లేదంటే 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి. మరోవైపు సీనియర్ మహిళల సెలక్షన్ కమిటీలో కూడా మార్పులు ఖాయమయ్యాయి. వన్డే వరల్డ్ కప్కు జట్టును ఎంపిక చేయడంతో ఈ కమిటీ పదవీకాలం ముగిసింది. నలుగురు సభ్యుల ఈ బృందంలో నీతూ డేవిడ్, ఆర్తి వైద్య, రేణు మార్గరెట్ తప్పుకోవడం ఖాయం కాగా... రెండేళ్ల క్రితమే కమిటీలోకి వచ్చిన శ్యామ షా మాత్రం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. -
పాపం హార్దిక్ పాండ్యా!.. బీసీసీఐ ఉపాధ్యక్షుడి కామెంట్స్ వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన ఆట తీరుతో హిట్మ్యాన్ కోట్లాది మంది ఫ్యాన్స్ను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్.. టీ20లలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.ఇక ఐపీఎల్ (IPL)లోనూ ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వ్యవహరించి.. జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత రోహిత్కు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో ఈ ఫీట్ నమోదు చేసిన మొదటి సారథి కూడా ఇతడే!.. అయితే, గతేడాది ముంబై ఇండియన్స్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది.రోహిత్పై వేటు.. పాండ్యాకు పగ్గాలురోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను కెప్టెన్గా నియమించింది. అయితే, హిట్మ్యాన్ అభిమానులు ఈ విషయాన్ని అంత తేలికగా జీర్ణం చేసుకోలేకపోయారు. రోహిత్ను పక్కనపెట్టడాన్ని విమర్శిస్తూ.. ముంబై ఇండియన్స్ను తప్పుబట్టడంతో పాటు హార్దిక్ను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.పాపం హార్దిక్.. చేదు అనుభవంఅంతేకాదు.. ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడేలోనూ హార్దిక్ పాండ్యాపై నేరుగానే తిట్ల వర్షం కురిపించారు. అతడిని హేళన చేస్తూ కించపరిచేవిధంగా వ్యవహరించారు. అయితే, హార్దిక్ మాత్రం ఇందుకు కౌంటర్ ఇచ్చేందుకు బదులు.. ఆటపై మరింతగా శ్రద్ధ పెట్టాడు.కానీ ముంబై ఇండియన్స్ను విజయవంతంగా ముందుకు నడపలేకపోయాడు. హార్దిక్ సారథ్యంలో 2024లో ఆ జట్టు మరీ చెత్త ప్రదర్శనతో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు.వరల్డ్కప్ గెలిచిన వీరుడురోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మరోసారి రోహిత్ సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను టీమిండియా సొంతం చేసుకోవడంలోనూ పాలుపంచుకున్నాడు.రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలా చేశారుఅయితే, 2024 నాటి ఐపీఎల్లో వాంఖడే వేదికగా హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా స్పందించాడు. యూపీటీ20 యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘అలాంటి సంఘటనలు జరిగినపుడు బీసీసీఐలోని వ్యక్తులు సదరు ఆటగాళ్లతో మాట్లాడతారు.వారికి ధైర్యం చెబుతారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచిస్తారు. నిజానికి హార్దిక్ విషయంలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలా చేశారు. తమ అభిమాన ఆటగాడి స్థానంలో అతడు కెప్టెన్గా రావడాన్ని సహించలేకపోయారు.హార్దిక్ పరిణతితో వ్యవహరించాడురోహిత్ వారినేమీ అతడిపైకి ఉసిగొల్పలేదు. అంతేకాదు.. హార్దిక్కు కూడా ఇలా జరుగవచ్చని ముందు నుంచే అవగాహన ఉంది. ఏదేమైనా ఆ పరిస్థితుల్లో హార్దిక్ పరిణతితో వ్యవహరించాడు. ఆ ప్రభావం తనమీద పడకుండా చూసుకున్నాడు.భావోద్వేగాల్లో కూరుకుపోకుండా.. ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకున్నాడు. ఒక్కసారి ఆటగాళ్లు తిరిగి గొప్పగా రాణిస్తే తిట్టిన వారే.. ప్రశంసించడం మొదలుపెడతారు’’ అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చాడు.చదవండి: Asia Cup 2025: అదొక వింత నిర్ణయం.. కెప్టెన్ అయ్యే ప్లేయర్ను జట్టు నుంచి తీసేస్తారా? -
రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా టూర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత రో-కో ద్వయం ఇప్పటివరకు భారత తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే వన్డే ప్రపంచకప్-2027 దృష్ట్యా వీరిద్దరి స్ధానాల్లో యువ ఆటగాళ్లను బీసీసీఐ సిద్దం చేయనుందని, అక్టోబర్లో ఆసీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డేల సిరీసే ఆఖరిదని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సీనియర్ ద్వయం రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ (BCCI ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్సే అని అతడు కొట్టిపారేశారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ వైట్ బాల్ క్రికెట్లోకి తిరిగొచ్చేందుకు తమ ట్రైనింగ్ను తిరిగి ప్రారంభించారు. కాగా రాజీవ్ శుక్లా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో శుక్లాను సచిన్ టెండూల్కర్లాగానే రోహిత్, కోహ్లిలకు ప్రత్యేకంగా ఫేర్వెల్ నిర్వహిస్తారా ? అని హోస్ట్ ప్రశ్నించాడు."రోహిత్, కోహ్లి ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు. వారిద్దరూ ఇంకా వన్డేలు ఆడుతున్నారు. వారు ప్రస్తుతం కేవలం రెండు ఫార్మాట్ల నుంచి మాత్రమే తప్పుకొన్నారు. మరో ఫార్మాట్లో ఆడుతున్నప్పుడు మీరెందుకు వారి ఫేర్వెల్ గురుంచి మాట్లాడుతున్నారు? వారి రిటైర్మెంట్ గురించి మీరంతా ఎందుకు ఆందోళన చెందుతున్నారు? బీసీసీఐకి ఒక పాలసీ ఉంటుంది. బీసీసీఐ ఎవరిని కూడా రిటైర్మెంట్ ఇవ్వమని అడగదు. వారే సొంతంగా తమ నిర్ణయాలు తీసుకోవాలి. ప్లేయర్ తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము. ఆటగాళ్లు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మాకు తెలుసు. కానీ ఇదంతా ఇప్పుడు అనవసరం.విరాట్ కోహ్లి చాలా ఫిట్గా ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా బాగా ఆడుతున్నాడు. కాబట్టి వారి ఫేర్వెల్ గురుంచి ఆలోచిండం ఆపయేండి" అని శుక్లా పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఆక్టోబర్లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం -
‘డ్రీమ్’ బంధం ముగిసినట్లే!
న్యూఢిల్లీ: ‘సెబీ’ నిబంధనలు ఉల్లంఘించిన సహారా గ్రూప్, కాంపిటీషన్ కమిషన్ విచారణను ఎదుర్కొన్న స్టార్ ఇండియా, ఆర్థిక సమస్యలతో ఒప్పో, చెల్లింపులు చేయలేక బాకీపడ్డ బైజూస్... భారత క్రికెట్ జట్టు గత నాలుగు ప్రధాన స్పాన్సర్లు ఏదో ఒక వివాదం లేదా సమస్యతో సహవాసం చేయడం బీసీసీఐకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ జాబితాలో ‘డ్రీమ్ 11’ కూడా చేరింది. ఇందులో నేరుగా కంపెనీ పాత్ర లేకపోయినా... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో పరిస్థితి మారిపోయింది. ఇకపై ‘డ్రీమ్ 11’ భారత టీమ్ స్పాన్సర్గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్, గ్యాంబ్లింగ్ వేదికలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే కేటగిరీలో వచ్చే ‘డ్రీమ్ 11’కు దీని కారణంగా ఆర్థిక పరంగా గట్టి దెబ్బ తగలనుంది. 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో ‘డ్రీమ్ 11’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ 2026 మార్చి వరకు ఉంది. అయితే ఆసియా కప్కు ముందే స్పాన్సర్షిప్ ఒప్పందం రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ‘ఫలానా సంస్థతో ఒప్పందానికి అనుమతి లేదంటే మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతీ పాలసీ, నిబంధనలను బీసీసీఐ పాటిస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ స్పాన్సర్షి-ప్కు సంబంధించి త్వరలోనే మరింత స్పష్టత రావచ్చు. తక్కువ సమయంలో బోర్డు మళ్లీ కొత్త స్పాన్సర్తో ఒప్పందం కుదుర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. మరోవైపు డ్రీమ్ 11 శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘డబ్బులు చెల్లించి ఆడే పోటీలన్నింటినీ మేం నిలిపివేశాం. ఉచితంగా ఆడుకునే ఆన్లైన్ సోషల్ గేమ్లుగా వాటిని మార్చేశాం. ఇన్నేళ్లు మేం నిబంధనల ప్రకారమే పని చేశాం. భారత ప్రభుత్వ చట్టాలను మేం గౌరవిస్తే. ఇకపై మా ఇతర సంస్థలు ఫ్యాన్ కోడ్, డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడలతో అనుబంధాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొంది. -
టీమిండియా సెలెక్టర్గా ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్..
బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ పదవీ కాలాన్ని పొడిగించిన బీసీసీఐ.. సౌత్జోన్ సెలక్టర్ శ్రీధరన్ శరత్తో పాటు మరొకరిపై వేటు వేసేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే జాతీయ సెలెక్టర్ పదవులకు భారత క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా ప్రస్తుత సెలక్షన్ కమిటీలో అగార్కర్తో పాటు ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ ఉన్నారు.సెలక్టర్గా ప్రజ్ఞాన్ ఓజా..టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సౌత్ జోన్ నుంచి జాతీయ సెలెక్టర్ అయ్యే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్లో పేర్కొంది. సెలెక్టర్గా దాదాపు నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ఎస్. శరత్ స్థానంలో ఓజా ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ మరోసారి జూనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రజ్ఞాన్ ఓజా 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో ప్రజ్ఞాన్ ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్, డక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడునేషనల్ సెలెక్టర్ ధరఖాస్తుకు ఆర్హతలు ఇవే..టీమిండియా సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 7 టెస్టులు లేదా 10 వన్డేలు లేదా కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాలి. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్లు దాటి ఉండాలి. బీసీసీఐ ఏ క్రికెట్ కమిటీలోనూ 5 సంవత్సరాల పాటు సభ్యుడిగా పనిచేసి ఉండకూడదు. కాగా అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ను వచ్చే ఏడాది జూన్ వరకు బీసీసీఐ పొడిగించింది. అతడి పదవీకాలంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్స్ను సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 రన్నరప్గా కూడా మెన్ ఇన్ బ్లూ నిలిచింది. ఈ క్రమంలోనే అజిత్ కాంట్రాక్ట్ను పొడిగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది.చదవండి: నా బెస్ట్ కెప్టెన్ అతడే.. ధోనికి కూడా అంత సులువుగా ఏదీ రాలేదు: ద్రవిడ్ -
టీమిండియా వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..? బీసీసీఐ రియాక్షన్ ఇదే?
టీమిండియా తదుపరి వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించేందుకు బీసీసీఐ ఆసక్తి ఉందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ వారుసుడిగా అయ్యర్ భారత జట్టు వన్డే పగ్గాలను చేపట్టనున్నాడనని రెండు రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది.అయ్యర్కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కని అనంతరం ఈ విషయం బయటకు వచ్చింది. అయితే తాజాగా ఈ వార్తలపై భారత క్రికెట్ బోర్డు స్పందించింది. అవన్నీ వట్టి రూమర్సే అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. వన్డే కెప్టెన్సీకి సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని నేనూ విన్నాను. అవన్నీ తప్పుడు వార్తలే. ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరగడం లేదు అని సైకియా హిందూస్తాన్ టైమ్స్తో పేర్కొన్నారు.వన్డే కెప్టెన్గా గిల్..అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం.. రోహిత్ శర్మ తర్వాత భారత వన్డే జట్టు బాధ్యతలను శుబ్మన్ గిల్కే అప్పగించే అవకాశముంది. "వన్డే క్రికెట్లో శుబ్మన్ గిల్ సగటు 59 పైగా ఉంది. ప్రస్తుతం అతడు జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఇటీవలే టెస్టు కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు.తన తొలి సిరీస్లోనే జట్టును అద్భుతంగా నడిపించాడు. అటువంటి ఒక ప్లేయర్ సమయం వచ్చినప్పుడు వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహించే అవకాశముంది" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా టెస్టు కెప్టెన్గా ఉన్న గిల్.. వన్డే, టీ20ల్లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్లకు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఒకవేళ అదే జరిగితే టెస్టులు మాదిరిగానే వన్డేల్లో కూడా జట్టు పగ్గాలను గిల్ తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. వీటిన్నంటికి ఓ క్లారిటి రావాలంటే మరో రెండు నెలలు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆసియాకప్-2025కు సిద్దమవుతోంది.ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.చదవండి: సిరాజ్, రాహుల్ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్ -
సిరాజ్, రాహుల్ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్
దులీప్ ట్రోఫీ 2025 తొలి రౌండ్ మ్యాచ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మెరకు ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనెజర్ అబే కురువిల్లా లేఖ రాశారు.ముఖ్యంగా సౌత్ జోన్ జట్టులో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి సుదర్శన్,మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో బీసీసీఐ స్పందించాల్సి వచ్చింది. వీరందరూ ప్రస్తుతం భారత టెస్టు జట్టులో భాగంగా ఉన్నారు. ఇంగ్లండ్ టూర్ తర్వాత వీరిందరికి నెలకు పైగా విశ్రాంతి లభించింది.అంతేకాకుండా ఆసియాకప్ జట్టులో వీరివ్వరూ భాగం కాకపోవడంతో దులీప్ ట్రోఫీలో ఆడుతారని అంతా భావించారు. కానీ సౌత్ జోన్ జట్టులో వారిలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. దీంతో అక్టోబర్లో వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్ వరకు వారికి విశ్రాంతి లభించనుంది. కాగా దులీప్ ట్రోఫీకి జట్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ కాకుండా, జోన్ సెలెక్టర్లు ఎంపిక చేస్తారు."దులీప్ ట్రోఫీ ప్రతిష్టను కాపాడుకునేందుకు, సరైన పోటీ అందించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లను వారి సంబంధిత జోనల్ జట్లకు కచ్చితంగా ఎంపిక చేయాలి. కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు లేదా టీమిండియాలో ఎంపిక కోసం ఎదురు చూస్తున్న ఆటగాళ్లందరూ బీసీసీఐ నిర్వహించే దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలి.ఒకవేళ ఎవరైనా ఆటగాడు అందుబాటులో ఉన్నప్పటికి సరైన కారణం లేకుండా దేశీయ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంటే సదరు ప్లేయర్ను జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోరు" అని లేఖలో కురువిల్లా పేర్కొన్నారు.కాగా గతేడాదే సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్లో ఆడాలి అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు గత రంజీ సీజన్లో ఆడారు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: భారత్, పాక్ పోరుకు రాజముద్ర -
ఆస్ట్రేలియా టూర్.. రోహిత్ శర్మ ఊహించని నిర్ణయం!?
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగే అనాధికారిక మూడు వన్డేల సిరీస్లో భారత్-ఎ తరపున ఆడేందుకు రోహిత్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.ఈ మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 5 మధ్య కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. కాగా టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఈ ఏడాది ఆక్టోబర్లో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఐపీఎల్-2025 తర్వాత క్రికెట్ దూరంగా ఉంటున్న హిట్మ్యాన్.. ఆసీస్-ఎతో జరిగే అనాధికారిక సిరీస్ను సన్నహాకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేవ్ స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. రోహిత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు తెలుస్తోంది.కాగా ఆస్ట్రేలియా టూర్ తర్వాత రోహిత్ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపించాయి. వన్డే ప్రపంచకప్-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్, కోహ్లి స్దానాల్లో యువ ఆటగాళ్లను సిద్దం చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అంతేకాకుండా వన్డేల్లో తన స్ధానాన్ని కాపాడుకోవాలంటే విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడమని రోహిత్ను సెలక్టర్లు కోరనున్నట్లు సమాచారం. మరి రోహిత్ ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతాడో లేదో వేచి చూడాలి. అయితే ఆసియాకప్ ముగిసిన తర్వాత వన్డే జట్టు భవిష్యత్తు గురించి చర్చించడానికి సెలెక్టర్లు ముంబైలో సమావేశం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఒకవేళ రోహిత్ తన కెరీర్ను ముగిస్తే భారత వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ చివరగా విజయ్ హాజారే ట్రోఫీ 2018లో ముంబై తరపున ఆడాడు.చదవండి: Ajinkya Rahane: ఇక గుడ్ బై.. అజింక్య రహానే సంచలన నిర్ణయం -
అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపు.. అతడిపై వేటు?
టీమిండియా ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పొడిగించినట్లు తెలుస్తోంది. అగార్కర్ వచ్చే ఏడాది జూన్ వరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్గా కొనసాగనున్నాడు.2023లో ఛీప్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ అభ్యర్దన మేరకు తన నిర్ణయాన్ని అజిత్ మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై కొన్ని నెలల కిందటే అతడితో బీసీసీఐ చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ ఆఫర్కు అగార్కకర్ అంగీకరించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో పేర్కొంది."అజిత్ అగార్కర్ పదవీకాలంలో భారత పురుషల క్రికెట్ జట్టు రెండు ఐసీసీ టైటిల్స్ను గెలుచుకుంది. అంతేకాకుండా టెస్టులు, టీ20ల్లో భారత జట్టు పురోగతి సాధించింది. దీంతో భారత క్రికెట్ బోర్డు అతడి కాంట్రాక్ట్ను జూన్ 2026 వరకు పొడిగించింది. కొన్ని నెలల క్రితమే ఈ ఆఫర్ను అతడు అంగీకరించాడు" అని ఓ బీసీసీఐ అధికారి ఇండియన్ ఎక్స్ప్రెస్తో చెప్పుకొచ్చారు.కాగా అగార్కర్ బీసీసీఐ ఛీప్ సెలక్టర్గా తన మార్క్ను చూపించాడు. అతడి పదవీకాలంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్స్ను సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 రన్నరప్గా కూడా మెన్ ఇన్ బ్లూ నిలిచింది.అయితే ప్రస్తుత సెలక్షన్ కమిటీలో ఓ మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. శ్రీధరన్ శరత్ స్దానంలో మరో కొత్త వ్యక్తికి అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా శరత్ జనవరి 2023లో సీనియర్ సెలక్షన్ కమిటీకి పదోన్నతి పొందారు. ప్రస్తుత సెలక్షన్ కమిటీలో అగార్కర్, ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ ఉన్నారు.చదవండి: టీమిండియా వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్? -
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు ‘అగ్ని పరీక్ష’!
సెప్టెంబరులో ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ మొదలు.. వరుస సిరీస్లతో టీమిండియా బిజీబిజీగా గడుపనుంది. ఈ ఖండాంతర ఈవెంట్ తర్వాత స్వదేశంలో అక్టోబరులో వెస్టిండీస్తో టెస్టులు.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది.ఆటగాళ్లు ఫిట్గా ఉంటేనే..ఆ తర్వాత నవంబరులో టీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికా (IND vs SA)తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్లలో తలపడనుంది. మరి ఈ బిజీ షెడ్యూల్లో భారత జట్టు అనుకున్న ఫలితాలు రాబడుతూ సాఫీగా ముందుకు సాగాలంటే ఆటగాళ్లు ఫిట్గా ఉండటం అత్యంత ముఖ్యం.బీసీసీఐ కీలక నిర్ణయంఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదింట.. కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడిన విషయం తెలిసిందే. ఫలితంగా టీమిండియా యాజమాన్యం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫిట్నెస్ పరీక్షలో భాగంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (CoE) సరికొత్త టెస్టును ప్రవేశపెట్టినట్లు సమాచారం. రగ్బీ, ఫుట్బాల్ క్రీడాకారులకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా భారత ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించనున్నట్లు తెలిసింది. బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్లు, ముఖ్యంగా పేసర్లకు ఈ పరీక్ష ద్వారా ఫిట్నెస్ స్థాయి పెంచుకునే వీలు కలుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం.ఫాస్ట్ బౌలర్లు పరిగెత్తడం లేదు!ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టింది. కొంత మంది సెంట్రల్ కాంట్రాక్టు క్రికెటర్లు బెంగళూరుకు వెళ్లి ఈ పరీక్ష చేయించుకున్నారు. ఫిట్నెస్ ప్రమాణాలు పెంచేందుకే సీఓఈ ఈ నిర్ణయం తీసుకుంది.భారత క్రికెటర్లలో చాలా మంది.. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు జిమ్లో ఎక్కువ సమయం (స్పీడ్ రన్నింగ్) గడపడం లేదని తెలిసింది. తప్పకుండా ఎక్కువ సేపు రన్నింగ్ చేయాలని స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆడ్రియన్ లే రౌక్స్ వారికి చెప్పారు’’ అని పేర్కొన్నాయి.ఇంతకీ ఏమిటీ బ్రోంకో టెస్టు?ఇదొక రకమైన ఫిట్నెస్ పరీక్ష. ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 40 మీటర్లు, 60 మీటర్ల షటిల్ రన్లో పాల్గొంటాడు. ఈ మూడింటిని కలిపి ఒక సెట్గా వ్యవహరిస్తారు.పరీక్ష సమయంలో ఆటగాడు ఇలాంటి ఐదు సెట్లు పూర్తి చేయాలి. అంటే.. మొత్తంగా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా వేగంగా పరిగెత్తాలి. ఆరు నిమిషాల్లోనే సదరు ప్లేయర్ ఈ పని పూర్తి చేయాలి.ఇదిలా ఉంటే.. రెండు కిలోమీటర్ల టైమ్ ట్రయల్లో ఫాస్ట్ బౌలర్లు ఎనిమిది నిమిషాల పదిహేను సెకండ్లలో బెంచ్ మార్కును అందుకోవాలి. మరోవైపు.. బ్యాటర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లకు ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల టైమ్ ఉంటుంది. కాగా అంతకు ముందు బీసీసీఐ ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించేదన్న విషయం తెలిసిందే.చదవండి: ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు.. వారికి మరో ఛాన్స్: అగార్కర్ -
Ind Vs Pak మ్యాచ్ గురించి అగార్కర్కు ప్రశ్న.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
క్రికెట్ ప్రేమికులకు మరోసారి మజా అందించేందుకు ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. యూఏఈ వేదికగా ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహణకు సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ ఖండాంతర టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.ఆరోజే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్!గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ తలపడనుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడనున్నాయి. ఒకే గ్రూపులో ఉన్న దాయాదులు భారత్- పాక్ (India vs Pakistan) జట్లు ఈ టోర్నీ లీగ్ దశలో సెప్టెంబరు 14న తొలిసారి తలపడతాయి. ఆ తర్వాత సూపర్ 4, ఫైనల్ కలుపుకొని మరో రెండుసార్లు పరస్పరం ఢీకొట్టే అవకాశం లేకపోలేదు.ఆ మ్యాచ్ రద్దుఅయితే, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో క్రీడల్లోనూ ఎలాంటి బంధం కొనసాగించవద్దనే డిమాండ్లు పెరిగాయి. ఇటీవల వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లోనూ ఇండియా చాంపియన్స్.. పాకిస్తాన్తో ఆడేందుకు విముఖత చూపింది.లీగ్, సెమీ ఫైనల్ మ్యాచ్ను బహిష్కరించి.. దేశమే తమకు ముఖ్యమని మాజీ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు తేల్చిచెప్పింది. అయితే, ఆసియా కప్ టోర్నీలో మాత్రం చిరకాల ప్రత్యర్థులు కచ్చితంగా ముఖాముఖి పోటీపడే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కు తాజాగా ప్రశ్న ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీ కోసం మంగళవారం భారత జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి అగార్కర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.అగార్కర్కు ప్రశ్న.. బీసీసీఐ రియాక్షన్ ఇదేఈ క్రమంలో ఓ విలేఖరి.. ‘‘సెప్టెంబరు 14న ఆసియా కప్ టోర్నీలో బిగ్ మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇరుదేశాల మధ్య గత రెండు నెలలుగా ఏం జరుగుతుందో మనకి తెలుసు. మరి ఈ మ్యాచ్ విషయంలో మీ వైఖరి ఏమిటి?’’ అని ప్రశ్నించారు.ఇందుకు అగార్కర్ బదులిచ్చేందుకు సిద్ధమవుతుండగా.. బీసీసీఐ మీడియా మేనేజర్ అతడికి అడ్డుపడ్డారు. ‘‘ఆగండి.. కాస్త ఆగండి. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలు మాత్రమే అడగండి’’ అంటూ సమాధానం దాటవేసేలా చేశారు. దీంతో మరోసారి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్. చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
Asia Cup 2025: భారత జట్టు ప్రకటన ఆలస్యం.. కారణమిదే?
ఆసియాకప్-2025కు భారత జట్టు ప్రకటన కాస్త ఆలస్యం కానుంది. వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు విలేకరుల సమావేశంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గోవల్సింది.కానీ ముంబైలో భారీ వర్షాల కారణంగా వీరిద్దరి ప్రెస్కాన్ఫరెన్స్ ఆలస్యమ్యే అవకాశం ఉందని బీసీసీఐ మీడియా సంస్థలకు సమాచారమిచ్చినట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ కథనంలో పేర్కొంది. కాగా ముంబైలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ముంబై వ్యాప్తంగా పాఠశాలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. ఒకవేళ వర్షం తగ్గుముఖం పట్టకపోతే అగార్కర్, సూర్య వర్చవల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముంది.ఆసియాకప్కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ జట్టులో టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్కు చోటు దక్కుతుందా లేదా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్ స్లాట్ కోసం సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, అభిషేక్ శర్మల నుంచి గిల్కు తీవ్రమైన పోటీ ఉంది. అయితే ఈ జట్టులో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను సెలక్టర్లు చేర్చినట్లు తెలుస్తోంది. అతడితో పాటు రియాన్ పరాగ్కు చోటు కల్పించినట్లు సమాచారం.ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ.చదవండి: KBC 2025: ఐపీఎల్పై రూ. 7.50 లక్షల ప్రశ్న.. సమాధానం మీకు తెలుసా? -
గిల్కు చోటు దక్కేనా!
కెప్టెన్సీలో ఆడిన గత 20 టి20ల్లో 17 గెలిచి జోరు మీదుంది. ఈ అన్ని మ్యాచ్లకు వేర్వేరు కారణాలతో శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ దూరమయ్యారు. మరోవైపు ఈ ఏడాది జట్టు 5 టి20లు మాత్రమే ఆడింది. నిజానికి వీటిలో ప్రదర్శనను బట్టి చూస్తే భారత జట్టులో పెద్దగా మార్పులకు ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టెస్టు కెపె్టన్గా రాణించి అన్ని ఫార్మాట్లకు నాయకుడిగా పరిగణనలోకి తీసుకుంటున్న గిల్తో పాటు ఓపెనర్గా యశస్వి జైస్వాల్ కూడా టి20 రేసులోకి వచ్చారు. దీనికి తోడు ఐపీఎల్లో ఆటను గుర్తిస్తే శ్రేయస్ అయ్యర్కు కూడా అవకాశం ఉంది. ఇలాంటి స్థితిలో ఆసియా కప్ కోసం సెలక్టర్లు ఎలాంటి జట్టును ప్రకటిస్తారనేది ఆసక్తికరం. న్యూఢిల్లీ: ఆసియా కప్ టి20 క్రికెట్ టోరీ్నలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు ప్రకటించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే స్వదేశంలో టి20 వరల్డ్ కప్ కూడా ఉన్న నేపథ్యంలో ఇదే జట్టును అప్పటి వరకు సన్నద్ధం చేసే ఆలోచనతో సెలక్టర్లు ఉన్నారు. సెపె్టంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆసియా కప్ జరుగుతుంది. 15 మంది సభ్యులతో టీమ్ను ఎంపిక చేయాల్సి ఉండగా... ఇటీవల యువ ఆటగాళ్లు తమకు లభించిన అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంతో జట్టులో చోటుపై గట్టి పోటీ నెలకొంది. తిలక్ వర్మకు పోటీ! ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ తమ ఆటతో స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. ఇంగ్లండ్తో భారత్ ఆడిన చివరి టి20 సిరీస్లో అభిషేక్ 219.68 స్ట్రయిక్రేట్తో 279 పరుగులు చేసి టాప్స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్లో సామ్సన్ కాస్త తడబడినా... అంతకుముందు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లపై చెలరేగి ఐదు ఇన్నింగ్స్లలో మూడు సెంచరీలు సాధించాడు. ఈ స్థితిలో గిల్, జైస్వాల్ను తీసుకొచ్చి కూర్పును చెడగొడతారా అనేది సందేహమే. రిజర్వ్ ఓపెనర్గా జైస్వాల్ను గానీ, గిల్ను కానీ తీసుకొస్తే సామ్సన్ను పక్కన పెట్టక తప్పదు. మూడో స్థానంలో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు సహా 280 పరుగులు చేసి కుదురుకున్నాడు. అయితే ఐపీఎల్లో అతను ఆకట్టుకోలేకపోగా, ఇక్కడే శ్రేయస్ అయ్యర్ నుంచి పోటీ ఎదురవుతోంది. ఈ సీజన్లో 600కు పైగా పరుగులు చేసిన శ్రేయస్ సవాల్ విసురుతున్నాడు. నాలుగులో సూర్యకుమార్ ఖాయం కాగా, వరల్డ్ కప్ విజయం సహా గత రెండేళ్లుగా ఐదో స్థానాన్ని శివమ్ దూబే సొంతం చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానానికి ఢోకా లేకపోగా, ఏడో స్థానం కోసం రింకూ సింగ్ పోటీ పడుతున్నాడు. చివర్లో దూకుడుగా ఆడే ప్రయత్నంలోనే అయినా గత కొన్ని మ్యాచ్లలో రింకూ నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. కొత్తగా ఒక అదనపు ఆల్రౌండర్ ఉంటే మేలని భావిస్తే ముందుగా రింకూ స్థానమే ప్రశ్నార్ధకంగా మారనుంది. బుమ్రా ఖాయం... స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఖాయం. ఆల్రౌండర్గా అక్షర్ ఎంతో విలువైన ఆటగాడు కాగా, ఇంగ్లండ్తో సిరీస్లో 14 వికెట్లతో వరుణ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గాయంతో వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఆడని కుల్దీప్ కోలుకొని చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాడు. అతను టి20 టీమ్లోకి రావడం లాంఛనమే. మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అనుకుంటే వాషింగ్టన్ సుందర్ అందరికంటే ముందున్నాడు. అతని తాజా ఫామ్ కూడా అనుకూలం కానుంది. మూడో పేసర్గా హార్దిక్ ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ పేసర్లుగా బుమ్రా, అర్‡్షదీప్ల స్థానాలకు ఢోకా లేదు. మరో పేసర్గా ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ అందుబాటులో ఉన్నా... వీరి ఎంపిక సందేహమే. కొంత విశ్రాంతి తీసుకొని టెస్టు క్రికెట్పైనే పూర్తిగా దృష్టి పెట్టాలని వీరిద్దరికి సెలక్టర్లు సూచించే అవకాశాలే ఎక్కువ. ఇంగ్లండ్తో ఆడిన తర్వాత ఐపీఎల్లో ఘోరంగా విఫలమైన మొహమ్మద్ షమీ అంతర్జాతీయ టి20 కెరీర్ ఇక ముగిసినట్లుగానే భావించవచ్చు. గాయం వల్ల నితీశ్ కుమార్ రెడ్డి అందుబాటులో లేడు. రెండో వికెట్ కీపర్గా ఐపీఎల్లో ఆకట్టుకున్న జితేశ్ శర్మను సెలక్టర్లు ఎంపిక చేయవచ్చు. జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉన్న 15 మంది సభ్యులు (అంచనా): సూర్యకుమార్ (కెపె్టన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ. -
ఆసియాకప్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్ టీ20 టోర్నీకి మరో 22 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ప్రకటించే అవకాశముంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ అనంతరం భారత జట్టుకు ఒక నెల పాటు విరామం లభించింది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో టీమిండియా తలపడాల్సిండేది.కానీ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ సిరీస్ తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో భారత ఆటగాళ్లకు లాంగ్ బ్రేక్ దొరికింది. ఈ క్రమంలో టీమిండియా మెనెజ్మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆసియాకప్నకు ముందు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు యూఏఈలో ఒక ప్రత్యేక శిబిరాన్ని చేయనుంది. ఇందుకోసం టీమిండియా నాలుగు రోజుల ముందే యూఏఈ గడ్డపై అడుగుపెట్టనుంది. అయితే తొలుత ఆసియాకప్కు సిద్దం కావడానికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం.కానీ టీమ్ మెనెజ్మెంట్ మాత్రం యూఏఈ పరిస్థితులు అలవాటు పడేందుకు అక్కడకి వెళ్లి తమ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఈ స్పెషల్ క్యాంపు చాలా మంది భారత ఆటగాళ్లకు ఉపయోగపడనుంది.ఐపీఎల్-2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లోపించింది. అటువంటి వారు ఈ క్యాంపును సన్నాహాకంగా ఉపయోగించుకోవచ్చు. ఇక దాయాది పాకిస్తాన్ కూడా ఈ మెగా టోర్నీకి తమ సన్నాహాకాలను ప్రారంభించనుంది. అయితే భారత్కు భిన్నంగా పాక్ జట్టు అఫ్గాన్-యూఏఈలతో ట్రై సిరీస్ ఆడనుంది.అంతేకాకుండా మెన్ ఇన్ గ్రీన్ ఐసీసీ ఆకాడమీలో నాలుగు రోజుల పాటు ఒక ప్రత్యేక క్యాంపును నిర్వహించనుంది. ఈ టోర్నీ కోసం పీసీబీ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలకు చోటు దక్కలేదు. ఈ ఆసియా జెయింట్స్ పోరులో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వ్యవహరించనున్నాడు.చదవండి: వాళ్ళేమి తోపు ఆటగాళ్లు కాదు.. సెలక్టర్లు మంచి పనిచేశారు: పాక్ మాజీ కెప్టెన్ -
రిషబ్ పంత్ గాయం ఎఫెక్ట్.. సరికొత్త రూల్ను తీసుకురానున్న బీసీసీఐ!
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) దేశవాళీ క్రికెట్ సీజన్ 2025-26లో 'సీరియస్ ఇంజురీ రీప్లేస్మెంట్'సరికొత్త రూల్ను పరిచయం చేయనుంది. ఈ రూల్ ప్రకారం ఏ ప్లేయరైనా తీవ్రంగా గాయపడితే అతడి స్ధానంలో 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్’ మరొకరిని తీసుకోవచ్చు.అంటే ఉదహరణకు బౌలర్ గాయపడితే బౌలర్, బ్యాటర్ గాయపడితే బ్యాటర్ను భర్తీ చెయోచ్చు. టాస్ వేసే ముందు ఆయా జట్లు నలుగురు ఆటగాళ్లతో కూడిన జాబితాను అంపైర్లకు అందజేయాలి. ఎవరైనా గాయపడితే వారి నుంచే భర్తీ చేయాలి. ప్రస్తుతానికి ఈ రూల్ సీకే నాయుడు ట్రోఫీలో వర్తించనుంది.అహ్మదాబాద్లో జరుగుతున్న సెమినార్లో అంపైర్లకు ఈ మార్పు గురించి తెలియజేసేందుకు బీసీసీఐ ఒక ప్రత్యేక సెషన్ను నిర్వహించింది. అయితే ఈ ఏడాది జరగనున్న సయ్యద్ ముష్తాక్ అలీ లేదా విజయ్ హజారే ట్రోఫీలో బోర్డు ఈ ప్రవేశ పెట్టకపోవచ్చు.ఐపీఎల్-2026, రంజీ ట్రోఫీ సీజన్లో ఈ కొత్త నియమాన్ని అమలు చేసే అవకాశముంది. అయితే గాయం తీవ్రతను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాత ఆటగాడిని రిప్లేస్ చేయాలా వద్దా అని నిర్ణయించే తుది అధికారం మ్యాచ్ రిఫరీదేనని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ కొత్త రూల్కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్లో పంత్ కాలు ఎముక విరిగిన కూడా బ్యాట్కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో కేవలం కంకషన్ సబ్స్ట్యూట్(తలకు దెబ్బ)కు మాత్రమే రిప్లేస్మెంట్ అవకాశముంది.చదవండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు జీతాలు కట్!? -
విరాట్, రోహిత్ రిటైర్మెంట్ వెనుక కుట్ర..? మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. భారత క్రికెట్కు డాదాపు 16 ఏళ్ల పాటు తమ సేవలను అందించిన ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు సరైన వీడ్కోలు మాత్రం లభించింది.ఈ కోవకు చెందిన వారే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు. వారిద్దరూ కూడి ఎటువంటి వీడ్కోలు లేకుండా తమ టెస్టు కెరీర్లను ముగించారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లిలు వారం రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందిరికి షాకిచ్చారు.ఈ సీనియర్ ద్వయం లేకుండానే ఇంగ్లండ్కు వెళ్లిన భారత జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమంగా ముగించింది. అయితే తాజాగా రోహిత్, కోహ్లి రిటైర్మెంట్లపై భారత మాజీ ఆల్ రౌండర్ కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐలో రాజకీయాల వల్లే వారిద్దరూ త్వరగా రిటైరయ్యారని ఆయన ఆరోపించాడు."వరల్డ్ క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ఫిట్గా ఉండే క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే సత్తా కోహ్లికి ఉంది. అటువంటిది ఆకస్మికంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడం వెనక కొన్ని శక్తులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను.అంతేకాకుండా సుమారు 14 ఏళ్ల పాటు భారత జట్టుకు తన సేవలను అందించిన విరాట్కు బీసీసీఐ కనీసం ఫేర్వెల్ కూడా ఏర్పాటు చేయలేదు. కోహ్లి, రోహిత్ వంటి ఆటగాళ్లు ఘనమైన వీడ్కోలుకు ఆర్హులు. ఇది బీసీసీఐలోని అంతర్గత రాజకీయాల కారణంగా జరిగింది.దీనిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కారాణాలతోనే కోహ్లి త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ కూడా కావాలనుకుంటే మరి కొన్నాళ్ల పాటు ఆడేవాడు. కానీ కొంత మంది బీసీసీఐ పెద్దలు అతడిని జట్టు నుంచి బయటకు పంపాలని చూశారు. వారు కోరుకున్న విధంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడని" విక్కీ లాల్వానీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘావ్రీ పేర్కొన్నాడు. -
'టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్గా అతడే సరైనోడు'
భారత పురుషుల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్న సంగతి తెలిసిందే. వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్మన్ గిల్ టీమిండియా సారథిలుగా ఉన్నారు. రోహిత్ శర్మ టీ20, టెస్టుల నుంచి రిటైర్ కావడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ ముగ్గురు కెప్టెన్ల విధానంపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా శుబ్మన్ గిల్ను ఎంపిక చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు."ప్రస్తుతం శుబ్మన్ గిల్ను చూస్తుంటే 2017లో విరాట్ కోహ్లిలా కన్పిస్తున్నాడు. లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని హయంలో విరాట్ బాగా రాటు దేలాడు. ఆ తర్వాత అతడి వారుసుడిగా కోహ్లి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు గిల్ కూడా విరాట్ లాగే రోహిత్ సారథ్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. టెస్ట్ కెప్టెన్గా గిల్ను నియమించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన ముందుచూపును చాటుకున్నాడు. టీ20 ఫార్మాట్కు కూడా గిల్ సరిపోతాడు. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్కు బదులుగా ఎవరు కెప్టెన్సీ తీసుకుంటారనే దానిపై బీసీసీఐ స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలి.ఇతర దేశాలు మాదిరిగా భారత్లో స్ప్లిట్ కెప్టెన్సీ దీర్ఘకాలంలో పనిచేయదు. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఒక ఆటగాడు ఒక ఫార్మాట్కు కెప్టెన్గా ఉన్నప్పుడు, మిగిలిన ఫార్మాట్లకు కూడా అతనే నాయకత్వం వహించాలి. గిల్ బ్యాటర్గా కూడా రాణించాడు.అంతేకాకుండా ఐపీఎల్లో కూడా అతడు సారథ్యం వహించాడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్గా గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: Asia Cup 2025: సంజూ శాంసన్కు నో ఛాన్స్..? ఆర్సీబీ స్టార్కు చోటు? -
BCCI: అప్పటి వరకు అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ తన పూర్తి పదవీకాలం కొనసాగనున్నారు. 2022 అక్టోబర్లో ఎంపికైన ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బోర్డు అధ్యక్షుడిగా ఉంటారు. గత నెల 19న బిన్నీకి 70 ఏళ్లు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం ఆయన వెంటనే తప్పుకోవాల్సి ఉంది. అయితే తాజాగా మంగళవారం ‘నేషనల్ స్పోర్ట్స్ బిల్’ పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీని ప్రకారం క్రీడా సంఘాల ఆఫీస్ బేరర్ల వయోపరిమితిని 75 ఏళ్లకు పెంచారు.ఇక బీసీసీఐ కూడా ఒక క్రీడా సమాఖ్యగా ఈ బిల్లు పరిధిలోకి రావడంతో ఈ నిబంధన కూడా దానికి వర్తించనుంది. దీంతో బిన్నీ కొనసాగేందుకు మార్గం సుగమమైంది. సెప్టెంబరు చివర్లో జరిగే ఏజీఎంలోనే కొత్త అధ్యక్షుడి ఎన్నికపై బీసీసీఐ ముందుకు వెళుతుంది. ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకోకపోయినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్లో మన జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా కొత్త బిల్లు పరిధిలోకి వచ్చింది.అయితే బోర్డు నుంచి ఎలాంటి సమాచారం కోరకుండా దానిని ఆర్టీఐ పరిధి నుంచి తప్పిస్తూ సవరణ చేర్చిన తర్వాతే ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. పార్లమెంట్లో ఇప్పుడే బిల్లు పాస్ అయింది కాబట్టి దానిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత లోటుపాట్లపై చర్చిస్తామని బీసీసీఐ న్యాయ నిపుణుల బృందం అభిప్రాయపడింది. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్ -
మీకు ఆటే ముఖ్యమా?: బీసీసీఐ తీరుపై హర్భజన్ ఆగ్రహం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. దేశం కంటే మీకు ఆటే ముఖ్యమా అంటూ బోర్డు పెద్దల్ని ప్రశ్నించాడు. క్రికెట్ కంటే సైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. కాబట్టి ఇప్పటికైనా ఆసియా కప్-2025 (Asia Cup) విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.పాక్తో మ్యాచ్ బహిష్కరించిన ఇండియా చాంపియన్స్ఇటీవల పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం ప్రతిస్పందించగా.. దాయాదికి కూడా గట్టిగానే బుద్ధి చెప్పింది.ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొనగా.. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ (IND vs PAK)తో మ్యాచ్ను బహిష్కరించారు. సెమీ ఫైనల్లో దాయాదితో పోటీ పడాల్సి ఉండగా.. తమకు అన్నింటికంటే దేశమే ముఖ్యమని శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ నుంచి కూడా నిష్క్రమించారు.ఆసియా కప్లో మాత్రం దాయాదితో పోరుకు సై!అయితే, ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో మాత్రం భారత్- పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండటంతో పాటు.. అత్యధికంగా మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశం ఉన్నట్లు షెడ్యూల్ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మీకు ఆటే ముఖ్యమా?పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్లను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం మ్యాచ్లు యథావిధిగా సాగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘‘వారికి (బీసీసీఐ) ఏది ముఖ్యమో.. ఏది ప్రాధాన్యం లేని విషయమో అర్థం కావడం లేదు.సరిహద్దులో నిలబడి ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే సైనికుల కుటుంబాలు.. తరచూ వారిని చూడలేవు. ఒక్కోసారి సైనికులు తమ ప్రాణాలనే త్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్లు ఎప్పటికీ ఇంటికి తిరిగా రాలేరు కూడా!వారి త్యాగమే ఎంతో గొప్పదిఅందరి కంటే వారి త్యాగమే ఎంతో గొప్పది. వారితో పోలిస్తే ఇలాంటివి చాలా చిన్న విషయాలు. వారి కోసం మనం ఒక్క క్రికెట్ మ్యాచ్ను వదులుకోలేమా? మన ప్రభుత్వం కూడా ‘హింస- త్యాగం’ ఒకేచోట ఉండలేవని చెప్తోంది.కొంత మంది సరిహద్దులో యుద్ధం చేస్తున్నపుడు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నపుడు.. మనం మాత్రం వెళ్లి వాళ్లతో క్రికెట్ ఆడటమా?.. సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రికెట్ అనేది చిన్న విషయంలా చూడాలి. దేశ ప్రయోజనాలే మనకు ప్రథమ ప్రాధాన్యం కావాలి.మనకు ఏ గుర్తింపు వచ్చినా.. అది దేశం కారణంగానేనని గుర్తుపెట్టుకోండి. మీరొక ఆటగాడు లేదంటే నటుడు.. ఎవరైనా కానీవండి. దేశం కంటే ఎవరూ గొప్పవారు కాదు. దేశం తరఫున తప్పక నిర్వర్తించాల్సిన విధులను విస్మరించకూడదు’’ అంటూ భజ్జీ బీసీసీఐ తీరును ఎండగట్టాడు. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్ -
National Sports Bill 2025: లోక్సభ ఆమోదం.. ఇందులో ఏముంది?
జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు-2025 (National Sports Governance Bill)కి లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. అదే విధంగా.. జాతీయ యాంటీ-డోపింగ్ (సవరణ) బిల్లుకు కూడా ఈరోజే ఆమోదం లభించింది. అయితే, విపక్షాలు మాత్రం ఇందుకు సహకరించలేదు. అయినప్పటికీ నిరసనల నడుమే క్రీడా పరిపాలనా బిల్లుకు ఆమోదం లభించింది.అతిపెద్ద సంస్కరణ ఇదిఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ సభలో మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రీడా రంగంలో ప్రవేశపెట్టిన అతిపెద్ద సంస్కరణ ఇది. జవాబుదారీతనం తీసుకురావడం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుంది. క్రీడా సమాఖ్యలన్నీ అత్యుత్తమంగా పరిపాలన చేసేందుకు ఇది తోడ్పడుతుంది’’ అని పేర్కొన్నారు.స్పోర్ట్స్ ఎకోసిస్టమ్లో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుందన్న మాండవీయ.. దురదృష్టవశాత్తూ ప్రతిపక్షాలు ఈ బిల్లు ఆమోదంలో పాలు పంచుకోలేకపోయాయన్నారు. ‘‘1975లో మేము ఈ బిల్లుకు సంబంధించి తొలి డ్రాఫ్ట్ తయారుచేశాము. కానీ క్రీడలు కూడా వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజకీయ రంగు పులుముకున్న కారణంగా ఇది సాధ్యం కాలేదు.అయితే, కొంతమంది మంత్రులు ఈ బిల్లును ప్రవేశపెట్టగలిగారు కానీ.. దీనికి ఆమోదం లభించేలా చేయలేకపోయారు. 2011లో మనకు జాతీయ స్పోర్ట్స్ కోడ్ వచ్చింది. దానిని బిల్లుగా మార్చేందుకు మేము కృషి చేశాం.అనంతరం క్యాబినెట్లో చర్చల్లో భాగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఇది పార్లమెంట్ వరకు చేరుకోలేకపోయింది. ఏదేమైనా నేనషల్ స్పోర్ట్స్ బిల్ గవర్నెన్స్ బిల్ ఒక సంచలనాత్మక మార్పునకు నాంది.అతి పెద్దదైన మన దేశంలో ఒలింపిక్స్లో, అంతర్జాతీయ స్థాయిలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం నిజంగా విచారకరం. క్రీడా రంగ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ బిల్లు దోహదం చేస్తుంది’’ అని మన్సుఖ్ మాండవీయ చెప్పుకొచ్చారు.ఇందులో ఏముంది?కాగా క్రీడా సంస్థలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పించడం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు ద్వారా సాధ్యమవుతుంది. రాజకీయ ఒత్తిడి, జోక్యం ఉండదని చెబుతున్నారు. స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు ద్వారా.. అథ్లెట్లు, ఆఫీస్ బేరర్లు, క్రీడా సమాఖ్యల మధ్య తగాదాలను త్వరితగతిన పరిష్కరించే వీలుంటుంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే ఆటగాళ్ల ఎంపిక ఉండేలా చూసుకుంటారు.జాతీయ క్రీడా సమాఖ్యలకు సంబంధించిన ఆడిట్లు సకాలంలో పూర్తి చేయడంతో పాటు.. నిధుల వినియోగానికి సంబంధించి పారదర్శకత ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. క్రీడా పరిపాలనా విభాగాన్ని మెరుగుపరచి, ఎవరి పాత్ర ఏమిటన్న అంశాలపై స్పష్టతనివ్వడం ద్వారా ఒలింపిక్స్ వంటి హై ప్రొఫైల్ ఈవెంట్లు నిర్వహించడం కాస్త సులువుగా మారుతుంది. అయితే, అన్నింటికీ మించి ఆటగాళ్లకు సురక్షిత వాతావరణం కల్పించడం.. అంటే.. అన్ని రకాల వేధింపుల నుంచి ఉపశమనం కలిగించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.బీసీసీఐకి రిలీఫ్ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి మాత్రం ఈ బిల్లులో ఉపశమనం లభించింది. బోర్డు వ్యవహారాల గురించి ఆర్టీఐ నుంచి సమాచారం కోరేందుకు మాత్రం అనుమతి ఉండదు. బీసీసీఐ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదు.. కాబట్టి అందుకే ఈ మేరకు మినహాయింపు ఇచ్చారని సమాచారం. అదే విధంగా.. అడ్మినిస్ట్రేటర్లకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ బాడీ అనుమతించినట్లయితే.. 70- 75 ఏళ్ల వ్యక్తులు కూడా క్రీడా సమాఖ్యల ఎన్నికల్లో పాల్గొనవచ్చు.చదవండి: క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు! -
‘సెలక్టర్లు అతడిని తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడు’
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) టెస్టు మ్యాచ్ ఆడి రెండేళ్లు దాటిపోయింది. చివరగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (WTC)-2023 ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఈ బెంగాల్ పేసర్ బరిలోకి దిగాడు. నాటి ఈ మెగా పోరులో షమీ ఓవరాల్గా నాలుగు వికెట్లు తీయగలిగాడు.అనంతరం స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ.. ఈ ఐసీసీ ఈవెంట్ ముగిసిన తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.వరుస సిరీస్లకు దూరంఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ పేసర్.. ఆఖరిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, టెస్టుల్లో మాత్రం వరుస సిరీస్లకు అతడు దూరమయ్యాడు.స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్- అనంతరం ఆస్ట్రేలియా పర్యటన, ఇంగ్లండ్ టూర్లకు ఎంపిక చేసిన జట్లలో షమీకి చోటు దక్కలేదు. అయితే, ఆసీస్ టూర్కు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినా సెలక్టర్లు పట్టించుకోలేదనే వార్తలు వచ్చాయి.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా స్పందిస్తూ.. ‘‘ఫామ్లేమి కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించలేదు. ఫిట్నెస్ సమస్యల కారణంగా తనకు తానే తప్పుకొన్నాడు. అందుకే ఇంగ్లండ్కు ప్రయాణం చేయలేకపోయాడు.సెలక్టర్లు తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడుఆస్ట్రేలియా టూర్ మిస్సైన తర్వాత.. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారు. అతడి అవసరం జట్టుకు ఉందని భావించారు. జట్టును ఖరారు చేసే సమయంలో షమీతో మాట్లాడారు కూడా!అయితే, తను మాత్రం ఆత్మవిశ్వాసంతో లేడు. ఫిట్నెస్ సమస్యలు లేవని కచ్చితంగా చెప్పలేకపోయాడు. షమీ ఫిట్నెస్ సాధిస్తే సంప్రదాయ ఫార్మాట్లోనూ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వగలడు. రంజీ మ్యాచ్లలో మూడు- నాలుగు ఓవర్లు బౌల్ చేసి అతడు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే, ఐదు రోజుల మ్యాచ్కు అతడి శరీరం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నపుడే రీఎంట్రీపై స్పష్టత వస్తుంది.దులిప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. 34 ఏళ్ల షమీకి వయస్సు పెద్ద సమస్య కాదని.. ఇంకో ఏడు- ఎనిమిదేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా అతడిలో ఉందంటూ సదరు వర్గాలు ప్రశంసలు కురిపించాయి.చదవండి: క్రికెట్లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు! -
ఆసియాకప్-2025కు శుబ్మన్ గిల్ దూరం!?
ఆసియాకప్-2025కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో నెల రోజుల్లో యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా తొలి మ్యాచ్లో హాంకాంగ్, అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ ఆసియా సింహాల పోరు కోసం బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ ప్రాథిమిక జట్లను ప్రకటించాయి.బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా వచ్చే వారం భారత జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టులో టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ను చేర్చాలా వద్దా అని సెలక్టర్లు తర్జబర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్తో జరగనున్న టెస్ట్ సిరీస్ను దృష్టిలో ఉంచుకుని గిల్కు విశ్రాంతి ఇవ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఆసియాకప్ ముగిసిన నాలుగు రోజులకే భారత్-వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆసియాకప్నకు గిల్కు విశ్రాంతి ఇచ్చి టీ20 వరల్డ్ కప్-2026లో అతడిని ఆడించాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు ది టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది.కాగా గిల్ వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ముందు దులీప్ ట్రోఫీ-2025లో ఆడనున్నాడు. నార్త్జోన్ కెప్టెన్గా శుబ్మన్ వ్యవహరించనున్నాడు. కాగా గిల్ ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో కెప్టెన్గా, వ్యక్తిగత ప్రదర్శనంగా పరంగా ఆకట్టుకున్నాడు.ఐదు మ్యాచ్లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఇక ఆసియాకప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్తో మెన్ ఇన్ బ్లూ అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: శుబ్మన్ గిల్ జెర్సీ కోసం పోటీ.. ఎన్ని లక్షలకు అమ్ముడుపోయిందంటే? -
టీమిండియా సెలక్టర్లు కాదు.. ఇకపై అతడే డిసైడ్ చేస్తాడా?
టీమిండియాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ (Sandeep Patil) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవతరం ఆటగాళ్లంతా పనిభారం అంటూ సాకులు చూపడం సరికాదని విమర్శించాడు. ఆధునిక క్రికెట్లో కెప్టెన్, హెడ్కోచ్ కంటే ఫిజియోలకే ఎక్కువ ప్రాముఖ్యం దక్కుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు టీమిండియా ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను గిల్ సేన 2-2తో సమంగా ముగించింది. బుమ్రా మూడే ఆడాడుఅయితే, ఈ సిరీస్లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా.. అతడిని కేవలం మూడు టెస్టుల్లోనే ఆడించారు. పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా కీలక సమయంలో.. కీలక మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది. సిరీస్ డ్రా అయింది కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే బుమ్రాతో పాటు మేనేజ్మెంట్పై విమర్శల దాడి మరింత ఎక్కువయ్యేది. ఈ నేపథ్యంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అతడే డిసైడ్ చేస్తాడా?‘‘అసలు బీసీసీఐ ఇలాంటి వాటికి ఎలా అంగీకరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. కెప్టెన్, హెడ్కోచ్ కంటే వీరికి ఫిజియోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయ్యేలా ఉన్నాడు. అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు?సెలక్షన్ కమిటీ సమావేశాల్లో వీరితో కలిసి ఫిజియో కూడా కూర్చుంటాడా ఏమిటి?. ఎవరి వర్క్లోడ్ ఎంత? ఎవరు ఆడాలని అతడే డిసైడ్ చేస్తాడా?’’ అని 1983 వన్డే వరల్డ్కప్ విన్నర్ సందీప్ పాటిల్ అసహనం వ్యక్తం చేశాడు.పనికిమాలిన వ్యవహారంఅదే విధంగా.. ‘‘వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేదే ఓ పనికిమాలిన వ్యవహారం. ఆటగాళ్లు ఫిట్గా ఉన్నారా? లేదంటే అన్ఫిట్?.. ఈ రెండిటి ఆధారంగానే జట్ల ఎంపిక ఉండాలి. అంతేగానీ.. ఈ వర్క్లోడ్ బిజినెస్ను పట్టించుకోకూడదు.మా రోజుల్లో అయితే ఫ్యాన్సీ స్ట్రోక్స్ ఆడేందుకు ప్రయత్నించినా సునిల్ గావస్కర్ తిట్టేవాడు. అయితే, రోజులు మారాయి. కానీ ఈ నవతరం క్రికెటర్లు తరచూ మ్యాచ్లు మిస్ కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా’’ అని సందీప్ పాటిల్ మిడ్-డేతో పేర్కొన్నాడు.చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్ -
బెంగాల్ క్రికెట్ ఎన్నికల బరిలో గంగూలీ!
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి క్రీడా పరిపాలనలో అడుగుపెట్టనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి గంగూలీ తప్పుకొని మూడేళ్లు కావొస్తుండగా... త్వరలో జరగనున్న బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్ష పీఠం అధిరోహించడానికి ముందు వరకు ‘దాదా’...‘క్యాబ్’ అధ్యక్షుడిగా కొనసాగాడు. గంగూలీ పదవీ కాలం ముగిసిన అనంతరం రోజర్ బిన్నీ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ‘గంగూలీ తిరిగి పాలకవర్గంలో అడుగుపెట్టనున్నాడు. క్యాబ్ అధ్యక్ష పదవికి అతడు పోటీ పడటం ఖాయమే. బీసీసీఐ నియమావళి అంగీకరిస్తే ఆ పదవికి గంగూలీ ఎన్నికవడం ఖాయమే. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలపై స్పష్టత రాదు’ అని బెంగాల్ క్రికెట్ సంఘానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ ‘క్యాబ్’ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఈ పదవిలో ఆరేళ్లుగా కొనసాగుతుండటంతో... లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తప్పనిసరి. దీంతో గతంలో ‘క్యాబ్’ను సమర్థవంతంగా నడిపించిన గంగూలీ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
బీసీసీఐ సమాచారం ఇవ్వనవసరం లేదు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ (ఎన్ఎస్జీబీ)లో కొత్త సవరణను చేర్చింది. ఇప్పటి వరకు ఉన్న బిల్లులో ‘గుర్తింపు పొందిన ఏ క్రీడా సంఘమైనా ప్రజలకు చెందినదే. తమ విధులు, అధికారాలు నిర్వహించే విషయంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ )–2005 పరిధిలోకే అది వస్తుంది’ అని స్పష్టంగా ఉంది. అయితే దీనిపై బీసీసీఐ చాలా కాలంగా తమ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇతర క్రీడా సంఘాల తరహాలో తాము ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం తీసుకోవడం లేదని, బోర్డు ఆర్టీఐ పరిధిలోకి రాదని చెబుతూ వచ్చింది. చివరకు బోర్డు ఆశించిన ప్రకారం వారికి ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం కొత్త బిల్లులో సవరణను జోడించింది. దీని ప్రకారం ‘ప్రభుత్వం నుంచి నిధులు, సహాయం పొందే క్రీడా సంఘాలకే ఆర్టీఐ నిబంధన వర్తిస్తుంది. అలా ఆర్థిక సహకారం తీసుకుంటేనే దానిని ప్రజా సంస్థగా గుర్తిస్తారు’ అని స్పష్టతనిచ్చింది. తాజా సవరణ నేపథ్యంలో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తూ సామాన్యులు ఎవరైనా బీసీసీఐని ప్రశ్నించడానికి లేదా వారి కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు కోరడానికి గానీ అవకాశం లేదు. ‘తాజా బిల్లులో ఇది ఒక సమస్యగా కనిపించింది. ఆర్థిక సహకారం తీసుకోవడం లేదనే కారణం చూపించి ఈ బిల్లు ఆమోదం కాకుండా పార్లమెంట్లో అడ్డుకునే అవకాశం ఉండేది. లేదా ఇదే కారణంతో బీసీసీఐ కోర్టుకెక్కేది కూడా. అందుకే సవరణ చేయాల్సి వచ్చింది’ అని కేంద్ర క్రీడాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఆర్టీఐ పరిధిలోకి రాకపోయినా... కొన్ని ఇతర నిబంధనలు బీసీసీఐని కూడా ప్రభుత్వం ప్రశ్నించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది చట్టంగా మారితే బీసీసీఐ కూడా వెంటనే జాతీయ క్రీడా సమాఖ్యగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్ క్రీడగా మారనుండటం దీనికి ఒక కారణం. కొత్త బిల్లు ప్రకారం నిధులు పొందకపోయినా... వ్యవస్థ నడిచేందుకు ఇతర రూపాల్లో సహాయ సహకారాలు తీసుకుంటుంది కాబట్టి జవాబుదారీతనం ఉండాల్సిందే. పైగా బీసీసీఐ కూడా నేషనల్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ (ఎన్ఎస్టీ) పరిధిలోకి వస్తుంది. క్రీడా సంఘాల్లో ఎన్నికల నుంచి ఆటగాళ్ల ఎంపిక వరకు ఏదైనా వివాదం వస్తే ఎన్సీటీ పరిష్కరిస్తుంది. ట్రైబ్యునల్ తీర్పులను సుప్రీం కోర్టులో మాత్రమే సవాల్ చేసే అవకాశం ఉంది. -
బీసీసీఐ వేటు!.. నా ఫ్యామిలీ లాంటిది అంటూ..
టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టగానే గౌతం గంభీర్ Gautam Gambhir).. సహాయ సిబ్బంది నియామకం విషయంలోనూ తన మాట నెగ్గించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో వేర్వేరు సమయాల్లో, వేర్వేరు జట్లలో తనతో కలిసి పనిచేసిన ముగ్గురిని కోచింగ్ సిబ్బందిలో చేర్చుకున్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా ఉన్నప్పుడు తనతో కలిసి సహాయక సిబ్బందిలో ఉన్న దక్షిణాఫ్రికా బౌలర్ మోర్నీ మోర్కెల్ను.. టీమిండియా బౌలింగ్ కోచ్గా తెచ్చుకున్నాడు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో ఉన్నపుడు తన అసిస్టెంట్లుగా ఉన్న నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు ర్యాన్ డష్కాటే, భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ను టీమిండియాలోనూ అసిస్టెంట్ కోచ్లుగా తెచ్చుకున్నాడు.వేటు వేసిన బీసీసీఐఅయితే, టీమిండియా టెస్టుల్లో వరుసగా విఫలమైన తరుణంలో అభిషేక్ నాయర్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వేటు వేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ చేజార్చుకున్న తర్వాత.. అతడికి ఉద్వాసన పలికింది.ఈ క్రమంలో అభిషేక్ నాయర్ మళ్లీ తన సొంతగూటికి చేరుకున్నాడు. ఐపీఎల్-2025లో కోల్కతా జట్టు అసిస్టెంట్ కోచ్గా సేవలు అందించాడు. ఇటు బీసీసీఐ పొమ్మనగానే.. అటు కేకేఆర్ తనను అక్కున చేర్చుకోవడంపై అభిషేక్ నాయర్ తాజాగా స్పందించాడు.నాకు కేకేఆర్ ఫ్యామిలీ లాంటిది‘‘కేకేఆర్ నా సొంత కుటుంబం వంటిది. ప్రతి వ్యక్తి తన భావోద్వేగాలను ఫ్యామిలీతోనే పంచుకుంటాడు. నాకు కేకేఆర్ ఫ్యామిలీ. కాబట్టే ఎలా ఇక్కడి నుంచి వెళ్లానో.. అంతే వేగంగా తిరిగి వచ్చేశాను. అన్ని రకాలుగా నేను కేకేఆర్కే చెందినవాడిని.ఇది నా ఇల్లు. ఇక్కడే నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈసారి కూడా అలాగే జరిగింది’’ అని అభిషేక్ నాయర్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో యూపీ వారియర్స్కు అభిషేక్ నాయర్ మార్గదర్శనం చేయనున్నాడు. ఆ జట్టు హెడ్కోచ్గా అతడు నియమితుడైనట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.ఆ జట్టుకు హెడ్కోచ్గా..ఈ విషయం గురించి అభిషేక్ నాయర్ మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూపీఎల్ కేవలం భారత క్రికెట్ మీద మాత్రమే కాకుండా.. దేశవాళీ క్రికెట్ మీద కూడా ఉంది. తొలి సీజన్ నుంచి ఇప్పటికి చాలా మారింది. ఆదరణ పెరిగింది.అమ్మాయిలు డైవ్ చేస్తున్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ బంతిని ఫాస్ట్గా త్రో చేస్తున్నారు. రోజురోజుకీ ఈ లీగ్ అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆసీస్తో సిరీస్లోనూ 3-1తో ఓడిపోయింది. అయితే, తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో మాత్రం అదరగొట్టింది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో సమం చేసింది. తద్వారా వరుస పరాజయాల తర్వాత కోచ్ గౌతం గంభీర్కు ఉపశమనం కలిగింది.చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్తో సిరాజ్.. కొంప మునిగేదే! -
మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్న గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్ష పదవి కోసం పోటీ పడనున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియాకు వెల్లడించాడు. గంగూలీ 2015–2019 మధ్యలో క్యాబ్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆతర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ బాస్ హోదాలో గంగూలీ మూడేళ్లు (2019-2022) ఉన్నాడు. తన హయాంలో గంగూలీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు.ప్రస్తుతం క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ అన్న స్నేహశిష్ గంగూలీ ఉన్నాడు. అతని పదవీకాలం త్వరలోనే ముగియనుంది. స్నేహశిష్కు క్యాబ్ అధ్యక్షుడిగా కొనసాగాలని ఉన్నా, లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం అది సాధ్యపడదు. దీంతో సౌరవ్ గంగూలీ బరిలోకి దిగుతున్నాడు.సౌరవ్ గంగూలీకి క్యాబ్లో మంచి పట్టు ఉండటంతో అతని ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. గంగూలీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 25న క్యాబ్ వార్షిక సమావేశం జరగనుంది. అంతకుముందే అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సౌరవ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్కు (ఐపీఎల్) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా పని చేస్తున్నాడు. ఒకవేళ క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. -
‘పని భారం’ను పక్కన పెట్టాల్సిందే!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఒక కీలక అంశం భారత క్రికెట్లో చర్చకు వచ్చింది. గత కొంత కాలంగా బీసీసీఐ ప్రధాన ఆటగాళ్లకు ‘పనిభారం’ ఎక్కువగా ఉంటుందని, వారికి మ్యాచ్లు, సిరీస్ల మధ్యలో తగినంత ‘విశ్రాంతి’ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్తో సిరీస్తో మూడు టెస్టులే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ ముందే ప్రకటించింది. చివరకు అదే జరిగింది. అయితే తొలి టెస్టు తర్వాత వారం రోజుల విరామం వచ్చినా బుమ్రా రెండో టెస్టు ఆడకపోవడం, కీలకమైన, సిరీస్ను సమం చేయాల్సిన చివరి టెస్టుకు కూడా అతను దూరం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు ఎలాంటి విరామం లేకుండా పూర్తి ఫిట్నెస్తో మొహమ్మద్ సిరాజ్ ఐదు టెస్టులూ ఆడి వేయికి పైగా బంతులు వేయడం ఈ అంశాన్ని మరింతగా చర్చించేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇకపై ‘పనిభారం’ పేరుతో ఆటగాళ్లు మ్యాచ్లకు దూరం కాకుండా నిబంధనలు విధించాలని బోర్డు యోచిస్తోంది. దీంతో పాటు కొందరు క్రికెటర్లు ప్రత్యేక హోదాను ప్రదర్శిస్తూ తమకు నచ్చిన మ్యాచ్లు ఎంచుకుంటూ మిగతా కొన్ని మ్యాచ్ల నుంచి వేర్వేరు కారణాలతో తప్పుకుంటున్నారు. దీనికి కూడా ఫుల్స్టాప్ పెట్టే ప్రతిపాదన ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.‘సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరికీ ఈ సమాచారం అందిస్తాం. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో రెగ్యులర్గా ఆడే ప్లేయర్లు ఇకపై తమ ఇష్టానుసారం మ్యాచ్లను ఎంపిక చేసుకునే వీలుండదు’ అని ఆయన అన్నారు. ‘పనిభారం’ అంటూ ఆటగాళ్లను మ్యాచ్లకు దూరం పెట్టే విషయంపై కూడా సరైన రీతిలో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘పేస్ బౌలర్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. ఈ విషయంలో వైద్యబృందం సలహాలతోనే ముందుకు వెళతాం. అయితే పనిభారం పేరుతో కీలక మ్యాచ్లకు దూరం కావడం మాత్రం జరగదు. ఆటకంటే ఆటగాళ్లు ఎక్కువ కాదని సందేశం అందరికీ వెళ్లాలి’ అని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు... మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా ‘పనిభారం’ విషయంలో ఘాటుగా స్పందించారు. ‘దేశం కోసం ఆడుతున్నప్పుడు గాయం, నొప్పిలాంటివాటిని మర్చిపోవాలి. సరిహద్దుల్లో చలి ఎక్కువగా ఉందని సైనికులు ఫిర్యాదు చేస్తున్నారా. పంత్ ఫ్రాక్చర్తో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అలాంటి తత్వం ఆటగాళ్ళలో ఉండాలి. కోట్లాది మంది భారతీయులకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.సిరాజ్ ఐదు టెస్టుల్లోనూ కెప్టెన్ అడిగిన ప్రతీసారి 7–8 ఓవర్ల స్పెల్లు బౌలింగ్ చేశాడు. అసలు ‘పనిభారం’ అనే చర్చనే అతను తీసిపడేశాడు. నేను చాలా కాలంగా చెబుతున్నా. ఈ పదాన్ని భారత క్రికెట్ డిక్షనరీ నుంచి పూర్తిగా తొలగించాలి’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు.సిరీస్ విజయంతో స్వదేశానికి... న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో ఓవల్లో చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు ప్రత్యేకంగా ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. సుదీర్ఘ సిరీస్ ముగిసిన వెంటనే జట్టును వీడేందుకు సిద్ధమయ్యారు. కొందరు విశ్రాంతి కోసం ఇంగ్లండ్లోనే ఆగిపోయేందుకు సిద్ధపడగా...మరికొందరు సాధ్యమైనంత తొందరగా అందుబాటులో ఉన్న ఫ్లయిట్ ద్వారా స్వస్థలాలకు తిరిగి వచ్చారు. మ్యాచ్ ముగిశాక లండన్ వీధుల్లో సహచరుడు కుల్దీప్తో కలిసి సరదాగా తిరిగిన అనంతరం అర్ష్ దీప్ స్వదేశానికి బయల్దేరాడు. అతనితో పాటు సిరాజ్, శార్దుల్ కూడా భారత్కు చేరుకున్నారు. -
కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్కు భారీ షాక్?
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను అభిమానులు టీమిండియాలో జెర్సీలో చూసి దాదాపు 6 నెలలపైనే అవుతోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనుహ్యంగా టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ దిగ్గజ క్రికెటర్లు.. కేవలం వన్డేల్లో మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నారు.అయితే ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో విరాట్, రోహిత్లను చూడొచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ రాజకీయ, దౌత్యపరమైన పరిణామాలతో బంగ్లా పర్యటనను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో అభిమానులకు నిరాశే మిగిలింది. తిరిగి వీరిద్దని ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో చూసే అవకాశముంది. కానీ ఈ సీనియర్ ద్వయం వన్డే ప్రపంచకప్-2027లో ఆడడం అనుమానమే. వీరిద్దరి వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు."కోహ్లి, రోహిత్ శర్మ వన్డే ఫ్యూచర్పై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాము. వన్డే ప్రపంచకప్-2027కు మాకు ఇంకా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉంది. అప్పటికి కోహ్లి, రోహ్లి ఇద్దరి వయస్సు 40 సంవత్సరాలు దాటుతోంది. కాబట్టి ఈ మెగా ఈవెంట్ కోసం మేము స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. కొంతమంది యువ ఆటగాళ్లకు కూడా జట్టులో అవకాశమివ్వాలి. కోహ్లి, రోహిత్ ఇద్దరూ వైట్బాల్ క్రికెట్లో భారత జట్టు ఎంతో కాలం నుంచి తమ సేవలను అందిస్తున్నారు. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యారు. వారు ప్రతీదీ సాధించారు.కాబట్టి అటువంటి లెజెండరీ క్రికెటర్లను రిటైర్మెంట్ ప్రకటించాలని ఎవరూ ఒత్తిడి తీసుకురారు. కానీ తదుపరి వన్డే సైకిల్ ప్రారంభమయ్యే సమయానికి వారు వారు మానసికంగా, శారీరకంగా సిద్దంగా ఉన్నారో లేదో పరీక్షించక తప్పదు అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.చదవండి: టీమిండియా గెలుస్తుందని నాకు ముందే తెలుసు: సౌరవ్ గంగూలీ -
Ind Vs Pak: ‘సైనికుల రక్తం, భారతీయుల కంటే డబ్బే ముఖ్యమా?’
ముంబై: మహారాష్ట్ర శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ (BCCI), భారత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియాకప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ (IND vs PAK) మధ్య మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐపై ప్రియాంక విరుచుకుపడ్డారు. భారత సైనికుల ప్రాణాలు, ప్రజల రక్తం కంటే.. బీసీసీఐకి డబ్బే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ సంచలన విమర్శలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఆసియాకప్లో భారత్, పాక్ మ్యాచ్ విషయమై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రియాంక.. ‘బ్లాక్బస్టర్ ఫిక్సర్.. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్ను షెడ్యూల్ చేశారు. అలాగే, మళ్లీ సూపర్ ఫోర్, ఫైనల్స్లో కూడా దాయాదులు తలపడే అవకాశం ఉంది. ఇది న్యాయమేనా?. భారత సైనికుల రక్తం, త్యాగం.. భారతీయుల ఆత్మాభిమానం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యమైనప్పుడు ఇలాంటివి ఉంటాయి. బీసీసీఐ సంపాదించాలనుకుంటున్నది రక్తపు సొమ్ము మాత్రమే కాదు.. వినాశకరమైన డబ్బు. ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత ప్రభుత్వం సిగ్గుపడాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దుతు ఇస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.“Blockbuster Fixture: India vs Pakistan scheduled for 14 September, 2025 with potential rematches during Super Four and Final”When money is more important than the blood of our fellow Indians and our men in uniform. Shame on GoI for being a hypocrite on Operation Sindoor. And… pic.twitter.com/AJG4xruesB— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) August 3, 2025ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ విషయంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పహల్గాం ఎఫెక్ట్ ఇరుదేశాల క్రీడా సంబంధాలపైనా పడింది. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాక్ ఛాంపియన్స్తో ఆడేందుకు భారత్ నిరాకరించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రద్దైంది. ఆసియాకప్లో కూడా భారత్-పాక్ మ్యాచ్లను నిర్వహించాలనుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. ఈ సమయంలోనే ఆసియాకప్ షెడ్యూల్ విడుదల కావడంతో పలువరు నెటిజన్లు బీసీసీఐ తీరుపై విమర్శలు చేస్తున్నారు. అయితే, పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ టార్గెట్గా సోషల్ మీడియా ఖాతాలు, క్రికెటర్ల యూట్యూబ్ చానెల్స్ సైతం బ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. -
Asia Cup 2025: టీమిండియాకు భారీ షాక్..!?
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి వచ్చేయనున్నాడు. వర్క్లోడ్లో భాగంగా ఇంగ్లండ్తో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రాను జట్టు నుంచి బీసీసీఐ విడుదల చేసింది. భారత్కు చేరుకున్నాక బుమ్రా దాదాపు నెల రోజుల పైనా విశ్రాంతి తీసుకోనున్నాడు.అతడు తిరిగి మళ్లీ సెప్టెంబర్లో మైదానంలో అడుగుపెట్టే అవకాశముంది. అయితే బుమ్రా విషయంలో సెలక్టర్లకు, టీమ్ మెనెజ్మెంట్కు మరోక చిక్కు వచ్చి పడింది. బుమ్రాను ఆసియా కప్(టీ20 ఫార్మాట్)లో ఆడించాలా లేదా వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేయాలో సెలక్టర్లకు ఆర్ధం కావడం లేదు.ఎందుకంటే ఆసియాకప్ సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 29న ముగుస్తుంది. అక్కడికి నాలుగు రోజుల తర్వాత అక్టోబర్ 2-6 వరకు భారత జట్టు వెస్టిండీస్తో అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టులో ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్కు చేరి, వెంటనే విండీస్తో తొలి టెస్టులో బుమ్రా ఆడాలంటే అది ఆసాధ్యమనే చెప్పుకోవాలి.బుమ్రా ప్రస్తుతం అంత ఫిట్గా లేడు. ఇంగ్లండ్ టూర్లో కూడా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఇప్పుడు ఇదే సెలక్టర్లకు, టీమ్ మెనెజ్మెంట్ తలనొప్పిగా మారింది. తాజాగా ఇదే విషయంపై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.బుమ్రా దూరం?"బుమ్రా ఆసియాకప్లో ఆడి.. ఒకవేళ బారత్ ఫైనల్కు చేరితే అతడు అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగే తొలి టెస్టుకు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే అతడు తన వర్క్లోడ్ను మెనెజ్ చేయలేడు. అతడిని ఆసియాకప్లో ఆడించాలా లేదా వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేయాలా అన్నది సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.అంతేకాకుండా నవంబర్లో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు ఆడాల్సి వచ్చింది. కాబట్టి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. వారిద్దరికి ఇది ఒక సవాల్గా మారనుంది" అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.కాగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరగనున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం నాలుగో స్దానంలో ఉంది. కాబట్టి ఈ రెండు సిరీస్లు టీమిండియాకు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో బుమ్రాను ఆసియాకప్నకు బదులుగా విండీస్, ప్రోటీస్ సిరీస్లో ఆడించే అవకాశముంది.చదవండి: IPL 2026: గైక్వాడ్పై వేటు.. సీఎస్కే కెప్టెన్గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను? -
ఏసీఏ ఎన్నికల క్రీజులో బైలా డకౌట్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రాజకీయ రంగు పులుముకుని భ్రష్టు పట్టింది. క్రికెట్ అభివృద్ధికి, పారదర్శకతకు నిలువునా పాతరేయడంతో దశాబ్దాల ఏసీఏ ప్రతిష్ట మంటగలిసింది. కూటమి నేతలు చట్టాలకు తూట్లు పొడవడంతో ఎన్నికల క్రీజులో బైలా డకౌటైంది. క్రికెట్తో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఏసీఏ వెళ్లిపోవడంతో భావి క్రికెటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అనుబంధంగా కొనసాగుతున్న ఏసీఏలో.. కార్యవర్గం పదవీ కాలం గరిష్టంగా మూడేళ్లు. ఆ గడువు ఈ ఏడాది చివరితో ముగియనుంది. అయితే, బీసీసీఐను అనుసరించి ఏసీఏ రాసుకున్న బైలాస్ ప్రకారం ఏటా సెపె్టంబర్ 30లోగా వార్షిక జనరల్ బాడీ మీటింగ్(ఏజీఎం) నిర్వహించాలి. ఇందులోనే అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవాలి. దీనిలో ప్రధానమైనది ఏసీఏ అపెక్స్ కౌన్సిల్, అఫీస్ బేరర్ల ఎన్నిక. ఏజీఎంలో తప్పితే మరే సమయంలోనూ పదవీ కాలం పూర్తయిన తర్వాత మరో కొత్త కార్యవర్గాన్ని ఎన్నికోవడానికి బైలాలోని నిబంధనలు అంగీకరించవు. కానీ, కూటమి ప్రభుత్వంలో ఏసీఏ పాలక వర్గం ‘వార్షిక జనరల్ బాడీ మీటింగ్’ అర్థాన్నే మార్చేసింది. ఏడాదికి ఒక సారి మాత్రమే నిర్వహించే ఏజీఎంను రెండోసారి నిర్వహించేందుకు అందులో కొత్త కార్యవర్గ కోసం ఎన్నికలు చేపట్టేందుకు సమాయత్తమవుతుండడం, దీనికోసం నోటిఫికేషన్ సైతం విడుదల చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది. హడావుడిగా ఏజీఎం.. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏసీఏ కూటమి నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. మంత్రి లోకేశ్ అండతో గత ప్రభుత్వంలో ఏర్పడిన ఏసీఏ కార్యవర్గాన్ని బలవంతంగా రాజీనామా చేయించి ఆ పదవుల్లోకి కూటమి నేతలు దూరిపోయారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రీమియర్ లీగ్(ఏపీఎల్) ఫ్రాంచైజీలనూ చేజిక్కించుకునే కుట్ర పన్నారు. ఇందులో భాగంగా పాత ఫ్రాంచైజీలకు గడువు ఉన్నా.. వారిని తొలగిస్తూ కొత్త ఫ్రాంచైజీల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, ఇక్కడే ఏపీఎల్ నిర్వహణకు గవర్నింగ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలి. దీని కోసం సెపె్టంబర్లోగా నిర్వహించాల్సిన ఏజీఎంను ముందుకు జరిపేశారు. జూన్1 ఏజీఎం నిర్వహిస్తున్నట్టు ఈ ఏడాది మే 12న ఏసీఏ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం జూన్లో ఏసీఏ కార్యవర్గం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ పూర్తయింది. కానీ, అప్పుడు ఎన్నికల అంశం అజెండాలోకి రాలేదు. ఈ ఎన్నిక చెల్లుబాటేనా? వాస్తవానికి ఏసీఏ బైలా ప్రకారం ఏడాదికి ఒక సారి మాత్రే వార్షిక జనరల్ బాడీ మీటింగ్(ఏజీఎం) నిర్వహించాలి. ఇది జూన్లోనే ముగిసింది. ఒక వేళ అది ఏజీఎం కానప్పుడు ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్గా గుర్తించాలి. కానీ, ఏసీఏ సెక్రటరీ తన సర్క్యులర్లో స్పష్టంగా ఏజీఎం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. ఏజీఎంలో మాత్రమే ఎన్నికలకు అవకాశం ఉండగా.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఏసీఏ ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికలు బీసీసీఐ రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ పైగా ఏసీఏ ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికే సక్రమం కాదంటూ కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి ఏజీఎంకు నాలుగు వారాల ముందు ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఎన్నికల అధికారిని నియమించుకుని.. ఏజీఎంలో దానిని రాటిఫై చేసుకోవాలి. ఇక్కడ అదేమీ జరగలేదు. జూన్లో అసలు ఎన్నికల అధికారి నియామకం అజెండానే పెట్టలేదు. కానీ, జూలైలో అపెక్స్ కౌన్సిల్ కూర్చుని ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్ను నియమించినట్టు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్ని గందరగోళాల మధ్య ఎన్నికలు జరిపితే ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా, బీసీసీఐ అంబుడ్స్మెన్ను ఫిర్యాదు చేసినా ఎన్నికలు చెల్లుబాటు కావని క్రీడానిపుణులు హెచ్చరిస్తున్నారు. నచ్చనోళ్ల ఓట్ల తొలగింపు.. ఈ నెల 3న ఏసీఏ ఎన్నికలకు నామినేషన్లు వేయాలని ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ నోటిఫికేషన్ ఇచ్చారు. 6న పరిశీలన, 7న అర్హత పొందిన నామినేషన్ల జాబితా విడుదల, 11 వరకు ఉపసంహరణ, 16న ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే, గత కార్యవర్గమే మరోసారి పీఠంపై కూర్చునే కుట్రతో తమకు వ్యతిరేకంగా గళం విప్పిన వారి ఓట్లను తొలగించింది. పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్లో ఏసీఏ మాజీ అధ్యక్షుడు మనవడిని ఏసీఏ సస్పెండ్ చేసింది. అయితే, కోర్టుకు వెళ్లడంతో ఓటు తిరిగి పొందారు. కానీ, ఎన్నికల్లో పోటీకి మాత్రం అర్హత లేకుండా పోవడం గమనార్హం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఉన్న వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకోవడం ఒక్క కూటమి పాలనలోనే చెల్లుతోంది. దీనికి తోడు ఏసీఏ దోపిడీలను ప్రశ్నిస్తున్న గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్నూ అబయన్స్లో పెట్టి ఓటు లేకుండా చేశారు. ఒక ప్రాంత వ్యక్తిని మరో జిల్లాలో సభ్యుడిగా చూపించి ఓటు కల్పించారు. ఇలా తమకు నచ్చినోళ్లకు ఓటు హక్కు కల్పించి నచ్చనోళ్లను తొలగించారు. వ్యతిరేకులు ఎవరూ నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓట్ల కోసమే..ఓ మూడు జిల్లాల క్రికెట్ అసోసియేషన్ సభ్యులను ప్రలోభపెట్టి ఏసీఏ నుంచి పనులు ఇచ్చి నిధులు దోచిపెడుతున్నారు. -
BCCI: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అప్డేటెడ్ జట్టు ఇదే
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఐదో టెస్టు జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్తో ఓవల్ టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా బీసీసీఐ ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెల్లడించింది.ఇక జట్టును వీడిన బుమ్రాకు సెప్టెంబరులో జరిగే ఆసియా కప్-2025 (Asia Cup) వరకు సుదీర్ఘ కాలం విశ్రాంతి లభించనుంది. కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతోంది.ఓవల్ టెస్టులో గెలిస్తేనే సమంఈ క్రమంలో ఇంగ్లండ్ గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ను కనీసం డ్రా చేసుకోగలుగుతుంది. అయితే, పనిభారం తగ్గించే క్రమంలో ప్రధాన పేసర్ బుమ్రాను ఇంగ్లండ్లో కేవలం మూడు టెస్టుల్లోనే ఆడిస్తామని మేనేజ్మెంట్ ముందుగానే ప్రకటించింది.అందుకు తగ్గట్లుగానే లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్బాస్టన్లో విశ్రాంతి తీసుకున్నాడు. లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చి.. వెంటనే మాంచెస్టర్ టెస్టు కూడా ఆడాడు. అయితే, కీలకమైన ఐదో టెస్టులో ఆడతాడని భావించినా.. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా యాజమాన్యం అతడికి రెస్ట్ ఇచ్చింది. తాజాగా జట్టు నుంచి రిలీజ్ చేసింది. కాగా ఇంగ్లండ్తో ఆడిన మూడు టెస్టుల్లో ఈ రైటార్మ్ పేసర్ ఐదు ఇన్నింగ్స్లో కలిపి 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి.. 14 వికెట్లు కూల్చాడు.ఇంగ్లండ్తో ఐదో టెస్టుకు భారత జట్టు (అప్డేటెడ్)శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, అర్ష్దీప్ సింగ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఆసియా కప్ నాటికి తిరిగి వస్తాడా?ఆసియాకప్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నట్లు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహసిన్ నఖ్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబరు 14న గ్రూప్ దశ మ్యాచ్, 21న ‘సూపర్ ఫోర్’ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది.ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్లు జరగనుండగా... దుబాయ్, అబుదాబిలో మ్యాచ్లు నిర్వహించనున్నారు. యూఏఈ, ఒమాన్, పాకిస్తాన్తో కలిసి భారత్ గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ గ్రూప్ ‘బి’లో పోటీపడనున్నాయి.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ కేవలం తటస్థ వేదికల్లోనే తలపడాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మ్యాచ్లను యూఏఈలో నిర్వహించనున్నారు. ప్రసారదారులతో ఏసీసీ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ నుంచి పోటీపడనున్నాయి. దీంతో గ్రూప్ స్థాయిలో, ‘సూపర్ ఫోర్’ దశతో పాటు ఫైనల్లో ఇరు జట్లు పోటీపడే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుండటంతో... ఆసియాకప్ను అదే ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మెగా టోర్నీ నాటికి బుమ్రా తిరిగి వస్తాడో లేదో చూడాలి. చదవండి: ENG VS IND 5th Test: అట్కిన్సన్ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా -
‘పాక్తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని వాపోతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్కు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.కుదిరితే మూడుసార్లుఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇరుజట్లు సెప్టెంబరు 14న దుబాయ్లో ముఖాముఖి తలపడనున్నాయి. ఆసియా క్రికెట్ మండలి (ACC) ప్రసారకర్తలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సూపర్ ఫోర్ దశలో ఇరుజట్లు మరోసారి పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగి.. మెరుగైన ప్రదర్శన కనబరిస్తే సెప్టెంబరు 28 నాటి ఫైనల్లోనూ దాయాదులు పోటీపడతాయి. నిజానికి ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్వి. అయితే, అంతకుముందు పాక్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించింది. తటస్థ వేదికపైనేభద్రతా కారణాల దృష్ట్యా పాక్కు వెళ్లలేమని ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరుగగా.. టీమిండియా చాంపియన్గా నిలిచింది.అయితే, నాటి చర్చల ప్రకారం 2027 వరకు భారత్- పాక్ ఏ టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా తటస్థ వేదికపైనే ఆడాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇందుకు అంగీకరించాయి. కానీ.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి పరిస్థితులు శ్రుతిమించాయి.పాక్కు బుద్ధి చెప్పిన భారత సైన్యంప్రశాంతమైన పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులపై జరిపిన దాడులకు పాక్ సైన్యం స్పందిస్తూ.. ప్రతిదాడికి దిగగా.. ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధిచెప్పింది.ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని.. క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై గంగూలీ గతంలో స్పందిస్తూ.. ఈ డిమాండ్లకు మద్దతు తెలిపాడు. అయితే, తాజాగా మరోసారి ఆసియా కప్-2025 నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురుకాగా దాదా భిన్నంగా స్పందించాడు.పాక్తో మ్యాచ్.. ఆటలు కొనసాగాలి‘‘ఇరుజట్లు పరస్పరం పోటీపడటంలో నాకెలాంటి ఇబ్బందీ లేదు. ప్రణాళిక ప్రకారం క్రీడలు కొనసాగాలి. అదే సమయంలో పహల్గామ్ వంటి ఘటనలను అరికట్టాలి. అయితే, ఆటలు మాత్రం కొనసాగుతూనే ఉండాలి. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కాబట్టి క్రీడలు కొనసాగించడంలో తప్పులేదు’’ అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇటీవల ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 సీజన్లో భాగంగా ఇండియా- పాకిస్తాన్తో తలపడాల్సి ఉండగా.. విమర్శల నేపథ్యంలో మ్యాచ్ రద్దైపోయింది. ఇండియా చాంపియన్స్ జట్టులో భాగమైన శిఖర్ ధావన్, సురేశ్ రైనా తదితరులు పాక్తో ఆడేందుకు విముఖత వ్యక్తం చేయడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆసియా కప్ వంటి కీలక టోర్నీలో బీసీసీఐ.. దాయాదితో ముఖాముఖి పోరు నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!చదవండి: Asia Cup 2025: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్లు ఎప్పుడంటే? #WATCH | Kolkata: On India-Pakistan placed in the same group in the Asia Cup, former Indian cricketer Saurav Ganguly says, "I am okay. The sport must go on. At the same time Pahalgam should not happen, but the sport must go on. Terrorism must not happen; it needs to be stopped.… pic.twitter.com/Qrs17KOKrN— ANI (@ANI) July 27, 2025 -
BCCI: ఇద్దరు టీమిండియా కోచ్లపై వేటు!.. అతడు మాత్రం..
గత కొన్నాళ్లుగా టీమిండియా టెస్టుల్లో నిరాశపరుస్తోంది. ముఖ్యంగా గౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడుతోంది. స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో కనీవినీ ఎరుగని రీతిలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ చేదు అనుభవం చవిచూసింది.కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 ఫైనల్ చేరే అవకాశాన్ని కూడా టీమిండియా కోల్పోయింది. డబ్ల్యూటీసీ మొదలుపెట్టిన తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్.. ఈసారి మాత్రం ఇలా డీలాపడింది.అయితే, గత వైఫల్యాలు మరిచి డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ను ఆరంభించిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ నిరాశపరుస్తోంది. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ నేతృత్వంలో... టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్లో ఓడిపోయిన టీమిండియా.. ఎడ్జ్బాస్టన్లో మాత్రం తొలిసారి గెలుపు జెండా ఎగురవేసింది.అనంతరం లార్డ్స్లో ఓడిపోయిన గిల్ సేన... తాజాగా మాంచెస్టర్లో ముగిసిన నాలుగో టెస్టులో ‘డ్రా’ తో గట్టెక్కింది. ఇక ఓవల్ మైదానంలో.. ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ను 2-2తో సమం చేయగలుగుతుంది. లేదంటే.. విదేశీ గడ్డపై వరుసగా రెండోసారి భంగపాటు తప్పదు.నిజానికి లీడ్స్, లార్డ్స్లో వ్యూహాత్మక తప్పిదాల వల్లే గెలవాల్సిన మ్యాచ్లలో టీమిండియా ఓడిపోయింది. ముఖ్యంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సేవలు వాడుకోకపోవడం.. కరుణ్ నాయర్ విఫలమవుతున్నా వరుస అవకాశాలు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ క్రమంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై వేటు వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.అయితే, గంభీర్పై నమ్మకం ఉంచిన యాజమాన్యం బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటేలపై మాత్రం వేటు వేయనున్నట్లు సమాచారం. ‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. ఆసియా కప్-2025 ముగిసిన తర్వాత వీళ్లిద్దరికి ఉద్వాసన పలికేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంగం సిద్ధం చేసింది. వెస్టిండీస్తో అక్టోబరులో జరిగే సిరీస్కు ముందే వీరిపై వేటు వేయనుంది. మోర్కెల్ బౌలింగ్ కోచ్గా వచ్చిన తర్వాత టీమిండియా బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులేమీ రాలేదని మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు.. అసిస్టెంట్ కోచ్గా డష్కాటే సేవలు కూడా అంత గొప్పగా లేవనే భావనలో ఉంది. ఈ నేపథ్యంలోనే మోర్కెల్, డష్కాటేలను సాగననంపేందుకు బోర్డు సిద్ధమైంది.కాగా గంభీర్ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్, డష్కాటేలతో పాటు అభిషేక్ నాయర్ను మేనేజ్మెంట్ అతడి సహాయక సిబ్బందిలో చేర్చింది. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అభిషేక్ నాయర్పై వేటు వేసిన బీసీసీఐ... తాజాగా మోర్నీ, డష్కాటేల భవితవ్యంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
యూఏఈలో ఆసియా కప్!
న్యూఢిల్లీ/ఢాకా: భారత్లో జరగాల్సిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించేందకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఢాకాలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు చర్చించినట్లు తెలిసిది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఏసీసీ వెల్లడించనుంది. ఏసీసీలోని మొత్తం 25 సభ్య దేశాలు ఈ మీటింగ్లో పాల్గొన్నాయి. మొదట్లో ఈ సమావేశానికి బీసీసీఐ గైర్హాజరైనట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కానీ భారత బోర్డు నుంచి సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వర్చువల్గా (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) పాల్గొన్నట్లు బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.‘ఆసియా కప్ను యూఏఈలో నిర్వహించనున్నాం. టీమిండియా మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడనుంది. షెడ్యూల్పై చర్యలు ఇంకా జరుగుతున్నాయి’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించాయి. ఏసీసీ చైర్మన్ మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ 25 సభ్య దేశాలన్నీ పాల్గొన్నాయని, బీసీసీఐతో సంప్రదింపులు పూర్తయిన వెంటనే తుది షెడ్యూలును త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. పూర్తిగా క్రికెట్ క్రీడ, అనుబంధ, సభ్యదేశాల్లో ఆట గురించే తప్ప ఇతరత్రా రాజకీయ అంశాలేవీ చర్చించలేదని ఆయన చెప్పారు. బీసీసీఐ భౌతికంగా పాల్గొనకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘అది అసలు సమస్యే కాదు. ఎందుకంటే నేను కూడా సింగపూర్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో భౌతికంగా పాల్గొనలేదు’ అని అన్నారు. సెపె్టంబర్లో రెండు వారాల్లోనే ఈ టి20 టోర్నీని ముగించే ప్రణాళికల్లో బీసీసీఐ ఉంది. ఎందుకంటే ఆ నెలాఖరి వారంలో భారత్, వెస్టిండీస్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ మొదలు కానుంది. భారత్లో ఎందుకు జరగడం లేదు? భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరిలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం భారత్లో ఈ సారి ఆసియా కప్ను టి20 ఫార్మాట్లో నిర్వహించాలనుకున్నారు. అయితే పాక్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్ల్ని దుబాయ్లో ఆడింది. ఆ సందర్భంలోనే ఇకపై పాక్ కూడా తమ మ్యాచ్ల్ని తటస్థ వేదికైన శ్రీలంక, లేదంటే యూఏఈలో ఆడుతుందని ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది. అయితే ఇటీవలే పాక్ వైఖరిలో మార్పు వచ్చింది. భారత్లో ఆడేందుకు సై అంటూ సంకేతాలిచ్చింది. సాక్షాత్తూ పాకిస్తాన్ క్రీడాశాఖ మంత్రే ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ భారత్లో పహల్గామ్లో ఉగ్రమూకల ఊచకోత అనంతరం భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో యుద్ధవాతావరణ పరిస్థితులు తలెత్తాయి. చివరకు కాల్పుల విరమణతో ఉద్రిక్తతలకు తెరపడింది. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురై నెలలు గడవకముందే పాక్ ఆటగాళ్లను భారత్లోకి అనుమతిస్తే వచ్చే సమస్యలు, విమర్శలను ముందే గుర్తించిన బీసీసీఐ తమ ఆతిథ్యాన్ని యూఏఈలో ఇచ్చేందుకు సిద్ధపడింది. -
ENG VS IND 4th Test: పంత్ బ్యాటింగ్ చేస్తాడు.. బీసీసీఐ కీలక ప్రకటన
ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో గాయపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రిషబ్ పంత్కు సంబంధించి బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. పంత్ ఈ మ్యాచ్లో వికెట్కీపింగ్కు దూరంగా ఉన్నా, బ్యాటింగ్ చేస్తాడని కన్ఫర్మ్ చేసింది. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తాడని స్పష్టం చేసింది. గాయం తీవ్రత అధికంగా ఉన్నా ఆట రెండో రోజు పంత్ జట్టుతో చేరాడని, జట్టు అవసరాల దృష్ట్యా అతను బ్యాటింగ్ చేస్తాడని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటన చేసింది.𝗨𝗽𝗱𝗮𝘁𝗲: Rishabh Pant, who sustained an injury to his right foot on Day 1 of the Manchester Test, will not be performing wicket-keeping duties for the remainder of the match. Dhruv Jurel will assume the role of wicket-keeper.Despite his injury, Rishabh Pant has joined the…— BCCI (@BCCI) July 24, 2025కాగా, ఈ మ్యాచ్ తొలి రొజు ఆటలో పంత్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డాడు. బంతి బ్యాట్ ఎడ్జ్కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దీంతో పంత్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవడంతో పంత్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. నడవలేని స్థితిలో ఉన్న పంత్ను వాహనంలో తీసుకెళ్లారు. పంత్ రిటైర్డ్ అయ్యే సమయానికి 37 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ఓవర్నైట్ స్కోర్ 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా తన స్కోర్కు మరో పరుగు మాత్రమే జోడించి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.జడేజా ఆదిలోనే ఔటైనప్పటికీ శార్దూల్ ఠాకూర్ (39) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ (13) శార్దూల్కు సహకరిస్తున్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 37 (రిటైర్డ్ హర్ట్), రవీంద్ర జడేజా 20 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 2, వోక్స్, ఆర్చర్, డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు తీవ్రగాయమైంది. తొలి రొజు ఆటలో భాగంగా పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో మూడో బంతికి పంత్ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు.అయితే బంతి బ్యాట్ ఎడ్జ్కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దీంతో రిషబ్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవడంతో ఈ ఢిల్లీ ఆటగాడు రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. పంత్ రిటైర్డ్ హార్ట్ అయ్యే సమయానికి 37 పరుగులు చేశాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న రిషబ్ గాయపడడం భారత్కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. అస్సలు రెండో రోజు ఆటలో పంత్ బ్యాటింగ్ వస్తాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతకుముందు లార్డ్స్ టెస్టులో కూడా పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక తాజా గాయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది."మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ కుడి పాదానికి గాయమైంది. అతడిని స్కాన్ల కోసం అస్పత్రికి తరలించారు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" భారత క్రికెట్ బోర్డు ఎక్స్లో రాసుకొచ్చింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (58), రాహుల్ (46) రాణించగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పర్చాడు. ఇక యువ ఆటగాడు సాయిసుదర్శన్(61) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు వికెట్ల పడగొట్టగా.. వోక్స్, డాసన్ చెరో వికెట్ తీశారు.చదవండి: IND vs ENG: భారత మాజీ వికెట్ కీపర్కు అరుదైన గౌరవం..𝗨𝗽𝗱𝗮𝘁𝗲:Rishabh Pant was hit on his right foot while batting on Day 1 of the Manchester Test. He was taken for scans from the stadium. The BCCI Medical Team is monitoring his progress.— BCCI (@BCCI) July 23, 2025 -
అనిల్ కుంబ్లే తర్వాత అన్షుల్.. బీసీసీఐ స్పెషల్ వీడియో వైరల్
ఊహించిందే జరిగింది.. ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సందర్భంగా భారత యువ పేసర్ అన్షుల్ కంబోజ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆకాశ్ దీప్ స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మాంచెస్టర్లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా అన్షుల్ రికార్డులకెక్కాడు.కుంబ్లే తర్వాత అన్షులేఅంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 1990లో ఇదే వేదికపై భారత్ తరఫున తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే, ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే..ఫస్ట్క్లాస్ క్రికెట్లో అనిల్ కుంబ్లే, అన్షుల్ కంబోజ్ ఇద్దరూ 10 వికెట్ల హాల్ కలిగి ఉండటం విశేషం. ఓ ఫస్ట్క్లాస్ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతి కొద్ది మంది బౌలర్ల జాబితాలో ఉన్న వీరు.. ఒకే వేదికపై టెస్టులో అడుగుపెట్టడం గమనార్హం.ఎవరీ అన్షుల్ కంబోజ్?కాగా భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో అన్షుల్ 318వ ప్లేయర్. 24 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ స్వస్థలం హర్యానాలోని కర్నాల్. గతేడాది రంజీ ట్రోఫీలో భాగంగా రోహ్తక్ వేదికగా కేరళతో మ్యాచ్లో అన్షుల్ అదరగొట్టాడు. కేరళ ఇన్నింగ్స్లో పది వికెట్లు కూల్చి సత్తా చాటాడు.తాజాగా ఇంగ్లండ్తో నాలుగో టెస్టుతో అన్షుల్ కంబోజ్ అరంగేట్రం సందర్భంగా... భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా 2022లో ఢిల్లీ వేదికగా త్రిపురతో మ్యాచ్ సందర్భంగా అన్షుల్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు.గత మూడేళ్లకాలంలో ఓవరాల్గా ఫస్ట్క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్లు ఆడిన అన్షుల్ కంబోజ్ 79 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు.. ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఖాతాలో 486 పరుగులు కూడా ఉన్నాయి. గతేడాది దులిప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-సి తరఫున మూడు మ్యాచ్లు ఆడిన కంబోజ్ 16 వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ గడ్డ మీదఇక ఇటీవల ఇంగ్లండ్ లయన్స్తో భారత్-ఎ ఆడిన అనధికారిక టెస్టు సిరీస్లోనూ అన్షుల్ కంబోజ్ భాగమయ్యాడు. నార్తాంప్టన్లో జరిగిన రెండో అనధికారిక టెస్టులో నాలుగు వికెట్లు కూల్చడంతో పాటు.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి కెరీర్లో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.ఇక ఐపీఎల్లో గతేడాది ముంబై ఇండియన్స్కు ఆడిన అన్షుల్.. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటి వరకు మొత్తంగా పదకొండు మ్యాచ్లు ఆడి పది వికెట్లు కూల్చాడు.వెనుకబడిన టీమిండియాఇదిలా ఉంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు శుబ్మన్ గిల్. అతడి సారథ్యంలో లీడ్స్లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. ఎడ్జ్బాస్టన్లో గెలిచి చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. అయితే, లార్డ్స్లో చివరి వరకు పోరాడి టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు జరుగుతోంది. ఈ వేదికపై ఒక్కసారి కూడా టెస్టు మ్యాచ్ గెలవని టీమిండియా.. ఈసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని పట్టుదలగా ఉంది.ఇక ఈ మ్యాచ్కు ముందే ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ గాయాల వల్ల దూరం కాగా.. వీరి స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుదిజట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ గిల్ వెల్లడించాడు. మరోవైపు.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కరుణ్ నాయర్పై వేటు పడగా.. సాయి సుదర్శన్ రీఎంట్రీ ఇచ్చాడు.ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.Shine on, young lad 🙌🙌#TeamIndia #ENGvIND https://t.co/BLDRZz8Gu7— BCCI (@BCCI) July 23, 2025 -
జాతీయ క్రీడా నియమావళి పరిధిలోకి బీసీసీఐ!
న్యూఢిల్లీ: త్వరలోనే భారత ప్రభుత్వం కొత్త క్రీడా బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఇది వరకే జాతీయ క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్) ఉంది. దీనికి కొన్ని సవరణలు, మార్పు–చేర్పులతో తాజాగా స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఇన్నేళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్వతంత్ర క్రీడా సమాఖ్యగా చక్రం తిప్పింది. ఇప్పుడు కొత్త బిల్లు ప్రకారం క్రికెట్ బోర్డు కూడా స్పోర్ట్స్ గవర్నెన్స్ గొడుగు కిందకే రానుంది. ఇదే విషయమై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది. ‘దేశంలో ఉన్న అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల మాదిరే బీసీసీఐ కూడా కొత్త గవర్నెన్స్ బిల్లు పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు, గ్రాంట్లు పొందిన, పొందకపోయినా పార్లమెంటులో చట్టం అయ్యాక క్రికెట్ బోర్డు కూడా స్పోర్ట్స్ కోడ్ కిందకే వస్తుంది’ అని క్రీడాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. క్రీడా సమఖ్యల లాగే క్రికెట్ బోర్డుకు ఉన్న స్వయంప్రతిపత్తికి ఎలాంటి విఘాతం కలుగదని, అయితే వివాదాలు, ఇతరాత్ర సమస్యలు ఎదురైతే మాత్రం జాతీయ క్రీడా నియమావళి ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి వెల్లడించారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్–2028లో క్రికెట్ క్రీడాంశం ఉండటంతోనే బోర్డు ఒలింపిక్ సంఘం పరిధిలోకి వచ్చినట్లయ్యింది. జాతీయ క్రీడాసమాఖ్యల్లో నిర్లిప్తతను దూరం చేసి జవాబుదారితనాన్ని మరింత పెంచేందుకు, సకాలంలో ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు, పారదర్శక పరిపాలన, అర్హులైన క్రీడాకారుల సంక్షేమం, ప్రమాణాల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును తీసుకొస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఒలింపిక్ చార్టర్ ప్రకారం నడుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ బిల్లు తెలియజేస్తుంది. దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన మోదీ సర్కారు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు సిద్ధమైంది. ఇది వరకటి స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 70 ఏళ్ల వయసుకు చేరిన ఏ కార్యవర్గ సభ్యుడైనా పదవికి రాజీనామా చేయాల్సివుండగా... ఈ గరిష్ట వయోపరిమితి ఇక మీదట 75కు చేరే అవకాశముంది. బిల్లు పాసయితే... కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అపెక్స్ కమిటీ రూపుదిద్దుకుంటుంది. ఈ కమిటీలో కేబినెట్ కార్యదర్శి హోదా ఉన్న అధికారి లేదంటే క్రీడా శాఖ కార్యదర్శి, స్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ చైర్ పర్సన్ అవుతారు. క్రీడలకు సేవలిందించిన దిగ్గజ క్రీడాకారులు, కోచ్లు సభ్యులుగా ఉంటారు. వీరు తప్పనిసరిగా ద్రోణాచార్య, ఖేల్రత్న, అర్జున అవార్డీలై ఉండాలి. జాతీయ క్రీడా సమాఖ్యలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులకు ఈ కమిటీలో చోటుంటుంది. ముఖ్యంగా తరచూ వివాదాస్పదమవుతున్న అంశాలపై మరింత జవాబుదారీతనంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది. ఎంపికల ప్రక్రియ, ఆటగాళ్ల నిషేధం ఇతరాత్ర సమస్యల్ని ఈ కమిటీ పారదర్శక విధానంతో పరిష్కరిస్తుంది. -
రోజర్ బిన్నీ తప్పుకుంటారా?
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, ప్రస్తుత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ శనివారం (19 జూలై) నాటి పుట్టినరోజుతో 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడున్న జాతీయ క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్) ప్రకారం ఏవరైనా క్రీడా సమాఖ్య కార్యవర్గ సభ్యుడు గరిష్టంగా 70 ఏళ్ల వయసు వరకే పదవిలో కొనసాగాలి. వయోపరిమితి మించితే వైదొలగాల్సి ఉంటుంది. అయితే బీసీసీఐ ఒక స్వతంత్ర క్రీడా సంఘమైనా... మిగతా జాతీయ క్రీడా సమాఖ్యల మాదిరి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గొడుగు కింద లేకపోయినా... లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్ (2028)లో క్రికెట్ ఉండటంతో ఇకపై స్పోర్ట్స్ కోడ్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాలో ఆయన తప్పుకుంటారని, తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా బాధ్యతలు చేపడతారని వార్తలు ప్రముఖంగా వచ్చాయి. దీంతో అతను తప్పుకోవడంపై నేడో రేపో ప్రకటన ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ బిన్నీ నుంచి అలాంటి ప్రకటన కాదు కదా... కనీసం సంకేతాలు కూడా రాలేదు. కొత్త ‘కోడ్’పై కోటి ఆశలు రోజర్ బిన్నీ పదవిని వీడకపోవడానికి కారణం కూడా లేకపోలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నూతన క్రీడా బిల్లును ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా ఎప్పుడో సిద్ధమైంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు ఈ బిల్లు రానుంది. ఇందులో ఉన్న కొత్త నిబంధన వృద్ధండ పిండాలకు ఊరటనిచ్చేలా ఉంది. గరిష్ట వయోపరిమితికి వెసులుబాటు కల్పిస్తుంది. అంటే నామినేషన్ల సమయంలో 69 ఏళ్లకు పైబడి 70 ఏళ్లలోపు ఏ ఒక్కరోజు మిగిలున్నా... అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి పోటీపడేందుకు... గెలిస్తే పూర్తి పదవీకాలం కొనసాగేందుకు కొత్త క్రీడా పాలసీలో అవకాశం ఉంది. దీంతో ఈ బిల్లు పాస్ అయితే 70 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వరకు బిన్నీలాంటివారు పదవిలో కొనసాగవచ్చు. పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిపా), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో గరిష్ట వయోపరిమితి లేనేలేదు. ఒకవేళ విమర్శలు ఎదురైతే రాజీవ్ శుక్లాకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించడం లేదంటే స్పోర్ట్స్ కోడ్ బిల్లు వరకు వేచి చూసే ధోరణితో ఉండాలని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. -
BCCI: క్రికెట్ ఒక్కటేనా?.. అదో పెద్ద సామ్రాజ్యం! ఆర్థిక వనరులు ఇవే..
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రపంచ క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. వరల్డ్లోనే సంపన్నమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఖ్యాతి గడించింది. తాజాగా బీసీసీఐ మరోసారి సంపద సృష్టిలో చరిత్ర సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) రికార్డు స్థాయిలో రూ.9,741.7 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డుకు ఆదాయం వచ్చే మార్గాలపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ బంగారు బాతు..భారత క్రికెట్ బోర్డుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బంగారు బాతులా మారింది. 2007లో పురుడుపోసుకున్న ఐపీఎల్.. బీసీసీఐకి ప్రదాయ ఆదాయ వనరుగా ఉంది. తాజా నివేదిక ప్రకారం 2023-2024 సంవత్సరానికి గాను ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి రూ. 5,761 కోట్లు బోర్డు ఖాతాలో చేరాయి.మీడియా హక్కులు, ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్షిప్ల రూపంలో వచ్చాయి. బీసీసీఐ ఆర్జించిన మొత్తంలో 59 శాతంతో ఐపీఎల్ ప్రధాన వాటాదారుగా నిలిచింది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ద్వారా బీసీసీఐకి రూ.1042 కోట్లు(10.7%) వచ్చాయి.అంతేకాకుండా ఐపీఎల్ యేతర మీడియా హక్కుల(భారత అంతర్జాతీయ మ్యాచ్లు బ్రాడ్కాస్టింగ్) ద్వారా బోర్డు అదనంగా రూ. 813 కోట్లు సంపాదించింది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్ ద్వారా బోర్డుకు రూ. 378 కోట్లు వచ్చాయి.భారత్ అంతర్జాతీయ పర్యటనలో టికెట్ అమ్మకాలు, స్పాన్సర్లు, లైసెన్సింగ్ ద్వారా 361 కోట్లు అదనంగా బీసీసీఐకి లభించాయి. స్టేడియంలో ప్రకటనలు, జరిమానాలు, ఇతర రుసుముల రూపంలో భారత క్రికెట్ బోర్డుకు 400 కోట్ల ఆదాయం సమకూరింది.వెయ్యి కోట్ల పైగా వడ్డీ..భారత క్రికెట్ బోర్డు దగ్గర దాదాపు రూ. 30 వేల కోట్లు రిజర్వ్లో ఉన్నాయి. దీని వల్ల ఏడాదికి రూ. 1,000 కోట్ల వడ్డీ వస్తున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐకి ఖర్చు కూడా ఎక్కువే..భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదాయాన్ని సంపాదించడంలోనే కాదు ఖర్చు చేయడంలో మిగిలిన బోర్డులకంటే ముందు ఉంది. క్రికెట్ అభివృద్ది కోసం బీసీసీఐ ఖర్చు చేసే ఆంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఆటగాళ్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్లు కింద బీసీసీఐ ప్రతీ ఏటా రూ.250 కోట్ల పైగా ఖర్చుచేస్తోంది. అదేవిధంగా కోచింగ్ స్టాప్ జీతాల కోసం రూ.100 కోట్ల పైగా బీసీసీఐ వెచ్చిస్తోంది.అంతేకాకుండా స్టేట్ క్రికెట్ ఆసోయేషిన్లకు నిధుల రూపంలో రూ.1000 కోట్ల పైగా భారత క్రికెట్ బోర్డు ఖర్చుచేస్తోంది. మ్యాచ్లను నిర్వహించేందుకు రూ. 500 కోట్లు, మహిళల క్రికెట్ అభివృద్ది కోసం 150 కోట్లు బీసీసీఐ ప్రతీ ఊటా కేటాయిస్తోంది.పరిపాలన, కార్యకలాపాలు(ట్రావిలింగ్, మార్కెటింగ్) కోసం బీసీసీఐ 300 పైగా కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభించడానికి బీసీసీఐ భారీ ఖర్చు చేసింది. అందులో మీడియా హక్కుల కోసం రూ. 951 కోట్లు వెచ్చించింది.చదవండి: ENG vs IND: క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్లో ఏమి తింటారో తెలుసా? -
HCA సమావేశం: ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) వార్షిక సమావేశం నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్బాబు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. ఇక ఈ మీటింగ్లో పాల్గొనేందుకు 173 క్రికెట్ క్లబ్లకు సంబంధించిన సెక్రటరీలకు మాత్రమే క్రికెట్ స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. అయితే, గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదనిహెచ్సీఏ తేల్చి చెప్పింది. దీంతో అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే లిస్టు చూసి పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. కాగా ఈ సమావేశంలో అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టైన నేపథ్యంలో ఆయనను తొలగిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో హెచ్సీఏకు కొత్త అధ్యక్షుడి నియామకం జరుగనుండగా.. ఆశావహులు తమకు అనుకూలంగా పావులు కదుపుతున్నారు. అయితే, ఈ మీటింగ్ను అడ్డుకుంటామని తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించడంతో.. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.అంబుడ్స్మన్గా జస్టిస్ సురేష్ కుమార్తాజా సమాచారం ప్రకారం.. అంబుడ్స్మన్గా జస్టిస్ సురేష్ కుమార్ ఎంపికయ్యారు. ఇక పోలీసుల బందోబస్తు నడుమ జరిగిన HCA వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ముగిసింది.ఇదిలా ఉంటే.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని ఉప్పల్ స్టేడియానికి తీసుకువచ్చింది. అధ్యక్షుడు జగన్మోహన్ రావును శుక్రవారం స్టేడియానికి తీసుకువచ్చిన సీఐడీ.. తాజాగా ట్రెజరర్ శ్రీనివాస్, సీఈఓ సునీల్లను కూడా ఇక్కడికి తీసుకువచ్చి వివరాలు సేకరించింది.కాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడితో పాటు ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా సీఐడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలో జగన్మోహన్ రావు అక్రమ పద్ధతిలో హెచ్సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మల్కాజిగిరీ కోర్టు నిందితులకు పన్నెండు రోజుల రిమాండ్ విధించింది.ఇక ఈ అక్రమాల కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇటీవల మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించడం గమనార్హం. బీసీసీఐ నుంచి వచ్చే నిధులను మళ్లించారంటూ టీసీఏ ఆరోపించింది. -
BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
భారత క్రికెట్ జట్లు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి. శుబ్మన్ గిల్ సారథ్యంలోని పురుషుల జట్టు టెస్టు సిరీస్ ఆడుతుంటే.. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని మహిళల టీమ్ పరిమిత ఓవర్ల సిరీస్లో ఆతిథ్య జట్టుతో తలపడుతోంది.మరోవైపు.. ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వంటి నయా ఐపీఎల్ సంచనాలతో కూడిన భారత అండర్-19 జట్టు కూడా ప్రస్తుతం ఇంగ్లండ్లోనే ఉంది. ఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు పూర్తి చేసుకున్న ఈ టీమ్ 3-2తో సిరీస్ను కైవసం చేసుకుంది.ధనాధన్.. ఫటాఫట్ఈ సిరీస్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ మరోసారి హాట్టాపిక్ అయిపోయాడు. అతడి ఆటను చూసేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణించి అభిమానులు స్టేడియాలకు వస్తున్నారంటే అతడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్లుగానే ధనాధన్ దంచికొడుతూ క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేస్తున్నాడు వైభవ్.ముఖ్యంగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో నాలుగో వన్డేలో వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే శతక్కొట్టడం ఇంగ్లండ్ టూర్ మొత్తంలో హైలైట్గా నిలిచింది. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి యూత్ టెస్టులోనూ పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు రాణించాడు. తొలి ఇన్నింగ్స్ (14)లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకం (56) సాధించాడు. అంతేకాదు.. ఈ పార్ట్టైమ్ స్పిన్నర్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు.ఇప్పటికే కోటీశ్వరుడిగాఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే కోటీశ్వరుడైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా ఈ బిహార్ కుర్రాడిని రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్లుగానే ఫాస్టెస్ట్ సెంచరీతో పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు వైభవ్.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వైభవ్ ఎంత సంపాదిస్తున్నాడన్న అంశంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనల ప్రకారం.. స్లాబుల ప్రకారం అండర్-19 ప్లేయర్లకు రోజుకు రూ. 20 వేల చొప్పున ఫీజు అందుతుంది. అయితే, తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లకే ఈ మొత్తం దక్కుతుంది. రిజర్వు ప్లేయర్లకు ఇందులో సగం అంటే రూ. 10 వేలు మాత్రమే ఇస్తారు.ఇప్పటికి రూ. 1.80 లక్షలుఈ లెక్కన వైభవ్ ఐదు యూత్ వన్డేల్లోనూ ఆడాడు కాబట్టి.. ఒక్కో మ్యాచ్కు రూ. 20 వేల చొప్పున ఐదింటికి రూ. లక్ష లభిస్తుంది. అదే విధంగా.. నాలుగు రోజుల యూత్ టెస్టుగానూ రోజుకు రూ. 20 వేల చొప్పున ఎనభై వేలు అతడికి ఫీజు రూపంలో దక్కుతాయి. వైభవ్తో పాటు తుదిజట్టులో ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్కు ఈ మేర ఫీజు లభిస్తుంది.సీనియర్ జట్ల ప్రదర్శన ఇలాఇదిలా ఉంటే.. శుబ్మన్ గిల్ సేన ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో మూడు పూర్తి చేసుకుంది. లీడ్స్లో ఓడిన టీమిండియా.. ఎడ్జ్బాస్టన్లో తొలిసారి గెలుపు జెండా ఎగురవేసిది. అయితే, లార్డ్స్లో ఓటమిపాలు కావడంతో ఇంగ్లండ్ 2-1తో ముందంజ వేసింది. మరోవైపు.. మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది. ఇక మూడు వన్డేల సిరీస్లోనూ తొలి మ్యాచ్ గెలిచి.. శుభారంభం అందుకుంది.చదవండి: సిరాజ్ సింహం లాంటోడు.. కానీ ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్ -
Sourav Ganguly: ఈ రికార్డులను ఇంత వరకూ ఎవరూ టచ్ కూడా చేయలేదు!
భారత క్రికెట్కు దూకుడు పరిచయం చేసిన ధీరుడు అతడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్న వారియర్ అతడు. తన కెప్టెన్సీతో ఇంటా, బయట భారత జట్టును విజయపథంలో నడిపించిన నాయకుడు అతడు.యువరాజ్ సింగ్, హార్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లను పరిచయం చేసిన దాదా అతడు. అతడే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly). అభిమానులు ముద్దుగా పిలుచుకునే బెంగాల్ టైగర్ పుట్టిన రోజు నేడు(జూలై 8). ఈ సందర్భంగా గంగూలీ పేరిట ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్న పది ఐకానిక్ రికార్డులపై ఓ లుక్కేద్దాం.ఒకే ఒక్కడు..అంతర్జాతీయ వన్డే మ్యాచ్లలో వరుసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందిన ఏకైక క్రికెటర్ గంగూలీ. ఇప్పటికి అతడి రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. 1997లో పాకిస్తాన్తో వన్డే సిరీస్లో దాదా ఈ ఘనత సాధించాడు.ఏకైక లెఫ్ట్ హ్యాండర్గా..వన్డేల్లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్గా గంగూలీ కొనసాగుతున్నాడు. గంగూలీ తన కెరీర్లో 308 మ్యాచ్లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఓవరాల్గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా గంగూలీ ఉన్నాడు. అగ్రస్ధానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్దానంలో విరాట్ కోహ్లి(14181) కొనసాగుతున్నాడు.👉ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడు కూడా గంగూలీనే కావడం గమనార్హం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో న్యూజిలాండ్పై సౌరవ్ సెంచరీ(117) సెంచరీతో మెరిశాడు.👉ఐసీసీ వన్డే టోర్నీల నాకౌట్ మ్యాచ్ల్లో మూడు శతకాలు చేసిన ఆటగాళ్లలో గంగూలీ ఒకడు. ఆయనతోపాటు ఈ లిస్ట్ లో రికీ పాంటింగ్, సయద్ అన్వర్ లు ఉన్నారు. ఈ జాబితాలో భారత తరపున నుంచి గంగూలీ ఒక్కడే ఉన్నాడు.👉ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భారత తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా ఇప్పటికీ గంగూలీ కొనసాగుతున్నాడు. 1999 వరల్డ్ కప్లో శ్రీలంకపై గంగూలీ 183 పరుగులు పరుగులు చేశాడు.వరసుగా నాలుగు సార్లు1997 నుంచి 2000 వరకు వరుసగా నాలుగు క్యాలెండర్ ఈయర్స్లో 1000 కన్నా ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గంగూలీ.1997లో – 1338 పరుగులు1998లో – 1328 పరుగులు1999లో – 1767 పరుగులు2000లో – 1579 పరుగులు👉వరల్డ్ క్రికెట్లో అంతర్జాతీయ వన్డేల్లో పదివేలకు పైగా పరుగులు, వంద వికెట్లు సాధించిన ఆరుగురిలో ఒకడిగా గంగూలీ ఉన్నారు. భారత్ నుంచి మాత్రం గంగూలీ ఒక్కడే ఈ ఫీట్ను అందుకున్నాడు.👉టెస్టు అరంగేట్రంలో ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసి, సెకెండ్ ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్ అయిన ఏకైక క్రికెటర్ కూడా దాదానే కావడం విశేషం.👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గంగూలీ నిలిచాడు. గంగూలీ 1990లో ఈ ఫీట్ సాధించాడు.👉 భారత జట్టుకు తొలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్నుని అందించిన కెప్టెన్ కూడా గంగూలీనే. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గంగూలీ సారథ్యంలోని టీమిండియా సొంతం చేసుకుంది. -
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
భారత టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ కెప్టెన్కూ సాధ్యం కాని అరుదైన ఘనతను శుబ్మన్ గిల్ (Shubman Gill) సాధించాడు. ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో తొలిసారి టీమిండియాకు టెస్టు విజయాన్ని అందించాడు. బ్యాటర్గానూ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుని.. సారథిగా రెండో ప్రయత్నంలోనే చిరస్మరణీయ గెలుపుతో సత్తా చాటాడు.చారిత్రాత్మక విజయంతోనే సమాధానంఈ నేపథ్యంలో 25 ఏళ్ల శుబ్మన్ గిల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెప్టెన్గా ఇతడేంటి? అన్న వాళ్లకు చారిత్రాత్మక విజయంతోనే సమాధానమిచ్చాడంటూ మాజీ క్రికెటర్లు ఈ కుర్రాడిని కొనియాడుతున్నారు. అయితే, అంతా బాగానే ఉన్నా టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ వ్యవహరించిన తీరు అతడిని చిక్కుల్లో పడేసేలా ఉంది.చిక్కుల్లో పడేలా గిల్ చర్య?టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ద్విశతకం (269)తో చెలరేగిన గిల్.. రెండో ఇన్నింగ్స్ (161)లోనూ శతక్కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో తాను అవుటైన కాసేపటికే గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటన చేశాడు.డ్రెసింగ్రూమ్ బయటకు వచ్చి అప్పటికి క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా (69*), వాషింగ్టన్ సుందర్ (12*)లను వెనక్కి రావాల్సిందిగా గిల్ రెండు చేతులతో సైగ చేశాడు. అయితే, ఈ సందర్భంగా అతడు తన జెర్సీ తీసేసి.. బ్లాక్ వెస్ట్ (లో దుస్తులు)తో దర్శనమిచ్చాడు. అది నైక్ బ్రాండ్కు చెందినది.ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు గిల్ తీరును విమర్శిస్తూ అతడితో పాటు బీసీసీఐ కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..బీసీసీఐ అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ అన్న విషయం తెలిసిందే. ఇందుకు గానూ భారత పురుషుల జట్టు జెర్సీలు, కిట్లు రూపొందించేందుకు బీసీసీఐతో భారీ మొత్తానికి అడిడాస్ 2023లో ఐదేళ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, ఆ బ్రాండ్కు కాంపిటీటర్ అయిన మరో బ్రాండ్ వెస్ట్ ధరించి గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం.. అది విశేషంగా వైరల్ కావడంతో చట్టపరంగా బోర్డుకు, అతడికి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. మరి కొందరేమో ఓ అడుగు ముందుకేసి.. ‘‘నువ్వు ఇప్పుడు కెప్టెన్వి. ఆచితూచి అడుగేయాలి. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు’’ అంటూ గిల్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 10 -14 మధ్య లార్డ్స్లో మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు🏏టీమిండియా- 587 & 427/6 d🏏ఇంగ్లండ్- 407 & 271🏏ఫలితం- ఇంగ్లండ్ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 🏏తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకుని.. సిరీస్ 1-1తో సిరీస్ సమం🏏ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- శుబ్మన్ గిల్.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్pic.twitter.com/SkeKPaxH5S— Shubman Gill (@ShubmanGill) July 6, 2025While Siraj & Akash Deep tore through England, the umpire had other plans for DSP Siraj… and got the stare of the century. 😤🎥India made history — first Asian team to conquer Edgbaston! 🏰🇮🇳From serious records to serial reactions —Historic win. Hilarious moments. One… pic.twitter.com/jF3q64fpws— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
అంతా ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్లో భారత జట్టు పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ధ్రువీకరించింది. ఇరు బోర్డుల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ కమిట్మెంట్స్, రెండు జట్ల షెడ్యూల్ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.ఈ సిరీస్ను వచ్చే ఏడాది సెప్టెంబర్లో నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.వాయిదా ఎందుకంటే?కాగా ఈ ఏడాది ఆరంభం నుంచే బంగ్లా-భారత్ వైట్బాల్ సిరీస్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లా పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూసింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకోమని భారత ప్రభుత్వం బీసీసీఐని సూచించినట్లు తెలుస్తోంది.మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలాక అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. ప్రస్తుతం తాత్కాళిక ప్రభుత్వ ఏర్పాటుతో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ, నివురుగప్పిన నిప్పులా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే ఛాన్స్ ఉంది. అంతకుతోడు బంగ్లాదేశ్ మాజీ మంత్రులు, రాజకీయ నేతలపై అక్కడ తరచూ మూకదాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.వచ్చే ఏడాదికల్లా ఎన్నికలు పూర్తయితే పరిస్థితిలో మార్పుంటుందని బోర్డు భావిస్తోంది. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకునే ఈ పర్యటను బీసీసీఐ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం.. భారత జట్టు ఆతిథ్య బంగ్లాతో వచ్చేనెల 17 నుంచి 31 వరకు చిట్టగాంగ్, ఢాకా వేదికలపై మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడాల్సి ఉంది. రోహిత్-కోహ్లి ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..మరోవైపు తమ ఆరాధ్య క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను మైదానంలో చూడాలన్న ఆశపడ్డ అభిమానులు మరి కొన్న నెలలు వేచి చూడాల్సిందే. టెస్టు, టీ20లకు ప్రకటించిన రోహిత్, కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. ఈ క్రమంలో బంగ్లాతో జరిగే వన్డే సిరీస్లో వీరిద్దరని చూడవచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు టూర్ వాయిదా పడడంతో ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో రో-కో ద్వయం ఆడనున్నారు.చదవండి: సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్ -
భారత్-బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్లపై నీలినీడలు?
