తొలి మ్యాచ్‌లో ఛాంపియన్‌కు షాక్.. ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | Royal Challengers Bangalore won the first WPL match against Mumbai indians | Sakshi
Sakshi News home page

WPL-2026: తొలి మ్యాచ్‌లో ముంబయికి షాక్.. ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

Jan 9 2026 11:23 PM | Updated on Jan 9 2026 11:24 PM

Royal Challengers Bangalore won the first WPL match against Mumbai indians

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సూపర్ విక్టరీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు తొలి మ్యాచ్‌లో గట్టి ఝలక్ ఇచ్చింది. ముంబయి నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఛేదనలో నదినే డి క్లార్క్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. కేవలం 44 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచింది.   

కాగా.. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన బౌలింగ్ ఎంచుకుంది.  ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లారెన్‌ బెల్‌, శ్రేయంకా పాటిల్‌ తలా వికెట్‌ సాధించారు. ఈ మ్యాచ్‌లో ముంబయి క్రికెటర్ సజీవన్ సజన విధ్వంసం సృష్టించింది.  25 బంతులు ఎదుర్కొన్న సజన.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసింది. ఆమెతో పాటు నికోలా కారీ(40) కీలక ఇన్నింగ్స్‌తో రాణించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement