breaking news
Sports News
-
ఊహించినట్టే జరిగింది.. పెళ్లిపై ఇద్దరూ క్లారిటీ
-
పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చేసిన స్మృతి
-
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
-
విశాఖలో క్రికెట్ ఫీవర్.. టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
-
వరుస సెంచరీలతో విరాట్ విధ్వంసం.. 2027 వరల్డ్ కప్ పై ఆశలు
-
రాయ్ పూర్ వన్డేలో భారత్ పై సౌతాఫ్రికా విజయం
-
సిరీస్ పై భారత్ గురి
-
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
-
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
-
జట్టులో కీలక మార్పులు
-
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
-
స్మృతి మందాన పెళ్లి రద్దు? వేరే అమ్మాయితో పలాస్ డేటింగ్!
-
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
-
గిల్ అనుమానమే..!
-
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
-
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
-
బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల
-
క్రీడా కీర్తి కిరీటం
-
Viral Video: ఎంతుంటే ఏంటయ్యా.. గెలిచానా లేదా..?
జపాన్లో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడల్లో సుమో ముందువరుసలో ఉంటుంది. ఈ క్రీడకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో ఓ చిన్న కుర్రాడు, ఓ మహాబలున్ని అలవోకగా ఓడిస్తాడు. సాధారణంగా సుమో పోరాటాల్లో బరువు, అనుభవం కీలకమని భావిస్తారు. అయితే ఈ సందర్భంలో 68 కిలోల బరువుండే ఓ 16 ఏళ్ల కుర్రాడు, 168 కిలోల బరువుండే 39 ఏళ్ల ఓ అనుభవజ్ఞుడిని సులువుగా ఓడించేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో 43 లక్షలకు పైగా వ్యూస్ను సాధించింది.16-year-old sumo prodigy Kosei defeated 39-year-old Amamidake, who’s more than twice his size. 😳In professional sumo, there are no weight classes. pic.twitter.com/A8adcb0Vmj— Dudes Posting Their W’s (@DudespostingWs) November 12, 2025ఈ పోటీని చూసిన వారు డేవిడ్ వర్సెస్ గొలియాత్ పోటీగా అభివర్ణించారు. ఎంతున్నామన్నది కాదన్నయ్యా.. గెలిచామా లేదా అన్నదే ముఖ్యమని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఈ పోటీలో అమమిడాకే అనే పేరుగల భారీకాయుడిపై గెలిచిన కుర్రాడి పేరు కోసే. కోసే.. అమమిడాకే కటౌట్ను చూసి బయపడకుండా, తన తక్కువ బరువునే ఆయుధంగా మలచుకొని అమమిడాకేను రింగ్ బయటికి కదిలించాడు. ఈ పోటీలో కోసే పాదాల కదలిక, అతని ధైర్యం అందరిని ఆకట్టుకున్నాయి. చదవండి: షోయబ్తో విడాకులు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సానియా మీర్జా -
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
-
మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు
-
త్వరలో మరో క్రికెట్ లీగ్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 వేదికల్లో 600 జట్లతో తెలుగు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ టోర్నీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ లీగ్కు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. టీపీఎల్ నిర్వాహకులైన జూపర్ ఎల్ఈడీ సంస్థ ప్రతినిధులు మంగళవారం మంత్రిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి లీగ్ విశేషాలను వివరించారు. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారులుగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని శ్రీహరి అన్నారు. క్రికెట్తో పాటు ఏదో ఒక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. ‘సే నో టూ’ డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం లీగ్ నిర్వాహక సంస్థ జూపర్ ఎల్ఈడీ డైరెక్టర్ ఒ.రమేశ్ మాట్లాడుతూ తమ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ లీగ్ను కేవలం వినోదం కోసం నిర్వహించకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్నెస్, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్మనీ రూ. 80 లక్షలు అని ఆయన చెప్పారు. చదవండి: ప్రపంచ క్రికెట్ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి -
ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి..
క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, ఛేజింగ్ మాస్టర్, ఫిట్నెస్ ఫ్రీక్ అయిన విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ (నవంబర్ 5, 2025) కింగ్ కోహ్లి 37వ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ క్రీడా సమాజం అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.ఇటీవలే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 ప్రపంచకప్ ఆడాలన్నది అతడి కొరిక. అంతవరకు విరాట్ మునుపటి మెరుపులు మెరిస్తూ, మరెన్నో రికార్డులను బద్దలు కొడుతూ అప్రతిహతంగా కెరీర్ను కొనసాగించాలని ఆశిద్దాం.కోహ్లి ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆడాడు. ఇందులో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైనా, మూడో మ్యాచ్లో తిరిగి పుంజుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను విజయాన్నందించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో రోహిత్ సెంచరీ (121 నాటౌట్) చేయగా.. కోహ్లి (74 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.విరాట్ త్వరలో మరోసారి దర్శనమివ్వబోతున్నాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. 2027 ప్రపంచకప్ వరకు కోహ్లి ఫిట్నెస్ను, ఫామ్ను కాపాడుకుంటూ టీమిండియాను గెలిపిస్తూ ఉండాలని భారత క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అతడి జన్మదినం సందర్భంగా ప్రతి భారత క్రికెట్ అభిమాని అకాంక్ష ఇదే.ఢిల్లీ వీధుల్లో క్రికెట్ ఆడటం మొదలుపెట్టి, క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కోహ్లి.. ఫామ్ను కాపాడుకోగలిగితే సునాయాసంగా మరో రెండు, మూడేళ్లు దేశానికి సేవలందించగలడు. ఫిట్నెస్ విషయంలో అతడికి ఎలాంటి సమస్యలు లేవు. ఉండవు. సాధారణంగా 35 ఏళ్ల వయసొచ్చే సరికే క్రికెటర్లు ఫిట్నెస్ను కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటుంటారు.అయితే కోహ్లి మాత్రం అలా కాదు. 25 ఏళ్ల కుర్రాళ్లు కూడా పోటీ పడలేని విధంగా ఫిట్నెస్ను మెయిన్టెయిన్ చేస్తున్నాడు. తాజాగా ఆసీస్తో జరిగిన సిరీస్లో కోహ్లిని చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది.కెరీర్ను నిదానంగా ప్రారంభించిన కోహ్లి.. అందరిలాగే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటివరకు పొగిడిన నోళ్లే అతన్ని దూషించాయి. బ్యాడ్ టైమ్ను అధిగమించిన కోహ్లి తిరిగి నిలబడ్డాడు. దూషించిన నోళ్లకు బ్యాట్తో సమాధానం చెప్పాడు.ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గానూ కోహ్లి కెరీర్ విజయవంతంగా సాగింది. టెస్ట్ల్లో భారత అత్యుత్తమ కెప్టెన్ కోహ్లినే అని చెప్పవచ్చు. అతడి హయాంలో భారత్ అత్యున్నత శిఖరాలు అధిరోహించింది. కోహ్లి జట్టు ఆటతీరునే మార్చేశాడు. ఆటగాళ్లకు దూకుడు నేర్పాడు. ఫిట్నెస్ మెరుగుపర్చుకునే విషయంలో అందరికీ దిక్సూచిగా నిలిచాడు. కోహ్లి జమానాలో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. చాలాకాలం పాటు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా కొనసాగింది.కోహ్లి ఆటగాడిగా, కెప్టెన్గా ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఇప్పటికే భారత క్రికెట్కు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. అయినా కోహ్లిలో కసి తీరడం లేదు. భారత జట్టుకు ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ గెలిచి కెరీర్కు ముగింపు పలకాలన్నది కోహ్లి కోరిక. ఈ కోరిక నెరవేరాలని, కోహ్లి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం. కోహ్లి సాధించిన ఘనతలు..అండర్-19 వరల్డ్కప్ (2008)వన్డే వరల్డ్కప్ (2011)టీ20 వరల్డ్కప్ (2024)ఛాంపియన్స్ ట్రోఫీ (2013, 2025)ఐపీఎల్ (2025)ఆసియా కప్-3టెస్ట్ మేస్-5ఐసీసీ అవార్డ్స్-10చదవండి: డ్రగ్స్కు బానిస.. స్టార్ క్రికెటర్పై శాశ్వత నిషేధం -
స్టార్ క్రికెటర్పై శాశ్వత నిషేధం
జింబాబ్వే క్రికెట్కు 20 ఏళ్ల పాటు సేవలందించిన మాజీ కెప్టెన్ సీన్ విలియమ్స్ (Sean Williams) ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక కాడు. డ్రగ్స్ అలవాటు కారణంగా జింబాబ్వే క్రికెట్ బోర్డు అతనిపై శాశ్వత నిషేధం విధించింది. ఇకపై అతని సెంట్రల్ క్రాంటాక్ట్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది.సీన్ ఈ ఏడాది సెప్టెంబర్లో స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి ఆకస్మికంగా తప్పుకున్నాడు. కారణం ఏంటని బోర్డు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. అప్పటికే హెవీగా డ్రగ్స్కు అలవాటు పడిన సీన్.. డోపింగ్ టెస్ట్లో పట్టుబడతాడన్న భయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. సీన్ తాను డ్రగ్స్ అలవాటు పడిన విషయాన్ని బోర్డు పెద్దల వద్ద అంగీకరించినట్లు తెలుస్తుంది. అలవాటు నుంచి బయటపడేందుకు డీఎడిక్షన్ సెంటర్లో కూడా జాయిన్ అయ్యాడని సమాచారం. బోర్డుతో సీన్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివర్లో ముగుస్తుంది. 39 ఏళ్ల సీన్ జింబాబ్వేకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. కెరీర్లో 18 టెస్ట్లు, 162 వన్డేలు, 8 టీ20లు ఆడి 13 సెంచరీలు, 50 సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా అయిన సీన్.. మూడు ఫార్మాట్లలో 156 వికెట్లు తీశాడు.కాగా, సీన్ డుమ్మా కొట్టిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ జింబాబ్వేకు అత్యంత కీలకంగా ఉండింది. ఆ టోర్నీలో జింబాబ్వే సికందర్ రజా పుణ్యమా అని నెగ్గి ప్రపంచకప్కు అర్హత సాధించింది. సీన్ లాంటి సీనియర్ ఆటగాడు ఆ టోర్నీకి అందుబాటులో లేకపోవడం జింబాబ్వే విజయావకాశాలను ప్రభావితం చేసేదే. ఒకవేళ ఆ టోర్నీలో జింబాబ్వే ఓటమిపాలై, ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయుంటే జింబాబ్వే అభిమానులు సైతం సీన్ను క్షమించేవారు కాదు.జింబాబ్వే క్రికెట్కు మాదకద్రవ్యాల ముప్పు జింబాబ్వే క్రికెట్లో మాదకద్రవ్యాల కలకలం ఇది మొదటిసారి కాదు. 2022లో మరో మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ కోకైన్ వాడకం వల్ల మ్యాచ్ ఫిక్సర్ల చేతిలో బ్లాక్మెయిల్కు గురయ్యాడు. ఆ ఉదంతంలో ఫిక్సర్ల నుంచి డబ్బు తీసుకున్న టేలర్పై 3.5 ఏళ్ల నిషేధం విధించబడింది. టేలర్ ఇటీవల శిక్షను పూర్తి చేసుకొని రీఎంట్రీ ఇచ్చాడు. టేలర్ విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు సీన్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించింది. చదవండి: యాషెస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన -
పాకిస్తాన్, సౌతాఫ్రికా తొలి వన్డేలో హైడ్రామా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా (Pakistan vs South Africa) జట్ల మధ్య నిన్న (నవంబర్ 4) జరిగిన తొలి వన్డేలో హైడ్రామా చోటు చేసుకుంది. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) హ్యాట్రిక్ సాధించినట్టే సాధించి మిస్ అయ్యాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 44వ ఓవర్ తొలి రెండు బంతులకు అబ్రార్.. బ్రీట్జ్కే, ఫోర్టుయిన్ను ఔట్ చేశాడు. మూడో బంతికి లుంగి ఎంగిడి ఎల్బీడబ్ల్యూ అయినట్లు తొలుత ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు.దీంతో అబ్రార్, అతని సహచరులు సహా మైదానంలో ఉన్న పాక్ అభిమానులంతా తెగ సంబరపడిపోయారు. అయితే ఎంగిడి అంపైర్ నిర్ణయంపై రివ్యూకి వెళ్లడంతో కథ తారుమారైంది. రివ్యూలో స్పష్టంగా ఇన్సైడ్ ఎడ్జ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. చేతిలోకి వచ్చిన హ్యాట్రిక్ మిస్ కావడంతో అబ్రార్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.ఈ మ్యాచ్లో పాక్ సౌతాఫ్రికాను ఓడించి సిరీస్లో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ 8 వికెట్లు కోల్పోయి, మరో 2 బంతులు మిగిలుండగా అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ గెలుపులో సల్మాన్ అఘా (62), మొహమ్మద్ రిజ్వాన్ (55), ఫకర్ జమాన్ (45), సైమ్ అయూబ్ (39, 2 వికెట్లు) కీలక పాత్రలు పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లు పాక్ను భయపెట్టారు. ఎంగిడి, ఫెరియెరా, కార్బిన్ బాష్ తలో 2, లిండే, ఫోర్టుయిన్ చెరో వికెట్ పడగొట్టారు.అంతకుముందు నసీం షా (9.1-1-40-3), అబ్రార్ అహ్మద్ (9-1-53-3), సైమ్ అయూబ్ (8-0-39-2), షాహీన్ అఫ్రిది (10-0-55-1), మొహమ్మద్ నవాజ్ (10-0-45-1) ధాటికి సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఓపెనర్లు ప్రిటోరియస్ (57), డికాక్ (63) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ బ్రీట్జ్కే (42), కార్బిన్ బాష్ (41) పర్వాలేదనిపించారు. ఈ సిరీస్లోని రెండో వన్డే కూడా ఫైసలాబాద్ వేదికగానే నవంబర్ 6న జరుగుతుంది. చదవండి: ఆసియాకప్లో ఓవరాక్షన్.. పాక్ ఆటగాడిపై 2 మ్యాచ్ల బ్యాన్! సూర్యకు కూడా -
ఆసీస్ దిగ్గజానికి కీలక పదవి
ఐపీఎల్ 2026కి ముందు ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీకి (Tom Moody) కీలక పదవి దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఫ్రాంచైజీ మూడీని గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా నియమించింది. ఈ పదవి చేపట్టాక మూడీ ఎల్ఎస్జీతో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జెయింట్స్, హండ్రెడ్ లీగ్లో మాంచెస్టర్ ఆధారిత ఫ్రాంచైజీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తాడు.గతంలో ఈ పదవిలో టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ ఉండేవాడు. జహీర్ తప్పుకున్న తర్వాత మూడీని ఈ పదవి వరించింది. మూడో రానున్న ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ (కెప్టెన్), జస్టిన్ లాంగర్ (హెడ్ కోచ్), కేన్ విలియమ్సన్ (స్ట్రాటజిక్ అడ్వైజర్), భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్), లాన్స్ క్లూసెనర్తో (అసిస్టెంట్ కోచ్) కలిసి పని చేస్తాడు. మూడీకి కోచింగ్తో పాటు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్లో అపార అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని క్యాష్ చేసుకునేందుకే ఎల్ఎస్జీ మూడీని తమ ఫ్రాంచైజీల గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా నియమించింది. మూడీ పర్యవేక్షణలో (కోచ్గా) సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి, ఏకైక టైటిల్ (2016) సాధించింది.మూడీ ప్రొఫైల్..2000 సంవత్సరం ప్రారంభంలో ఆటకు వీడ్కోలు పలికిన మూడీ.. 2005-07 మధ్యలో శ్రీలంక జాతీయ జట్టుకు కోచ్గా పని చేశాడు. అతని జమానాలో శ్రీలంక 2007 వరల్డ్ కప్ ఫైనల్కు చేరింది.అదే ఏడాది మూడీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో కోచ్గా రాణించిన మూడీ.. 2008-10 మధ్యలో ఐపీఎల్లో Kings XI Punjab (ఇప్పుడు Punjab Kings) జట్టుకు కోచ్గా సేవలందించాడు.2013లో Sunrisers Hyderabad ఫ్రాంచైజీలో హెడ్ కోచ్గా చేరి, 2016లో ఆ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. 2019 వరకు అదే బాధ్యతలు నిర్వహించిన మూడీ.. 2020 డిసెంబర్లో అదే ఫ్రాంచైజీకి Director of Cricketగా తిరిగి వచ్చాడు.చదవండి: జైస్వాల్ సూపర్ సెంచరీ -
జైస్వాల్ సూపర్ సెంచరీ