ఈ ఏడాది ఆగస్టులో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్బాల్ సిరీస్లపై అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ సిరీస్లకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ అమీనుల్ ఇస్లాం కీలక అప్డేట్ ఇచ్చారు. బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ(BCCI) ఇంకా ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తుందని అమీనుల్ ఇస్లాం తెలిపాడు.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టులో భారత జట్టు మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం బంగ్లాలో పర్యాటించాల్సి ఉంది. ఆగస్టు 17 నుంచి టీమిండియా టూర్ ప్రారంభమవ్వాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్లు జరగడం అసంభవం అన్పిస్తోంది.అయితే బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ మాత్రం ఈ సిరీస్లకు ఆతిథ్యమిచ్చేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టులో వీలుకాకపోయినా, తర్వాతైనా భారత జట్టు తమ దేశానికి రావాలని అతడు ఆశిస్తున్నాడు. "ఈ పర్యటనకు సంబంధించి మేము బీసీసీఐతో నిరంతరం చర్చలు జరుపుతున్నాము. వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్లో సిరీస్లను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాము. ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే తర్వాతైనా భారత్కు ఆతిథ్యమిస్తామన్న నమ్మకం మాకు ఉంది. భారత్ ఇంకా అధికారికంగా టూర్ను వాయిదా వేయలేదు. భారత జట్టు బంగ్లా పర్యటన అనేది ప్రభుత్వం నుండి అనుమతి లభించడంపై ఆధారపడి ఉందని" బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో అమీనుల్ పేర్కొన్నారు. కాగా భారత జట్టు వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే, బీసీబీ ఐపీఎల్-2026 వేచి ఉండాల్సిందే. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరిలో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయింది. పొట్టి ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ జరగనుంది. కాబట్టి వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే భారత జట్టుకు కాస్త సమయం లభిస్తోంది. టీమిండియా చివరగా 2022లో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాలో పర్యటించింది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్! అతడికి పిలుపు? -
సెప్టెంబర్ 10 నుంచి ఆసియా కప్..! భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?
సెప్టెంబర్లో ఆసియా కప్.. భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్-2025 సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.వాస్తవానికి టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్కు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో జరిగిన ఒప్పందం ప్రకారం.. పాక్ తమ మ్యాచ్లను యూఏఈలో ఆడనుంది. కానీ ఇప్పుడు మ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య రాజీకీయ ఉద్రిక్తలు మరింత పెరిగాయి.దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోంటుందా? ఒకవేళ పాల్గోన్న భారత్ దాయాది జట్టుతో ఆడుతుందా అన్నది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ విషయాలపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆరు జట్లలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎఈ ఉన్నాయి.ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్..కాగా పాకిస్తాన్తో ఉద్రిక్తల కారణంగా ఆసియాకప్ నుంచి వైదొలగాలని భారత్ నిర్ణయించుకుందని తొలుత వార్తలు వినిపించాయి. ఈ వార్తలను కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. అవన్నీ ఆ వాస్తవమని, తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని సైకియా కొట్టిపారేశారు. తాజాగా మరో బీసీసీఐ సీనియర్ ఆధికారి కూడా ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు."ఆసియాకప్లో పాల్గోకపోవడం లేదా మ్యాచ్లను బాయ్కట్ చేయడం గురుంచి ఎటువంటి చర్చ కూడా జరగలేదు. ఐసీసీ ఈవెంట్లలో మేము పాకిస్తాన్తో ఆడుతాము. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాము.ఒకవేళ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రాకపోతే అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటాము. ఈ టోర్నీకి సంబంధించి రాబోయే రోజుల్లో మాకు ఒక క్లారిటీ వస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్తో పేర్కొన్నారు. -
England Tour: యువ ఆటగాడిని వెనక్కి పిలిచిన బీసీసీఐ
ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా బ్యాకప్ పేసర్గా ఎంపికైన హర్షిత్ రాణాను బీసీసీఐ వెనక్కు పిలిచినట్లు తెలుస్తుంది. హర్షిత్ను వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు భారత మేనేజ్మెంట్ రెండో టెస్ట్ మ్యాచ్కు ముందు హర్షిత్ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. రెండో టెస్ట్ కోసం బర్మింగ్హమ్కు పయనమైన భారత జట్టుతో పాటు హర్షిత్ లేడని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. వాస్తవానికి హర్షిత్ ఇంగ్లండ్ పర్యటన కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో లేడు. సుదీర్ఘంగా సాగే పర్యటన కావడంతో పేస్ బౌలర్లు గాయపడే అవకాశం ఉందని హెడ్ కోచ్ గంభీర్ ముందు జాగ్రత్త చర్యగా హర్షిత్ పేరును సిఫార్సు చేశాడు. దీంతో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు హర్షిత్ హుటాహుటిన ఇంగ్లండ్కు పయనమయ్యాడు. అయితే తాజా పరిస్థితుల ప్రకారం బ్యాకప్ పేసర్ అవసరం లేదని భారత మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జట్టులోని పేసర్లంతా ఫిట్గా ఉన్నారని సమాచారం. అందుకే మేనేజ్మెంట్ హర్షిత్ను బీసీసీఐకి సరెండర్ చేసినట్లు తెలుస్తుంది.గంభీర్పై విమర్శలుఇంగ్లండ్ పర్యటన కోసం హర్షిత్ను టీమిండియా బ్యాకప్ పేసర్ ఎంపిక చేసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వచ్చాయి. హర్షిత్ విషయంలో గంభీర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని విశ్లేషకులు బహిరంగ కామెంట్లు చేశారు. గంభీర్ కేకేఆర్ కోచ్గా ఉన్నప్పుడు హర్షిత్ను దగ్గరగా చూశాడు. అదే పరిచయంతో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక హర్షిత్ పేరును సెలెక్టర్లకు కూడా సిఫార్సు చేసినట్లు టాక్ వినిపించింది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాకే హర్షిత్ మూడు ఫార్మాట్లలో భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. హర్షిత్లో గుర్తించదగ్గ ప్రత్యేకతలేమీ లేనప్పటికీ.. టీమిండియా తరఫున సులువుగా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు హర్షిత్ను బ్యాకప్ పేసర్గా ఎంపిక చేయడంతో విమర్శల శృతి మించిందని గంభీరే స్వయంగా హర్షిత్ను బీసీసీఐ సరెండర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా, బ్యాకప్ పేసర్తో పాటు పేస్ బౌలింగ్ బలం సంపూర్ణంగా ఉన్నా భారత్ తొలి టెస్ట్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో భారత ఓటమికి బౌలింగ్ విభాగం కూడా ఒకానొక కారణం. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా పుణ్యమా అని (5 వికెట్ల ప్రదర్శన) ఇంగ్లండ్ను ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైంది. బుమ్రా సహా బౌలింగ్ విభాగమంతా తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్కు పగ్గాలేయడం ఎవరి వల్ల కాలేదు. బుమ్రా సైతం చేతులెత్తేశాడు. ఫలితంగా భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది. -
గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి (77) సోమవారం లండన్లో గుండెపోటుతో కన్నుమూశారు. 32 ఏళ్ల వయసులో ఆయనకు తొలిసారి భారత్ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది. 1979–1983 మధ్య కాలంలో 33 టెస్టులు ఆడి 114 వికెట్లు పడగొట్టిన దిలీప్ దోషి...15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు.1981లో మెల్బోర్న్లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియాపై భారత జట్టు చారిత్రాత్మక విజయంలో దిలీప్ 5 వికెట్లతో కీలక పాత్ర పోషించారు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన సుదీర్ఘ కాలం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో వార్విక్షైర్, నాటింగ్హామ్షైర్ జట్ల తరఫున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత లండన్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు కూడా భారత్ జట్టులో బిషన్సింగ్ బేడి హవా నడుస్తుండటంతో దిలీప్కు ఎక్కువగా టెస్టులు ఆడే అవకాశం రాలేదు. ‘స్పిన్ పంచ్’ పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చింది. దిలీప్ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది.కాగా ఆయన కుమారుడు నయన్ జోషీ సైతం సర్రే, సౌరాష్ట్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. దోషీ మృతికి సంతాపంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఐదు రోజు ఆటలో భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్లాక్ బ్యాండ్స్ భుజానికి కట్టుకుని బరిలోకి దిగనున్నారు. -
బెంగళూరు తొక్కిసలాట ఎఫెక్ట్.. విజయోత్సవాలకు బీసీసీఐ సరికొత్త నిబంధనలు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.ఈ క్రమంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కఠిన నియమాలను తీసుకురానుంది. ఇకపై విన్నింగ్ సెలబ్రేషన్స్, సత్కార కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా భద్రతా నియమాలను రూపొందించడానికి బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.బీసీసీఐ ప్రతిపాదించిన గైడ్లైన్స్ ఇవే..👉కూలింగ్-ఆఫ్ పీరియడ్: ఏ జట్టు అయినా టైటిల్ గెలిచిన తర్వాత మూడు, నాలుగు రోజుల్లోపు వేడుకలు నిర్వహించడానికి అనుమతి నిరాకరణ.👉బీసీసీఐ క్లియరెన్స్ తప్పని సరి: జట్లు ఏదైనా వేడుకను నిర్వహించే ముందు బీసీసీఐ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి.👉బోర్డు నుండి లిఖిత పూర్వకంగా అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు.👉భద్రతా బ్లూప్రింట్ను ముందే సమర్పించాలి. ఫైవ్ టైర్ సెక్యూరిటీ కచ్చితంగా ఉండాలి.👉విమానాశ్రయం నుండి కార్యక్రం జరిగే వేదిక వరకు జట్టు వెళ్లే మార్గమంతా భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి.👉ఈవెంట్ షెడ్యూల్ అంతటా ఆటగాళ్లు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించడం.👉జిల్లా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల నుండి అనుమతి పొందాలి. -
జై షా, బీసీసీఐతో మాట్లాడాను.. వారికి నేనే చెప్పాను: సచిన్ టెండుల్కర్
‘పటౌడీ ట్రోఫీ’ పేరు మార్పు అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB)దే తుది నిర్ణయమని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) అన్నాడు. అయితే, పటౌడీ వారసత్వాన్ని కొనసాగించేలా విజేత జట్టు కెప్టెన్కు.. పటౌడీ మెడల్ అందించేలా తాను చేసిన ప్రయత్నం సఫలమైనందుకు సంతోషంగా ఉందన్నాడు.ఈసీబీ తీరుపై విమర్శలుకాగా భారత్- ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్కు పటౌడీ ట్రోఫీ అనే పేరు ఉండేది. అయితే, తాజాగా సిరీస్ నేపథ్యంలో ఈ పేరును టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీగా మార్చారు. ఈ నేపథ్యంలో ఈసీబీ తీరుపై విమర్శలు వచ్చాయి.అయినప్పటికీ తన నిర్ణయానికి కట్టుబడి ఇరు దేశాల దిగ్గజ ఆటగాళ్ల పేర్లు గుర్తుకు వచ్చేలా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ పేరును ఈసీబీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో పటౌడీ గౌరవం తగ్గకుండా ఏదో ఒక రూపంలో వారిని గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలంటూ సచిన్ టెండుల్కర్ ఈసీబీకి విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.ఇందుకు సానుకూలంగా స్పందించిన ఈసీబీ భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్కు పటౌడీ మెడల్ అందజేస్తామని వెల్లడించింది. ఈ అంశాలపై సచిన్ టెండుల్కర్ తాజాగా స్పందించాడు.జై షా, బీసీసీఐ, ఈసీబీతో మాట్లాడాను‘‘పటౌడీ వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోవాలి. భారత క్రికెట్కు పటౌడీ కుటుంబం చేసిన సేవలు మనకు స్ఫూర్తిదాయకం. వారి పేరుకు భంగం కలగకుండా.. లెగసీ కొనసాగేలా నా వంతు ప్రయత్నం చేస్తానని పటౌడీ ఫ్యామిలీకి చెప్పాను.ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ, ఈసీబీతో ఈ విషయం గురించి మాట్లాడాను. నా ఆలోచనలను వారితో పంచుకున్నాను. ఈ క్రమంలోనే విన్నింగ్ కెప్టెన్కు పటౌడీ మెడల్ ఇవ్వాలనే నిర్ణయం జరిగింది.ఇరుజట్ల మధ్య ఏదేని ట్రోఫీ రిటైర్ చేయడంపై బీసీసీఐ, ఈసీబీలదే తుది నిర్ణయం. అయితే, పటౌడీ పేరును ఏదో ఒక రూపంలో కొనసాగించేలా చేయాలన్న నా ప్రయత్నం ఫలించింది’’ అని బోరియా మజుందార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు.కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి లీడ్స్ వేదికగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్తో భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ శకం మొదలుకానుంది. రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడబోయే తొలి టెస్టు సిరీస్ ఇదే కావడంతో.. టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.పటౌడీ ఫ్యామిలీ గౌరవార్థంకాగా టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి పేరుంది. ఆయన ససెక్స్, ఆక్స్ఫర్డ్ జట్ల తరఫున కూడా క్రికెట్ ఆడారు. ఇక మన్సూర్ తండ్రి ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ కూడా టీమిండియా, ఇంగ్లండ్ జట్లకు ఆడటం విశేషం. ఈ నేపథ్యంలోనే వారి గౌరవార్థం భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ను పటౌడీ ట్రోఫీగా పిలిచారు. కాగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ భార్య షర్మిలా ఠాగూర్. ఆమె బాలీవుడ్ నటి. వీరి సంతానం సైఫ్ అలీ ఖాన్, సోహా అలీఖాన్ కూడా బాలీవుడ్ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్ హీరోయిన్గా కొనసాగుతోంది.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ -
BCCI: బీసీసీఐకి ‘భారీ’ షాక్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి గట్టి షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగమైన ఒకప్పటి ఫ్రాంఛైజీ కొచ్చి టస్కర్స్ కేరళకు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. కాగా ఐపీఎల్లో ఒక సీజన్ తర్వాత తగిన కారణాలు లేకుండా తమ జట్టును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కొచ్చి టస్కర్స్ కేరళ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో బీసీసీఐదే తప్పని తేల్చింది. అదే విధంగా.. కొచ్చి యాజమాన్యానికి రూ. 538 కోట్లు చెల్లించాలని ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎనిమిదో స్థానంలోకాగా ఐపీఎల్- 2011 సీజన్లో మాత్రమే ఆడిన టస్కర్స్ టీమ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే జట్టు మేనేజ్మెంట్ నిబంధనలు ఉల్లంఘించిందని, సరైన సమయంలో బ్యాంక్ గ్యారంటీ చెల్లించలేదని పేర్కొంటూ కొచ్చి టీమ్ను బీసీసీఐ లీగ్ నుంచి తప్పించింది.ఈ విషయంపై... టీమ్లో భాగస్వాములైన కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (కేసీపీఎల్), రెండేవూ స్పోర్ట్స్ వరల్డ్ (ఆర్ఎస్డబ్ల్యూ) కోర్టుకెక్కాయి. చివరకు 2015లో కోర్టు ఆర్బిట్రేటర్ కొచ్చికి అనుకూలంగా తీర్పునిస్తూ రూ. 538 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అయితే, ఆర్బిట్రేటర్ నిర్ణయాన్ని బోర్డు హైకోర్టులో సవాల్ చేయగా...ఇప్పుడు అదే తీర్పునకు హైకోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం కేసీపీఎల్కు రూ.385.50 కోట్లు, ఆర్ఎస్డబ్ల్యూకు రూ.153.34 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. దీనిపై మళ్లీ అప్పీల్ చేసేందుకు బీసీసీఐకి ఆరు వారాల గడువు ఉంది. ప్రస్తుతం పదికాగా ఐపీఎల్లో ప్రస్తుతం పది జట్లు ఉన్నాయి. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ క్యాష్ రిచ్ లీగ్లో కొనసాగుతున్నాయి. వీటిలో ముంబై, చెన్నై అత్యధికంగా ఐదేసి సార్లు టైటిల్ గెలవగా.. కోల్కతా మూడుసార్లు ట్రోఫీని ముద్దాడింది. ఇక 2008 నాటి తొలి సీజన్లో రాజస్తాన్ చాంపియన్గా నిలవగా.. సన్రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి టైటిల్ అందుకున్నాయి. తాజాగా ఐపీఎల్-2025లో విజేతగా నిలిచి బెంగళూరు జట్టు కూడా చాంపియన్ల జాబితాలో చేరింది. ఇక కొచ్చి టస్కర్స్తో పాటు దక్కన్ చార్జర్స్, గుజరాత్ లయన్స్ కూడా ఇప్పుడు ఉనికిలో లేవు. వీటిలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ దక్కన్ చార్జర్స్ కూడా ఓసారి టైటిల్ గెలిచింది.చదవండి: ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు -
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ప్రస్తుత జమానాలో క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు. ఇదో పెద్ద వ్యాపారం. ఇందులో ఆయా దేశ క్రికెట్ బోర్డులు లెక్కలేనంతగా సంపాదిస్తున్నాయి. స్పాన్సర్లు, ప్రసార ఒప్పందాలు, ఇతరత్రా మార్గాల ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నాయి. గత దశాబ్దకాలంలో ఈ ధోరణి మరింత పెరిగింది. ఐపీఎల్ లాంటి లీగ్ల వల్ల క్రికెట్ బోర్డుల రూపురేఖలే మారిపోయాయి. ఎంతలా అంటే, క్రికెట్ బోర్డులు దేశ అర్దిక వ్యవస్థలను శాశించేంతలా మారాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇందుకు ప్రధాన ఉదాహరణ.బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కావడమే కాక ప్రపంచ క్రికెట్ మొత్తాన్నే శాశిస్తుంది. ఐపీఎల్ బీసీసీఐ దశ దిశనే మార్చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమయ్యాక బీసీసీఐ రెవెన్యూ అమాంతం పెరిగింది. ధనార్జన విషయంలో ఇతర దేశ క్రికెట్ బోర్డులు బీసీసీఐ దరిదాపుల్లోకి కూడా రాలేపోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం బీసీసీఐ నికర విలువ రూ. 19052 కోట్లని తెలుస్తుంది. ఈ సంఖ్యతో పోలిస్తే మిగతా క్రికెట్ బోర్డుల ఆదాయం కనీసం పది శాతం కూడా లేదు. తాజా నివేదికల ప్రకారం.. బీసీసీఐ అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా ఉంటే, టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో న్యూజిలాండ్ అతి పేద క్రికెట్ బోర్డుగా ఉంది. న్యూజిలాండ్ 1926 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ను కేవలం క్రీడగానే చూస్తుంది. దీన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఏ నాడు ఆదాయ వనరుగా పరిగణించలేదు.కడు పేదరికాన్ని అనుభవిస్తున్న మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా క్రికెట్ ద్వారా కోట్లు సంపాదిస్తుంటే న్యూజిలాండ్ మాత్రం క్రీడలో విలువలకు ప్రాధాన్యత ఇస్తూ చాలీచాలని ఆదాయంతో సరిపెట్టుకుంటుంది.బీసీసీఐ విషయానికొస్తే.. భారత్లో క్రికెట్ ప్రతి పౌరుడి జీవితంలో ఓ భాగం. ఇదే బీసీసీఐకి అతి పెద్ద పెట్టుబడి. బీసీసీఐ బలమంతా భారత క్రికెట్ మార్కెట్లోనే ఉంది. అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు భారత అభిమానుల ముందుకు రావడానికి వందల కోట్లు ఖర్చు పెడతాయి. ఐపీఎల్ పరిచమయ్యాక బీసీసీఐ తలరాతే మారిపోయింది. ఈ లీగ్ మీడియా హక్కులు చిన్న దేశ క్రికెట్ బోర్డుల ఆదాయం కంటే చాల ఎక్కువ. భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు స్పాన్సర్షిప్లు బీసీసీఐకి మరో ప్రధాన ఆదాయ వనరు. భారత్లోనే జరిగే మ్యాచ్ల టిక్కెట్ల అమ్మకాలు మరియు ఆ మ్యాచ్ల ద్వారా జరిగే వ్యాపారం బీసీసీఐకి అదనపు ఆదాయం. డిజిటల్ ఒప్పందాలు, ఐసీసీ ఆదాయ వాటాలు బీసీసీఐకి మరో భారీ ఆదాయ వనరు. ఇలా బీసీసీఐ నాలుగు చేతులా సంపాదిస్తూ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా చలామణి అవుతుంది.తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 ధనిక క్రికెట్ బోర్డుల వివరాలు ఇలా ఉన్నాయి.భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు-రూ. 19052 కోట్లుక్రికెట్ ఆస్ట్రేలియా- రూ. 684 కోట్లుఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు- రూ. 510 కోట్లుపాకిస్తాన్ క్రికెట్ బోర్డు- రూ. 476 కోట్లుబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు- రూ. 441 కోట్లుక్రికెట్ సౌతాఫ్రికా- రూ. 406 కోట్లుజింబాబ్వే క్రికెట్ బోర్డు- రూ. 329 కోట్లుశ్రీలంక క్రికెట్ బోరు- రూ. 173 కోట్లువెస్టిండీస్ క్రికెట్ బోర్డు- రూ. 129 కోట్లున్యూజిలాండ్ క్రికెట్ బోర్డు- రూ. 77 కోట్లు -
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి మరో ఆటగాడు?
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రెండు వారాల ముందే ఇంగ్లండ్ గడ్డపై అడగుపెట్టిన భారత జట్టు తీవ్రంగా శ్రమించింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్మన్ గిల్ సారథ్యంలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను బ్యాకప్ ఆప్షన్గా భారత టెస్ట్ జట్టులో చేర్చినట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత జట్టులో రాణాకు చోటు దక్కలేదు.కానీ ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇండియా-ఎ జట్టుకు రాణాను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్లో ఉన్న రాణాను జట్టుతో పాటు ఉండమని సెలక్టర్లు సూచించినట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. అయితే అతడిని ఇంకా జట్టులో అధికారిక సభ్యుడిగా లెక్కించలేదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు క్రిక్బజ్ తెలిపింది. కాగా గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్లో రాణా తన టెస్టు అరంగేట్రం చేశాడు. 2 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో సెలక్టర్లు అతడిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. కానీ ఇప్పుడు ఆటగాళ్ల గాయాల బెడద దృష్ట్యా అతడికి మరోసారి అవకాశం లభించింది.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్థూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్తో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్? -
వయో నిర్ధారణకు మరో పరీక్ష
న్యూఢిల్లీ: క్రీడల్లో తరచూ తప్పుడు వయో ధ్రువీకరణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా పలు వయో విభాగాల ఈవెంట్లలో పెను విమర్శలు తావిస్తోంది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. అండర్–15, అండర్–16, అండర్–19 క్రికెట్ ఆడే టీనేజర్ల అసలైన వయసు ధ్రువీకరణ కోసం పరీక్షలు చేయిస్తోంది. ఇప్పుడు కచ్చితమైన వయో నిర్ధారణకు అదనంగా మరో బోన్ మ్యారో (ఎముక వయసు పరీక్ష) టెస్టు చేస్తామని బోర్డు ప్రకటించింది. దీనివల్ల అర్హత గల క్రికెటర్లకు నష్టం వాటిల్లకుండా, అనర్హులను దూరం పెట్టేలా అదనపు పరీక్ష ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది. క్రితంసారి అండర్–16లో పాల్గొన్న క్రికెటర్ మరో ఏడాది ఆ వయో విభాగంలో పాల్గొనాలంటే ఈ పరీక్షకు హాజరై నెగ్గాల్సి ఉంటుంది. ఒకవేళ క్రితం ఏడాదే ఎముక పరీక్షలో ఓ సంవత్సరం పిన్న అని తేలితే మాత్రం మరుసటి ఏడాది ఆ పరీక్షను చేయరు. ఉదాహరణకు అండర్–16 బాలుర క్రికెట్లో కటాఫ్ వయసు 16.5 ఏళ్లు. అంటే పరీక్ష సమయంలో ఎముక వయసు 16.4 ఏళ్లు మాత్రమే ఉండాలి. లేదంటే ఆ సీజన్లో అనుమతించరు. అండర్–15 బాలికల క్రికెట్లో కటాఫ్ వయసు 15 ఏళ్లు. అయితే ఎముక పరీక్ష సమయంలో 14.9 ఏళ్లే ఉండాలి. గత సీజన్లో ఆ బాలిక బోన్ మ్యారో టెస్టులో వయసు 13.9 అని నిర్ధారణ అయితే మరుసటి సీజన్లో టెస్టు పెట్టకుండానే అనుమతిస్తారు. -
డబ్ల్యూటీసీ ఫైనల్స్.. బీసీసీఐ ఆశలపై నీళ్లు చల్లిన ఐసీసీ?
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న బీసీసీఐ ఆశలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నీళ్లు చల్లే సూచనలు కన్పిస్తున్నాయి. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే వచ్చే మూడు సీజన్ల ఫైనల్ ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్కే కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.దీనిపై వచ్చే నెలలో సింగపూర్లో జరిగే వార్షిక సమావేశం అనంతరం ఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే 2027, 2029, 2031 ఫైనల్స్కు ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుంది. 2021లో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ను ఇంగ్లండ్లోని సౌతాంప్టాన్ వేదికగా జరిగింది.ఆ తర్వాత రెండు సీజన్ల ఫైనల్స్కు లండన్లోని ఓవల్ మైదానం, లార్డ్స్ వేదికలు ఆతిథ్యమిచ్చాయి. అయితే ఐసీసీ ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్కే కట్టబెట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇంగ్లండ్ గ్లోబల్ బ్రాడ్కాస్టర్స్కు అనువగా ఉండడం, అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రేక్షకులు ఎక్కువగా టెస్టు క్రికెట్కు ప్రాముఖ్యత ఇవ్వడం వంటి ఆంశాలు ఐసీసీని ప్రభావితం చేసినట్లు సమాచారం.ప్రస్తుతం లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు విశేష ప్రేక్షక ఆదరణ లభించింది. మొదటి మూడు రోజుల్లో 75,000 మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఈ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తమ విజయానికి అంత్యంత చేరువైంది.చదవండి: WTC Final 2025: చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్గా -
టీమిండియా షెడ్యూల్.. బీసీసీఐ నుంచి కీలక అప్డేట్
ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోయే టీమిండియా హోం సీజన్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారత సీనియర్ పురుషుల జట్టు.. వెస్టిండీస్, సౌతాఫ్రికాతో ఆడబోయే టెస్ట్ మ్యాచ్ల వేదికలు మారాయి. అలాగే భారత సీనియర్ మహిళల జట్టు ఆస్ట్రేలియాతో ఆడబోయే వన్డే సిరీస్ వేదికలు.. సౌతాఫ్రికా-ఏ జట్టు భారత-ఏ జట్టుతో ఆడబోయే వన్డే మ్యాచ్ల వేదికలు కూడా మారాయి. వేదికల మార్పు అంశాన్ని బీసీసీఐ ఇవాళ (జూన్ 9) అధికారికంగా ప్రకటించింది.🚨 NEWS 🚨BCCI announces updated venues for Team India (International home season) & South Africa A Tour of India.Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank https://t.co/vaXuFZQDRA— BCCI (@BCCI) June 9, 2025భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 14 తేదీ వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వేదికను ఈడెన్ గార్డన్స్ నుంచి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు మార్చడం జరిగింది. వేదిక మారినా మ్యాచ్ అదే తేదీల్లో యధాతథంగా జరుగుతుంది.నవంబర్ 14 నుంచి 18 వరకు టీమిండియా, సౌతాఫ్రికా మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డన్స్కు మార్చడం జరిగింది. వేదిక మారినా ఈ మ్యాచ్ అదే తేదీల్లో యధాతథంగా జరుగనుంది. నవంబర్ నెలలో ఢిల్లీలో వాయు కాలుష్యం అధికంగా ఉండటంతో వేదిక మార్చినట్లు బీసీసీఐ చెప్పుకొచ్చింది.భారత సీనియర్ మహిళల జట్టు సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉండింది. అయితే చిదంబరం స్టేడియంలో ఔట్ ఫీల్డ్, పిచ్కు సంబంధించి మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో తొలి రెండు వన్డేను న్యూ ఛండీఘడ్లోని పీసీఏ స్టేడియంకు, చివరి వన్డేను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు మార్చడం జరిగింది.సౌతాఫ్రికా పురుషుల ఏ టీమ్ నవంబర్ 13, 16, 19 తేదీల్లో భారత ఏ జట్టుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉండింది. అయితే ఈ సిరీస్ వేదికను చిన్నస్వామి స్టేడియం నుంచి రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు మార్చారు. -
బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతు
భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఇదో వేడుక. మ్యాచ్లు జరిగినన్ని రోజులు నిత్యం వీటిపైనే చర్చ. అయితే ఈసారి ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఎంత సంపద సమకూరిందోననే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? ఐపీఎల్ 2025లో బీసీసీఐకు మీడియా హక్కులు, ఇతర ప్రకటనలు వంటి వాటి ద్వారా ఎంత రాబడి వచ్చిందో తెలుసుకుందాం.ఐపీఎల్ 2025 జూన్ 3న ముగిసింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనన్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటిసారి ఈ లీగ్ను గెలుచుకుంది. బీసీసీఐకి కీలకంగా మారిన ఐపీఎల్లో వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ప్రసార రుసుము ద్వారా రూ.9,678 కోట్లు అంటే ఒక్కో ఆటకు సుమారు రూ.130.7 కోట్లు రాబడి వచ్చినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. టెలివిజన్ హక్కుల నుంచి డిజిటల్ హక్కులను బీసీసీఐ వేరు చేయడంతో ఆదాయం మరింత పెరిగింది.టెలివిజన్ హక్కులు స్టార్ స్పోర్ట్స్ వద్ద ఉండగా, డిజిటల్ హక్కులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన వయాకామ్ 18 వద్ద ఉన్నాయి. వీటిని అదనంగా స్పాన్సర్షిప్ ఫీజు వస్తుంది. లీగ్ టైటిల్ స్పాన్సర్ టాటా గ్రూప్. ఇది 2024 నుంచి 2028 వరకు ఐపీఎల్తో తన స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రూ.2,500 కోట్లకు పొడిగించింది. అంటే 2025 సీజన్తో సహా ప్రతి సీజన్కు రూ.500 కోట్ల డీల్ కుదుర్చుకుంది.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలువీటితో పాటు అసోసియేట్ పార్టనర్స్ మై11సర్కిల్, ఏంజెల్ వన్, రూపే వంటి ఇతర స్పాన్సర్ల నుంచి కూడా బీసీసీఐ డబ్బు సంపాదించింది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్ - సియెట్; అధికారిక అంపైర్ భాగస్వాములు - వండర్ సిమెంట్; ఆరెంజ్ & పర్పుల్ క్యాప్ పార్టనర్- ఆరామ్కో వంటి కంపెనీలు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. టిక్కెట్లు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం బీసీసీఐకి అదనం. అయితే నిర్ణీత కేంద్ర ఆదాయ భాగస్వామ్య ప్రక్రియలో భాగంగా ఒక్కో జట్టుకు బీసీసీఐ రూ.425 కోట్లు ఇస్తుంది. 2024లో బీసీసీఐకి రూ.20,686 కోట్లు సమకూరాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.16,493 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. -
కేఎల్ రాహుల్.. నీ కమిట్మెంట్కు సలాం..!
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్కు చేరని జట్ల ఆటగాళ్లందరూ ప్రస్తుతం వారివారి పనుల్లో నిమగ్నమైపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత ఏ ఆటగాళ్లు ఇవాల్టి నుంచి ఇంగ్లండ్ లయన్స్తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఏ జట్టు రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఆతర్వాత టీమిండియా ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఐపీఎల్ పూర్తయిన తర్వాత ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెడతారు.కాగా, ఐపీఎల్లో తన జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఖాళీగా ఉన్న ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐని ఓ విషయం కోసం అభ్యర్దించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ఎంపికై, ప్రస్తుతం భారత్లోనే ఉన్న రాహుల్ ఇంగ్లండ్ లయన్స్తో జరిగే రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ కోసం తనను ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట.ప్రస్తుతం భారత్లో వాతావరణ పరిస్థితులు ప్రాక్టీస్కు అనుకూలంగా లేకపోవడంతో (వర్షాలు) లయన్స్తో టెస్ట్ మ్యాచ్ తన ప్రాక్టీస్కు ఉపయోగపడుతుందని రాహుల్ భావిస్తున్నాడట. ఇందుకే తనను లయన్స్తో రెండో టెస్ట్ మ్యాచ్కు ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట. ఈ విషయంపై స్పందించిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాహుల్కు రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రాహుల్ను సోమవారం (జూన్ 2) లండన్కు బయల్దేరాల్సిందిగా ఆదేశించిందట.జాతీయ జట్టు తరఫున రాణించేందుకు రాహుల్ బీసీసీఐకి చేసిన విన్నపం గురించి తెలిసి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. రాహుల్ కమిట్మెంట్కు సలాం కొడుతున్నారు. స్టార్డమ్ ఉన్న ఇతర ఆటగాళ్లు ఖాళీ దొరికితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చూస్తారు. రాహుల్ మాత్రం తన దేశం తరఫున రాణించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాండంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి నార్తంప్టన్ వేదికగా జరుగనుంది.ఇంగ్లండ్ లయన్స్తో టెస్ట్ మ్యాచ్లకు ఎంపిక చేసిన భారత-ఏ జట్టు..కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్పాండే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, ఆకాశ్దీప్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
భారత-ఎ జట్టు నుంచి తప్పుకున్న శుబ్మన్ గిల్..!
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ హైవోల్టేజ్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన సిరీస్కు ముందు భారత-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది.తొలి టెస్టు మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్బరీ వేదికగా, రెండో టెస్టు నార్తాంప్టన్లో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. అయితే ఈ అనాధికారిక టెస్టు సిరీస్కు ముందు టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా- ఎ జట్టు నుంచి తప్పుకోవాలని గిల్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో గిల్ సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్ కండీషన్స్కు అలవాటు పడేందుకు గిల్కు ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు ఉపయోగపడతాయని సెలక్టర్లు భావించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కారణంగా తొలి వార్మాప్ మ్యాచ్కు గిల్ దూరంగా ఉంటాడని, రెండవ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇండియా-ఎ జట్టులో చేరతారని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపాడు. కానీ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్కు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే భారత-ఎ జట్టు ఇంగ్లండ్కు పయనమైంది. ఈ జట్టు కెప్టెన్గా దేశవాళీ దిగ్గజం అభిమాన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. జూన్ 13 నుంచి బెకెన్హామ్ వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఇంట్రా స్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ పాల్గోనే అవకాశముంది.ఇంగ్లండ్ పర్యటనకు భారత- ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబేచదవండి: ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్ -
బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్కు మళ్లీ పిలుపు
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ మళ్లీ ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దిలీప్ను మరో సారి ఫీల్డింగ్ కోచ్గా నియమించింది. 2021 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు దిలీప్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించగా... ఆ్రస్టేలియాలో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో సహాయక కోచ్ అభిషేక్ నాయర్తో పాటు దిలీప్ను తొలగించింది.ఫీల్డింగ్ కోచ్గా విదేశీయుడిని నియమించాలని బోర్డు ప్రయత్నించనా... అది వీలు కాకపోవడంతో జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్ను తిరిగి ఎంపిక చేసింది. "దిలీప్ చాలా మంచి కోచ్. నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పనిచేశాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు అతడిని తిరిగి నియమించాం"అని బోర్డు అధికారి వెల్లడించారు. ఇక మరోవైపు భారత టెస్టు కొత్త కెపె్టన్ శుబ్మన్ గిల్, సుదర్శన్ జూన్ 6 నుంచి ఇంగ్లండ్ లయన్స్తో జరిగే వార్మప్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: జితేశ్ జితాదియా -
శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటించిన బీసీసీఐ
-
సీకే నాయుడు నుంచి శుబ్మన్ గిల్ వరకు...
అంచనాలకు అనుగుణంగానే యువ ఆటగాడు శుబ్మన్గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. వచ్చే నెలలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం... గిల్ సారథ్యంలో 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకడంతో... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల గిల్ను ఎంపిక చేసింది. సీకే నాయుడు భారత తొలి టెస్టు కెప్టెన్గా వ్యవహరించగా... ఇప్పుడు గిల్ 37వ కెప్టెన్ కానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహించిన ప్లేయర్ల జాబితా... -
‘శుబ్’ సమయం మొదలు
భారత టెస్టు క్రికెట్కు కొత్త నాయకుడు వచ్చాడు...నాలుగున్నరేళ్ల కెరీర్ అనుభవం ఉన్న శుబ్మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు... 93 ఏళ్ల భారత టెస్టు చరిత్రలో 37వ సారథిగా గిల్ బాధ్యతలు చేపడుతున్నాడు...గత కొంత కాలంగా చర్చ సాగినట్లుగా ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండా సెలక్టర్లు 25 ఏళ్ల గిల్కే మద్దతు పలికారు... ఇంగ్లండ్ పర్యటనలో అతను తొలిసారి టెస్టు జట్టును నడిపించనున్నాడు. టెస్టు జట్టులో సాయిసుదర్శన్, అర్ష్ దీప్ లకు తొలి అవకాశం లభించగా...ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ మళ్లీ టీమ్లోకి రావడం విశేషం. ముంబై: ఇంగ్లండ్తో గడ్డపై జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందానికి శుబ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఆసీస్తో సిరీస్లో బుమ్రా కెప్టెన్గా వ్యవహరించినా...అతని ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీ కోసం బుమ్రా పేరును పరిశీలించలేదు. కోహ్లి, రోహిత్, అశ్విన్ల శకం ముగిసిన తర్వాత భవిష్యత్తు కోసం టీమ్ను సిద్ధం చేసే కోణంలో జట్టు ఎంపిక జరిగింది. 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్ పాల్గొనే తొలి సిరీస్ ఇదే కానుంది. భారత జట్టు చివరిసారిగా ఆ్రస్టేలియాలో ఆడిన టెస్టు సిరీస్తో పోలిస్తే జట్టులో ఐదు మార్పులు జరిగాయి. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ కాగా...రెండు టెస్టులు ఆడిన పేసర్ హర్షిత్ రాణా, ఒక్క మ్యాచ్ కూడా ఆడని బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానం కోల్పోయారు. వీరి స్థానాల్లో కరుణ్ నాయర్, సాయిసుదర్శన్, అర్ష్ దీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత... 33 ఏళ్ల కరుణ్ నాయర్ తన కెరీర్లో 6 టెస్టులు ఆడాడు. తన మూడో టెస్టులో ఇంగ్లండ్పై 303 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతను...సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత మరో 3 టెస్టులు మాత్రమే ఆడి జట్టులో 2017లో జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్లలో 863 పరుగులు సాధించి రేసులోకి వచ్చాడు. కోహ్లి రిటైర్మెంట్తో మిడిలార్డర్లో ఖాళీ ఏర్పడి మరో అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్లో, భారత్ ‘ఎ’ తరఫున టన్నుల కొద్దీ పరుగులు చేసి అభిమన్యు ఈశ్వరన్కు మరోసారి పిలుపు లభించింది. ఇక ఇప్పటికీ వన్డేలు, టి20లు ఆడిన పేసర్ అర్ష్ దీప్ సింగ్, సాయి సుదర్శన్కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం. షమీ అవుట్... సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించినట్లుగానే చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత వన్డేలు, టి20లు ఆడినా...టెస్టు మ్యాచ్లకు తగిన స్థాయిలో అతని ఫిట్నెస్ లేదని సెలక్టర్లు తేల్చారు. కివీస్తో సిరీస్లో చివరి రెండు టెస్టుల్లో విఫలమై మళ్లీ మ్యాచ్ అవకాశం దక్కని సర్ఫరాజ్ ఖాన్ను కూడా పక్కన పెట్టారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రాణాను కూడా ఎంపిక చేయలేదు. ‘కోహ్లి, రోహిత్, అశ్విన్లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం కష్టం. అయితే కొత్తగా జట్టులోకి వచ్చే వారికి తమ సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. ఫిట్నెస్ సమస్యల కారణంగా బుమ్రా అన్నీ టెస్టులూ ఆడతాడనే నమ్మకం లేదు. అందుకే కెప్టెన్సీ భారం లేకుండా అతను బౌలర్గా మాకు అందుబాటులో ఉంటే చాలు. ఈ విషయాన్ని బుమ్రా కూడా అర్థం చేసుకున్నాడు. గిల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న విషయాన్ని గమనించాం. చాలా మంది అభిప్రాయాలు కూడా విన్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే కెప్టెన్, జట్టును ఎంపిక చేశాం. ప్రస్తుత స్థితిలో సర్ఫరాజ్తో పోలిస్తే అనుభవజ్ఞుడైన కరుణ్ సరైనవాడు అనిపించింది’ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించారు. భారత జట్టు వివరాలు గిల్ (కెప్టెన్ ), పంత్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, జురేల్, జడేజా, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిధ్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, సుందర్, శార్దుల్, అర్ష్ దీప్ భారత జట్టు విజేతగా నిలిచిన 2020–21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో శుబ్మన్ గిల్ టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. 91 పరుగులతో చారిత్రాత్మక గాబా టెస్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టెస్టు టీమ్లో గిల్ రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. భారత జట్టు ఆడిన రెండు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్లలో గిల్ ఆడాడు. 32 టెస్టుల కెరీర్లో గిల్ 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.స్వదేశంలో ప్రదర్శనతో పోలిస్తే విదేశీ గడ్డపై అతని రికార్డు పేలవంగా ఉన్నా...మంచి ప్రతిభావంతుడైన బ్యాటర్గా మున్ముందు సత్తా చాటగలడని సెలక్టర్లు నమ్ముతున్నారు. భారత అండర్–19 జట్టు తరఫున ఆడినా అతను కెపె్టన్గా ఎప్పుడు వ్యవహరించలేదు. రంజీ ట్రోఫీలో కూడా పంజాబ్కు ఒకే ఒక మ్యాచ్లో సారథ్యం వహించాడు. అయితే భారత్కు 5 టి20 మ్యాచ్లలో కెప్టెన్ గా పని చేసిన అనుభవం గిల్కు ఉంది. రెండు సీజన్లుగా ఐపీఎల్లో గుజరాత్ జట్టును నడిపిస్తున్నాడు. -
Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. కట్ చేస్తే! ఇప్పుడు టీమ్లోనే నో ఛాన్స్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లను తిరిగి పిలుపునిచ్చింది. అయితే ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అండ్ కో ఎంపిక చేసిన ఈ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇటీవల కాలంలో అయ్యర్ దేశవాళీ క్రికెట్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలోనూ శ్రేయస్ది కీలక పాత్ర.అదేవిధంగా 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్ కేవలం ఏడు ఇన్నింగ్స్లలో 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. అయ్యర్ ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్ము లేపుతున్నాడు. ఐపీఎల్-2025లో కెప్టెన్గా, ఆటగాడిగా ఈ ముంబై బ్యాటర్ అదరగొడుతున్నాడు. అయితే గతేడాది మాత్రం అయ్యర్ టెస్టుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.శ్రేయస్ గత 12 ఇన్నింగ్స్లలో 17 సగటుతో 187 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందుకే సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టి ఫామ్లో ఉన్న కరుణ్ నాయర్ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఏదేమైనా ప్రస్తుత ఫామ్ను పరిగణలోకి తీసుకుని అయ్యర్ను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసి ఉంటే బాగుండేంది అని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.అయ్యర్ జట్టులో ఉంటే మిడిలార్డర్ పటిష్టంగా ఉంటుందని మరి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ అభిమానులైతే ఒకడుగు ముందుకు వేసి సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కెప్టెన్ కావాల్సిన ఆటగాడికి పూర్తిగా జట్టులోనే ఛాన్స్ ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 5 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ ఉంది.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్.. అధికారిక ప్రకటన -
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్.. భారత స్టార్ పేసర్ ఔట్?
ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగే ఐదు టెస్టుల (ENG vs IND) సిరీస్కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు భారత్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్టు మ్యాచ్లో షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయలేడని బీసీసీఐ (BCCI) వైద్యబృందం చెప్పినట్లు తెలుస్తోంది.బీసీసీఐ అధికారి ఒకరు.. షమీ ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున నాలుగు ఓవర్లు వేశాడు. షమీ ఒక రోజులో పది ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్లు వేస్తాడా.. అన్న విషయం బోర్డుకు, సెలెక్టర్లకు తెలియదు. ఇంగ్లండ్లో టెస్టుల్లో పేసర్లు ఎక్కువ స్పెల్స్ వేసే అవసరం ఉండొచ్చు. అక్కడి పిచ్లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా పేసర్లే వికెట్లు తీస్తారు. అందుకే మేం ఎలాంటి ఛాన్స్లు తీసుకోలేం అని నేషనల్ మీడియాకు చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇంగ్లండ్ సిరీస్కు మరో 20 రోజులే సమయంలో షమీపై (BCCI) వైద్యబృందం కూడా ఓ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. షమీ టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్ వేయలేడని బీసీసీఐ వైద్యబృందం యాజమాన్యానికి చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని జట్టులోకి తీసుకుంటే.. ఐదు టెస్టులూ ఆడే అవకాశాలు చాలా తక్కువని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ షమీని టెస్టు సీరిస్కు ఎంపిక చేయకపోతే అతడి స్థానంలో అర్ష్దీప్ సింగ్కు అవకాశం లభించవచ్చు. షమీ టెస్టుల్లో చివరిసారిగా ఓవల్లో ఆస్ట్రేలియాపై 2023 WTC Finalలో ఆడిన సంగతి తెలిసిందే.🚨 NO SHAMI IN ENGLAND TOUR 🚨 - Mohammed Shami is unlikely to play in the Test series against England. (Devendra Pandey/Express Sports). pic.twitter.com/tjIlRHFgR7— Tanuj (@ImTanujSingh) May 23, 2025ఇదిలాఉండగా.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ.. భారత జట్టును శనివారం ప్రకటించనుంది. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. రోహిత్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి భారత జట్టు ఎంపిక ఉండనుంది అనే చర్చ నడుస్తోంది. ఇక టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పోటీలో ఉన్నారు. కోహ్లీ, రోహిత్.. స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
అహ్మదాబాద్లో ఐపీఎల్ ఫైనల్
న్యూఢిల్లీ: ఐపీఎల్ 18వ సీజన్ తుదిపోరుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రెండో క్వాలిఫయర్ పోరు కూడా అహ్మదాబాద్లోనే (జూన్ 1న) జరుగుతుంది. నిజానికి ఈ రెండు మ్యాచ్లు గత విజేత కోల్కతా నైట్రైడర్స్ కావడంతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగాలి. అయితే భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలతో లీగ్ను వారం వాయిదా వేశారు. సవరించిన షెడ్యూల్ సమయంలో కోల్కతా, హైదరాబాద్లో వర్షాలు ఉంటాయనే సమాచారంతో ఈ రెండు నగరాల్లో జరగాల్సిన ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్లను అహ్మదాబాద్, ముల్లాన్పూర్ (న్యూ చండీగఢ్) తరలించారు. 2022, 2023 ఐపీఎల్ ఫైనల్స్ అహ్మదాబాద్లోనే జరిగాయి. ఇక ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో జరగాల్సిన తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లను ముల్లాన్పూర్లో నిర్వహిస్తారు. ఈ నెల 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్ మ్యాచ్ ముల్లాన్పూర్లో జరుగుతాయి. దీంతో ఈ సీజన్లో కోహ్లి మ్యాచ్ను క్వాలిఫయర్ రూపంలో అయినా హైదరాబాద్లో చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రొటేషన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో సన్రైజర్స్ హైదరాబాద్ హోం మ్యాచ్కు ఈసారి అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ ఆరంభం నుంచి అదరగొట్టడంతో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. దీంతో టాప్–2 జట్ల మధ్య తొలి క్వాలిఫయర్... 3–4వ స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్... ఈ రెండింటిలో ఏదైనా ఒక మ్యాచ్లోనైనా కోహ్లి మెరుపులు చూడాలనుకున్న హైదరాబాద్ ప్రేక్షకులు ఇప్పుడు మరో సీజన్ దాకా నిరీక్షించక తప్పదు. ఈ నెల 23న బెంగళూరు, సన్రైజర్స్ల మధ్య బెంగళూరు వేదికగా జరగాల్సిన లీగ్ మ్యాచ్ను లక్నోకు మార్చారు. 23న బెంగళూరులో భారీ వర్ష సూచన ఉండటంతో మ్యాచ్ను లక్నోకు తరలించినట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఐపీఎల్ పునఃప్రారంభమైన 17న బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ల మధ్య మ్యాచ్ వర్షార్పణమైంది. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’షెడ్యూల్మే 29 క్వాలిఫయర్–1 ముల్లాన్పూర్ మే 30 ఎలిమినేటర్ ముల్లాన్పూర్ జూన్ 1 క్వాలిఫయర్–2 అహ్మదాబాద్ జూన్ 3 ఫైనల్ అహ్మదాబాద్ -
'అవన్నీ రూమర్సే.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు': బీసీసీఐ
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్కు చెందిన మంత్రి మొహిసిన్ నఖ్వీ ఏసీసీ చైర్మెన్గా ఉండడంతో భారత క్రికెట్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.తాజాగా ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు."ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ రెండు ఏసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుందన్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. ఈ రోజు ఉదయం నుంచి ఇదే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ నిరాధరమైన వార్తలు. బీసీసీఐ ఇప్పటివరకు తదుపరి ఏసీసీ ఈవెంట్లకు సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదు. అదేవిధంగా ఏసీసీకి ఎటువంటి లేఖ కూడా బీసీసీఐ రాయలేదు.ప్రస్తుతం మా దృష్టింతా ఐపీఎల్, తదుపరి ఇంగ్లండ్ సిరీస్లపైనే మాత్రమే ఉంది. ఆసియా కప్ లేదా ఏదైనా ఇతర ఏసీసీ ఈవెంట్పైన ఎటువంటి నిర్ణయం తీసుకున్న భారత క్రికెట్ బోర్డు ప్రెస్నోట్ కచ్చితంగా విడుదల చేస్తోంది" అని దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కాగా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ వచ్చే నెలలో జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్లో పురుషుల ఆసియా కప్ టోర్నీని నిర్వహించనున్నారు. గత ఆసియాకప్ టోర్నీ శ్రీలంక, పాక్ల వేదికగా హైబ్రిడ్ మోడల్లో జరిగింది.చదవండి: IPL 2025: పాకిస్తాన్ సరసన గుజరాత్ టైటాన్స్ -
పాక్కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం
-
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్కు టీమిండియా దూరం
పాక్తో ఉద్రిక్త పరిస్థితలు నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మంత్రి నేతృత్వం వహిస్తున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనకూడదని డిసైడ్ చేసుకుంది. ఏసీసీ ఆథ్వర్యంలో జరిగే ఈవెంట్లలో భారత క్రికెట్ జట్లు (పురుషులు, మహిళలు) పాల్గొనవని స్పష్టం చేసింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్,ఆ తర్వాత సెప్టెంబర్లో భారత్ వేదికగా జరగాల్సిన ద్వైవార్షిక పురుషుల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఏసీసీకి కూడా తెలియజేసింది. క్రికెట్కు సంబంధించి పాక్ను ఒంటరి చేయడమే లక్ష్యంగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.కాగా, పాకిస్తాన్కు చెందిన మంత్రి మొహిసిన్ నఖ్వీ ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్గా ఎన్నికయ్యాడు. నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) కూడా చైర్మన్గా వ్యవహరిస్తూ, జోడు పదవులను అనుభవిస్తున్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. రోస్టర్ విధానంలో ఏసీసీ చైర్మన్ ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలో ఈ దఫా పాకిస్తాన్కు అవకాశం వచ్చింది. అంతకుముందు ఏసీసీ చైర్మన్గా ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జై షా ఉండేవాడు. షా.. ఐసీసీ పదవి చేపట్టాల్సి ఉండటంతో ఏసీసీ చైర్మన్గిరికి ముందుగానే రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే, భారత్ పురుషుల ఆసియా కప్ను బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీ భారత్లోనే జరగాల్సి ఉన్నా పాక్ మంత్రి ఏసీసీ చైర్మన్గా ఉన్నందుకు బీసీసీఐ ససేమిరా అంటుంది. ఆసియా కప్లో భారత్ పాల్గొనపోతే టోర్నీ జరగడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లకు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్కు చెందిన వారే ఉన్నారు. వీరు స్పాన్సర్షిప్కు ముందుకు రాకపోతే టోర్నీ జరుగదు.పెహల్గామ్ దాడితో మొదలు..ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నాయి. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్ దాడులకు పాక్ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి. తదనంతరం పరిణామాల్లో భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. -
BCCI - IND vs ENG: టీమిండియాలో అతడికి చోటు కష్టమే!
విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్ కారణంగా టీమిండియా సెలక్టర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. టెస్టు జట్టులో ఈ దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేసే సరైన ప్లేయర్ కోసం సెలక్షన్ కమిటీ వేట కొనసాగిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలన్నది తలనొప్పిగా మారింది.టీమిండియాలో అతడికి చోటు కష్టమేఅయితే, వసీం జాఫర్, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు కోహ్లి స్థానంలో శుబ్మన్ గిల్ (Shubman Gill)ను పంపాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్ల పేర్లు తెరమీదకు తీసుకువస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీసీఐ అధికారి ఒకరు ‘టెలిగ్రాఫ్’తో మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ఒకవేళ టీమిండియా సొంతగడ్డ మీద టెస్టు సిరీస్ ఆడుతున్నట్లయితే శ్రేయస్ అయ్యర్కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉండేవి. అయితే, తదుపరి భారత జట్టు విదేశంలో సిరీస్ ఆడబోతోంది.. అది కూడా ఇంగ్లండ్ గడ్డమీద.కాబట్టి శ్రేయస్కు ఛాన్స్ లేదనే చెప్పాలి. అతడు రెడ్ బాల్ క్రికెట్లో మరింత గొప్పగా రాణించాల్సిన అవసరం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రేయస్ అద్భుతంగా ఆడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేస్తున్నాడు.కానీ టెస్టు ఫార్మాట్ వైట్బాల్ క్రికెట్తో పోలిస్తే పూర్తి భిన్నమైనది. అందుకే అతడి విషయంలో ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేము’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.ఓపికగా బ్యాటింగ్ చేయాలిఅదే విధంగా.. ఇంగ్లండ్లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. కాబట్టి ఒక్కోసారి అలాంటి బంతులను వదిలేయడమే ఉత్తమం. ఇంగ్లండ్ గడ్డ మీద ఎంత ఓపికగా బ్యాటింగ్ చేస్తున్నామనదే ముఖ్యం’’ అని పేర్కొన్నారు.కాగా శ్రేయస్ అయ్యర్ చివరగా గతేడాది ఫిబ్రవరిలో టీమిండియా తరఫున టెస్టు బరిలో దిగాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. ఆ తర్వాత అతడికి మళ్లీ ఇంత వరకు సెలక్టర్లు టెస్టు జట్టులో చోటివ్వలేదు.చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడుఅయితే, దేశవాళీ క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ ముంబై తరఫున బరిలోకి దిగి దంచికొట్టాడు. రంజీల్లో రాణించడంతో పాటు టీ20 ఫార్మాట్లో నిర్వహించే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ సొంతం చేసుకోవడంలో అతడిది ముఖ్య భూమిక.ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, బ్యాటర్గానూ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. అయితే, టెస్టుల్లో మాత్రం అతడు ఇప్పట్లో పునరాగమనం చేసే అవకాశం కనిపించడం లేదు. కాగా జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్ ఈ సిరీస్తోనే మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఓపెనర్గా కేఎల్ రాహుల్.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు! -
‘ఒలింపిక్ క్రీడలను దత్తత తీసుకుంటాం’
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన దేశంలో ఇతర క్రీడలకు అండగా నిలవాలని యోచిస్తోంది. కనీసం రెండు లేదా మూడు ఒలింపిక్ క్రీడలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు బీసీసీఐ తమ ఆలోచనను కేంద్ర క్రీడా శాఖకు తెలియజేసింది. మంత్రి మన్సుఖ్ మాండవియాతో గురువారం బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీసీఐ ఈ ప్రతిపాదన చేసింది ‘మా ప్రతిపాదనను బీసీసీఐ స్వాగతించింది. ఏ క్రీడలను ఎంచుకుంటే బాగుంటుందనే విషయం తుది నిర్ణయం కేంద్ర క్రీడాశాఖకే వదిలేశాం. ఆయా క్రీడల్లోనూ ఒలింపిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి కనీసం 100 నుంచి 200 మందికి అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తాం. ఒలింపిక్ క్రీడలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రీడల సన్నాహాలు ఉంటాయి’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సమావేశంలో 58 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. క్రికెట్ బోర్డు తాజా ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన వీరు తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 23 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిక్షణా కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో బాక్సింగ్ (రోహ్టక్), స్విమ్మింగ్, షూటింగ్ (న్యూఢిల్లీ)లలో మాత్రం ఒకే క్రీడాంశంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. విభిన్న క్రీడాంశాలకు కేంద్రంగా పటియాలా, బెంగళూరులలో ‘సాయ్’ కేంద్రాలు నడుస్తున్నాయి. గతంలోనూ పలు మార్లు బీసీసీఐ ఆరి్థకపరంగా ఇతర క్రీడలకు సహకారం అందించింది. ఆటలను దత్తత తీసుకోవాలనే తాజా ప్రతిపాదనపై మున్ముందు మరింత స్పష్టత రానుంది. భారత సంతతికి చెందిన విదేశాల్లో స్థిరపడిన ఓవర్సీస్ సిటిజన్ (ఓసీఐ)లు క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించరాదనే నియమం ప్రస్తుతం అమల్లో ఉంది. దీనిని తొలగించాలని కూడా కేంద్ర క్రీడాశాఖ యోచిస్తోంది. అక్కడ ఆటలో నిష్ణాతులైన తర్వాత మన దేశం తరఫున వచ్చి ఆడితే ఇక్కడి ప్లేయర్లకు కూడా మేలు జరుగుతుందని, వ్యవస్థలో కొత్త మార్పులు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరోవైపు వివిధ క్రీడా సమాఖ్యలు తమలోని వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించుకుంటేనే ఆట బాగుపడుతుందని... క్రీడలను కోర్టులు నడపడం సరైందని కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. వారందరితో సమావేశంపై సమస్యను పరిష్కరించేందుకు మంత్రి స్వయంగా సిద్ధమయ్యారు. -
IPL 2025: మే 26లోగా తిరిగి రండి.. సౌతాఫ్రికా ప్లేయర్లకు వార్నింగ్..!
ముందుగా అనుకున్నట్లుగా మే 26 తేదీలోగా స్వదేశానికి తిరిగి రావాలని ఐపీఎల్-2025 ఆడుతున్న తమ ఆటగాళ్లకు (డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైన వారికి) క్రికెట్ సౌతాఫ్రికా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 20 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మందికి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కింది.ఈ ఎనిమిది మంది విషయంలోనే క్రికెట్ సౌతాఫ్రికా, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య పేచీ పడేలా ఉంది. సంబంధిత ఫ్రాంచైజీలు క్రికెట్ సౌతాఫ్రికాతో చర్చలు జరుపుతున్నా వారు ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. ఆటగాళ్లకు లీగ్ కంటే దేశమే ముఖ్యం కావాలని సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ భావోద్వేగంతో పిలుపునిచ్చాడు. సదరు 8 మంది సౌతాఫ్రికా ప్లేయర్ల నిర్ణయంపై వారి ఫ్రాంచైజీల భవితవ్యం ఆధారపడి ఉంది.డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైన 8 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు (ఐపీఎల్ ఆడుతున్న వారు)..కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)మార్కో జన్సెన్ (పంజాబ్ కింగ్స్)లుంగి ఎంగిడి (ఆర్సీబీ)కగిసో రబాడ (గుజరాత్)ర్యాన్ రికెల్టన్ (ముంబై)ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ)ఎయిడెన్ మార్క్రమ్ (లక్నో)వియాన్ ముల్దర్ (ఎస్ఆర్హెచ్)పైనున్న ఆటగాళ్లలో ఐదుగురు (కార్బిన్ బాష్, జన్సెన్, ఎంగిడి, రబాడ, రికెల్టన్) సంబంధిత ఫ్రాంచైజీలకు ప్లే ఆఫ్స్లో కీలకమవుతారు. వీరు అందుబాటులో లేకపోతే వారి జట్ల విజయావకాశాలు ఖచ్చితంగా ప్రభావితమవుతాయి. మిగతా ముగ్గురు (స్టబ్స్, మార్క్రమ్, ముల్దర్) ఆటగాళ్లలో ఒకరి (ముల్దర్) జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. మరో ఇద్దరి (స్టబ్స్, మార్క్రమ్) జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం లైన్లో ఉన్నాయి. క్రికెట్ సౌతాఫ్రికా, బీసీసీఐ మధ్య ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం.. మే 25న ఐపీఎల్ ఫైనల్ ముగిస్తే, ఆ మరుసటి రోజే (మే 26) సౌతాఫ్రికా ఆటగాళ్లంతా స్వదేశానికి బయల్దేరాలి. అనంతరం మే 30న డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైన సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్కు బయల్దేరాలి. అక్కడు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్కు బయల్దేరాలి. ఐపీఎల్ 2025 ముందస్తు షెడ్యూల్ ప్రకారం సౌతాఫ్రికా జట్టు ప్రణాళిక ఇది.అయితే భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడింది. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్కు (జూన్ 3) డబ్ల్యూటీసీ ఫైనల్కు (జూన్ 11) కేవలం వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీని వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఆటగాళ్లు ఐపీఎల్ లీగ్ మ్యాచ్ల వరకు మాత్రమే అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపిక కాని మిగతా సౌతాఫ్రికా ఆటగాళ్లు (ఐపీఎల్ ఆడుతున్న వారు)..డెవాల్డ్ బ్రెవిస్ (చెన్నై సూపర్ కింగ్స్), ఫాఫ్ డుప్లెసిస్, డోనోవన్ ఫెరీరా (ఢిల్లీ క్యాపిటల్స్), గెరాల్డ్ కోట్జీ (గుజరాత్ టైటాన్స్), క్వింటన్ డికాక్, అన్రిచ్ నోర్ట్జే (కోల్కతా నైట్ రైడర్స్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ బ్రీట్జ్కే (లక్నో), నండ్రే బర్గర్, క్వేనా మఫాకా, డ్రే ప్రిటోరియస్ (రాజస్థాన్ రాయల్స్), హెన్రిచ్ క్లాసెన్ (సన్రైజర్స్ హైదరాబాద్) -
రోహిత్ శర్మకు సత్కారం.. ఇంటికి ఆహ్వానించి సన్మానించిన సీఎం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) హిట్మ్యాన్ను తన ఇంటికి ఆహ్వానించి.. సన్మానించారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.కాగా రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ (Test Cricket Retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. మే 7న ఇందుకు సంబంధించి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. తెలుపు రంగు జెర్సీలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు.అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. అతడే వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతాడని పేర్కొంది. అధికారిక నివాసానికి ఆహ్వానించిన సీఎంకాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అతడిని తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. పుష్ఫగుచ్ఛం అందించి.. శాలువాతో రోహిత్ను ఫడ్నవిస్ సత్కరించారు. అతడితో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ.. ‘‘భారత క్రికెట్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం ‘వర్ష’కు ఆహ్వానించడం.. ఆయనను కలిసి మాట్లాడటం ఎంతో గొప్పగా అనిపిస్తోంది.టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్కు ప్రకటించిన రోహిత్ శర్మకు శుభాకాంక్షలు. జీవితంలోని తదుపరి అధ్యాయంలోనూ ఆయన ఇలాగే మరింత విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు.దిగ్గజ కెప్టెన్గాకాగా టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ ఇప్పటికే రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలపడంతో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) కూడా అందించాడు. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం రోహిత్ శర్మ ప్రదర్శన ఇటు కెప్టెన్గా.. అటు బ్యాటర్గా బాగాలేదు.రోహిత్ సారథ్యంలో టీమిండియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది సొంతగడ్డపై విదేశీ జట్టు చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఫలితంగా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (2025) ఫైనల్కు చేరుకోలేకపోయింది.కోహ్లి కూడా ఇదే బాటలోఆ తర్వాత ముంబై తరఫున రోహిత్ శర్మ రంజీ బరిలో దిగి కూడా విఫలమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లోనూ బీసీసీఐ అతడినే కెప్టెన్గా కొనసాగిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. వీరిద్దరు లేకుండానే జూన్ 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్తో యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ టీమిండియా కొత్త కెప్టెన్గా నియమితుడు కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. వాళ్లిద్దరు ఉంటే బెటర్! -
పీసీబీ బుద్ధి మారలేదు!.. మళ్లీ ఐపీఎల్తో పోటీ.. కానీ ఊహించని షాక్!
చావు దెబ్బలు తింటున్నా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరు మారలేదు. ఇప్పటికే ఐపీఎల్-2025 (IPL 2025)కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL-2025) షెడ్యూల్ను ఖరారు చేసి చేతులు కాల్చుకున్న పీసీబీ.. మరోసారి అదే సాహసానికి సిద్ధపడింది. కాగా మార్చి 22న ఐపీఎల్ తాజా ఎడిషన్ మొదలుకాగా.. ఎన్నడూ లేని విధంగా పాక్ బోర్డు కూడా పోటీకి దిగింది. ఏప్రిల్ 11న తమ టీ20 లీగ్ను ఆరంభించింది.వాయిదా పడిన రెండు లీగ్లుఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్కు ఎప్పటిలాగే ప్రేక్షకాదరణ దండిగానే లభించగా.. పీఎస్ఎల్ను మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి తరుణంలో పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్తో పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగా.. పాక్ ఆర్మీ అందుకు ప్రతిదాడికి దిగింది. దీంతో గట్టిగా బదులిచ్చిన భారత్ రావల్పిండి, కరాచీ, లాహోర్లను టార్గెట్ చేయగా.. పీఎస్ఎల్ మ్యాచ్కు ముందే రావల్పిండి స్టేడియంలో క్షిపణి దాడి జరిగింది.పునఃప్రారంభంలోనూ పోటీఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇటు ఐపీఎల్తో పాటు.. అటు పీఎస్ఎల్ను కూడా వాయిదా వేశారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత.. ఈ రెండు లీగ్లు మళ్లీ మొదలుకానున్నాయి. అయితే, పునఃప్రారంభంలో కూడా పీసీబీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో పోటీకి దిగిందిరామని తేల్చి చెప్పిన ఆటగాళ్లుఈ సీజన్లో మిగతా ఐపీఎల్ మ్యాచ్లను మే 17 నుంచి అని బీసీసీఐ ప్రకటించిన మరుసటి రోజే పోటీగా.. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా మే 17 నుంచి పీఎస్ఎల్ తిరిగి ఆరంభం అంటూ ఆర్భాటానికి పోయింది. కానీ ఇక్కడ ఆసలు సవాల్ విదేశీ ప్లేయర్ల నుంచి ఎదురవుతోంది. భారత ఆర్మీ దాడులతో బెంబేలెత్తిన పలువురు విదేశీ ఆటగాళ్లు ఇక పాక్కు వచ్చే సమస్యే లేదని తెలిసింది.ముఖ్యంగా కేన్ విలియమ్సన్ సహా ఇతర న్యూజిలాండ్ ఆటగాళ్లు పాకిస్తాన్కు ససేమిరా అంటున్నట్లు సమాచారం. డారిల్ మిచెల్ అయితే మళ్లీ తాను పాక్లో అడుగుబెట్టబోనని తేల్చిచెప్పినట్లు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో కివీస్ ప్లేయర్లు మాత్రమే ఇంగ్లండ్ సహా ఇతర విదేశీ ప్లేయర్లు పీఎస్ఎల్ కోసం వెనక్కి వచ్చే అవకాశమైతే లేదు. కాగా 25న జరిగే ఫైనల్తో ఈ సీజన్ పీఎస్ఎల్ ముగుస్తుంది. అయితే పలువురు స్టార్ క్రికెటర్లు తిరిగి రానే రామని తేల్చేయడంతో వారి స్థానాల్ని వెంటనే భర్తీ చేసుకొని ఆయా ఫ్రాంచైజీలన్నీ పునఃప్రారంభానికి సిద్ధంగా ఉండాలని పీసీబీ సూచించింది. చదవండి: IPL 2025 Revised Schedule: దేశమా.. ఐపీఎలా..? -
IPL 2025: ఎవరు ఆడతారు... ఎవరు ఆగిపోతారు?
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త షెడ్యూల్ను ప్రకటించడంతో ఇప్పుడు లీగ్లో జరగాల్సిన తర్వాతి మ్యాచ్లపై అందరి దృష్టీ నిలిచింది. ఆరు నగరాలు బెంగళూరు, ముంబై, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్లలో మిగిలిన 13 లీగ్ మ్యాచ్లు నిర్వహించేందుకు సిద్ధమైన గవర్నింగ్ కౌన్సిల్... ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్ల వేదికలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు మ్యాచ్ల వేదికలకంటే ఆయా జట్లకు ఎవరెవరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారనే విషయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మే 9న ప్రకటించడంతోనే దాదాపు అందరు విదేశీ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నవారు కూడా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవుతున్నట్లుగా బీసీసీఐ సోమవారమే ప్రకటించింది. దాంతో ఫ్రాంచైజీలు తమ జట్లలోని కీలక ఆటగాళ్లను రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆటగాళ్ల ఇష్టానికి... యుద్ధం కారణంగా టోర్నీ వాయిదా పడకుండా ఉంటే మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ ముగియాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3 వరకు టోర్నీ పొడిగించాల్సి వచ్చింది. అయితే విదేశీ ఆటగాళ్లందరూ మే 25 ప్రకారమే సిద్ధమై లీగ్ కోసం తమ ప్రణాళికలకు రూపొందించుకున్నారు. ఆ తేదీ తర్వాత ఆయా జాతీయ జట్ల సిరీస్లు, ఇతర ఒప్పందాల ప్రకారం వారు ఐపీఎల్లో కొనసాగే అవకాశం లేదు. ఐపీఎల్ తేదీల ప్రకారమే తాము ఎన్ఓసీలు జారీ చేశామని, దీనిపై మళ్లీ చర్చించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ బోర్డు కూడా దాదాపు ఇదే తరహాలో స్పందించింది. మరో వైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఆటగాళ్ల ఇష్టానికి వదిలేసింది. వారి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రధానంగా రెండు సిరీస్ల కారణంగా ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఆడే విషయంలో ఇబ్బంది ఎదురు కావచ్చు. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్లో పాల్గొనే ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్లో భాగంగా ఉన్నారు. ఐపీఎల్ కొత్త తేదీల్లోనే ఈ సిరీస్ ఉంది. మరో వైపు జూన్ 11 నుంచి ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఉంది. ఇందులో ఆడే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లలో చాలా మంది కోసం ఐపీఎల్ టీమ్లు ఎదురు చూస్తున్నాయి. మే 31న ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్టు టీమ్ ఒక చోటకు చేరాలని దక్షిణాఫ్రికా బోర్డు స్పష్టంగా ఆదేశించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా జట్టులోంచి రబడ, ఎన్గిడి, స్టబ్స్, మార్క్రమ్, రికెల్టన్, బాష్, యాన్సెన్, ముల్డర్ ప్రస్తుతం ఐపీఎల్ జట్లలో ఉన్నారు.అహ్మదాబాద్లోనే ఫైనల్! ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్ల వేదికల విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పాత షెడ్యూల్ ప్రకారం రెండు మ్యాచ్లు హైదరాబాద్, మరో రెండు కోల్కతాలో జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు నగరాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక ఏర్పాట్ల సమస్యను దృష్టిలో ఉంచుకొని ‘ప్లే ఆఫ్స్’ను ఇక్కడి నుంచి తరలించాలని బోర్డు యోచిస్తోంది. మ్యాచ్ల ప్రసారానికి సంబంధించిన ఎక్విప్మెంట్ను సిద్ధం చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా కొత్త వేదికలో కష్టమని భావిస్తోంది. పైగా ‘ప్లే ఆఫ్స్’ తేదీల్లో హైదరాబాద్, కోల్కతా నగరాల్లో వర్ష సూచన ఉంది. అందుకే మిగిలిన లీగ్ మ్యాచ్ల కోసం ఇప్పటికే ఎంపిక చేసిన ఆరు వేదికల నుంచి ఏవైనా రెండింటిలో ‘ప్లే ఆఫ్స్’ జరపాలనేది ఆలోచన. ఇదే కారణంగా చెన్నై, హైదరాబాద్ తమ హోం గ్రౌండ్లో ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్లను కూడా ఫ్రాంచైజీలకు చెప్పి అక్కడి నుంచి తరలించారు. టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఈ రెండు జట్ల చివరి మ్యాచ్లకు ఢిల్లీ వేదికవుతోంది. బీసీసీఐ యోచన ప్రకారం క్వాలిఫయర్–1, ఎలిమినేటర్లను ముంబైలో నిర్వహించి... క్వాలిఫయర్–2, ఫైనల్ మ్యాచ్లను అహ్మదాబాద్లో నిర్వహించవచ్చు. -
బాస్.. నువ్వే కెప్టెన్గా ఉండు ప్లీజ్!.. నేనైతే ఇదే చెప్పేవాడిని!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) నిర్ణయం పట్ల భారత జట్టు మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ విచారం వ్యక్తం చేశాడు. కోహ్లి తొందరపడ్డాడని.. ఇంగ్లండ్ (IND vs ENG)తో సిరీస్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.తానే గనుక సెలక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ని అయి ఉంటే.. ఈ సిరీస్కు కోహ్లినే కెప్టెన్ని చేసేవాడినని ఈ మాజీ చీఫ్ సెలక్టర్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశాడు.పది వేల పరుగుల మైలురాయికి చేరకుండానే..కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. అయితే, తనకు మరోసారి సారథిగా అవకాశం ఇవ్వాలని కోహ్లి కోరాడని.. అయితే, యాజమాన్యం ఇందుకు నిరాకరించిందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే అతడు వీడ్కోలు పలకడం అనుమానాలను పెంచింది.ఏదేమైనా టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయికి కేవలం 770 పరుగుల దూరంలో కోహ్లి నిలిచిపోయాడు. సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన ఈ సారథి.. భారమైన హృదయంతో వైదొలిగాడు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బాస్.. ఈ జట్టుకు నువ్వే కెప్టెన్గా ఉండాలిరెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ నేనే గనుక ఇప్పుడు సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవిలో ఉండి ఉంటే.. ‘బాస్.. ఈ జట్టుకు నువ్వే కెప్టెన్గా ఉండాలి. భారత టెస్టు క్రికెట్కు పూర్వ వైభవం తీసుకురా.. ఆ తర్వాత టెస్టు క్రికెట్ను వదిలెయ్’ అని చెప్పేవాడిని.నిజానికి సెలక్టర్లు అతడిని ఒప్పించి ఉండాల్సింది. నేను గనుక అక్కడ ఉంటే.. అతడే కెప్టెన్గా ఉండాలని పట్టుబట్టేవాడిని. టీమిండియా గాడిలో పడిన తర్వాత రిటైర్ అవమని చెప్పేవాడిని. అతడికి అదే సరైన వీడ్కోలు అయి ఉండేది’’ అని చిక్కా చెప్పుకొచ్చాడు.ప్రత్యేక ప్రతిభఅదే విధంగా.. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్న శ్రీకాంత్.. ‘‘కోహ్లిలో ప్రత్యేక ప్రతిభ దాగి ఉంది. ఆట పట్ల అంకిత భావం, నిబద్ధత.. అతడిని ఈ స్థాయికి చేర్చాయి. కఠినంగా శ్రమించడం తనకు అలవాటు.అతడు గొప్ప బ్యాటర్ కాగలడనే నమ్మకం మాకు ఉంది. అందుకే ఆరోజు కోహ్లిని అందరికంటే ముందుగా ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపిక చేశాము’’ అని తెలిపాడు. కాగా 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2011-12 నాటి సిరీస్లో ఆస్ట్రేలియా గడ్డమీద తొలి శతకం సాధించాడు.తన కెరీర్లో మొత్తంగా 123 టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లి 9230 పరుగులు సాధించాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల నుంచి కూడా రిటైర్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.చదవండి: గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్గా అతడే సరైనోడు! -
IPL 2025: ఐపీఎల్ మళ్లీ షురూ
-
కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్కప్-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ సారథి సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ వన్డే వరల్డ్కప్-2027 ఆడే అవకాశం లేదని కుండబద్దలు కొట్టాడు. కాగా గత కొంతకాలంలో టెస్టుల్లో భారత జట్టు వైఫల్యం చెందుతున్న విషయం తెలిసిందే.ఇద్దరూ రిటైర్ అయ్యారుస్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ కావడం సహా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025ని 3-1తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్లలో విఫలమైన నేపథ్యంలో తొలుత రోహిత్ శర్మ.. ఆ తర్వాత వారం తిరిగే లోపే కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు.యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడే కెప్టెన్వీరిద్దరు ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక తాను వన్డేల్లో కొనసాగుతానని రోహిత్ తెలపగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడే కెప్టెన్ అని స్పష్టం చేసింది.మరోవైపు.. కోహ్లి సోమవారం(మే 12) నాటి రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడే గానీ.. వన్డేల గురించి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన గావస్కర్.. కోహ్లి- రోహిత్ వరల్డ్కప్-2027 నాటికి జట్టులో ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నాడు.కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్కప్-2027 ఆడరు‘‘వన్డే ఫార్మాట్లో వాళ్లిద్దరు అత్యద్భుతమైన ఆటగాళ్లు. అయితే, 2027 ప్రపంచకప్ నాటికి సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము. వాళ్లిద్దరు వరల్డ్కప్ జట్టులో ఉంటారో లేదో తెలియదు. అందుకు తగ్గట్లుగా వారి ప్రదర్శన కొనసాగుతుందా? అంటే అదీ తెలియదు.ఒకవేళ సెలక్షన్ కమిటీ వాళ్లపై నమ్మకం ఉంచితే ఇద్దరూ మరో ప్రపంచకప్ ఆడతారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కోహ్లి- రోహిత్ మరో వరల్డ్కప్ ఆడే అవకాశం లేదు.ఒకవేళ వాళ్లిద్దరు వచ్చే ఏడాది గనుక మంచి ఫామ్లో ఉంటే.. అది కూడా శతకాలు బాదితే... అప్పుడు దేవుడు కూడా వాళ్లను జట్టు నుంచి తప్పించలేడు! కానీ అదంతా జరుగుతుందో లేదో చూడాలి’’ అని గావస్కర్ తన అభిప్రాయం పంచుకున్నాడు. తిరుగులేని రికార్డులుకాగా వన్డేల్లో అత్యధికంగా మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్గా రోహిత్ కొనసాగుతుంటే.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ ఫార్మాట్లో 51 శతకాలు బాది కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. తద్వారా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును అతడు బద్దలు కొట్టాడు. కాగా ప్రస్తుతం రోహిత్ వయస్సు 38 ఏళ్లు కాగా.. కోహ్లికి 36 ఏళ్లు. ఈ ఇద్దరూ వరల్డ్కప్ నాటికి వరసగా 40, 38వ పడిలో అడుగుపెడతారు. ఫిట్నెస్ కాపాడుకుంటూ ఫామ్ను కొనసాగిస్తే వీరు 2027 టీమిండియా ప్రపంచకప్ జట్టులో ఉండటం ఖాయమే!చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్లలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 27 వరకు లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో రెండు ఆదివారాలు రాగా రెండేసి మ్యాచ్లు (డబుల్ హెడర్) నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫయర్, 3న ఫైనల్తో ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తుంది. ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్లో కోల్కతా నైట్రైడర్స్తో జరగాల్సిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆఖరి పోరును 25వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈనెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు. -
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
భారత టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli Retirement) సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలుకుతున్నట్లు భారమైన హృదయంతో వెల్లడించాడు.బీసీసీఐ ట్వీట్ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోహ్లికి కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ‘‘టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసిపోయింది.. కానీ వారసత్వం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే, టీమిండియాకు ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. థాంక్యూ విరాట్ కోహ్లి’’ అంటూ కోహ్లి ఫొటోలు పంచుకుంది.దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా?అయితే, బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో వరుస వైఫల్యాలకు కేవలం ఆటగాళ్లనే బాధ్యుల్ని చేయడం సరికాదంటూ చురకలు అంటిస్తున్నారు.కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్తో 3-0తో వైట్వాష్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025ని 3-1తో చేజార్చుకుంది.రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడాఈ రెండు సిరీస్లలోనూ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా విఫలయ్యాడు. పెర్త్లో సెంచరీ బాదినప్పటికీ.. ఆ తర్వాత ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో దాదాపు ఎనిమిది సార్లు ఒకే రీతిలో అవుటయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగి.. అక్కడా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిల ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే, వీళ్లిద్దరు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ముగిసేంత వరకు మాత్రం జట్టుతో ఉంటారని అంతా భావించారు. అంతలోనే బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు.కాగా రోహిత్ను వైదొలగాల్సిందిగా ముందుగానే సెలక్టర్లు కోరగా.. కోహ్లిని మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కోహ్లి కెప్టెన్సీ చేపట్టాలనే ఉద్దేశంతో ఉండగా.. ఇందుకు బీసీసీఐ నిరాకరించిందని బోర్డు సన్నిహిత వర్గాలు చెప్పడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.బలవంతంగా రిటైర్ అయ్యేలా చేశారనిమరోవైపు.. కోచ్గా గౌతం గంభీర్ విఫలమైనా ఎలాంటి చర్యలు చేపట్టని బీసీసీఐ.. రోహిత్, కోహ్లిలను మాత్రం బలవంతంగా రిటైర్ అయ్యేలా చేసిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఇద్దరూ.. ముఖ్యంగా టెస్టుల్లో భారత్ను అగ్రపథంలో నిలిపిన కోహ్లికి మైదానంలో ఘనంగా వీడ్కోలు పలకాల్సింది పోయి... ఇలా సోషల్ మీడియాలో సాధారణ ఆటగాళ్లలా రిటైర్మెంట్ ప్రకటించే దుస్థితి కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పది వేల పరుగులు చేస్తానంటూఒకవేళ కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంటే ఈ ఏడాది ఆరంభంలోనే సిడ్నీ టెస్టులోనే వీడ్కోలు ఏర్పాటు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పటికిప్పుడు వీరిద్దరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని కనిపిస్తోందంటున్నారు. ఈ సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగులు చేస్తానంటూ కోహ్లి గతంలో చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. కాగా కోహ్లి తన టెస్టు కెరీర్లో 9230 పరుగులు చేశాడు. ఈ మైలురాయికి 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
మనసు మార్చుకోని కోహ్లి.. త్వరలోనే రిటైర్మెంట్?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందే టెస్టు క్రికెట్ నుంచి కోహ్లి తప్పుకుంటాడని, ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలో కనీసం ఇంగ్లండ్ సిరీస్ వరకైనా కొనసాగేలా కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా కోహ్లిని తన రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచన చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సిరీస్తోనే టీమిండియా 2025- 27 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఒకవేళ విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఈసారి ఇంగ్లండ్కు వెళ్లే జట్టులో అనుభవం లేని యువ ఆటగాళ్లే ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడి మనసు మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.మనసు మార్చుకోని కోహ్లి.. కానీ కోహ్లి మాత్రం రిటైర్మెంట్ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. విరాట్ తను మొదట తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోహ్లి తన టెస్టు రిటైర్మెంట్ విషయంపై వారాల క్రితమే సెలెక్టర్లకు సమాచారం ఇచ్చాడు. ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్లో ఆడేలా అతడిని ఒప్పించడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది.కానీ అతడి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేలా కన్పించడం లేదు. వచ్చే వారం జరిగే సెలక్షన్ సమావేశంలో కోహ్లి కొనసాగుతాడా? లేదా అన్నది తేలిపోనుంది అని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి. కాగా రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టులకు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి స్దానంలో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించనుంది. విరాట్ ఇప్పటివరకు 123 టెస్టుల్లో భారత్ ప్రాతినిధ్యం వహించాడు. 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: IND vs SL: ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు -
ఐపీఎల్-2025 ఫైనల్ వేదిక, తేదీ మార్పు?
ఐపీఎల్-2025 సీజన్ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభిస్తే మే 15 లేదా 16వ తేదీన ఐపీఎల్ తిరిగి మొదలయ్యే అవకాశముంది. మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఫైనల్ వేదికను మార్చాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పుడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఫైనల్ వేదికను మార్చనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ తేదీలో కూడా మార్పు చోటు చేసుకోనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. మే 25 బదులుగా మే 30న తుది పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్లకు విదేశీ ఆటగాళ్ల అందుబాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. చాలా మంది ఫారన్ ప్లేయర్లు ఇప్పటికే తమ స్వదేశాలకు వెళ్లిపోయారు.చదవండి: IND vs SL: ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు -
IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?
ఐపీఎల్-2025 టోర్నీని వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలనిఫ్రాంఛైజీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.అదే విధంగా.. విదేశీ ఆటగాళ్లను కూడా వీలైంత త్వరగా భారత్కు రప్పించాలని ఆదేశించినట్లు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ హెడర్ మ్యాచ్లుఇందులో భాగంగా డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు) మ్యాచ్లు నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ తాజా ఎడిషన్ 57 మ్యాచ్లు పూర్తైన తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే.పహల్గామ్ ఉగ్రదాడికి.. భారత్ ఆపరేషన్ సిందూర్తో గట్టిగా బదులిస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్- పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని భారత్ దాడులు చేస్తే.. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, భారత సైనిక స్థావరాలపై దాడులకు తెగబడింది. అయితే, భారత సైన్యం వీటిని సమ ర్థవంతంగా తిప్పికొట్టింది.అర్ధంతరంగా ముగిసిపోయిందిఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది. శత్రువును దారి మళ్లించే క్రమంలో ధర్మశాలలో బ్లాకవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో ఆట మధ్యలోనే స్టేడియాన్ని ఖాళీ చేయించారు.ఈ నేపథ్యంలో తాజా ఐపీఎల్ సీజన్ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. అయితే, శనివారం భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, దాయాది మరోసారి తన వంకర బుద్ధిని చూపి.. దాడులకు తెగబడింది. తెల్లవారిన తర్వాత మాత్రం పరిస్థితులు కాస్త సద్దుమణినట్లు తెలుస్తోంది.ఆ జట్టుకు మాత్రం తటస్థ వేదికఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం భేటీ అయిన బీసీసీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘మంగళవారం నాటికి అన్ని ఫ్రాంఛైజీలు తమ మ్యాచ్లు జరిగే వేదికలకు ఆటగాళ్లను చేర్చాలని బోర్డు ఆదేశించింది.పంజాబ్ జట్టుకు మాత్రం తటస్థ వేదిక ఉంటుంది. కాబట్టి ఇంకా వారి గమ్యస్థానాన్ని నిర్దేశించలేదు. త్వరితగతిన టోర్నీని పూర్తి చేసేందుకు డబుల్ హెడర్ మ్యాచ్లు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది’’ అని తెలిపాయి.కాగా ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్-4లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఇక సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతేభారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘‘మిగిలిన మ్యాచ్లను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. వేదికలు, తేదీలు కొత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.స్టేక్హోల్డర్లు, జట్ల యజమానులు, ప్రసారకర్తలు.. ఇలా లీగ్లో భాగమైన ప్రతి ఒక్కరితో చర్చలు జరపాలి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు! -
IPL రీస్టార్ట్ పై బీసీసీఐ కీలక నిర్ణయం
-
BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (VIrat Kohli) రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లిని మరికొన్నాళ్లు టెస్టుల్లో కొనసాగేలా ఒప్పించేందుకు.. భారత క్రికెట్లో అత్యంత అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తిని రంగంలోకి దించినట్లు సమాచారం.ప్రకటన చేయకపోయినా...కాగా టీమిండియా కెప్టెన్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు గుడ్బై చెప్పిన మూడు రోజుల్లోపే భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే మరో వార్త శనివారం వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాడు, జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లి కూడా టెస్టులనుంచి రిటైర్ కావాలని భావిస్తున్నట్లు దాని సారాంశం. ఈ ‘రన్మెషీన్’ అధికారికంగా తన రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయకపోయినా... తాను టెస్టులనుంచి తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు బోర్డుకు అతడు సమాచారం అందించాడు.కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!ఇంగ్లండ్తో కీలకమైన సిరీస్ కోసం త్వరలోనే జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో.. దానికంటే ముందే తన మనసులో మాటను కోహ్లి బీసీసీఐకి తన నిర్ణయం గురించి తెలియజేశాడు. అయితే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటన చేయకుండా బీసీసీఐ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రోహిత్ రిటైర్ కాగా, శుబ్మన్ గిల్ జట్టు కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్లాంటి పటిష్ట జట్టుతో సమరంలో జట్టులో అనుభవలేమి సమస్య కావచ్చు. అందుకే కనీసం ఈ సిరీస్ వరకైనా కోహ్లి జట్టులో కొనసాగాలని బోర్డు కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్లో అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి ఒకరితో కోహ్లిని ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది.అతడితో మాట్లాడిన తర్వాతే కోహ్లి తన టెస్టు రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన చేయవచ్చు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ను గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మతో పాటు కోహ్లి కూడా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకొన్నాడు. అయితే, వన్డేల్లో మాత్రం రోహిత్తో పాటే అతడు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.టెస్టు క్రికెట్లోనూ ప్రత్యేక స్థానంకాగా విరాట్ కోహ్లి వన్డే రికార్డులు చాలా గొప్పగా, ఘనంగా ఉన్నాయి. అందరి దృష్టిలో అతడు గొప్ప వన్డే ఆటగాడే అయినప్పటికీ.. టెస్టు క్రికెట్లో తనకంటూ కోహ్లి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలతో కాకుండా ఈతరం క్రికెటర్లలో టెస్టులను బతికించేందుకు సిద్ధపడిన ఏకైక బ్యాటర్గా గుర్తింపు పొందాడు.సంప్రదాయ ఫార్మాట్కు ఒక ‘దిక్సూచి’లా నిలబడి పునరుత్తేజం నింపేందుకు కోహ్లి ప్రయత్నించాడు. టెస్టుల్లో గతంలో కనిపించని దూకుడు, వ్యూహాలతో అత్యుత్తమ కెప్టెన్గా జట్టును నడిపించాడు. అయితే టెస్టుల్లో అతడి బ్యాటింగ్ ప్రదర్శన ఇటీవల అంత గొప్పగా లేదు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆస్ట్రేలియాపై పెర్త్లో కోహ్లి సెంచరీ చేశాడు. అయితే సిరీస్లోని మిగతా టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు.గత రెండేళ్లలో కోహ్లి సగటు 32.56 మాత్రమే. ఇదే ఫామ్తో ఇంగ్లండ్కు వెళితే కోహ్లి ఎంత బాగా ఆడతాడనేది సందేహమే. పైగా రోహిత్ కూడా లేకపోవడంతో అందరి దృష్టీ తనపైనే ఉండటంతో తీవ్ర ఒత్తిడి ఖాయం. జట్టు సంధి దశలో తానూ తప్పుకుంటే మెరుగని కోహ్లి ఆలోచిస్తుండవచ్చు.ఇక కెరీర్లో 123 టెస్టులు ఆడిన కోహ్లి 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరో 770 పరుగులు చేస్తే అతను 10 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. చదవండి: Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’! -
IPL 2025: బీసీసీఐ కొత్త ప్రణాళికలు .. ‘మే’లోనే ముగించాలని..
న్యూఢిల్లీ: ఐపీఎల్కు వారం రోజుల పాటు విరామం ఇచ్చిన బీసీసీఐ భారత్, పాక్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాల తర్వాత మళ్లీ కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితులు మెరుగవుతాయి కాబట్టి వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను ముగించాలని గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచనతో ఉంది. ఈ వారాంతంలో టోర్నీ మళ్లీ మొదలు కావచ్చని వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15 నుంచే మ్యాచ్లు జరగవచ్చు. అసలు షెడ్యూల్ ప్రకారం మే 25లోపే లీగ్ను ముగించాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మూడు వేదికల్లో మ్యాచ్లు... ఐపీఎల్–2025 లీగ్ దశలో మొత్తం 57 మ్యాచ్లు పూర్తయ్యాయి. పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న 58వ మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీనిని ‘రద్దు’గా పరిగణించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించాలా లేక మళ్లీ నిర్వహించాలా అనే అంశంపై ఇంకా గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు. లీగ్ దశలో మరో 12 మ్యాచ్లతో పాటు 4 ప్లే ఆఫ్స్ కలిపి మొత్తం 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ముందుగా ఊహించినట్లుగానే దక్షిణాదిలో ఉన్న వేదికలను ఎంచుకొని మ్యాచ్లు జరపాలని బీసీసీఐ ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందు కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను ఎంపిక చేశారు. అసలు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ ఎలాగూ రెండు ప్లే ఆఫ్స్కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఆటగాళ్లు వెనక్కి వస్తారా... ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నిర్వాహకులకు మిగిలిన మ్యాచ్ల కోసం విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించడమే ఇప్పుడు పెద్ద సమస్య. ఐపీఎల్ వాయిదా గురించి తెలిసిన వెంటనే శుక్ర, శనివారాల్లో పలువురు విదేశీ క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ స్వస్థలాలను బయల్దేరి వెళ్లిపోయారు. వీరందరికీ ఐపీఎల్ ఇప్పట్లో మళ్లీ జరగదని, ఏడాది చివర్లో మళ్లీ నిర్వహించవచ్చనే సమాచారమే ఉంది. దాంతో వారంతా వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ జట్లకు చెందిన ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి తాజా సమాచారాన్ని అందించాయని, మళ్లీ వెంటనే వెనక్కి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కూడా చెప్పినట్లు సమాచారం. కొందరు ఆదివారం బయల్దేరేందుకు సిద్ధమవుతుండగా వారిని ఆగిపోవాలని ఒక ఫ్రాంచైజీ చెప్పగా... మరికొందరు సగం దూరం ప్రయాణించగా, ఎక్కడ ఉన్నారో అక్కడినుంచే వెనక్కి రావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెళ్లిపోయిన బట్లర్, కొయెట్జీలను వెనక్కి రమ్మని గుజరాత్ టైటాన్స్ కోరింది. అయితే అందరు విదేశీ ఆటగాళ్లు దాదాపు ఒకే మాట మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 25 తర్వాత లీగ్ కొనసాగితే తాము ఉండలేమని తేల్చేశారు. జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో ఈ రెండు టీమ్ల ప్లేయర్లు మాత్రం అందుబాటులో ఉండే అవకాశాలు పూర్తిగా లేనట్లే. -
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ తిరిగి ప్రారంభం?
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..! మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి వచ్చే వారం ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో త్వరలోనే ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పోర్ట్స్ టాక్ తమ కథనంలో పేర్కొంది. పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్ధావరాలపై దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులను భారత సాయుధ దళాలు మట్టుబెట్టాయి. అనంతరం పాకిస్తాన్ సైన్యం సరిహద్దు వెంబడి కాల్పులు జరపడం, అందుకు భారత్ ధీటుగా బదులివ్వడం వంటి చర్యలు జరిగాయి. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే శనివారం ఇరు దేశాలు సీజ్ఫైర్కు ఒప్పుకొన్నాయి. ఈ విషయాన్ని భారత్-పాకిస్తాన్ అధికారికంగా ధ్రువీకరించాయి. మే 10 సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. మే 12న ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. మే 8న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ మళ్లీ తొలి బంతి నుంచి ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. రెండు మూడు రోజుల్లో కొత్త షెడ్యూల్ను ఐపీఎల్ పాలకమండలి ఖారారు చేసే అవకాశముంది.చదవండి: ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది: రాయుడు -
పాకిస్తాన్కు అంత సీన్ లేదు.. త్వరలోనే ఐపీఎల్ మళ్లీ మొదలు!
ఐపీఎల్-2025 (IPL 2025)ని వాయిదా వేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్వాగతించాడు. దేశ సరిహద్దుల వెంబడి నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా బోర్డు సరిగ్గా స్పందించిందని పేర్కొన్నాడు. అయితే, త్వరలోనే ఈ మెగా టోర్నీ మళ్లీ మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.దాయాది దుశ్చర్యలుపాకిస్తాన్కు ఎక్కువ కాలం పోరాడే శక్తి లేదని.. కాబట్టి త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని గంగూలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని దాదాపు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భారత్ చేపట్టిన ఈ చర్యను దాయాది జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అనుచితంగా దాడులకు తెగబడుతోంది.ఈ క్రమంలో దాయాది పాక్ దుశ్చర్యలకు భారత్ గట్టి సమాధానిమిస్తోంది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి.. రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా సరిహద్దుల వెంబడి పాక్ ఎక్కువగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ.. సామాన్యులు, సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తోంది. భారత్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది.ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ధర్మశాల స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారం రోజుల పాటు లీగ్ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.పాకిస్తాన్కు అంత సీన్ లేదుఈ పరిణామాలపై స్పందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బీసీసీఐ భారత, విదేశీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.అయితే, త్వరలోనే లీగ్ మళ్లీ మొదలు కావాలని ఆకాంక్షిద్దాం. ప్రస్తుతం టోర్నీ ప్లే ఆఫ్స్ దశలో ఉంది. ఇలాంటి తరుణంలో ధర్మశాల, చండీగఢ్, ఢిల్లీ, రాజస్తాన్, జైపూర్ వంటి ప్రాంతాలు మినహా.. మిగతా చోట్ల ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది.కాలక్రమేణా పరిస్థితులు చక్కబడతాయనే విశ్వాసం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితులను, ఒత్తిడిని ఎక్కువ కాలం భరించలేదు. ఆ దేశానికి అంతటి సామర్థ్యం లేదు. కాబట్టి బీసీసీఐ కచ్చితంగా ఐపీఎల్-2025ని పూర్తి చేస్తుంది’’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.సురక్షితంగా ఢిల్లీకిఇదిలా ఉంటే.. ధర్మశాలలో మ్యాచ్ రద్దు కాగానే.. బీసీసీఐ పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లను సురక్షితంగా ఢిల్లీకి చేర్చింది. అత్యంత భద్రత నడుమ వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025లో ఇప్పటికి 57 మ్యాచ్లు పూర్తయ్యాయి. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయిపోయాయి. మిగతా మ్యాచ్లలో ఢిల్లీ, కోల్కతా, లక్నో జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు! -
భారత్లో WTC ఫైనల్-2027!.. ఐసీసీ నిర్ణయం?
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2027 (WTC) ఫైనల్కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోందా?.. అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాల నుంచి అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మెగా మ్యాచ్ను నిర్వహించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.మేము నిర్వహిస్తాంగత నెలలో జింబాబ్వే వేదికగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్కు భారత్ తరఫున అరుణ్ ధుమాల్ హాజరయ్యారు. ఈ క్రమంలో చర్చల్లో భాగంగా డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణ పట్ల బీసీసీఐకి ఆసక్తి ఉందన్న విషయాన్ని ఆయన ఐసీసీ అధికారులకు చెప్పినట్లు ‘ది గార్డియన్’ కథనం పేర్కొంది.కాగా 2019లో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ను ఆరంభించారు. ఇప్పటికి ఈ ఐసీసీ టోర్నీకి సంబంధించి మూడు సీజన్లు (2019-2021, 2021-23, 2023-25)ముగిశాయి. ఇందులో తొలి రెండు ఎడిషన్లలో టీమిండియా ఫైనల్కు వెళ్లింది.ఈసారి అదీ లేదుఅయితే, 2021 టైటిల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో.. అదే విధంగా 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక 2023-25 సీజన్లో మాత్రం భారత జట్టు ఫైనల్కు చేరలేకపోయింది. సొంతగడ్డపై న్యూజిలాండ్తో 3-0తో వైట్వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓడిపోవడం ఇందుకు ప్రధాన కారణం.మూడూ ఇంగ్లండ్లోనేఈ క్రమంలో టీమిండియాపై పైచేయి సాధించిన ఆస్ట్రేలియా- సౌతాఫ్రికాతో కలిసి డబ్ల్యూటీసీ-2025 ఫైనల్కు చేరింది. ఇక ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లన్నింటికీ ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది.సౌతాంప్టన్లోని రోజ్ బౌల్లో 2021, ది ఓవల్ మైదానంలో 2023 ఫైనల్ను నిర్వహించారు. ఈసారి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆసీస్- ప్రొటిస్ జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఈ మెగా మ్యాచ్ తర్వాత టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ఆరంభం కానుంది.ఈ నేపథ్యంలో ఈసారి భారత్ ఫైనల్ చేరితే తాము ఆ మ్యాచ్ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ ఐసీసీకి తెలియజేసినట్లు సమాచారం. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ల సమావేశంలో డబ్ల్యూటీసీ ఫైనల్ 2027 బిడ్కు సంబంధించి భారత్ తమ ఆసక్తిని తెలియజేసింది.అరుణ్ సింగ్ ధుమాల్ బీసీసీఐ తరఫున ఐసీసీ ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా.. బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్నారు. కాబట్టి భారత్కు ఈ బిడ్ దక్కే అవకాశం ఉంది’’ అని ది గార్డియన్ పేర్కొంది.ఐసీసీ నిర్ణయం ఏమిటి?డబ్ల్యూటీసీ ఫైనల్-2027 వేదికను భారత్కు తరలించే విషయంలో ఐసీసీ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. టీమిండియా ఈ మెగా మ్యాచ్కు అర్హత సాధిస్తే ఫర్వాలేదు.. అలా కాని పక్షంలో భారత్లో ఈ మ్యాచ్కు ఊహించిన స్థాయిలో ఆదరణ లభించదని ఐసీసీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అదే ఇంగ్లండ్లో అయితే.. వేసవిలో కౌంటీలతో పాటు ఈ మెగా పోరును వీక్షించేందుకు ప్రేక్షకులు స్టేడియానికి తరలివస్తారనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఇంగ్లండ్నే డబ్ల్యూటీసీ ఫైనల్కు సరైన వేదికగా ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈసారి టీమిండియా ఫైనల్కు చేరకపోవడంతో ఇంగ్లండ్ బోర్డుకు టికెట్ల రూపేణా వచ్చే ఆదాయం భారీగా తగ్గినట్లు వార్తలు వచ్చాయి. దాదాపు రూ. 45 కోట్లు మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నష్టపోయినట్లు కథనాలు వచ్చాయి.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్! -
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగేందుకు ఈ ‘రన్మెషీన్’ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కోహ్లి ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఇప్పుడే వద్దుఅయితే, సెలక్టర్లు మాత్రం కోహ్లిని మరికొన్నాళ్లు కొనసాగాల్సిందిగా కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి కోహ్లి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతానని బోర్డుకు చెప్పాడు.అయితే, ఇంగ్లండ్తో కీలక సిరీస్ ముందున్న నేపథ్యంలో కోహ్లి తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇంతవరకు అతడు మాత్రం ఈ విజ్ఞప్తిపై తన స్పందన తెలియజేయలేదు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్ గుడ్బైకాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-3తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్లలో ఆటగాడిగానూ విఫలమైన రోహిత్.. ఇటీవలే టెస్టులకు గుడ్బై చెప్పాడు.కోహ్లికి ఘనమైన రికార్డులుఇక ఈ రెండు సిరీస్లలో కోహ్లి కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఆసీస్తో పెర్త్లో శతకం బాదడం మినహా పెద్దగా అతడి బ్యాట్ నుంచి మెరపులేవీ లేవు. ఈ నేపథ్యంలో కోహ్లి కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, కోహ్లి టెస్టు కెరీర్ ఎంతో ఘనమైనది. ముఖ్యంగా ఒంటిచేత్తో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై భారత్ను గెలిపించిన రికార్డు అతడి సొంతం.కాబట్టి రోహిత్ విషయంలో రిటైర్మెంట్కు సులువుగానే ఓకే చెప్పిన సెలక్టర్లు.. కోహ్లిని మాత్రం కొనసాగాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో మొదటిదైన ఇంగ్లండ్ సిరీస్లో అతడిని తప్పక ఆడించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం.కాగా 2011లో టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన కోహ్లి ఇప్పటికి 123 మ్యాచ్లు ఆడాడు. సగటున 46.85తో 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 30 టెస్టు శతకాలు, 31 హాఫ్ సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.వన్డేలలో ఇద్దరూ కొనసాగుతారు!మరోవైపు.. రోహిత్ విషయానికొస్తే.. భారత్ తరఫున 67 టెస్టుల్లో 12 శతకాలు, ఒక ద్విశతకం సాయంతో 4301 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి కూడా రోహిత్తో పాటే తానూ వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు.ఇప్పుడు రోహిత్ టెస్టులకు గుడ్బై చెప్పగా.. కోహ్లి కూడా అతడిని అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ ఇద్దరు ఇటీవల టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి వన్డే వరల్డ్కప్-2027 వరకు యాభై ఓవర్ల ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్! -
IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్ల నిర్వహణ ఎప్పుడన్న అంశంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికి ఈ సీజన్లో లీగ్ దశలో భాగంగా 58 మ్యాచ్లు పూర్తయ్యాయి. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే.అందుకే వాయిదాఓవైపు యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు వినోదం కోసం ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడం సరికాదని భావిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా నిలిచే క్రమంలో వారం రోజుల పాటు ఐపీఎల్-2025ని వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) బీసీసీఐని సంప్రదించినట్లు సమాచారం. ఐపీఎల్ తాజా ఎడిషన్లో మిగిలిన పదహారు మ్యాచ్లకు తాము ఆతిథ్యం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాంది గార్డియన్ కథనం ప్రకారం.. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ బీసీసీఐ అధికారులను సంప్రదించి.. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్ల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. బీసీసీఐకి అభ్యంతరం లేకపోతే తమ దేశంలో ఈ మ్యాచ్లను నిర్వహిస్తామని తెలిపారు.‘‘వారం రోజుల తర్వాత కూడా ఐపీఎల్-2025ను పునఃప్రారంభించేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే.. ఈసీబీ ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబరులో మిగిలిన మ్యాచ్లను తాము పూర్తి చేస్తామని ఈసీబీ వర్గాలు వెల్లడించాయి’’ అని ది గార్డియన్ పేర్కొంది.కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మే 25తో ముగియాల్సి ఉంది. అయితే, సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో మే 8 నాటి పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే రద్దు చేశారు. ఈ క్రమంలో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తారనే వార్తలు రాగా.. వారం పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.ఢిల్లీకి చేరుకున్నారుఇదిలా ఉంటే.. పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లతో సహా సహాయక సిబ్బంది మొత్తాన్ని వందే భారత్ రైలులో జలంధర్ నుంచి ఢిల్లీకి సురక్షితంగా తరలించారు. ఇక కొంత మంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీలు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. దాడులకు బరితెగించిన పాకిస్తాన్కు భారత్ దీటుగా సమాధానం ఇస్తుండటంతో దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్-2025ని ఇప్పటికైతే నిలిపివేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. చదవండి: IPL 2025: ప్రత్యామ్నాయ తేదీలు ఏవి? -
వారం రోజుల విరామం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్లకు బ్రేక్ పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లీగ్ను వెంటనే నిలిపివేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. లీగ్ను ‘వారం రోజుల పాటు’ ఆపేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. గురువారం ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్ను అకస్మాత్తుగా ఆపేసినప్పుడే లీగ్ కొనసాగడంపై సందేహాలు వచ్చాయి.శుక్రవారం దీనిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు యుద్ధం సాగుతుండగా, మరోవైపు ఐపీఎల్ రూపంలో వినోదం కొనసాగడం సరైంది కాదని బోర్డు భావించింది. ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లతో పాటు లీగ్తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నవారందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ‘ఐపీఎల్ భాగస్వాములందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం.ప్రస్తుత స్థితిలో మేం దేశం వెంట ఉన్నాం. ప్రభుత్వానికి, సైన్యానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ ధైర్యసాహసాలకు మేం సెల్యూట్ చేస్తున్నాం. మన దేశంలో క్రికెట్ పట్ల అపరిమిత ప్రేమ ఉందనేది వాస్తవం. అయితే దేశంకంటే, దేశం సార్వభౌమత్వం, భద్రతకంటే ఏదీ ఎక్కువ కాదు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే బీసీసీఐ ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. మాకు మద్దతుగా నిలిచిన ఐపీఎల్ భాగస్వాములందరికీ కృతజ్ఞతలు’ అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. లీగ్ కొనసాగించడం, కొత్త తేదీలు, వేదికలపై అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత పరిస్థితులను బట్టి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా బోర్డు స్పష్టం చేసింది. క్రికెటర్లు స్వస్థలాలకు... ఐపీఎల్ వాయిదాపై ప్రకటన వచ్చిన వెంటనే అన్ని జట్లలోని క్రికెటర్లు తమ సొంత నగరాలకు బయలుదేరేలా ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేశాయి. స్వదేశానికి వెళ్లిపోవాలనుకునే విదేశీ క్రికెటర్లకు ఏర్పాట్లపరంగా ‘ప్లేయర్స్ అసోసియేషన్’ సహకరిస్తోంది. గురువారం ధర్మశాలలో మ్యాచ్ రద్దయ్యాక ఢిల్లీ, పంజాబ్ క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ముందుగా బస్సు ద్వారా జలంధర్కు తరలించారు. అక్కడి నుంచి వారంతా ప్రత్యేక వందేభారత్ రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. విమర్శల బారిన పడరాదనే... ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో 58 మ్యాచ్లు ముగియగా... మరో 12 మ్యాచ్లు మాత్రమే మిగిలాయి. వీటిలో అహ్మదాబాద్లో మూడు... లక్నో, బెంగళూరులలో రెండు చొప్పున...హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, జైపూర్లలో ఒక్కో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇవి కాకుండా 4 ప్లే ఆఫ్స్లలో రెండేసి మ్యాచ్లకు హైదరాబాద్, కోల్కతా వేదికగా నిర్వహించాల్సి ఉంది. వాస్తవికంగా చూస్తే సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఉన్నా... ఉత్తరాదిలోని కొన్ని నగరాలు మినహా ఈశాన్యం, దక్షిణం వైపు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. బీసీసీఐ స్థాయి, దానికి ఉన్న సాధన సంపత్తిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కేవలం వేదికలు మార్చి చకచకా ఈ 16 మ్యాచ్లు నిర్వహించడం ఏమాత్రం సమస్య కాదు. అయితే ఒకవైపు యుద్ధం సాగుతుంటే, మన సైనికులు పోరాడుతుంటే మీకు ఆటలు కావాలా అని సగటు భారతీయుడు ఆగ్రహిస్తున్నాడు. ఇంత సంకట స్థితిలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వం నుంచి ఆంక్షలు, హెచ్చరికలు వస్తుండగా ఐపీఎల్ మాత్రం కొనసాగడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది. అయితే పూర్తిగా సీజన్ను రద్దు చేయకుండా, లేక సుదీర్ఘ సమయం వాయిదా వేయకుండా ‘ఒక వారం వాయిదా’ అంటూ సన్నాయి నొక్కులు చూపిస్తోంది. బహుశా వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని, అప్పుడు మళ్లీ ఆడించవచ్చనే ఆలోచన కనిపిస్తోంది!ప్రత్యామ్నాయ తేదీలు ఏవి?బీసీసీఐ ‘వారం’ విరామం ప్రకటనను బట్టి చూస్తే వెంటనే కొనసాగించాలని భావిస్తున్నట్లుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న ఐపీఎల్ ముగియాలి. ఇప్పుడు మరో వారం దీనికి జోడిస్తే జూన్ 1న ముగిసేలా కొత్త షెడ్యూల్ ఇవ్వవచ్చు. సరిగ్గా చెప్పాలంటే టోర్నీని ముగించేందుకు బోర్డుకు 10 రోజులు చాలు. ‘డబుల్ హెడర్’లుగా రోజుకు రెండు లీగ్ మ్యాచ్ల చొప్పున 6 రోజులు... ప్లే ఆఫ్స్కు మరో 4 రోజులు సరిపోతాయి. జూన్ మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది కాబట్టి కష్టమనే చర్చ ఉన్నా... తొలి టెస్టు జూన్ 20న మొదలవుతుంది. ఐపీఎల్లో ఆడుతున్న టెస్టు జట్టు సభ్యులు జూన్ 10 వరకు చేరుకున్నా సమస్య లేదు. ఇప్పటికిప్పుడు మ్యాచ్లు నిర్వహించకుండా ఆగిపోతే ఇంగ్లండ్ సిరీస్ తర్వాత ఆగస్టు, సెపె్టంబర్ వరకు లీగ్ వెళుతుంది. అయితే ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్తో వన్డే, టి20 సిరీస్లను ఆడనుంది. దీనిని వాయిదా వేసినా ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్, ఇంగ్లండ్ బోర్డు నిర్వహించే ‘హండ్రెడ్’ టోర్నీలు ఉన్నాయి. ‘హండ్రెడ్’లో సగం జట్లను ఐపీఎల్ యజమానులే కొన్నారు కాబట్టి ఇది అసాధ్యం. సెప్టెంబర్లో 19 రోజులు ‘ఆసియా కప్’ టోర్నీకి కేటాయించారు. దీనికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇక్కడ ఆడకపోవడమే కాదు... భారత్, పాక్ మధ్య మ్యాచ్లు జరగడం కూడా అసాధ్యమే! కాబట్టి ఈ ఒక్క టోర్నీని రద్దు చేస్తే ఐపీఎల్కు కావాల్సిన సమయం లభిస్తుంది. -
IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ల డబ్బులు రీఫండ్
పాకిస్తాన్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. త్వరలోనే కొత్త షెడ్యూల్, వేదికలను ఖారారు చేస్తామని భారత క్రికెట్ బోర్డు తెలిపింది.దీంతో మే 9(శుక్రవారం) నుంచి మ్యాచ్లు ఆగిపోనున్నాయి. ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడంతో ఆయా ఫ్రాంచైజీలు అభిమానులకు టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేయడం ప్రారంభించాయి. షెడ్యూల్ ప్రకారం..ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడాల్సింది. కానీ వాయిదా పడడంతో టిక్కెట్ల డబ్బులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ కూడా టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేస్తామని వెల్లడించింది. కాగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అర్ధాంతంగా రద్దు అయ్యింది. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్లో యూఏఈలో నిర్వహించే అవకాశముంది. -
ఐపీఎల్ వాయిదా ఎన్ని రోజులంటే? బీసీసీఐ కీలక ప్రకటన
ఐపీఎల్-2025 సస్పెన్షన్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో కీలక ప్రకటన చేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది సీజన్ను వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది సీజన్ పూర్తిగా రద్దు అవుతుందన్న ఊహాగానాలకు భారత క్రికెట్ బోర్డు చెక్పెట్టింది."ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచులను వారం రోజుల పాటు తక్షణమే నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. సంబంధిత అధికారులు, వాటాదారులతో సంప్రదించి అప్పటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తాము. చాలా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి.ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లు అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే ఐపీఎల్ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. మన సాయుధ దళాల బలంపై బీసీసీఐకి పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ, స్టేక్ హోల్డర్స్ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం ముఖ్యమైనది బోర్డు భావించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది సీజన్ తిరిగి మళ్లీ మే 16 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతంగా రద్దు అయింది. భద్రతా కారాణాల దృష్ట్యా మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేశారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.చదవండి: ఆపరేషన్ సిందూర్ 2.0పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు -
ఐపీఎల్ రద్దు
-
ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా.. అధికారిక ప్రకటన
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక, తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ద పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు. ఉద్రిక్తతల కారణంగా పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దునిన్న (మే 8) ధర్మశాల వేదికగా పంజాబ్-ఢిల్లీ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన మ్యాచ్ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు.మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్కోట్ గుండా ఢిల్లీకి తరలించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ స్కోర్ 122/1గా (10.1 ఓవర్లలో) ఉండింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు.ఏం జరిగిందంటే..?ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్కు చెందిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కొద్ది రోజుల కామ్గా ఉన్న భారత్.. ఈ మంగళవారం అర్దరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరిట సాగిన ఈ ప్రతి దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇందుకు బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. రాకెట్లు, మిసైళ్లతో జనావాసాలను టార్గెట్ చేసింది. పాక్ దుశ్చర్యకు భారత్ సైతం ధీటుగా బదులిస్తోంది. భారత బలగాలు పాక్ మిస్సైల్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. సమాంతరంగా పాక్లోని కీలక నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే భారత బలగాలు పాక్ను కోలుకోలేని దెబ్బతీశాయి. అయినా పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. కాల్పులకు పాల్పడుతూనే ఉంది. -
ఐపీఎల్ కు ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్
-
ఐపీఎల్ వాయిదా?
ధర్మశాల: ఉగ్రవేటకు తలపెట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్తాన్ మిలిటరీ కుటిలబుద్ధితో క్రూరమైన దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల పౌరులపై విచక్షణారహితంగా మోర్టార్లు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీంతో భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్తా యుద్ధభూమిని తలపించడంతో భారత రక్షణ దళాలు కీలక నగరాల్లో విద్యుత్ సరఫరా (పవర్ బ్లాక్ అవుట్)ను నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేసింది. పాక్ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను నిర్వీర్యం చేసేందుకు భారత సాయుధ బలగాలు రాత్రంతా శ్రమిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం దేశం కోసం భారత త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే స్టేడియాల్లో ఐపీఎల్ వినోదం పట్ల నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. భారత పౌరులు, ప్రధాన నగరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ విచక్షణా రహితంగా జరిపే దాడుల్ని తిప్పికొడుతున్నప్పటికీ... పొరపాటున ఏ మిసైల్, డ్రోన్ దాడి అయిన స్టేడియంలో పడితే... వేలల్లో ప్రేక్షకులు, పదుల సంఖ్యలోని విదేశీ, భారత క్రికెటర్లకు జరిగే ప్రాణనష్టం ఊహకందదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినోదం కంటే కూడా దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుబాటులో ఉన్న బీసీసీఐ ఉన్నతాధికారులతో నేడు సమావేశమై ఐపీఎల్పై తుది నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం ఐపీఎల్ రద్దు లేదంటే వాయిదా ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నేటి మ్యాచ్ యథాతథం ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్ల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తాం. ఇప్పటివరకైతే కేంద్రం నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. ఆటగాళ్ల భద్రత, రవాణా తదితర పరిస్థితుల్ని సమీక్షించాకే తుది నిర్ణయం తీసుకుంటాం. లక్నోలో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్కు ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే ఉన్నాయి. –ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఐపీఎల్లో నేడులక్నో X బెంగళూరువేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
రోహిత్కు ముందే తెలుసు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు:సెహ్వాగ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం(మే 7) టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిచాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ను భారత టెస్ట్ కెప్టెన్గా తొలగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని రోహిత్ శర్మకు తెలియజేసినట్లు వినికిడి. ఈ క్రమంలోనే హిట్మ్యాన్కు టెస్టు క్రికెట్కు విడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై రోహిత్ ఆసంతృప్తిగా ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ తీసుకున్న నిర్ణయంతో తన ఆశ్చర్యపోయినట్లు సెహ్వాగ్ తెలిపాడు."రోహిత్ నిర్ణయం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందకంటే ఇంగ్లండ్ పర్యటనకు తను సిద్దమవుతున్నట్లు రోహిత్ శర్మ ఇటీవల చాలా సందర్బాల్లో వెల్లడించాడు. అంతేకాకండా ఆస్ట్రేలియా సిరీస్లో ఆఖరి టెస్టు అనంతరం తన రిటైర్మెంట్పై రోహిత్ ఓ క్లారిటీ ఇచ్చాడు. తను ఎక్కడికీ వెళ్ళడం లేదని, ఇప్పటిలో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.కానీ అంతలోనే ఏమి జరిగిందో ఆర్ధం కావడం లేదు. కచ్చితంగా సెలక్టర్లతో చర్చించాకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. ఇంగ్లండ్ పర్యటనకు తనను టెస్టు కెప్టెన్గా ఎంపిక చేయమని లేదా పూర్తిగా ఆటగాడిగా కూడా పరిగణలోకి తీసుకోబోమని రోహిత్తో సెలక్టర్లు చెప్పండొచ్చు. అందుకే జట్టును ప్రకటించక ముందే రోహిత్ టెస్టులకు విడ్కోలు పలికాడు. సెలక్టర్లు తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే రోహిత్ తనంతట తానే తప్పుకొన్నాడు. కానీ రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని ఎవరూ వదులుకోవాలని అనుకోరు. మూడు ఫార్మాట్లలో రోహిత్ తనదైన ముద్రవేశాడు. అతడి రికార్డులు అద్వితీయమైనవి" అని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: గిల్, బుమ్రా, పంత్ కాదు.. టీమిండియా కెప్టెన్గా అతడే -
MI Vs PBKS: ముంబై, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు!
న్యూఢిల్లీ/ధర్మశాల: ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం (మే 11) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం పంజాబ్ రెండో సొంత మైదానమైన ధర్మశాలలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా... ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై జట్టు ధర్మశాలకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన మ్యాచ్ను ముంబైలోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకార చర్యగా భారత సైన్యం... పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు విమానాశ్రయాలను మూసి వేసింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబై జట్టు ధర్మశాల చేరుకోవడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘ఈ మ్యాచ్ ముంబైలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని అన్నారు. కాగా... గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ యథావిథిగా జరగనుంది. ఈ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాల చేరుకోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ‘బీసీసీఐ నుంచి కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో గురువారం మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేశాం. అధికారికంగా చెప్పనంత వరకు షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తాం’ అని హిమాచల్ప్రదేశ్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు వేదిక మార్పునకు సంబంధించిన బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఐపీఎల్ సాగడంపై ఎలాంటి అనుమానాలు లేవని... ప్రభుత్వ సూచనల మేరకు లీగ్ నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు. -
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు?.. స్పందించిన బీసీసీఐ!