రాజస్థాన్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో (Ranji Trophy 2025-26) ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. తొలి ఇన్నింగ్స్లో సైతం అర్ద సెంచరీతో (67) రాణించిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్లో మూడంకెల మార్కును తాకాడు. 120 బంతుల్లో 11 బౌండరీల సాయంతో ఈ మార్కును చేరుకున్నాడు.జైస్వాల్కు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో సెంచరీ (21 ఇన్నింగ్స్ల్లో). ఓవరాల్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 17వది (టెస్ట్ల్లో 7 సెంచరీలు, భారత్-ఏ తరఫున 1, ముంబై తరఫున రంజీల్లో 5, రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున 2, వెస్ట్ జోన్ తరఫున 2).2019లో రంజీ అరంగేట్రం చేసిన జైస్వాల్ ఈ సెంచరీతో 1000 పరుగుల మార్కును కూడా తాకాడు. 10 మ్యాచ్ల్లో 57కు పైగా సగటుతో ఈ పరుగులు చేశాడు. తాజా సెంచరీని జైస్వాల్ తన ఐపీఎల్ హోం గ్రౌండ్ అయిన సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో (జైపూర్) చేయడం విశేషం.చెలరేగిన రాజస్థాన్ బౌలర్లుతొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 254 పరుగులకే ఆలౌటైంది. ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో యశస్వి జైస్వాల్ (67) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ముషీర్ ఖాన్ 49, షమ్స్ ములానీ 32, హిమాన్షు సింగ్ 25, తుషార్ దేశ్పాండే 25 (నాటౌట్) పరుగులతో పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో కుక్నా అజయ్ సింగ్ 4, అశోక్ శర్మ 3, అంకిత్ చౌదరి, ఆకాశ్ మహారాజ్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.దీపక్ హుడా ద్విశతకంఅనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రెండో ఇన్నింగ్స్లో దీపక్ హూడా ద్విశతకంతో (248), కార్తిక్ శర్మ (139) శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (617/6) చేసింది. సచిన్ యాదవ్ (92) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్పాండే, షమ్స్ ములానీ తలో 2 వికెట్లు తీశారు. యశస్వి జైస్వాల్ బంతితోనూ రాణించి డబుల్ సెంచరీ వీరుడు దీపక్ హుడాను ఔట్ చేశాడు.363 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి (52 ఓవర్లలో) 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (63), అజింక్య రహానే (18) ఔట్ కాగా.. జైస్వాల్ 105, సిద్దేశ్ లాడ్ 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి ముంబై రాజస్థాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 170 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య -
ఆసీస్పై టీమిండియా గెలుపు
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్లో తొలి మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఇన్నింగ్స్లో టిమ్ డేవిడ్ (74), స్టోయినిస్ (64) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. జితేశ్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) సుందర్కు సహకరించాడు. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 25, శుభ్మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరున్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టగా... ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3, బార్ట్లెట్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది.ఐదో వికెట్ కోల్పోయిన భారత్14.2వ ఓవర్- 145 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బార్ట్లెట్ బౌలింగ్లో తిలక్ వర్మ (29) ఔటయ్యాడు.15 ఓవర్ద తర్వాత భారత్ స్కోర్ 152/5గా ఉంది. సుందర్ (30), జితేశ్ శర్మ (5) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్11.1 ఓవర్- 111 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇల్లిస్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (17) ఔటయ్యాడు. 11.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 117/4గా ఉంది. వాషింగ్టన్ సుందర్ (6), తిలక్ వర్మ (24) క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 76 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్లో ఇల్లిస్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (24) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 82/3గా ఉంది. అక్షర్ పటేల్ (3), తిలక్ వర్మ (12) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్5.3వ ఓవర్- 61 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లిస్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (15) ఔటయ్యాడు.6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్లో ఉన్నారు. టీమిండియా రెండో వికెట్ డౌన్..శుభ్మన్ గిల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన శుభ్మన్ గిల్.. నాథన్ ఎల్లీస్ బౌలింగ్లో వికెట్లు ముందు దొరికిపోయాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 63/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్3.3 ఓవర్- 187 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేసి నాథన్ ఇల్లిస్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 41/1గా ఉంది. శుభ్మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్లో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(24), శుభ్మన్ గిల్(5) ఉన్నారు.భారత్ ముందు భారీ టార్గెట్హోబర్ట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 74), మార్కస్ స్టోయినిష్(39 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్స్లతో 64) విధ్వసంకర హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ దూబే ఒక్క వికెట్ సాధించారు.ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్12.6వ ఓవర్- 118 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (74) శివమ్ దూబే బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 143/5గా ఉంది.