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)నేపథ్యంలో ఐపీఎల్-2025లో షెడ్యూల్లో మార్పులు ఉంటాయా? లేదంటే క్యాష్ రిచ్ లీగ్ ప్రణాళిక ప్రకారమే ముందు సాగుతుందా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు స్పందించాయి.ఐపీఎల్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని.. లీగ్ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేశాయి. కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మొదలు కాగా.. మే 6 నాటికి 56 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో రెండు మాత్రమే వర్షం కారణంగా రద్దయ్యాయి.టాప్లో గుజరాత్ఈ క్రమంలో పదకొండింట ఎనిమిది విజయాలతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోకి కొనసాగుతుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా 16 పాయింట్లు ఉన్నా రన్రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు), ముంబై ఇండియన్స్ (14 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (13 పాయింట్లు), కోల్కతా నైట్ రైడర్స్ (11 పాయింట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (10 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇక ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ (7 పాయింట్లు), రాజస్తాన్ రాయల్స్ (6 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (4 పాయింట్లు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు కాగా ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం నాటి మ్యాచ్ వర్షం వల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి.. వాటిని ధ్వంసం చేసింది.జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఇలాంటి సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా వేస్తారేమోనని సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యలో బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.దేశ ప్రయోజనాలే ముఖ్యంఇక ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వ నిర్ణయాలను బీసీసీఐ శిరసా వహిస్తుందని స్పష్టం చేశారు. సమయానికి తగినట్లు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామని పేర్కొన్నారు.‘‘ఐపీఎల్ పాలక మండలి ఈ పరిస్థితులను గమనిస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే, ఏదీ మన చేతుల్లో లేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీసీసీఐ అందుకు కట్టుబడి ఉంటుంది. మద్దతుగా ఉంటుంది’’ అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.సురక్షితం, భద్రంఇక టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘భారత్లో ప్రతి ఒక్కరు సురక్షితంగా, భద్రంగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. మన దేశ సైన్యంపై అందరికీ అమితమైన విశ్వాసం ఉంది. విదేశీ ఆటగాళ్లు కూడా తాము భద్రంగా ఉన్నామని, ఉంటామని నమ్మకంగా ఉన్నారు. కాబట్టి లీగ్లో మార్పులు ఉండవనే అనుకుంటున్నా’’ అని ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్ -
ముంబై ఇండియన్స్కు భారీ షాక్!.. ఆశిష్ నెహ్రానూ వదల్లేదు
ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్కు మరో భారీ షాక్ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)తో పాటు జట్టు మొత్తానికి జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై మంగళవారం గుజరాత్ టైటాన్స్ (MI Vs GT)తో తలపడింది.ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులకు హార్దిక్ సేన పరిమితమైంది.గెలిచిన గుజరాత్ఇక గుజరాత్ లక్ష్య ఛేదనకు దిగగా పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. అయితే, ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత వాన తెరిపినవ్వడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో 147 పరుగులు చేయాల్సి ఉండగా.. గుజరాత్ పని పూర్తి చేసింది. ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.కాగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా విధించింది.రూ. 24 లక్షల ఫైన్ఈ సీజన్లో రెండోసారి ఇదే తప్పిదాన్ని పునరావృతం చేసినందుకు హార్దిక్కు రూ. 24 లక్షల ఫైన్ వేసింది. అదే విధంగా.. నిబంధనల ప్రకారం.. ఇంపాక్ల్ ప్లేయర్ సహా తుదిజట్టులోని ఆటగాళ్ల అందరికి రూ. 6 లక్షల జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది జరిమానాగా వర్తిస్తుందని వెల్లడించింది.మరోవైపు గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. అతడికి కూడా జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది.ఆశిష్ నెహ్రాను వదల్లేదుఈ మేరకు.. ‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం’’ అని ఐపీఎల్ పాలక మండలి తమ ప్రకటనలో పేర్కొంది.ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.20 ప్రకారం ఆశిష్ నెహ్రా లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ మేర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నెహ్రా కూడా తన తప్పును అంగీకరించాడని పేర్కొంది. అయితే, నెహ్రా ఏం తప్పు చేశాడన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా వర్షం వల్ల పదే పదే మ్యాచ్ టైమింగ్ను మార్చడంపై మైదానంలోనే నెహ్రా అంపైర్లతో వాదనకు దిగాడు. అందుకే అతడికి జరిమానా వేసినట్లు తెలుస్తోంది.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ గుజరాత్👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: గుజరాత్.. తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 155/8 (20)👉గుజరాత్ స్కోరు: 147/7 (19)👉ఫలితం: డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ముంబైపై మూడు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపుచదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్ Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025 -
ఐసీసీ టోర్నీల్లోనూ పాక్తో మ్యాచ్లు వద్దు: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టోర్నీల్లోనూ భారత్ పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా సరిహద్దు వివాదాల నేపథ్యంలో టీమిండియా-పాకిస్తాన్ (IND vs PAK) మధ్య పుష్కర కాలంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు జరగడం లేదన్న విషయం తెలిసిందే.. అయితే ఐసీసీ టోర్నీలలో మాత్రం ఇరు జట్లూ తలపడుతున్నాయి.ఇప్పుడు దీనికి కూడా ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. భారత్, పాక్ సరిహదుల్లో తీవ్రవాదం ముగిసేవరకు ఇరు జట్ల మధ్య ఆటలకు ప్రాధాన్యత లేదని అతను అన్నాడు. అప్పటిదాకా ఎలాంటి ఆటలు అవసరం లేదుఈ విషయంలో బీసీసీఐ మాత్రమే కాదు, భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడే వరకు అసలు ఎలాంటి ఆటలు అవసరం లేదు.గతంలోనూ ఈ అభిప్రాయాన్ని వెల్లడించాను. నా దృష్టిలో క్రికెట్ మ్యాచ్, బాలీవుడ్ సినిమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలేవీ భారత సైనికులు లేదా భారత పౌరుల ప్రాణాలకంటే ముఖ్యం కాదు. మ్యాచ్లు జరుగుతుంటాయి.సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. గాయకులు వేదికలపై పాడుతూనే ఉంటారు. కానీ మీ ఆత్మీయులను కోల్పోయిన బాధను ఏదీ తగ్గించలేదు’’ అని గంభీర్ ఉద్వేగభరితంగా మాట్లాడాడాడు. ఆసియా కప్ గురించి చెప్పలేనుఅదే విధంగా.. ‘‘ఈ ఏడాది జరిగే ఆసియా కప్ గురించి నేను ఏమీ చెప్పలేను. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. వారు ఏం చెబితే దానిని పాటిస్తాం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడిన విషయం విదితమే. బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా అనేక ఆంక్షలు విధించింది. ఆపరేషన్ సింధూర్తాజాగా ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో నాలుగు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు భారత భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకొన్నా -
MI vs GT: అందరికీ అప్పుడే.. సిరాజ్కు ఇప్పుడు!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు... భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టీ20 ప్రపంచకప్ విజేత ఉంగరాన్ని అందించాడు. గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కప్ గెలిచిన ఆ జట్టులోని సభ్యులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలి వార్షిక అవార్డుల కార్యక్రమంలో ప్రత్యేక ఉంగరాలు బహుకరించింది.అందరికీ అప్పుడే.. సిరాజ్కు ఇప్పుడు!ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకకు సిరాజ్ గైర్హాజరు కాగా... సోమవారం వాంఖడే స్టేడియంలో సిరాజ్కు రోహిత్ శర్మ ఈ బహుమతిని అందించాడు. ఐపీఎల్లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సిరాజ్కు ముంబై స్టార్ రోహిత్ ఈ ఉంగరాన్ని అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రింగ్లో ఆటగాడి పేరు, జెర్సీ నంబర్తో పాటు జాతీయ చిహ్నం అశోక చక్రను పొందుపరిచారు.ముంబైతో మ్యాచ్కు ముందు గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. రిక్రియేషనల్ (సరదా కోసం తీసుకునే) డ్రగ్స్ వాడటం వల్ల అతడిపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) తాత్కాలిక నిషేధం విధించగా... సస్పెన్షన్ సమయంలో ‘సబ్స్టాన్స్ అబ్యూస్’ చికిత్స పూర్తి చేయడంతో అతడిపై నిషేధాన్ని తొలగించారు. దీంతో రబడ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్కు అందుబాటులోకి వచ్చాడు.ఈ మేరకు దక్షిణాఫ్రికా ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రగ్ ఫ్రీ స్పోర్ట్ (ఎస్ఏఐడీఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ‘రబడ డోపింగ్కు పాల్పడినట్లు ఏప్రిల్ 1న నిర్ధారణ అయింది. దీంతో అతడిపై తాత్కాలిక నిషేధం విధించారు. ఆ సమయంలో ఐపీఎల్ ఆడుతున్న రబడ తక్షణమే దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా డోపింగ్ నిరోధక నియమాల ప్రకారం ప్రత్యేకంగా నిర్వహించే సబ్స్టాన్స్ అబ్యూస్ చికిత్స తీసుకున్నాడు. రెండు సెషన్లు పూర్తి కావడంతో అతడిపై విధించిన తాత్కాలిక నిషేధం ముగిసింది.నా వృత్తిపై గౌరవం, భక్తితో ఉంటానుఅతడు నెల రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. రబడ ఇప్పుడు నిరభ్యంతరంగా మ్యాచ్లు ఆడోచ్చు’ అని ఎస్ఏఐడీఎస్ వెల్లడించింది. ‘ఈ సంఘటనతో కుంగిపోను. ముందుకు సాగడమే నా లక్ష్యం. నిరంతరం కష్టపడుతూ నా వృత్తిపై గౌరవం, భక్తితో ఉంటాను’అని రబడ అన్నాడు. క్రీడల్లో మెరుగైన ప్రదర్శనకు ఉపయోగపడే డ్రగ్స్ తరహాలో కాకుండా కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి వాటిని రిక్రియేషనల్ డ్రగ్స్గా వ్యవహరిస్తారు.ఆటగాళ్లు వీటిని వాడితే నిబంధనల ప్రకారం గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం పడే అవకాశం ఉన్నా... సరదా కోసమే వాటిని వాడినట్లు... ఆ సమయంలో ఎలాంటి మ్యాచ్లు లేకపోవడంతోనే అలా చేసినట్లు ప్లేయర్ నిరూపించగలిగితే స్వల్ప నిషేధంతో తప్పించుకోవచ్చు. ఇక ముప్పై ఏళ్ల రబడ ఈ ఏడాది జనవరిలో ఎస్ఏ20 సందర్భంగా ఈ డ్రగ్ తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయడంతో వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు రబడ అందుబాటులో ఉండనున్నాడు. చదవండి: వయసుతో పనేంటి?.. అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు: వరుణ్ చక్రవర్తి 𝙈𝙤𝙢𝙚𝙣𝙩 𝙩𝙤 𝘾𝙝𝙚𝙧𝙞𝙨𝙝 👏@mdsirajofficial receives a special ring from #TeamIndia Captain @ImRo45 for his impactful contributions in the team's victorious ICC Men's T20 World Cup 2024 campaign 💍@Dream11 pic.twitter.com/dHSnS4mwu1— BCCI (@BCCI) May 5, 2025 -
ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది స్వదేశంలో (సెప్టెంబర్) జరగాల్సిన ఆసియా కప్ను రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో పాకిస్తాన్ పాల్గొనాల్సి ఉండటంతో ఈ మేరకు నిర్ణయించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఉండబోవని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.🚨 LIKELY NO ASIA CUP 2025 🚨- Asia Cup 2025 remains under a cloud because of the terror attack in Pahalgam. (Sahil Malhotra/TOI). pic.twitter.com/dji5zdwc5T— Tanuj (@ImTanujSingh) May 2, 2025కాగా, ఈ ఏడాది ఆసియా కప్లో భారత్, పాక్ సహా 8 జట్లు పాల్గొనాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతుందని ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) నిర్ణయించింది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగాల్సి ఉంది. ఈ టోర్నీకి భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. హాంగ్కాంగ్, ఒమన్, యూఏఈ 2024 ఏసీసీ ప్రీమియర్ కప్ ద్వారా క్వాలిఫై అయ్యాయి.🚨 NO INDIA-BANGLADESH SERIES 🚨- Team India Unlikely to tour Bangladesh for the White ball series in August due to cross border tension. (Sahil Malhotra/TOI). pic.twitter.com/qsBdZO7ccE— Tanuj (@ImTanujSingh) May 2, 2025బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దు..?అక్రమ చోరబాట్లు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ బంగ్లాదేశ్ పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకోనుందని సమాచారం. ఎఫ్టీపీ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్లో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ పర్యటన రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరుగనుంది. ఆగస్ట్ 17న తొలి వన్డే, 20న రెండో వన్డే ఢాకా వేదికగా జరగాల్సి ఉంది. ఆతర్వాత ఆగస్ట్ 23న మూడో వన్డే, 26న తొలి టీ20 చట్టోగ్రామ్లో జరగాల్సి ఉన్నాయి. చివరి రెండు టీ20లు ఆగస్ట్ 29, 31 తేదీలోల ఢాకాలో జరగాల్సి ఉన్నాయి.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో భారత్ పాక్ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. పాక్తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ల రద్దును కొనసాగించింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్లను బ్యాన్ చేసింది. పాక్కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్కు సూచించింది. -
IPL 2025: బీసీసీఐకి ఊహించని షాక్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్-2025 (IPL 2025) సందర్భంగా బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో బీసీసీఐకి ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి.అసలు ఏం జరిగిందంటే.. క్యాష్ రిచ్ లీగ్తో ప్రతి ఏటా ఏదో ఒక కొత్త హంగుతో నిర్వాహకులు అభిమానులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. తొలుత అంపైర్ క్యామ్.. తర్వాత స్పైడర్ క్యామ్.. తాజాగా రోబో కుక్క (Robotic Dog).. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ల టీమ్లో చేరిపోయాయి.నడుస్తుంది.. పరిగెడుతుంది.. ఎగురుతుంది..ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ రొబోటిక్ డాగ్ను నిర్వాహకులు పరిచయం చేశారు. ‘‘ఐపీఎల్ కుటుంబంలో కొత్త మెంబర్. ఇది నడుస్తుంది.. పరిగెడుతుంది.. ఎగురుతుంది.. అంతేకాదు మనస్ఫూర్తిగా నవ్వుతుంది కూడా! మా ప్రచార కుటుంబంలోని కొత్త మెంబర్కు స్వాగతం పలకండి’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు.ఇక రిమోట్తో ఆపరేట్ చేసే ఈ రోబో కుక్కకు ఏప్రిల్ 20న ‘చంపక్’గా నామకరణం చేశారు. ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రోబో డాగ్కు తాము ఎంచుకున్న పేర్లలో ఎక్కువ మంది చంపక్కే ఓటు వేశారని.. అందుకే దానికి ఆ పేరు పెట్టామని వెల్లడించారు.𝗛𝗼𝗹𝗱 𝗼𝗻! 𝗪𝗲'𝘃𝗲 𝗮 𝗻𝗲𝘄 𝗜𝗣𝗟 𝗳𝗮𝗺𝗶𝗹𝘆 𝗺𝗲𝗺𝗯𝗲𝗿 𝗶𝗻 𝘁𝗼𝘄𝗻 👀It can walk, run, jump, and bring you a 'heart(y)' smile 🐩❤️And...A whole new vision 🎥Meet the newest member of the #TATAIPL Broadcast family 👏 - By @jigsactin P.S: Can you help us in… pic.twitter.com/jlPS928MwV— IndianPremierLeague (@IPL) April 13, 2025 ‘చంపక్’ పేరిట పిల్లల కోసం మ్యాగజీన్అయితే, ‘చంపక్’ విషయంలో ఢిల్లీ ప్రెస్ పత్రా ప్రకాశన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1968 నుంచి తాము ‘చంపక్’ పేరిట పిల్లల కోసం మ్యాగజీన్ ప్రచురిస్తున్నామని.. అయితే, తమ అనుమతి లేకుండానే తమ ట్రేడ్మార్క్ వాడుకున్నారని కోర్టుకు విన్నవించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా బుధవారం బీసీసీఐకి నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానంతో తమ ముందుకు రావాలని బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.అనుమతి లేకుండాకాగా తమ ట్రేడ్మార్క్ను ఉపయోగించుకోకుండా బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని కక్షిదారు కోరగా.. న్యాయస్థానం మాత్రం ఈ అంశంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ విషయం గురించి పబ్లిషర్ తరఫు న్యాయవాది అమిత్ గుప్తా మాట్లాడుతూ.. రొబోటిక్ డాగ్కు చంపక్ అనే పేరును పెట్టడం ట్రేడ్మార్క్ వివాదానికి తీసింది. అంతేకాదు సుప్రసిద్ధ బ్రాండ్ను.. అనుమతి లేకుండా అదీ వాణిజ్యపరంగా వాడుకోవడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా చంపక్కు ఉన్న పేరును ఇలా తమ వినోద వ్యాపారం కోసం వాడుకోవడం ఎంతమాత్రంసరికాదని పేర్కొన్నారు.ఇక బీసీసీఐ తరఫున న్యాయవాది జై సాయి దీపక్ స్పందిస్తూ.. చంపక్ అనేది ఒక పువ్వు పేరని.. టీవీ సిరీస్లోని క్యారెక్టర్గా అభిమానులు చంపక్ను చూస్తున్నారని పేర్కొన్నారు. అంతేతప్ప మ్యాగజీన్ నుంచి తాము ఎలాంటి పేరును తీసుకోలేదని వెల్లడించారు.చదవండి: గెలుపు జోష్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కు షాక్! -
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐపీఎల్లో 94 మ్యాచ్లు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్గా కొనసాగుతోంది. ఐపీఎల్ను మరింత ఆకర్షణగా మార్చేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత 74 మ్యాచ్ల నుండి టోర్నమెంట్ను 94 మ్యాచ్ల సీజన్కు విస్తరించాలని బీసీసీఐ భావిస్తోంది. 2028 నుంచే మ్యాచ్ల సంఖ్య పెంచేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశాడు."భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యను పెంచే అవకాశముంది. ఇదే విషయాన్ని ఐసీసీతో చర్చిస్తున్నాము. బీసీసీఐలో కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ను కూడా ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు. మ్యాచ్ల సఖ్యను పెంచి అభిమానులకు మరింత వినోదాన్ని అందించడమే మా లక్ష్యం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ తొమ్మిది వారాలు పాటు జరుగుతుంది. దాన్ని 11 వారాలకు పెంచాలని ఆలోచిస్తున్నాము. అంటే 74 మ్యాచ్ల నుంచి 84 లేదా 94కి పెంచవచ్చు. ప్రతి జట్టు సొంత గడ్డపై, ప్రత్యర్థి గడ్డపై రెండేసి మ్యాచ్లు ఆడేందుకు వీలు ఉంటుంది" అని ధుమాల్ పేర్కొన్నారు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి ఇప్పటిలో కొత్త ఫ్రాంచైజీలను తీసుకొచ్చే ఆలోచన లేదని ఆయన తెలిపారు. కాగా 59 మ్యాచ్లతో ప్రారంభమైన ఐపీఎల్.. ప్రస్తుతం 74 మ్యాచ్ల సీజన్గా కొనసాగుతోంది. -
జోక్ కాదు.. పాక్ క్రికెట్తో సంబంధాలన్నీ తెంచుకోండి: గంగూలీ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్తో సంబంధాలన్నీ తెంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు. కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే.ప్రశాంతమైన బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. 2008 తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ 2013లో భారత పర్యటనకు వచ్చింది.అనంతరం దాయాది దేశాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రం భారత్- పాక్ (Ind vs Pak) ముఖాముఖి తలపడుతున్నాయి. కానీ తాజాగా పహల్గామ్ ఘటన నేపథ్యంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది.సంబంధాలు తెంచుకోవాలిఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘అవును.. వందకు వంద శాతం పాకిస్తాన్తో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. కఠిన చర్యలు చేపట్టాలి. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరగడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇదేమీ జోక్ కాదు. ఉగ్రవాదాన్ని సహించకూడదు. టెర్రరిజంను తుడిచిపెట్టేయాలి’’ అని పేర్కొన్నాడు.ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే పాక్తో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్లు ఉండబోవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం దాయాదితో ఆడుతున్నామని.. అయితే, పరిస్థితులన్నింటినీ ఐసీసీ కూడా గమనిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం చెప్పినట్లే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.ముక్తకంఠంతో ఖండించిన క్రీడా లోకంకాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ‘‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో భారత్తో పాటు యావత్ ప్రపంచం వారికి అండగా నిలుస్తోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తేలియజేస్తున్నా. న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’’ అని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.ఇక విరాట్ కోహ్లి సైతం.. ‘‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.మరోవైపు.. ‘‘అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దీనికి రాబోయే కాలంలో మన ధైర్యవంతమైన సైనికులు గట్టి బదులిస్తారు. జమ్మూకశ్మీర్లో శాంతికి భంగం కలగించాలనుకునే వారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అని బాక్సర్ విజేందర్ సింగ్ తన స్పందన తెలియజేశాడు.భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు స్పందిస్తూ.. ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి బాధితుల కోసం నా హృదయం తపిస్తోంది. ఎలాంటి కారణమైనా.. ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. బాధితుల దుఖం మాటల్లో చెప్పలేనిది. కానీ వారు ఒంటరి వారు కాదు. వారి వెంట యావత్ దేశం ఉంది. క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుద్దాం. శాంతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది’’ అని పేర్కొంది.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రసారాలు భారత్లో బంద్ అయిపోయాయి. పాక్ బోర్డుకు చెందిన పీఎస్ఎల్ టోర్నీని భారత్లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్ కోడ్’ మొబైల్ స్ట్రీమింగ్ సంస్థ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్ ఘటన నేపథ్యంలో భారత్లో ఇకపై పీఎస్ఎల్ టోర్నీ ప్రసారం చేయమని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్లను ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫ్యాన్ కోడ్’ వెల్లడించింది. మరోవైపు పీఎస్ఎల్ టోర్నీ కోసం పాకిస్తాన్లో ఉండి మ్యాచ్ల ప్రసారానికి సంబంధించిన వేర్వేరు సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని ఆ దేశ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. భారత్కు చెందిన దాదాపు రెండు డజన్ల మంది పీఎస్ఎల్లో ఇంజినీర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, కెమెరామెన్లు, ప్లేయర్ ట్రాకింగ్ ఎక్స్పర్ట్లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల్లోగా వీరంతా దేశం వీడాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐమరోవైపు- టీమిండియా- పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లపై ఉన్న నిషేధం ఇక ముందు కూడా కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, పాక్ మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తినడంతో ఆ తర్వాత ఎలాంటి సిరీస్ను నిర్వహించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి. తాజాగా కశ్మీర్లోని పహల్గాంలో పాక్ తీవ్రవాదుల చేతుల్లో 26 మంది భారత పర్యాటకులు మరణించిన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్లపై మళ్లీ చర్చ మొదలైంది. ‘పాక్తో క్రికెట్ సిరీస్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారు చెప్పిందే మేం వింటాం. కాబట్టి ఇకపై కూడా పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అవకాశం లేదు.ఐసీసీతో ఒప్పందాల కారణంగానే వేర్వేరు టోర్నీల్లో ఆ జట్టుతో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన ఉన్న ఐసీసీ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఇకపై ఏదైనా ఐసీసీ టోర్నీ వచ్చినపుడు తగిన విధంగా స్పందిస్తాం’ అని రాజీవ్ శుక్లా వివరించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినా... టీమిండియా అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదిక దుబాయ్లోని అన్ని మ్యాచ్లు ఆడింది. పాక్ను లీగ్ దశలో ఓడించడం సహా టోర్నీ చాంపియన్గా నిలిచింది. చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
టీమిండియా దిగ్గజం బర్త్డే.. సారా టెండుల్కర్ పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 24). ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 52వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ (BCCI) ఈ లెజెండరీ బ్యాటర్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‘‘664 అంతర్జాతీయ మ్యాచ్లు.. 34,357 పరుగులు.. 201 అంతర్జాతీయ వికెట్లు.. 2011 వన్డే వరల్డ్కప్ విజేత.. కల్నల్ సీకే నాయుడు జీవనసాఫల్య పురస్కారం అందుకున్న విజేత..అంతర్జాతీయ క్రికెట్లో శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్.. దిగ్గజ, స్ఫూర్తిదాయక ఆటగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని ఎక్స్ వేదికగా విషెస్ చెప్పింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్ తదితరులు సచిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.హ్యాపీ బర్త్డే బాబాఇక సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తండ్రి బర్త్డే సందర్భంగా తాను అమూల్యంగా భావించే ఫొటోలను పంచుకుంది. అంతేకాదు తన తండ్రి గొప్పదనాన్ని వివరిస్తూ.. ‘‘ఎవరికీ భయపడొద్దు.. అయితే, ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని నేర్పించిన వ్యక్తికి...ఫ్రాక్చర్ అయిన తన భుజంపై నన్ను మోసుకువెళ్లిన దృఢమైన సారథికి.. నా ఫొటోషూట్లను మరింత ప్రత్యేకంగా మార్చే వ్యక్తికి.. అన్నిటికంటే ముఖ్యంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ నవ్వులతో ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పే వ్యక్తికి హ్యాపీ బర్త్డే బాబా’’ అంటూ సారా క్యాప్షన్ జత చేయగా.. ఆమె పోస్ట్ వైరల్గా మారింది.కాగా 1989లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన సచిన్ టెండుల్కర్ లిటిల్ మాస్టర్ నుంచి క్రికెట్ దేవుడిగా ఎదిగాడు. తన ఇరవై రెండేళ్ల కెరీర్లో లెక్కలు మిక్కిలి రికార్డులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్.. తన కెరీర్లో అంతర్జాతీయ స్థాయిలో ఏకైక టీ20 ఆడాడు.సచిన్ కెరీర్లో టాప్-9 రికార్డ్స్ ఇవే👉టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 15,921👉వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 18,426👉అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్- 463👉అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్- 200👉వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్👉అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్👉దేశవాళీ క్రికెట్లో ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ అరంగేట్రంలోనే శతక్కొట్టిన వీరుల జాబితాలో తొలి స్థానం👉టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్- 51👉వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్- 2278.చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం -
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది.పాకిస్తాన్తో ఇకపై కూడా..బీసీసీఐ తరఫున కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఈ మేరకు తమ స్పందన తెలియజేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘బాధిత కుటుంబాలకు మా మద్దతు. ఉగ్రవాదుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రభుత్వ నిర్ణయానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోము. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాం. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదు.అయితే, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడుతుంది. ప్రస్తుత పరిస్థితులను ఐసీసీ కూడా నిశితంగా గమనిస్తోంది’’ అని స్పోర్ట్స్తక్తో పేర్కొన్నారు.మాటలకు అందని విషాదంఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. ‘‘పహల్గామ్లో జరిగిన పాశవిక ఉగ్రదాడి కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.బీసీసీఐ తరఫున ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో వారంతా ధైర్యం కోల్పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో చోటు చేసుకున్న ఈ విషాదాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదు. మనమంతా వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు.బాధితులకు నివాళికాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్-2025లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ బాధితులకు నివాళి అర్పించింది. ఆటగాళ్లంతా నిమిషం పాటు మౌనం పాటించారు. అదే విధంగా చీర్లీడర్స్ ప్రదర్శనలు లేకుండా చూసుకున్నారు. బాణసంచా కూడా కాల్చలేదు.చివరగా 2008లోఇదిలా ఉంటే.. భారత జట్టు చివరగా 2008లో పాకిస్తాన్లో పర్యటించింది. అదే విధంగా పాక్ జట్టు 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు భారత్కు వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు రాగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికైన దుబాయ్లో రోహిత్ సేన తమ మ్యాచ్లు ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవగా.. ఆతిథ్య పాక్ జట్టు ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది.కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి దిగారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు.చదవండి: Pahalgam Incident: "గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు -
ఇక చాలు.. పాకిస్తాన్తో క్రికెట్ ఆడొద్దు: విరాట్ కోహ్లి ఫ్రెండ్
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ క్రీడా లోకం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. అందుకు బాధ్యలైన వారికి తగిన గుణపాఠం చెప్పాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి తీవ్రంగా స్పందించాడు. భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలను పూర్తిగా నిలిపివేయాలని అతడు బీసీసీఐకి లేఖకు రాశాడు. ఇందుకు సంబంధించిన లెటర్ను తన ఎక్స్ ఖాతాలో గోస్వామి పోస్ట్ చేశాడు."ఈ విషాదకర ఘటన సమయంలో నేను ఒక విషయం చెప్పాలనకుంటున్నాను. ఇకపై పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం మానేయాలి. ఇప్పుడే కాదు పాక్తో పూర్తిగా క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును పాకిస్తాన్కు పంపనందుకు ఆ దేశ మాజీ క్రికెటర్లు కొంతమంది ఏదో ఏదో మాట్లాడారు.ఆటను రాజకీయాలను కలపొద్దంటూ లేనిపోని మాటలు చెప్పారు. వారు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు. అమాయక భారతీయులను హత్య చేయడమే వారి జాతీయ క్రీడలా కనిపిస్తోంది. బ్యాట్లు, బంతులతో కాకుండా వారి బాషలోనే మనం కూడా సమాధానం చెప్పాలి" అని గోస్వామి తన నోట్లోపేర్కొన్నాడు. కాగా ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఐపీఎల్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన శ్రీవత్స్ గోస్వామి, ఆ తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లకు ప్రాతినిథ్యం వహించాడు. అదేవిధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో కలిసి భారత్ అండర్-19 జట్టుకు గోస్వామి ఆడాడు. -
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు (ఏప్రిల్ 23) ఐపీఎల్లో జరుగబోయే సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్కు ముందు ఓ నిమిషం మౌనం పాటించాలని నిర్ణయించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ నల్లటి బ్యాండ్లు ధరించాలని పిలుపునిచ్చింది. మ్యాచ్ సమయంలో బాణసంచా కాల్చకూడదని గైడ్ లైన్స్ జారీ చేసింది. మ్యాచ్ సందర్భంగా చీర్ లీడర్ల ప్రదర్శనలు ఉండవని స్పష్టం చేసింది.కాగా, కశ్మీర్లోని పహల్గామ్లో నిన్న (ఏప్రిల్ 22) మధ్యాహ్నం భయానమైన ఉగ్రవాద దాడి జరిగింది. పహల్గామ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు. 2019 పుల్వామా దాడి తర్వాత కశ్మీర్లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇదే. ఈ విషాద ఘటనతో దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. బీసీసీఐ సహా భారత క్రికెటర్లు బాధితులకు నివాళులర్పించి, సంతాపం తెలియజేశారు.ఇదిలా ఉంటే, ఇవాళ (ఏప్రిల్ 23) రాత్రి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తలపడటం ఇది రెండోసారి. ఏప్రిల్ 17న తమ హోం గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ముంబై హైదరాబాద్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్లో ఓడితే సన్రైజర్స్ అనధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించినట్లే. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కు కూడా కీలకమే. ఆ జట్టు కూడా ఈ మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ సీజన్లో సన్రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతుంది.నేటి మ్యాచ్ సన్రైజర్స్ తమ సొంత ఇలాకాలో ఆడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. తమ విధ్వంసకర ఆటగాళ్లు ఈ మ్యాచ్లో తప్పక చెలరేగుతారని సన్రైజర్స్ అభిమానులు ఆశిస్తున్నారు. సన్రైజర్స్కు హోం గ్రౌండ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ ఆడిన మ్యాచ్ల్లో ఆ జట్టు ఆటగాళ్లు పేట్రేగిపోయారు. నేటి మ్యాచ్లో అదే జోరు కొనసాగిస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. తుది జట్లు (అంచనా)సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (wk), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్ -
అందుకే రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్లో ఉన్నారు..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిన్న (ఏప్రిల్ 21) తమ సెంట్రల్ కాంట్రాక్ట్ (2024-25) ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడికి బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించాలంటే అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయ్యుండాలి. అయితే రోహిత్, విరాట్, జడేజా గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత పొట్టి క్రికెట్కు గుడ్బై చెప్పి కేవలం వన్డేలు, టెస్ట్ల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయినా వారికి ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించింది. దీనిపై నిన్నటి నుంచి క్రికెట్ అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా వారిని ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగిస్తున్నారని సోషల్మీడియా వేదికగా డిస్కషన్స్ నడిచాయి. ఈ అంశంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి తాజాగా స్పందించాడు.రోహిత్, విరాట్, జడేజా ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు కానప్పటికీ ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారన్న విషయంపై వివరణ ఇచ్చాడు. 2024-25 సంవత్సరాని గానూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధి అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉంటుంది. అయితే దీని అసెస్మెంట్ సంవత్సరం మాత్రం అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2024 మధ్యలో ఉంటుంది. ఆ వ్యవధిలో కోహ్లీ, రోహిత్ , జడేజా అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులుగా ఉన్నారు. జూన్ 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ముగ్గురు టీ20ల నుంచి తప్పుకున్నారు. ఈ సాంకేతికత ప్రకారం.. రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.ఇదిలా ఉంటే, నిన్న ప్రకటించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో మొత్తం 34 మంది చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.ఈ ఏడాది కొత్తగా ఏడుగురు (ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా) సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించకున్నారు. శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ తమ కాంట్రాక్ట్ను కోల్పోయారు. రిషబ్ పంత్కు బి నుంచి ఏ కేటగిరీకి ప్రమోషన్ లభించింది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు.ఏ ప్లస్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది. -
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లు ప్రకటన
-
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్, ఇషాన్.. కొత్తగా నితీశ్కు చోటు
2024-25 సంవత్సరానికి గానూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను (34 మంది) విడుదల చేసింది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.🚨 𝗡𝗘𝗪𝗦 🚨BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Men)#TeamIndiaDetails 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho— BCCI (@BCCI) April 21, 2025సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్ కింద విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్ఈ ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్ అశ్విన్ (కేటగిర ఏ నుంచి ఔట్) -
శుబ్మన్ గిల్కు భారీ షాక్!
గెలుపు సంబరంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా.. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు శిక్ష విధించింది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ గిల్కు జరిమానా విధించినట్లు తెలిపింది. ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో అతడు మొదటిసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు రూ. 12 లక్షలతో సరిపెట్టినట్లు పేర్కొంది.ఢిల్లీ భారీ స్కోరుకాగా ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్లు), అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. జోస్ ది బాస్.. దంచేశాడులక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ దంచికొట్టాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కేవలం 54 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.మరోవైపు.. బట్లర్కు తోడుగా షెర్ఫానే రూథర్ఫర్డ్ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్లు) కూడా రాణించాడు. ఆఖర్లో తెవాటియా మూడు బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి బట్లర్తో కలిసి గుజరాత్ను గెలుపుతీరాలకు చేర్చాడు. THE CELEBRATION FROM JOS BUTTLER. - Buttler was on 97*, but the happiness after Tewatia finished the match. 👏❤️ pic.twitter.com/31z4tWPJmL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2025 ఢిల్లీ విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ఈ సీజన్లో ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది.ఐపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ఢిల్లీ👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: గుజరాత్.. మొదట బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 203/8 (20)👉గుజరాత్ స్కోరు: 204/3 (19.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై గుజరాత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్ (గుజరాత్- 54 బంతుల్లో 97 నాటౌట్).చదవండి: IPL 2025: గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్ -
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
ఫిక్సింగ్కు యత్నించిన గుర్మీత్ సింగ్ భమ్రా అనే వ్యక్తిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిషేధం విధించింది. భమ్రా ముంబై టీ20 లీగ్లో సొబో సూపర్ సానిక్స్ అనే ఫ్రాంచైజీ కలిగి ఉన్నాడు. ఐదేళ్ల క్రితం అతడు ఆ లీగ్లో ఫిక్సింగ్కు యత్నించినట్లు తేలడంతో బోర్డు అంబుడ్స్మన్ రిటైర్డ్ జస్టిస్ అరుణ్ మిశ్రా నిషేధం విధించారు. అయితే, భమ్రాపై ఐదేళ్లా లేదంటే జీవితకాల నిషేధమా అనేది తెలియాల్సి ఉంది. కాగా 2019 సీజన్లో సొబో సూపర్ సానిక్స్ ప్లేయర్లు ధవళ్ కులకర్ణి, భవిన్ ఠక్కర్లతో ఫిక్సింగ్ కోసం సంప్రదింపులు జరిపారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కులకర్ణి సహా ఠక్కర్లు ఫిక్సింగ్కు నిరాకరించారు. తదనంతరం ఈ విషయాన్ని బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు తెలిపారు. సోనూ వాసన్ అనే వ్యక్తి ద్వారా గుర్మీత్ సింగ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు చేశారు. సోనూ వాసన్ డబ్బు ఆశ చూపినా భవిన్ తలొగ్గలేదు. ఇద్దరు ఫిక్సింగ్కు ససేమిరా అనడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. విచారణలో గుర్మీత్ దోషి అని తేలడంతో శిక్ష ఖరారు చేశారు.ఇక భమ్రా జీటీ20 కెనడా లీగ్ (ప్రస్తుతం మనుగడలో లేదు)లోనూ భాగమయ్యాడు. కాగా కోవిడ్కు ముందు అతడు ముంబై టీ20 లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్గా ఉండగా.. ప్రస్తుతం అతడిని లీగ్ నుంచి తొలగించారు.ఐపీఎల్లోనూ ఫిక్సింగ్ కలకలంకాగా ఐపీఎల్-2025లోనూ ఫిక్సింగ్కు అవకాశముందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీసీసీఐ జట్ల యజమానులు, ఆటగాళ్లు, సిబ్బందికి కీలక సూచనలు చేసింది.హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త గట్టిగానే ఫిక్సింగ్ యత్నాలు చేస్తున్నాడని.. ఆ వ్యక్తి గనుక సంప్రదిస్తే వెంటనే అవినీతి నిరోధక భద్రతా విభాగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఖరీదైన బహుమతుల పేరిట వల వేసే అవకాశం ఉందని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సదరు వ్యాపారవేత్త గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని.. అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ అతడు ఏ రకంగానైనా సంప్రదింపులు జరపాలని చూస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ఆటగాళ్లను అప్రమత్తం చేసింది.చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్గా -
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
సీనియర్ ఆటగాళ్లతో సఖ్యత లేకపోవడమే టీమిండియా కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar)పై వేటుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. డ్రెసింగ్రూమ్లో నాయర్ వ్యవహారశైలి పట్ల జట్టులోని కీలక సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని.. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే బీసీసీఐ (BCCI)అతడిని తప్పించిందని తెలుస్తోంది. కాగా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందికి సంబంధించి బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీమ్ అసిస్టెంట్ కోచ్గా ఉన్న అభిషేక్ నాయర్పై వేటు వేసింది. ఎనిమిది నెలల క్రితమే బాధ్యతలు తీసుకున్న నాయర్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బోర్డు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల తర్వాతస్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో 0–3తో ఓటమి, ఆపై ఆస్ట్రేలియా గడ్డపై 1–3తో సిరీస్ కోల్పోయిన తర్వాత జనవరిలో బీసీసీఐ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించింది.ఇందులో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్తో పాటు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే కోచింగ్ బృందంలో ఎవరి పైనైనా చర్యలు ఉండవచ్చని అర్థమైంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అభిషేక్ నాయర్ను బోర్డు తప్పించింది. హెడ్ కోచ్గా గంభీర్ కాంట్రాక్ట్ను 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఖాయం చేసిన బీసీసీఐ... నాయర్ను నియమించినప్పుడు అతని పదవీ కాలం విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు.కొటక్ ఎంపికతోనే... 2024 ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు కోసం గంభీర్, అభిషేక్ నాయర్ కలిసి పని చేశారు. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. గంభీర్ హెడ్ కోచ్గా ఎంపికయ్యాక ఎలాంటి దరఖాస్తులు, ఇంటర్వ్యూలు లేకుండా తనకు నచ్చిన వారిని ఎంచుకునేందుకు బోర్డు అవకాశం ఇచ్చింది. రోహిత్ శర్మకు మంచి స్నేహితుడుఈ క్రమంలో నాయర్ను అతను అసిస్టెంట్ కోచ్గా తీసుకున్నాడు. రోహిత్ శర్మకు మంచి స్నేహితుడైన నాయర్... అటు కెప్టెన్, ఇటు కోచ్గా మధ్య మంచి సంధానకర్తగా కూడా పని చేయగలడని భావించడం కూడా అతని ఎంపికకు మరో కారణం.భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన ముంబై ఆల్రౌండర్ నాయర్కు దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డుంది. అధికారికంగా ఏ జట్టుకు కోచ్గా పని చేయకపోయినా కూడా వ్యక్తిగతంగా ఎంతో మంది బ్యాటర్ల ఆటను మెరుగుపర్చడంలో అతని పాత్ర చాలా ఉంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వెంకటేశ్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రఘువంశీ ఇదే మాట చెప్పారు.అపుడే నాయర్ భవిష్యత్తుపై సందేహాలునిజానికి చాంపియన్స్ ట్రోఫీకి అప్పటికే ఉన్న సహాయక సిబ్బందితో పాటు అదనంగా మరో అసిస్టెంట్ కోచ్ సితాన్షు కొటక్ను పంపడంతోనే నాయర్ భవిష్యత్తుపై సందేహాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. మరోవైపు ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్కు చెందిన టి.దిలీప్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్లను కూడా తప్పిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. పని తీరు గురించి కాకుండా వీరి పదవీకాలం ముగియడమే కారణమని తెలుస్తోంది. బోర్డు కొత్త నిబంధనల (ఎస్ఓపీ) ప్రకారం సహాయక సిబ్బంది పదవీకాలం గరిష్టంగా మూడేళ్లే ఉండాలి. గంభీర్ ఏమాత్రం వ్యతిరేకించలేదుఇదిలా ఉంటే.. పట్టుబట్టి మరీ అభిషేక్ నాయర్ను తన సహాయక సిబ్బందిలో చేర్చుకున్న గంభీర్.. అతడిని తప్పించే సమయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘నాయర్పై వేటు వేయడాన్ని గంభీర్ ఏమాత్రం వ్యతిరేకించలేదు.డష్కాటే, మోర్నీ మోర్కెల్ను తన సిబ్బందిలో చేర్చుకునేందుకు గంభీర్ బోర్డుతో ఎన్నో సంప్రదింపులు జరిపాడు. అనేక చర్చల తర్వాతే వారిని సిబ్బందిలో చేర్చుకునే అవకాశం వచ్చింది. వారిని వదులుకునేందుకు మాత్రం అతడు సిద్ధంగా లేడు. అయితే, అభిషేక్ నాయర్ విషయం మాత్రం వేరు’’ అని పేర్కొన్నాయి.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
నలుగురు కోచింగ్ స్టాఫ్ పై బీసీసీఐ వేటు
-
బీసీసీఐ కీలక నిర్ణయం.. అభిషేక్ నాయర్, దిలీప్లపై వేటు!?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాప్లో మార్పులు జరగనున్నాయా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్ స్టాఫ్లో భాగమైన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది.బ్యాటింగ్ కోచ్గా ఇప్పటికే సితాన్షు కోటక్ ఉండగా అభిషేక్ అవసరం లేదన్న భావనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లో బ్యాటింగ్ యూనిట్ ఘోరంగా విఫలమైంది.ఈ క్రమంలోనే బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించిన నాయర్కు ఉద్వాసన పలకాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించకున్నట్లు దైనిక్ జాగరణ్ తెలిపింది. అదేవిధంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ స్దానంలో మరో సహాయక కోచ్ ర్యాన్ డస్కటే బాధ్యతలు నిర్వర్తించే అవకాశమున్నట్టు సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎటవంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్ భారత కొత్త హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నాయర్, ర్యాన్ డస్కటే, మోర్నే మోర్కెల్లను సపోర్ట్ స్టాప్లోకి తీసుకువచ్చాడు. అయితే ఈ కోచింగ్ స్టాప్లో ఆధ్వర్యంలో భారత క్రికెట్ జట్టు వరుసగా ఘోర పరాభావాలు ఎదురయ్యాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్, ఆస్ట్రేలియాతో బీజీటీని భారత్ కోల్పోయింది. దీంతో కోచింగ్ స్టాప్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో గంభీర్ అండ్ కో కాస్త ఉపశమనం పొందారు. కానీ బీసీసీఐ మాత్రం కోచింగ్ స్టాప్ను కుదించాలని పట్టుదలతో ఉంది.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్ -
మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్కు బీసీసీఐ అలెర్ట్?
ఐపీఎల్-2025కు మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు పొంచి ఉందా? అంటే అవునానే అంటుంది భారత క్రికెట్ బోర్డు. తాజాగా ఐపీఎల్లో మొత్తం పది జట్లకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లు అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ సూచించినట్లు క్రిక్బజ్ పేర్కొంది.క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలు ఉన్నట్లు బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ACSU) గుర్తించినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇటీవలి కాలంలో చాలా మంది ప్లేయర్లు, కోచ్లతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు క్రిక్బజ్ తెలిపింది.డబ్బే కాకుండా విలువైన వస్తువులు గిప్ట్లు ఎరగా వేస్తాడని క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. ఈ క్రమంలోనే అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని బీసీసీఐ సూచించింది. కాగా ఐపీఎల్-2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ వంటి జట్లు దూసుకుపోతుంటే.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి టాప్ జట్లు తడబడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IND vs ENG: టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ? -
బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది ఆగస్ట్లో భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 15) ప్రకటించింది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ఆగస్ట్ 17న వన్డే సిరీస్.. 26న టీ20 సిరీస్ మొదలవుతాయి.వన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే – ఆదివారం, ఆగస్టు 17, మిర్పూర్రెండో వన్డే – బుధవారం, ఆగస్టు 20, మిర్పూర్మూడో వన్డే – శనివారం, ఆగస్టు 23, చట్టోగ్రామ్టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి T20I – మంగళవారం, ఆగస్టు 26, చట్టోగ్రామ్లరెండో T20I – శుక్రవారం, ఆగస్టు 29, మిర్పూర్లమూడు T20I – ఆదివారం, ఆగస్టు 31, మిర్పూర్కాగా, భారత క్రికెటర్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ మే 25న ముగుస్తుంది. అనంతరం భారత్ జూన్లో ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది.ఇంగ్లండ్లో భారత పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- జూన్ 20-24రెండో టెస్ట్- జులై 2-6మూడో టెస్ట్- జులై 10-14నాలుగో టెస్ట్- జులై 23-27ఐదో టెస్ట్- జులై 31-ఆగస్ట్ 3ఈ సిరీస్ తర్వాతే భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరుతుంది.అనంతరం భారత జట్టు సెప్టెంబర్ నెలంతా ఖాళీగా ఉండి అక్టోబర్ 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది.వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్..తొలి టెస్ట్- అక్టోబర్ 2-6 (అహ్మదాబాద్)రెండో టెస్ట్- అక్టోబర్ 10-14 (కోల్కతా)ఈ సిరీస్ తర్వాత భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్బోర్న్నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్ స్వదేశంలో సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. భారత్లో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- నవంబర్ 14-18 (న్యూఢిల్లీ) రెండో టెస్ట్- నవంబర్ 22-26 (గౌహతి)తొలి వన్డే- నవంబర్ 30 (రాంచీ)రెండో వన్డే- డిసెంబర్ 3 (రాయ్పూర్)మూడో వన్డే- డిసెంబర్ 6 (వైజాగ్)తొలి టీ20- డిసెంబర్ 9 (కటక్)రెండో టీ20- డిసెంబర్ 11 (ఛండీఘడ్)మూడో టీ20- డిసెంబర్ 14 (ధర్మశాల)నాలుగో టీ20- డిసెంబర్ 17 (లక్నో)ఐదో టీ20- డిసెంబర్ 19 (అహ్మదాబాద్) -
ఐపీఎల్తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఐపీఎల్తో పోటీ పడి పాకిస్తాన్ సూపర్ లీగ్ను నిర్వహిస్తున్న పాక్ క్రికెట్ బోర్డుకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఐపీఎల్ కంటే తమ లీగే గొప్ప అని గప్పాలు కొట్టుకునే పీసీబీ, ఈ సారి పీఎస్ఎల్కు వస్తున్న ఆదరణ చూసి విస్తుపోతుంది. ఐపీఎల్తో సమాంతరంగా జరుగుతుండటంతో పీఎస్ఎల్ మ్యాచ్లు చూసేందుకు జనాలు రావడం లేదు. స్వదేశంలోనే పీఎస్ఎల్కు ఆదరణ తక్కువ కావడం చూసి పీసీబీ అధికారులు అవాక్కవుతున్నారు. ఐపీఎల్తో పోటీ పడి తప్పు చేశామని లీగ్ ప్రారంభంలోనే వారు తెలుసుకున్నారు.కొద్ది రోజుల క్రితం హసన్ అలీ చెప్పినట్లు.. మంచి క్రికెట్ ఆడుతున్నా పాక్ అభిమానులు పీఎస్ఎల్ను పట్టించుకోవడం లేదు. లీగ్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) హోరాహోరీ మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్లో ముల్తాన్ ఇన్నింగ్స్లో మహ్మద్ రిజ్వాన్.. ఛేదనలో జేమ్స్ విన్స్ విధ్వంసకర శతకాలు బాదారు.ఈ మ్యాచ్కు ముందు నిన్న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ 80 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆతర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ 136 పరుగులకే కుప్పకూలింది. గ్లాడియేటర్స్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ ఆమిర్ పెషావర్ పతనాన్ని శాశించారు.ఇలా, ఒకే రోజు రెండు రసవత్తర మ్యాచ్లు జరిగినా పాక్ అభిమానులు పీఎస్ఎల్వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ రెండు మ్యాచ్లు జరిగిన స్టేడియాలు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. రాత్రి జరిగిన ముల్తాన్, కరాచీ మ్యాచ్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉండింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు పట్టుమని 10 వేల మంది కూడా రాలేదు. పాక్ మీడియా ప్రకారం.. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన జనం కంటే స్టేడియంలో సెక్యూరిటి గార్డులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు 5000 మంది స్టేడియానికి రాగా.. అక్కడ సెక్యూరిటి సిబ్బంది 6700 మంది ఉన్నారట. ఈ లెక్కలు చూస్తే చాలు పీఎస్ఎల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పవచ్చు.ఇలాంటి లీగ్ ఐపీఎల్కు పోటీ అని పాక్ క్రికెట్ బోర్డు గొప్పలు చెప్పుకోవడం చూసి క్రికెట్ అభిమానులు నవ్విపోతున్నారు. పీఎస్ఎల్కు ఐపీఎల్తో పోలికే లేదని అంటున్నారు. ఐపీఎల్లో ఓ మ్యాచ్ జరిగితే వేలు, కొన్ని సార్లు లక్షల సంఖ్యలో జనాలు వస్తారు. టీవీల్లో, ఇతర మాధ్యమాల్లో మ్యాచ్లు వీక్షించే వారి సంఖ్య లెక్కలేనంతగా ఉంటుంది. కేవలం భారత్లోనే కాకుండా విదేశాల్లోనూ ఐపీఎల్ను అత్యధిక సంఖ్యలో వీక్షిస్తారు. విదేశాల్లో వారి సొంత దేశ ఆటగాళ్ల కంటే భారత ఆటగాళ్లకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. 2008 నుంచి ప్రతి సీజన్లో విజయవంతమైన ఐపీఎల్ను చూసి ఓర్వలేని పాక్.. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్తో సమాంతరంగా పీఎస్ఎల్ను నిర్వహించి చేతులు కాల్చుకుంది. -
BCCI: హై పెర్ఫార్మెన్స్ శిబిరానికి త్రిష, ధృతి
సాక్షి, హైదరాబాద్: అండర్–19 స్థాయిలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న తెలంగాణ ప్లేయర్లు గొంగడి త్రిష (Gongadi Trisha), కేసరి ధృతి (Kesari Drithi)కి హై పెర్ఫార్మెన్స్ క్యాంప్ నుంచి పిలుపు వచ్చింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ నెల 21 నుంచి మే 15 వరకు బీసీసీఐ అండర్–19 మహిళల హై పెర్ఫార్మెన్స్ క్యాంప్ జరగనుంది. దీని కోసం ఆలిండియా మహిళల సెలెక్షన్ కమిటీ తెలంగాణ నుంచి త్రిష, ధృతిని ఎంపిక చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా త్రిష ఈ ఏడాది ఆరంభంలో మలేసియా వేదికగా జరిగిన ఐసీసీ మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్లో వీరిద్దరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఓపెనర్గా బరిలోకి దిగి 309 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్గా నిలిచిన త్రిష 7 వికెట్లు సైతం పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకుంది.ఇక ధృతి వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యురాలైనా... ఆమెకు తుది జట్టులో చోటు దక్కలేదు. హై పెర్ఫార్మెన్స్ క్యాంప్లో ప్లేయర్ల నైపుణ్యాలను పెంపొదించడంతో పాటు... ఫిట్నెస్ను మరింత మెరుగు పర్చనున్నారు. దీని కోసం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ప్రత్యేక ప్రోగ్రామ్ను సిద్ధం చేశారు. ఇదీ చదవండి: నిగార్ సుల్తానా సూపర్ సెంచరీ లాహోర్: కెప్టెన్ నిగార్ సుల్తానా (80 బంతుల్లో 101; 15 ఫోర్లు, 1 సిక్స్) ‘శత’క్కొట్టడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు బోణీ కొట్టింది. గురువారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ మహిళల జట్టు 178 పరుగుల తేడాతో థాయ్లాండ్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.వన్డేల్లో బంగ్లాదేశ్ జట్టుకిదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నిగార్ సుల్తానా ధనాధన్ షాట్లతో సెంచరీ పూర్తి చేసుకోగా... షర్మిన్ అక్తర్ (126 బంతుల్లో 94 నాటౌట్; 11 ఫోర్లు) శతకానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫర్జానా హక్ (53) అర్ధశతకంతో రాణించింది. ధాయ్లాండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న బంగ్లాదేశ్ బ్యాటర్లు జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం లక్ష్యఛేదనలో థాయ్లాండ్ జట్టు 28.5 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. చునిడా సుతిరాంగ్ (22) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహీమ, జన్నతుల్ ఫిర్దోస్ చెరో 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. తదుపరి మ్యాచ్లో ఆదివారం ఐర్లాండ్తో బంగ్లాదేశ్ జట్టు తలపడుతుంది. -
ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అండగా నిలిచాడు. రాఠీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వ్యవహరిస్తున్న తీరు సరికాదని విమర్శించాడు. కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్ను ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో లక్నో రూ. 30 లక్షల ధరకు కొనుగోలు చేసింది.25 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్పై నమ్మకంతో సీజన్లో తమ తొలి మ్యాచ్లోనే తుదిజట్టులో అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రంలోనే దిగ్వేశ్ రెండు వికెట్లు తీసి మేనేజ్మెంట్ అంచనాలు నిజం చేశాడు.‘నోట్బుక్’ సంబరాలుఆ తర్వాత కూడా రాణించిన దిగ్వేశ్ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు వైరల్ అయింది. బ్యాటర్ను అవుట్ చేయగానే.. అతడి దగ్గరికి వెళ్లి నోట్బుక్లో వికెట్ నంబర్ రాసుకుంటున్నట్లుగా కాస్త అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ పాలక మండలి.. ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ జరిమానా విధించింది.మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. ఇక ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా కూడా దిగ్వేశ్ రాఠీ మరోసారి ఇదే రీతిలో వికెట్ తీసిన సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఈసారి మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధించడంతో పాటు మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది. మూడోసారి ఇది రిపీట్ అయితే.. మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పచ్చిక మీద సంతకంఈ నేపథ్యంలో తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో మాత్రం దిగ్వేశ్ తన శైలిని మార్చుకున్నాడు. గత రెండు మ్యాచ్ల్లో వికెట్ తీసిన అనంతరం ‘నోట్ బుక్’ సంబరాలతో జరిమానా ఎదుర్కొన్న అతడు.. ఈ మ్యాచ్లో తన ఆరాధ్య ప్లేయర్ సునీల్ నరైన్ వికెట్ తీసిన అనంతరం భిన్నంగా సంబరాలు జరుపుకొన్నాడు. ఏడో ఓవర్ రెండో బంతికి నరైన్ను అవుట్ చేసిన అనంతరం నేల మీద కూర్చొని పచ్చిక మీద సంతకం పెట్టాడు.Apne idol ka hi chalaan kaat diya 😌😂 pic.twitter.com/HuoxZJj1DX— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2025ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?ఈ పరిణామాలపై కామెంటేటర్ సైమన్ డౌల్ స్పందించాడు. ‘‘ఇలాంటి జరిమానాలను జట్టు యాజమాన్యం కడుతుంది. నాకైతే ఇదేమీ నచ్చడం లేదు. నిజానికి అతడు సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు చూసి నాకు ముచ్చటేసింది. అసలు అతడు చేసిన తప్పేంటి?ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?భారత క్రికెటర్లలో చాలా మంది సీనియర్లు ఇంతకంటే అధ్వానంగా సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్లకు మాత్రం ఎప్పుడూ జరిమానా వేయలేదు. కానీ ఈ యువ ఆటగాడి పట్ల మాత్రం ఎందుకు ఈ వివక్ష?.. నోట్బుక్ సంబరాలను తప్పుపట్టడం ఎంత మాత్రం సరికాదు’’ అని డౌల్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్న దిగ్వేశ్ సింగ్ రాఠీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు.. లక్నో జట్టు ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్లలో మూడు గెలిచింది.చదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్ -
బుమ్రా... మరికొన్ని రోజుల తర్వాతే...
ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు లభించేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటన నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో చికిత్స తీసుకుంటున్నాడు. వేగంగా కోలుకుంటున్న బుమ్రా ఐపీఎల్లో కనీసం మరో రెండు మ్యాచ్లు ముంబై జట్టుకు దూరంగా ఉండనున్నాడు.బుమ్రాకు పూర్తిస్థాయి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత... బీసీసీఐ మెడికల్ టీమ్ బుమ్రా ఫిట్నెస్పై సంతృప్తి వ్యక్తం చేస్తేనే అతను ఐపీఎల్లో ఆడతాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలని బుమ్రా భావిస్తున్నాడు. వచ్చే జూన్లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్లో భారత్ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో బుమ్రా పునరాగమనంపై తొందరపడకూడదని బీసీసీఐ భావిస్తోంది. ముంబై తరఫున బుమ్రా ఆడలేకపోతుండటంతో... సత్యనారాయణ రాజు, విఘ్నేశ్, అశ్వని కుమార్లాంటి యువ ఆటగాళ్లకు ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది -
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టి షాకిచ్చింది. వికెట్ తీసిన సంబరంలో ‘అతి’ చేసినందుకు గానూ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత వేయడంతో పాటు.. అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను జత చేసింది. అసలేం జరిగిందంటే..ఐపీఎల్-2025లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో మ్యాచ్ ఆడింది. ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. ఐడెన్ మార్క్రమ్ (18 బంతుల్లో 28), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44), ఆయుశ్ బదోని (33 బంతుల్లో 41), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27) రాణించారు.అర్ష్దీప్ సింగ్కు మూడు వికెట్లుఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో మెరవగా.. లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ప్రియాన్ష్ ఆర్య విఫలంఇక లక్ష్య ఛేదన మొదలుపెట్టిన కాసేపటికే పంజాబ్.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ కోల్పోయింది. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ అవుట్సైడ్ ఆఫ్ దిశగా.. సంధించిన షార్ట్ బంతిని ఆడే క్రమంలో బ్యాట్ టాప్ ఎడ్జ్కు తగిలింది. అయితే, షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచిన బంతిని.. మిడాన్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన ఫీల్డర్ శార్దూల్ ఠాకూర్ ఒడిసిపట్టాడు.రాఠీ ‘ఓవరాక్షన్’ఈ క్రమంలో మొత్తంగా తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అయితే, అతడు క్రీజు వీడుతున్న సమయంలో దగ్గరికి పరిగెత్తుకు వచ్చిన దిగ్వేశ్ రాఠీ ‘ఓవరాక్షన్’ చేశాడు. పుస్తకంలో అతడి పేరును రాసుకుంటున్నట్లుగా వికెట్ తీసిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.#DigveshRathi provides the breakthrough as #PriyanshArya heads back!P.S: Don't miss the celebration at the end! 👀✍🏻Watch LIVE action of #LSGvPBKS ➡ https://t.co/GLxHRDQajv#IPLOnJiostar | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! | #IndianPossibleLeague pic.twitter.com/TAhHDtXX8n— Star Sports (@StarSportsIndia) April 1, 2025 ఈ నేపథ్యంలో దిగ్వేశ్ రాఠీ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ పాలక మండలి అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ మీడియా అడ్వైజరీ కమిటీ ప్రకటన విడుదల చేసింది. జరిమానా‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5లో గల లెవల్ 1 నిబంధనను దిగ్వేశ్ రాఠీ అతిక్రమించాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం ప్రకారం అతడిపై చర్యలు తీసుకున్నాం’’ అని పేర్కొంది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ జతచేసినట్లు వెల్లడించింది.కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్ సింగ్ రాఠీ ఈ ఏడాదే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం వేదికగా ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ స్పిన్నర్ తొలి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు మొత్తంగా మూడు మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు.పంజాబ్ ఘన విజయంఇక మ్యాచ్ విషయానికొస్తే.. ప్రియాన్ష్ ఆర్య వికెట్ తీసిన ఆనందం లక్నోకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69) అర్ధ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43) ధనాధన్ దంచికొట్టి అజేయంగా ఇన్నింగ్స్తో.. జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.చదవండి: రూ. 27 కోట్లు దండుగ!.. పంత్కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా! -
BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు చోటు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల మహిళల సీనియర్ జట్టుకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. అయితే, పురుషుల సీనియర్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కాస్త జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బీసీసీఐ ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్తో శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజించి వార్షిక వేతనాలు అందచేస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లిల కొనసాగింపు!కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ గ్రేడ్ అయిన A+లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కేవలం వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి వీరిని A+ గ్రేడ్ నుంచి తప్పించాలని బోర్డు నిర్ణయించినట్లు గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురితో పాటు బుమ్రాను A+ గ్రేడ్లోనే కొనసాగించనున్నారు.అంతేకాదు..టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు ఈసారి ప్రమోషన్ దక్కనుంది. B గ్రేడ్ నుంచి అతడిని A గ్రేడ్కు ప్రమోట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఈ జాబితాలో చేరనున్నాడు.అంతేకాదు.. టాప్ గ్రేడ్లో అతడిని చేర్చేందుకు బీసీసీఐ నాయకత్వ బృందం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత టాప్ రన్ స్కోరర్గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ఈ మేర రిటర్న్గిఫ్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రేయస్ మాదిరి అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.టాప్ క్లాస్లో అతడి పేరుఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ తిరిగి వార్షిక కాంట్రాక్టు దక్కించుకోబోతున్నాడు. అది కూడా టాప్ క్లాస్లో అతడి పేరు చేరనుంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’’ అని పేర్కొన్నాయి.తొలిసారి వీళ్లకు చోటుఇక ఈసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే.. ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున మూడు టెస్టులు లేదంటే.. ఎనిమిది వన్డేలు.. లేదా పది అంతర్జాతీయ టీ20లు ఆడి ఉండాలి. తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్టు ఇస్తుంది.ఇక బీసీసీఐ A+ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.గతేడాది కాలానికి (2023-24) గానూ బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాగ్రేడ్- A+: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాగ్రేడ్- A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యాగ్రేడ్- B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్గ్రేడ్- C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్,రజత్ పాటిదార్. -
ఇంగ్లండ్ లయన్స్తో భారత్ ‘ఎ’ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు
న్యూఢిల్లీ: ఐపీఎల్ అనంతరం జరగనున్న ఇంగ్లండ్ పర్యటనకు బీసీసీఐ ప్రత్యేక ప్రణాళికలు వేస్తోంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్తో టీమిండియా 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. 2007 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలవలేదు. దీంతో ఈసారి మెరుగైన ఫలితం సాధించాలనే ఉద్దేశంతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత ‘ఎ’ టీమ్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనుంది. ఎర్రబంతితో నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ మ్యాచ్ల్లో ప్రధాన ఆటగాళ్లు కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి హెడింగ్లే వేదికగా తొలి టెస్టు జరగనుంది. దానికంటే ముందే భారత ‘ఎ’ జట్టు ఇంగ్లండ్లో పర్యటించనుంది. ‘ఇంగ్లండ్ లయన్స్, భారత్ ‘ఎ’ జట్ల మధ్య మే 30న కాంటర్బరీలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. జూన్ 6 నుంచి నార్తంప్టన్లో రెండో మ్యాచ్ నిర్వహిస్తాం’ అని ఇంగ్లండ్, వెల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లంతా ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. మే 25 ఐపీఎల్ ఫైనల్ జరగనుండగా... ఆ తర్వాతే ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది. కరుణ్ నాయర్కు పిలుపు.. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ను భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఇంగ్లండ్కు పంపాలని బీసీసీఐ భావిస్తోంది. విదర్భ జట్టు రంజీ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన కరుణ్ నాయర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ‘జట్టును ప్రకటించేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్కు ముందు ఆటగాళ్ల ఎంపికపై ఒక స్పష్టత వస్తుంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ‘వైట్ వాష్’కు గురైన టీమిండియా... ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లోనూ ఓటమి పాలైంది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్ పర్యటనతో టీమిండియా 2025–27 డబ్ల్యూటీసీ సైకిల్ను ప్రారంభించనుంది. -
అరుంధతి రెడ్డి తొలిసారి...
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్ (2024–25)ల జాబితాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మొత్తం 16 మంది ప్లేయర్లను ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్లుగా విభజించి బోర్డు కాంట్రాక్ట్లు అందించింది. గత సీజన్లో ఈ జాబితాలో 17 మంది ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 16కు తగ్గింది. 2022 అక్టోబర్ తర్వాత భారత జట్టుకు ఆడని ఆంధ్ర ఓపెనింగ్ బ్యాటర్ సబ్బినేని మేఘన, 2023 జనవరి తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించని ఆంధ్ర లెఫ్టార్మ్ పేస్ బౌలర్ అంజలి శర్వాణిలకు కొత్త కాంట్రాక్ట్ జాబితాలో స్థానం లభించలేదు. హైదరాబాద్కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డికి తొలిసారి ఈ అవకాశం దక్కింది. అరుంధతి భారత్ తరఫున 5 వన్డేలు, 33 టి20 మ్యాచ్లు ఆడింది. ఆరుగురు ప్లేయర్లను కాంట్రాక్ట్ నుంచి తొలగించి ఐదుగురిని కొత్తగా ఎంపిక చేశారు. అనూహ్యాలేమీ లేకుండా టాప్ ప్లేయర్లు కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్, ఓపెనర్ స్మృతి మంధాన, ఆల్రౌండర్ దీప్తి శర్మలు ‘ఎ’ గ్రేడ్లోనే కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయినా... షఫాలీ వర్మ తన ‘బి’ గ్రేడ్ కాంట్రాక్ట్ను నిలబెట్టుకోవడం విశేషం. హెడ్ కోచ్ అమోల్ మజుందార్, సెలక్షన్ కమిటీ చైర్మన్ నీతూ డేవిడ్ సిఫారసు ప్రకారం బోర్డు ఈ కాంట్రాక్ట్లను అందించింది. భారత క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితా గ్రేడ్ ‘ఎ’ (ఏడాదికి రూ. 50 లక్షలు): హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ. గ్రేడ్ ‘బి’ (ఏడాదికి రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ. గ్రేడ్ ‘సి’ (ఏడాదికి రూ. 10 లక్షలు): యస్తిక భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్. -
BCCI: వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. వాళ్లపై వేటు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్టుల జాబితా విడుదల చేసింది. 2024-25 ఏడాదికి గానూ గ్రేడ్-ఎ, బి, సిలలో చోటు దక్కించుకున్న ప్లేయర్ల పేర్లను సోమవారం వెల్లడించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana), ఆల్రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్-‘ఎ’లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.మరోవైపు.. రేణుకా ఠాకూర్ (Renuka Thakur), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ గ్రేడ్-‘బి’లో స్థానం పదిలం చేసుకున్నారు. అయితే, బౌలర్ రాజేశ్వర్ గైక్వాడ్కు మాత్రం ఈసారి ఈ జాబితాలో చోటు దక్కలేదు.వాళ్లపై వేటు.. వీరికి తొలిసారి చోటుఇక గ్రేడ్-‘సి’లో ఉన్న హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, దేవికా వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలపై బీసీసీఐ ఈసారి వేటు వేసింది. వర్ధమాన స్టార్లు శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్జ్యోత్ కౌర్, ఉమా ఛెత్రిలకు తొలిసారిగా, గ్రేడ్-‘సి’లో చోటు ఇచ్చింది.ఈ మేరకు.. ‘‘టీమిండియా సీనియర్ వుమెన్ జట్టుకు సంబంధించి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది. 2024-2025 సీజన్ (అక్టోబరు 1, 2024-సెప్టెంబరు 30, 2025)గానూ వివరాలు వెల్లడించడమైనది’’ అని బీసీసీఐ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సమీప భవిష్యత్తులో ప్రకటించంఅయితే, పురుషుల సీనియర్ జట్టుకు సంబంధించి సమీప భవిష్యత్తులో వార్షిక కాంట్రాక్టుల జాబితా ప్రకటించబోమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గురువారం స్పోర్ట్స్ స్టార్కు వెల్లడించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులకు సంబంధించి మూడు గ్రేడ్ల ప్లేయర్ల జీతాలు వేరుగా ఉంటాయి. అయితే, ఆ మొత్తం ఎంత అన్నది మాత్రం బీసీసీఐ ఈసారి వెల్లడించలేదు. ఆఖరిసారిగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. గ్రేడ్-‘ఎ’లో ఉన్న ప్లేయర్లకు రూ. 50 లక్షలు, గ్రేడ్-‘బి’లో ఉన్న క్రికెటర్లకు రూ. 30 లక్షలు, గ్రేడ్-‘సి’లో ఉన్న ప్లేయర్లకు రూ. 10 లక్షల చొప్పున వార్షిక వేతనం చెల్లిస్తారు.అయితే, పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే మొత్తం అసలు ఏమాత్రం లెక్కకాదు. పురుష క్రికెటర్లలో A+ గ్రేడ్లో ఉన్న వారికి రూ. 7 కోట్లు, A గ్రేడ్లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్న వారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్లో ఉన్నవారికి రూ. కోటి చొప్పున బీసీసీఐ చెల్లిస్తోంది.బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు(2024-25)గ్రేడ్-ఎ: హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మగ్రేడ్-బి : రేణుకా సింగ్ ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మగ్రేడ్-సి : యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్.చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా! -
గొంగడి త్రిషకు చోటు
న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ మహిళల చాలెంజర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం జట్లను ప్రకటించింది. డెహ్రాడూన్ వేదికగా ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 8 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. మూడు రోజుల ఫార్మాట్లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తుండగా, ఇందులో 4 జట్లు పాల్గొంటున్నాయి. స్టార్ ప్లేయర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఈ టోర్నీనకి దూరం కాగా... యంగ్ ప్లేయర్లకు అవకాశం దక్కింది. ‘సీనియర్ మహిళల మల్టీ డే చాలెంజర్ ట్రోఫీ కోసం మహిళల సెలెక్షన్ కమిటీ 4 జట్లను ఎంపిక చేసింది. ఎర్రబంతితో జరగనున్న ఈ టోర్నీని డెహ్రాడూన్లోని రెండు వేదికల్లో నిర్వహిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. మిన్ను మణి, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, స్నేహ్ రాణా నాలుగు జట్లకు సారథ్యం వహించనుండగా... భారత మహిళల అండర్–19 జట్టుకు రెండోసారి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఆల్రౌండర్ గొంగడి త్రిషకు టీమ్ ‘డి’లో చోటు దక్కింది. జట్ల వివరాలు టీమ్ ‘ఎ’: మిన్ను మణి (కెప్టెన్), రిచాఘోష్, శిప్రా గిరి, సుభ సతీశ్, శ్వేతా షెహ్రావత్, వృందా దినేశ్, ముక్తా మగ్రే, హెన్రిట్టా పెరీరా, తనూజ కన్వర్, వాసవి పావని, ప్రియా మిశ్రా, అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, అనాడీ తగ్డే, ప్రగతి సింగ్. టీమ్ ‘బి’: హర్లీన్ డియోల్ (కెప్టెన్), యస్తిక భాటియా, మమత, ప్రతీక రావల్, ఆయుశ్ సోని, ఆరుశీ గోయల్, కనిక అహూజ, మితా పాల్, శ్రీ చరణి, మమత పాస్వాన్, ప్రేమ రావత్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, అక్షర, టిటాస్ సాధు. టీమ్ ‘సి’: జెమీమా రోడ్రిగ్స్ (కెప్టెన్), ఉమా ఛెత్రి, రియా చౌదరి, షఫాలీ వర్మ, త్రిప్తి సింగ్, తనుశ్రీ సర్కార్, తేజల్ హసబ్నిస్, సుశ్రీ దివ్యదర్శిని, సుచి ఉపాధ్యాయ, రాజేశ్వరి గైక్వాడ్, శరణ్య గద్వాల్, జోషిత, శబ్నమ్, సైమా ఠాకూర్, గరిమా యాదవ్. టీమ్ ‘డి’: స్నేహ్ రాణా (కెప్టెన్), నందిని కశ్యప్, శివంగి యాదవ్, గొంగడి త్రిష, జిన్సీ జార్జ్, రాఘవి, ధార గుజ్జర్, సంస్కృతి గుప్తా, యమున రాణా, వైష్ణవి శర్మ, కీర్తన, అమన్జ్యోత్ కౌర్, కాశ్వీ గౌతమ్, మనాలీ దక్షిణి, మోనిక పటేల్. -
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో టీమిండియా మ్యాచ్
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆఖరిలో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా సౌతాఫ్రికా ఆతిథ్య టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఈ క్రమంలో ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ను ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. బీసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. టెస్టు సిరీస్తో ప్రోటీస్ జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన తేదీలను ఇంకా వెల్లడించలేదు. ఇక రెండో టెస్టు మాత్రం గౌహతిలోని బర్సాపర క్రికెట్ స్టేడియం వేదికగా నవంబర్ 22 నుండి నవంబర్ 26 వరకు జరగనుంది. గౌహతి టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనంతరం నవంబర్ 30న రాంఛీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో వైట్బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్పూర్, మూడో వన్డే డిసెంబర్ 6న వైజాగ్ వేదికలగా జరగనుంది.మరో టీ20 వరల్డ్కప్పై కన్ను..ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత టీమిండియా టీ20 వరల్డ్కప్-2026కు సన్నద్దం కానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పొట్టి ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఎక్కువగా టీ20 సిరీస్లను షెడ్యూల్ చేసింది. ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టు ఏకంగా 23 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో భాగంగానే స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. డిసెంబర్ 9న కటక్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు సిరీస్తొలి టెస్టు: - : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంరెండో టెస్టు: నవంబర్ 22 నుండి నవంబర్ 26-గౌహతిభారత్ వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్:నవంబర్ 30: రాంచీడిసెంబర్ 3: రాయ్పూర్డిసెంబర్ 6: వైజాగ్భారత్ vs సౌతాఫ్రికా T20I సిరీస్:1st T20I: డిసెంబర్ 9: కటక్2nd T20I: డిసెంబర్ 11: నాగ్పూర్3rd T20I: డిసెంబర్ 14: ధర్మశాల4th T20I: డిసెంబర్ 17: లక్నో5th T20I: డిసెంబర్ 19: అహ్మదాబాద్చదవండి: ఐపీఎల్-2025 తొలి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: తుదిజట్లు ఇవే!? -
ఐపీఎల్లో ‘సలైవా’ వాడవచ్చు!
న్యూఢిల్లీ: బంతిని రివర్స్ స్వింగ్ చేయగల సత్తా ఉన్న బౌలర్లకు శుభవార్త ఇది! బ్యాటర్ల బాదుడుతో ఏ దశలోనూ బంతిని నియంత్రణలో ఉంచుకోలేకపోతున్న పేసర్లకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఊరటనిచ్చింది. 2025 సీజన్లో బంతిపై ఉమ్మి (సలైవా)ని రుద్దేందుకు అనుమతినిచ్చింది. గురువారం జరిగిన టీమ్ కెప్టెన్ల సమావేశంలో వారి అభిప్రాయం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సలైవాను ఉపయోగిస్తే బంతిపై నునుపుదనం పెరిగి రివర్స్ స్వింగ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మ్యాచ్ కీలక క్షణాల్లో పేసర్లు దీనిని సమర్థంగా వాడుకోగలిగితే పైచేయి సాధించవచ్చు. క్రికెట్లో సుదీర్ఘ కాలంగా ఇది అమల్లో ఉంది. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత నాటి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సలైవాను రుద్దడంపై నిషేధం విధించడంతో పాటు ఎవరైనా వాడితే ఆ బౌలర్లకు శిక్షలు కూడా విధించింది. అయితే ఇప్పుడు అంతా మారిపోవడంతో బౌలర్ల వైపు నుంచి అభ్యర్థనలు వచ్చాయి. దాంతో ఒక మేజర్ ఈవెంట్లో తొలిసారి సలైవాను వాడేందుకు అనుమతినిస్తున్నారు. ఐసీసీ ఆంక్షలు ఇంకా ఉన్నా... ఐపీఎల్ మాత్రం దానికి సై అంది. తాజా నిర్ణయాన్ని పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ స్వాగతించాడు. లీగ్లో గుజరాత్ టైటాన్స్ తరఫున తొలిసారి ఆడనున్న అతను ‘సలైవా’ తమకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ‘ఇది పేస్ బౌలర్లకు ఎంతో మంచిది. బంతితో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న పరిస్థితుల్లో సలైవా వాడటం తప్పనిసరి. కొంతైనా రివర్స్ స్వింగ్కు ప్రయత్నించవచ్చు. బంతిని షర్ట్ను రుద్దడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. సలైవా వల్ల ఒకవైపు మెరుపును కొనసాగించవచ్చు. ఇది చాలా ముఖ్యం’ అని సిరాజ్ అన్నాడు. మరోవైపు ఎత్తుకు సంబంధించిన వైడ్లు, ఆఫ్సైడ్ వైడ్ల విషయంలో డీఆర్ఎస్ వాడుకునేందుకు కూడా గవర్నింగ్ కౌన్సిల్ అంగీకరించింది. రాత్రి మ్యాచ్లలో మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రెండో ఇన్నింగ్స్ సమయంలో 11వ ఓవర్ ఒక బంతిని మార్చేందుకు కూడా అనుమతినిచ్చారు. కెప్టెన్లపై నిషేధం ఉండదు... ఇక నుంచి ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెపె్టన్లపై మ్యాచ్ నిషేధం ఉండదని గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. గురువారం జరిగిన ఐపీఎల్ జట్ల కెప్టెన్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధం బదులుగా కెప్టెన్లపై డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు. గత ఏడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు మూడుసార్లు స్లో ఓవర్రేట్ నమోదు చేసింది. దాంతో పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. గతేడాది హార్దిక్పై విధించిన ఒక మ్యాచ్ నిషేధం ఈ ఏడాది అమలు కానుంది. ఫలితంగా 23న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తమ తొలి మ్యాచ్కు హార్దిక్ దూరమయ్యాడు. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఐపీఎల్లో కొత్త రూల్.. ఇక టాస్తో 'డోంట్ వర్రీ'
ఐపీఎల్-2025 సీజన్కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. మార్చి 22 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మెగా ఈవెంట్ షూరూ కానుంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు బీసీసీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్లో సాయంత్రం వేళ జరిగే మ్యాచ్ల్లో రెండో ఇన్నింగ్స్లో రెండు బంతులను వినియోగించుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. గురువారం(మార్చి 20) ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఐపీఎల్లో సాయంత్రం జరిగే మ్యాచ్లలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డ్యూ ఫాక్టర్ కారణంగా రెండో ఇన్నింగ్స్లో బంతి తడిగా మారి బౌలర్లకు గ్రిప్ దొరికేది కాదు. దీంతో బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్లో బంతులు వేయలేక పరుగులు సమర్పించుకునేవారు. చాలా మ్యాచ్ల్లో మంచునే ఎక్స్ ఫ్యాక్టర్గా మారేది. అందుకే ప్రతీ జట్టు టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకునేందుక మొగ్గు చూపేవారు. ఈ క్రమంలోనే డ్యూ ఫాక్టర్ను తగ్గించడానికి రెండు కొత్త బంతుల రూల్ను బీసీసీఐ తీసుకొచ్చింది.ఈ రూల్ ప్రకారం.. రెండో కొత్త బంతిని సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఉపయోగించాలి. అది కూడా 11వ ఓవర్ తర్వాత మాత్రమే జట్ల కెప్టెన్లు కొత్త బంతిని తీసుకునే అవకాశముంటుంది. అయితే బంతిని మార్చాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం అంపైర్దే.మంచు ఎక్కువగా ఉందా లేదా అని పరిశీలించి అంపైర్ తుది నిర్ణయం తీసుకుంటారు. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లకు ఈ రూల్ వర్తించదు. ఈ నిర్ణయంతో బౌలర్లకు ప్రయోజనం చేకూరనుంది.అదేవిధంగా ఇంపాక్ట్ రూల్ను కొనసాగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది. ఐపీఎల్-2023 సీజన్లో ప్రవేశిపెట్టిన ఈ రూల్ పట్ల మొత్తం పది మంది కెప్టెన్లు కూడా సముఖుత చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు సలైవా బ్యాన్ను కూడా బీసీసీఐ ఎత్తివేసింది.చదవండి: BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్కు ఎంతో వెల్లడించిన బీసీసీఐ -
IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. బౌలర్లకు పండగే?
ఐపీఎల్-2025కు ముందు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో బంతులపై లాలాజలం(సలైవా) వాడకంపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. గురువారం(మార్చి 20) జరిగిన కెప్టెన్ల సమావేశం అనంతరం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో జరిగిన ఈమీట్లో ఎక్కువ మంది కెప్టెన్లు సలైవా ఉపయోగించాలనే ఆలోచనకు అంగీకరించారు.ఈ ఏడాది సీజన్ నుంచే ఈ రూల్ అమలులోకి రానుంది. కాగా ఇదే విషయంపై బీసీసీఐ పెద్దలు ఇప్పటికే ఐపీఎల్ జట్ల కెప్టెన్లతో అంతర్గతంగా చర్చించారు. తుది నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కెప్టెన్లకే బోర్డు విడిచిపెట్టింది. ఇప్పుడు అందుకు కెప్టెన్లు కూడా అంగీకరించడంతో బీసీసీఐ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది."ఇది కెప్టెన్లు ఇష్టం. సలైవా వాడకాన్ని వారు కొనసాగించాలనకుంటే, మాకు ఎటువంటి సమస్య లేదు. మేము దానికి అంగీకరిస్తున్నాము. అయితే అంతర్జాతీయ మ్యాచ్ల సమయంలో మాత్రం ఐసీసీ రూల్కు కట్టుబడి ఉంటాము" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.2020లో బ్యాన్..కోవిడ్-19 మహమ్మారి తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లాలాజల వాడకాన్ని నిషేధించింది. దీంతో ఫాస్ట్ బౌలర్లు బంతిని రివర్స్ స్వింగ్ను చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. బంతిపై సలైవా ఉపయోగించితే అది ఎక్కువగా రివర్స్ స్వింగ్ అవుతుంది.ఐపీఎల్(2020)లో సైతం బీసీసీఐ సైతం లాలాజల వాడకంపై బ్యాన్ విధించింది. అప్పటి నుంచి గతసీజన్ వరకు ఏ ఫాస్ట్ బౌలర్, ఏ ప్లేయర్ కూడా సలైవాను ఉపయోగించలేదు. తాజాగా ఇదే విషయంపై భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా స్పందించాడు. లాలాజల వాడకంపై బ్యాన్ను ఎత్తివేయాలని ఐసీసీని షమీ అభ్యర్థించాడు"మేము రివర్స్ స్వింగ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. కానీ సలైవాను మాత్రం ఉపయోగించడం లేదు. మ్యాచ్ జరిగే సమయంలో సలైవా వాడకాన్ని అనుమతించమని మేము చాలా సార్లు ఐసీసీకి విజ్ఞప్తి చేశాము. అందుకు అనుమతి ఇస్తే బంతి మరింత ఎక్కువగా రివర్స్ సింగ్ అయ్యే అవకాశముంటుంది" అని ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విలేకరుల సమావేశంలో షమీ పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.చదవండి: BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్కు ఎంతో వెల్లడించిన బీసీసీఐ -
BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్కు ఎంతంటే?
టీమిండియాకు ప్రకటించిన నగదు బహుమతి పంపిణీ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆటగాళ్లకు, కోచ్లకు, సహాయక సిబ్బందికి ఇచ్చే మొత్తం ఎంతన్నది తాజాగా వెల్లడించారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్ల మేర అందజేయనున్నట్లు తెలిపారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచిన రోహిత్ సేన.. సెమీస్లో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్లలో అజేయంగా నిలిచి తొమ్మిది నెలల వ్యవధిలోనే మరో ఐసీసీ ట్రోఫీని సాధించింది.ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డు (BCCI Cash Reward) ప్రకటించింది. రూ. 58 కోట్ల నజరానా ఇవ్వనున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే, ఇందులో ఎవరెవరికి ఎంత మొత్తం ఇస్తారన్న విషయం గురించి కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా వెల్లడించారు.గౌతం గంభీర్కు మూడు కోట్లువార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్లు.. హెడ్కోచ్ గౌతం గంభీర్కు మూడు కోట్లు.. మిగిలిన కోచ్లలో అసిస్టెంట్లు ర్యాన్ టెన్ డష్కాటే, అభిషేక్ నాయర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్కు టి. దిలీప్నకు రూ. 50 లక్షలు.. మిగిలిన సహాయక సిబ్బందికి రూ. యాభై లక్షలు.. బీసీసీఐ అధికారులకు రూ. 25 లక్షలు ఇస్తాం’’ అని దేవజిత్ సైకియా తెలిపారు.కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమి పాలై టైటిల్ను చేజార్చుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2024తో ఈ గాయాలను మాన్పివేసింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు ఓటమన్నదే లేక చాంపియన్గా నిలిచింది.దుబాయ్లోనే అన్ని మ్యాచ్లు తొమ్మిది నెలల అనంతరం తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఈ వన్డే టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరించిగా.. భద్రతా కారణాల వల్ల టీమిండియాను అక్కడకు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో ఐసీసీ జోక్యంతో దుబాయ్లో భారత జట్టు తమ మ్యాచ్లన్నీ ఆడేలా హైబ్రిడ్ మోడల్కు పాక్ అంగీకరించింది. ఇక ఒకే వేదిక మీద అన్ని మ్యాచ్లు ఆడటం వల్ల టీమిండియాకు మిగతా జట్లతో పోలిస్తే.. అదనపు ప్రయోజనాలు చేకూరాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు విమర్శించారు. అయితే, భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని.. వేదిక ఏదైనా గెలుపు టీమిండియాదేనంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఆ విమర్శలను తిప్పికొట్టారు. టీ20 ప్రపంచకప్-2024లో మిగతా జట్ల మాదిరే టీమిండియా కూడా ప్రయాణాలు చేసిందని.. అయినా విజేతగా నిలిచిందంటూ కౌంటర్ ఇచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లొ పాల్గొన్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, రిషభ్ పంత్.సహాయక సిబ్బంది:హెడ్కోచ్ గౌతం గంభీర్, కోచ్లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే, టి. దిలీప్, మోర్నీ మోర్కెల్. చదవండి: ‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
టీమిండియాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో విజేతగా నిలిచినందుకు భారీ క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ మెగా వన్డే టోర్నీలో ఐదింటికి ఐదు మ్యాచ్లు గెలిచి అజేయంగా చాంపియన్గా నిలిచిన రోహిత్ సేనకు రూ. 58 కోట్ల నజరానా ఇచ్చింది. రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావిస్తూఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది.. అదే విధంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు బీసీసీఐ పంచనుంది. ఇందుకు సంబంధించి బోర్డు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియాకు రూ. 58 కోట్ల క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నాం.మెన్స్ సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది పనితీరును గుర్తిస్తూ వారిని ఇలా సత్కరిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. ‘‘కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబరిచింది. ఓటమన్నదే ఎరుగక నాలుగు విజయాలతో ఫైనల్ చేరింది.తొలుత బంగ్లాదేశ్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్తాన్పై కూడా ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ టాపర్ అయ్యింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించింది’’ అని బీసీసీఐ తమ ప్రకటనలో రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావించింది.అందుకే ఈ నగదు బహుమతిఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించడం ఎంతో ప్రత్యేకమైనది. భారత జట్టు అంకిత భావం, ప్రపంచ వేదికపై దేశానికి వారు తెచ్చి పెట్టిన కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుగా నగదు బహుమతి అందజేస్తున్నాం.ఈ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరి సేవలను మేము గుర్తించాం. భారత్కు ఈ ఏడాది ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. అండర్-19 వుమెన్స్ వరల్డ్కప్లో మనం చాంపియన్లుగా నిలిచాం. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాం.దేశంలో క్రికెటింగ్ ఎకోసిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్-2024 సాధించిన రోహిత్ సేన.. ఆ టోర్నీలోనూ అన్ని మ్యాచ్లలో అజేయంగా నిలిచింది. నాడు బీసీసీఐ రోహిత్ సేనకు ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది.ఎనిమిది జట్ల మధ్య పోటీతాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయగా.. ఈసారి రూ. 58 కోట్ల బహుమతి ఇచ్చింది. ఇది ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక ఈ మెగా ఈవెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లోనే తమ మ్యాచ్లన్నీ ఆడింది. ఈ టోర్నీలో భారత్తో పాటు గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి.తొలి సెమీస్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించగా.. రెండో సెమీస్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ క్రమంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య మార్చి 9న జరిగిన టైటిల్ పోరులో రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో కివీస్ను ఓడించింది. ఈ మ్యాచ్లో అద్భుత అర్ధ శతకం(76) బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: ‘రేపు మీ బౌలింగ్ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
ఐపీఎల్లో ‘సలైవా’కు అనుమతి!
న్యూఢిల్లీ: బంతిపై నునుపుదనం పెంచడం కోసం సలైవా (ఉమ్మి)ని వాడేందుకు అనుమతించాలంటూ ఇటీవల భారత పేసర్ మొహమ్మద్ షమీ విజ్ఞప్తి చేశాడు. సాధారణంగా ఉమ్మిని రుద్దడం వల్ల బంతి తన మెరుపును కోల్పోకుండా ఉండి రివర్స్ స్వింగ్కు సహకరిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇది ఆటలో భాగంగానే ఉన్నా... కోవిడ్ వచి్చనప్పుడు దీనిపై ఐసీసీ నిషేధం విధించింది. ఇప్పుడు ఆ ప్రమాదం లేదు కాబట్టి నిబంధన తొలగించాలంటూ బౌలర్లు కోరుతున్నారు. ఈ విషయంలో బీసీసీఐ తీవ్రంగా ఆలోచిస్తోంది. బ్యాటర్ల ఆధిపత్యం సాగే లీగ్లో కొంతైనా బౌలర్లకు ‘రివర్స్ స్వింగ్’ ప్రయోజనం కలగవచ్చు. కాబట్టి కెప్టెన్లందరూ అంగీకరిస్తే ఐపీఎల్లో ‘సలైవా’ వాడేందుకు బోర్డు అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు గతంలోలాగే హైట్, ఆఫ్ సైడ్ వైడ్లను నిర్ణయించే విషయంలో డీఆర్ఎస్ కొనసాగనుంది. -
BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
ఆటగాళ్ల కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనలకు అనుమతించే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసింది. జట్టుతో పాటు బోర్డుకు కూడా ఇదే మంచిదని పేర్కొంది. ఈ విషయంలో ఆటగాళ్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే, తాము జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని తెలిపింది.ఈ మేరకు బోర్డు తరఫున.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తమ స్పందన తెలియజేశారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. 3-1తో ఓడి ఇంటిబాటపట్టింది.ఈ పరాభవం తర్వాత.. విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతిస్తారు.విరాట్ కోహ్లి ఘాటు విమర్శలుఅంతకు మించి పర్యటన కొనసాగితే రెండు వారాల పాటు సన్నిహితులకు అక్కడే ఉండే వెసలుబాటు ఉంటుంది. అయితే, ఈ విషయంలో టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులే సగం బలమని.. ఆటగాడి విజయం వెనుక కుటుంబ సభ్యుల పాత్రను అందరికీ వివరించలేమని పేర్కొన్నాడు.మైదానంలో దిగని వాళ్లు, అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించిందని కోహ్లి ఘాటుగా విమర్శించాడు. ప్రతి ఆటగాడు తన కుటుంబ సభ్యులు వెంట ఉంటే మరింత బాధ్యతగా ఆడతారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో యూటర్న్ తీసుకోనుందనే వార్తలు వచ్చాయి.బీసీసీఐకి, దేశానికి ఇదే మంచిదిఅయితే, అలాంటిదేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కొట్టిపడేశారు. ‘‘మేము ప్రవేశపెట్టిన నిబంధనలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బీసీసీఐకి, వ్యవస్థకి, జట్టుకు, దేశానికి ఇదే మంచిది.ఈ అంశంలో ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు, మిశ్రమ స్పందన వస్తుందని తెలుసు. ఇక్కడంతా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి.. ఎవరైనా తమ గొంతును వినిపించవచ్చు. తమ భావాలను నిర్భయంగా పంచుకోవచ్చు.అయితే, ఈ నిబంధన విషయంలో అందరు ఆటగాళ్లూ సమానమే. జట్టులోని ప్రతి సభ్యుడు, కోచ్లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది.. ఇలా అందరికీ రూల్స్ వర్తిస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.రాత్రికి రాత్రే హడావుడిగా ఈ విధానాన్ని మేము ప్రవేశపెట్టలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని మా అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ పాలసీ తీసుకువచ్చారు. నిజానికి గతంతో పోలిస్తే విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై మేము ఆటగాళ్లకు చాలా వరకు మినహాయింపులు ఇచ్చాం. అయితే, ఇప్పుడు ఈ రూల్ కాస్త కఠినంగా అనిపించినా.. తప్పక అమలు చేస్తాం’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ -
మహిళల ప్రపంచకప్ కోసం...
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వబోయే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 22న కోల్కతాలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానుంది. అదే రోజు అక్కడి ఈడెన్ గార్డెన్స్లో ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆర్గనైజింగ్ కమిటీపై కసరత్తు పూర్తి చేయనుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పొగాకు, మద్యం ఉత్పాదనలకు సంబంధించిన ప్రకటనలు క్రికెట్ మైదానంలో నిషేధం, క్రిప్టో కరెన్సీపై గట్టి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్లో వన్డే మెగా ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కౌన్సిల్ అజెండాలో కమిటీ ఏర్పాటుతో పాటు మెగా ఈవెంట్ వేదికలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో పాటు 2025–26 దేశవాళీ సీజన్ షెడ్యూల్ను ఖరారు చేస్తారని, అలాగే భారత పర్యటనకు వచ్చే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో ద్వైపాక్షిక సిరీస్ వేదికలపై కూడా అపెక్స్ కౌన్సిల్ చర్చించే అవకాశముందని బోర్డు వర్గాలు తెలిపాయి. పొగాకు, మద్యం ప్రకటనలపై ఇదివరకే ఐపీఎల్ సీజన్లో విధించిన నిషేధాన్ని బోర్డు అమలు చేయనుంది. టీమిండియా పురుషుల జట్టు వన్డే వరల్డ్కప్ను రెండుసార్లు గెలిచినప్పటికీ... భారత మహిళల జట్టుకు మాత్రం ఆ ‘కప్’ అందని ద్రాక్షే అయ్యింది. ఫైనల్ చేరిన రెండు సార్లు కూడా అమ్మాయిల జట్టు రన్నరప్తోనే సరిపెట్టుకుంది. హర్మన్ప్రీత్ కౌర్ సేన కనీసం ఈ ఏడాదైన సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందో చూడాలి!