వరుణ్ మ్యాజిక్.. వరుస బంతుల్లో వికెట్లువరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో వరుస బంతుల్లో మిచెల్ మార్ష్ (11), మిచెల్ ఓవెన్ను (0) ఔట్ చేశాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 75/4గా ఉంది. స్టోయినిస్ (1), టిమ్ డేవిడ్ (55) క్రీజ్లో ఉన్నారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా డేవిడ్ మెరుపు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ 23 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 5 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లో, మూడో ఓవర్లో వికెట్లు తీశాడు. తొలుత ట్రవిస్ హెడ్ (6), ఆతర్వాత జోస్ ఇంగ్లిస్ను (1) పెవిలియన్కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 35/2గా ఉంది. టిమ్ డేవిడ్ (20), మిచ్ మార్ష్ (7) క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్హోబర్ట్ వేదికగా ఇవాళ (నవంబర్ 2) భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో ఓ మార్పుతో బరిలోకి దిగింది. హాజిల్వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్భారత్: శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: IND vs SA: వారెవ్వా అన్షుల్!.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
ఫైనల్ కు చేరిన భారత్
-
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఆసీస్తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో (73, 121 నాటౌట్) చెలరేగడంతో 36 రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకొని, తొలిసారి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు.ఈ ఘనతను రోహిత్ 38 ఏళ్ల 182 రోజల వయసులో సాధించాడు. తద్వారా అత్యంత లేటు వయసులో నంబర్ వన్ బ్యాటర్గా అవతరించిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గత వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉండిన రోహిత్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ ప్లేస్కు చేరాడు.ఈ క్రమంలో అగ్రపీఠంపై తిష్ట వేసిన సహచరుడు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ను కిందికి దించాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్ తర్వాత నంబర్ వన్ వన్డే బ్యాటర్గా అవతరించిన భారత బ్యాటర్గానూ రికార్డుల్లోకెక్కాడు.ఆసీస్తో తాజాగా జరిగిన 3 మ్యాచ్లో సిరీస్లో (10, 9, 24) విఫలమైన గిల్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైన మరో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్లోని రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 10 నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 3 స్థానాలు ఎగబాకి నాలుగో ప్లేస్కు చేరుకున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. టాప్-10లో ఏకైక టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ స్థానం కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరగా.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. చదవండి: రాణించిన రచిన్, మిచెల్.. న్యూజిలాండ్దే వన్డే సిరీస్ -
రెచ్చిపోయిన న్యూజిలాండ్ బౌలర్లు
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) చెలరేగడంతో 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్ను మట్టుబెట్టడంలో పాలుపంచుకున్నారు.జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో ఓవర్టన్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.కాగా, మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్లు రద్దైన టీ20 సిరీస్ను ఇంగ్లండ్ 1-0 తేడాతో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
పాక్ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఫార్మాట్లకతీతంగా అతను వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ సెంచరీ చేసి రెండేళ్లైపోయింది. ఈ మధ్యలో 75 ఇన్నింగ్స్లు ఆడినా ఓ మూడంకెల స్కోర్ లేదు.టెస్ట్ల్లో, వన్డేల్లో వరుస వైఫల్యాలు ఎదుర్కొన్న బాబర్.. తాజాగా టీ20 ఫార్మాట్లోనూ చెత్త ప్రదర్శనను కొనసాగించాడు. దాదాపుగా ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చి రెండు బంతుల్లో డకౌటయ్యాడు. ఈ ప్రదర్శన తర్వాత బాబర్పై ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది.సొంత అభిమానులు కూడా అతన్ని భరించడం లేదు. వీడు మనకొద్దు రా బాబూ అంటూ తలలు బాదుకుంటున్నారు.మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య నిన్న (అక్టోబర్ 28) తొలి టీ20 (Pakistan vs South Africa) జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బాబర్ సహా పాక్ ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు సౌతాఫ్రికా చేతిలో 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. టోనీ డి జోర్జి (33), జార్జ్ లిండే (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ (40-26-3), సైమ్ అయూబ్ (4-0-31-2) రాణించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఓ మోస్తరు ఆరంభం లభించినా ఆ తర్వాత పేకమేడలా కూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ 24, సైమ్ అయూబ్ 37 పరుగులకు ఔటయ్యారు. అంతా అయిపోయాక మొహమ్మద్ నవాజ్ (36) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ (4-0-14-4), జార్జ్ లిండే (3-0-31-3), లిజాడ్ విలియమ్స్ (3.1-0-21-2) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ పతనాన్ని శాశించారు. ఈ మ్యాచ్లో 9 మంది రెగ్యులర్ ప్లేయర్లు లేకపోయినా సౌతాఫ్రికా పాక్ను చిత్తుగా ఓడించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 అక్టోబర్ 31న లాహోర్లో జరుగుతుంది. చదవండి: మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం.. -
భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం
1930ల్లో భారత క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెడుతున్న వేళ, దేశీయ క్రికెట్కు బలం చేకూర్చే దిశగా 1934లో "క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా" పేరిట ఓ దేశీయ టోర్నీ ప్రారంభమైంది. ఈ టోర్నీ 1935-36లో (రెండో ఎడిషన్) రూపాంతరం చెంది రంజీ ట్రోఫీగా (Ranji Trophy) మారింది. తొలి రెండు ఎడిషన్లలో బాంబే (Bombay) ఛాంపియన్గా అవతరించింది.ఈ టోర్నీ మూడో ఎడిషన్ (1936-37) ఓ చారిత్రక ఘట్టానికి వేదికైంది. ఓ విదేశీ ఆటగాడు భారత దేశ అత్యుత్తమ క్రికెట్ టోర్నీ అయిన రంజీ ట్రోఫీని కైసవం చేసుకున్నాడు. ఇంగ్లండ్కు చెందిన అల్బర్ట్ ఫ్రెడ్రిక్ వెన్ల్సే (Albert Frederick Wensley) నావానగర్ (Nawanagar) అనే జట్టుకు నేతృత్వం వహించి ఛాంపియన్గా నిలబెట్టాడు.తద్వారా ఫ్రెడ్రిక్ రంజీ ట్రోఫీ గెలిచిన తొలి విదేశీ కెప్టెన్గా చరిత్రలో నిలిచాడు. ఆల్రౌండర్ అయిన ఫ్రెడ్రిక్ కోచ్గా వచ్చి, ఆటగాడిగా మారి నావానగర్కు తొలి టైటిల్ అందించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇది మరిచిపోలేని అధ్యాయం.బాంబేలోని జింంఖానా మైదానంలో బెంగాల్తో జరిగిన ఫైనల్లో నావానగర్ అద్భుత ప్రదర్శన చేసి ఛాంపియన్గా అవతరించింది. 1937, ఫిబ్రవరి 6-10 మధ్యలో జరిగిన ఆ మ్యాచ్లో నావానగర్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (424) చేసింది. వినూ మన్కడ్ (185) సెంచరీతో కదంతొక్కాడు. సోరబ్జీ కోలా (66) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం బరిలోకి దిగిన బెంగాల్.. ఫ్రెడ్రిక్ వెన్ల్సే (4/93) ధాటికి 315 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఇన్నింగ్స్లో పాల్ వాన్ డర్ గచ్ట్ (79) అర్ద సెంచరీతో రాణించాడు.109 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నావానగర్ 383 పరుగులకు ఆలౌటై, బెంగాల్ ముందు 493 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో ఫ్రెడ్రిక్ వెన్ల్సే (4/46) మరోసారి చెలరేగడంతో బెంగాల్ 236 పరుగులకే ఆలౌటై, 256 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఫ్రెడ్రిక్ వెన్ల్సే అద్భుతమైన బౌలింగ్తో నావానగర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఓ విదేశీ ఆటగాడు కోచ్గా వచ్చి, కెప్టెన్గా మారి, ఛాంపియన్గా నిలిచిన ఈ ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. ఈ ఘట్టం రంజీ ట్రోఫీకి అంతర్జాతీయ గౌరవాన్ని తెచ్చింది. ఫ్రెడ్రిక్ వెన్ల్సే తర్వాత టామ్ లాంగ్ఫీల్డ్, హెర్బర్ట్ బారిట్ అనే ఇంగ్లీష్ ఆటగాళ్లు బెంగాల్ (1938-39), వెస్ట్రన్ ఇండియా (1943-44) జట్లను రంజీ ఛాంపియన్లుగా నిలబెట్టారు. చదవండి: యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం -
జైస్వాల్ కీలక నిర్ణయం
భారత టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో దేశవాలీ క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. త్వరలో జరుగనున్న రంజీ ట్రోఫీ 2025/26 (Ranji Trophy) మూడో రౌండ్ మ్యాచ్ ఆడేందుకు సన్నద్దత వ్యక్తం చేస్తూ.. తన హోం టీమ్ మేనేజ్మెంట్కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు.జైస్వాల్ కొద్ది కాలం క్రితం తన హోం టీమ్ ముంబైని కాదని గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే తదనంత పరిణామాల్లో యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా రాజస్తాన్తో జరిగబోయే మూడో రౌండ్ మ్యాచ్కు ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.ఈ మ్యాచ్ నవంబర్ 1 నుంచి జైపూర్లో జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ D భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. ముంబై మేనేజ్మెంట్ తమను కాదని వెళ్లిపోవాలని చూసిన జైస్వాల్కు అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అవకాశం ఇస్తే అతను ముంబై జట్టులో కీలకమవుతాడు.జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో పాల్గొన్నాడు. అయితే అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ల టీ20ల సిరీస్కు అతను ఎంపిక కాలేదు. దీంతో దేశీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.టీమిండియా తరఫున కమిట్మెంట్స్ లేని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకే జైస్వాల్ కూడా రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మూడో రౌండ్కు ముంబై జట్టును త్వరలో ప్రకటిస్తారు.జైస్వాల్ గత సీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. జైస్వాల్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను ఈ ఏడాది ఆగస్ట్లో ఆడాడు. దులీప్ ట్రోఫీ 2025లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగాడు.రంజీ ట్రోఫీలో ఆడటం జైస్వాల్కు వ్యక్తిగతంగా కలిసొస్తుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే హోం సిరీస్కు ముందు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఆ సిరీస్లో భారత్ రెండు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జైస్వాల్కు టెస్ట్ జట్టులో చోటు పక్కా కాగా.. వన్డే, టీ20ల్లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లు నవంబర్ 14 (కోల్కతా), నవంబర్ 22 (గౌహతి) తేదీల్లో జరుగనున్నాయి.చదవండి: వెస్టిండీస్ బోణీ -
పక్కటెముకల్లో రక్తస్రావం.. ఐసీయూలో శ్రేయస్ అయ్యర్
భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి సీరియస్గా మారింది. ఆ మ్యాచ్లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ ఎడమ వైపు రిబ్ కేజ్పై పడిపోయాడు. మొదట్లో స్వల్ప నొప్పిగా కనిపించినా, డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెడికల్ టీమ్ ఆయనను ఆసుపత్రికి తరలించింది.సిడ్నీలోని ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు, శ్రేయస్కు అంతర్గత రక్తస్రావం (internal bleeding) ఉందని గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి, రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉంచారు. రక్తస్రావం ఆగే వేగం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఆధారంగా శ్రేయస్ను మరో రెండు నుంచి ఏడు రోజులు ఐసీయూలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందించారు. శ్రేయస్కు స్ప్లీన్లో లాసరేషన్ గాయం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రేయస్ అరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీమ్.. సిడ్నీ, భారత్లో ఉన్న వైద్యులను సమన్వయం చేసుకుంటూ శ్రేయస్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత డాక్టర్ శ్రేయస్తో పాటే ఉండి రోజువారీగా అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలిపారు.30 ఏళ్ల శ్రేయస్, ఇటీవలే టెస్ట్ క్రికెట్కు విరామం తీసుకుని వన్డేలపై ఫోకస్ పెంచనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో (11) నిరాశపరిచిన శ్రేయస్.. రెండో వన్డేలో పుంజుకొని 61 పరుగులు చేశాడు. శ్రేయస్ మరో 83 పరుగులు చేస్తే.. వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని తాకుతాడు.తాజాగా గాయం కారణంగా శ్రేయస్ త్వరలో (నవంబర్ 30) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో ఆడటం అనుమానంగా మారింది. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులు దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఇటీవలికాలంలో శ్రేయస్ టీమిండియాకు ప్రధానాస్త్రంగా ఉన్నాడు. వన్డేల్లో నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ తురుపుముక్కగా మారాడు. సౌతాఫ్రికాతో సిరీస్కు శ్రేయస్ దూరమైతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చదవండి: భారత్తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు -
IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..!
టెస్ట్, వన్డే ఫార్మాట్లలో గుత్తాధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా జట్టుకు పొట్టి క్రికెట్ బలహీనత ఉంది. ముఖ్యంగా టీమిండియా ఎదురైనప్పుడు ఆ బలహీనత మరింత ఎక్కువవుతుంది. 2007 నుంచి భారత్తో ఆడిన 32 మ్యాచ్ల్లో (India vs Australia) ఆసీస్ కేవలం 11 మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు సాధించింది.ద్వైపాక్షిక సిరీస్ల్లో అయితే ఆసీస్ ట్రాక్ రికార్డు మరింత చెత్తగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 11 సిరీస్లు జరగ్గా, ఆసీస్ రెండింట మాత్రమే గెలుపొందింది. త్వరలో జరుగనున్న ఐదు మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో భారత్-ఆసీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్లపై ఓ లుక్కేద్దాం.తొలి పంజా మనదేభారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2007 అక్టోబర్ 20న జరిగింది. వన్ మ్యాచ్ సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆసీస్పై తొలి పంజా విసిరింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో సత్తా చాటింది. బౌలింగ్లో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. బ్యాటింగ్లో గౌతమ్ గంభీర్ (63), యువరాజ్ సింగ్ (31 నాటౌట్) రాణించారు.అనంతరం 2008 ఫిబ్రవరి 1న మెల్బోర్న్లో జరిగిన వన్ మ్యాచ్ సిరీస్లో (డే అండ్ నైట్) ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 74 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ మరో 52 బంతులు మిడిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.గంభీర్ మరోసారి..!2012 ఫిబ్రవరిలో ఇరు జట్ల మధ్య తొలి మల్టీ మ్యాచ్ సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో గంభీర్ (56 నాటౌట్) టీమిండియాను గెలిపించాడు. యువీ విధ్వంసం2013 అక్టోబర్లో జరిగిన మరో వన్ మ్యాచ్ సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆరోన్ ఫించ్ (89) చెలరేగడంతో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం యువరాజ్ సింగ్ (77 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.చెలరేగిన కోహ్లి.. వైట్వాష్మళ్లీ మూడేళ్ల తర్వాత (2016, జనవరి) భారత్, ఆసీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మూడు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0తో వైట్వాష్ చేసింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు (90 నాటౌట్, 59 నాటౌట్, 59) బాది టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ కూడా రెండు అర్ద సెంచరీలతో రాణించాడు.రాణించిన శిఖర్అనంతరం 2017 అక్టోబర్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ (భారత్), 2018 నవంబర్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లు (ఆస్ట్రేలియా) 1-1తో డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి సత్తా చాటారు. ఈ సిరీస్లోని చివరి మ్యాచ్లో కృనాల్ పాండ్యా (4-0-36-4) అదరగొట్టాడు.తొలి పరాభవం2019లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్లో పర్యటించింది. ఈ సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి సత్తా చాటారు.హ్యాట్రిక్ విక్టరీస్ఆతర్వాత భారత్ వరుసగా 2020 (ఆస్ట్రేలియాలో), 2022 (భారత్లో), 2023 (భారత్లో) సిరీస్ల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 2020 సిరీస్లో రాహుల్, ధవన్, కోహ్లి, నటరాజన్, చహల్ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 2022 సిరీస్లో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 2-1 తేడాతో గెలుపొందింది.యువ ఆటగాళ్ల హవా.. రుతురాజ్ విధ్వంసకర శతకం2023లో జరిగిన సిరీస్లో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫలితంగా భారత్ 4-1 తేడాతో ఆసీస్ను ఖంగుతినిపించింది. ఈ సిరీస్లోని మూడో మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకం బాదాడు.చదవండి: రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..! -
టీమిండియాకు బిగ్ షాక్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్ 26) బంగ్లాదేశ్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా ఇన్ ఫామ్ ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్ మ్యాచ్కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది.ప్రస్తుతానికి ప్రతిక గాయంపై ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొలింది. ప్రతిక న్యూజిలాండ్తో జరిగిన చివరి మ్యాచ్లో స్మృతి మంధనతో సహా విధ్వంసకర శతకం బాదిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపంచకప్లో ప్రతిక మంధనతో కలిసి భారత్కు శుభారంభాలు అందిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.అలాంటి ప్రతిక ఆసీస్తో జరుగబోయే డూ ఆర్ డై సెమీఫైనల్ మ్యాచ్కు దూరమైతే, టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి.మ్యాచ్ రద్దునవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిన్న జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 119 పరుగుల స్వల్ప స్కోర్కు పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి మిడ్వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతిక తీవ్రంగా గాయపడింది.విలవిలాడిపోయిన ప్రతికమైదానం చిత్తడిగా ఉండటంతో రన్నింగ్ చేసే సమయంలో ప్రతిక కుడి కాలి మడమ మడతపడింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్కు తీసుకెళ్లారు. ఆతర్వాత ఆమె తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఆమె స్థానంలో అమన్జోత్ కౌర్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించింది.ఛేదనలో అమన్జోత్, మంధన 8.4 ఓవర్లలో 57 పరుగులు జోడించాక వర్షం మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్ను రద్దు చేశారు.రికార్డుల ప్రతికప్రతిక న్యూజిలాండ్తో జరిగిన గత మ్యాచ్లో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో చేసిన సెంచరీ ఆమెకు ప్రపంచకప్ టోర్నీలో మొదటిది. ఈ మ్యాచ్లో ఆమె మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకరిగా నిలిచింది. అలాగే మంధన తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కింది.ప్రతిక దూరమైతే..?ప్రతిక ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు దూరమైతే టీమిండియా తీవ్రమైన కష్టాలు ఎదుర్కోనుంది. ప్రతిక స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్ ఎవరూ జట్టులో లేరు. ఐసీసీ అంగీకారంతో రిజర్వ్లలో లేని ప్లేయర్ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ప్రతిక పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది.టీమిండియాకు మరో సమస్యప్రతిక గాయానికి ముందే టీమిండియా మరో సమస్య ఉండింది. న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా వికెట్కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ గాయపడింది. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. సెమీస్ మ్యాచ్కు రిచా అందుబాటులో ఉంటుందా లేదా అన్నదానిపై కూడా ప్రస్తుతానికి సమాచారం లేదు. గాయాల నేపథ్యంలో టీమిండియా సెమీస్లో పటిష్టమైన ఆసీస్ను ఏమేరకు నిలువరించగలదో చూడాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్ -
ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్
ఊహించిన విధంగానే జరిగింది. యాషెస్ సిరీస్ (Ashes Series 2025-26) తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) దూరమయ్యాడు. వెన్నెముకలో స్ట్రెస్ ఇంజ్యూరీ కారణంగా కమిన్స్ జూలై నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. కమిన్స్ గైర్హాజరీలో తొలి టెస్ట్కు కెప్టెన్గా స్టీవ్ స్మిత్ (Steve Smith) ఎంపికయ్యాడు. ఈ విషయాలను క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21న పెర్త్లో తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. కమిన్స్ స్థానాన్ని స్కాట్ బోలాండ్ భర్తీ చేసే అవకాశం ఉంది. బోలాండ్.. జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్తో కలిసి తొలి టెస్ట్లో బౌలింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు.ప్రస్తుతం కమిన్స్ రన్నింగ్ చేయగలుగుతున్నా, బౌలింగ్ చేయడం లేదు. పూర్తి రికవరీకి కనీసం నాలుగు వారాల సమయపడుతుందని అతనే స్వయంగా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ 4న బ్రిస్బేన్లో ప్రారంభమయ్యే రెండో టెస్ట్కు కమిన్స్ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తుంది.స్టీవ్ స్మిత్ విషయానికొస్తే.. 2018లో సాండ్పేపర్ వివాదం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన స్మిత్, కమిన్స్ వైస్ కెప్టెన్గా కొనసాగుతూ ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో తాత్కాలిక నాయకత్వం వహించాడు. ఆసక్తికరంగా, కెప్టెన్గా ఉన్నప్పుడు స్మిత్ బ్యాటింగ్ యావరేజ్ 68.98గా ఉండగా, సాధారణంగా అది 49.9 మాత్రమే.కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల యాషెస్ 2025-26 సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ నవంబర్ 21న పెర్త్లో, రెండో టెస్ట్ డిసెంబర్ 4న బ్రిస్బేన్లో, మూడో టెస్ట్ డిసెంబర్ 17న అడిలైడ్లో, నాలుగో టెస్ట్ డిసెంబర్ 26న మెల్బోర్న్లో, ఐదో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 4న సిడ్నీలో ప్రారంభం కానున్నాయి.స్వదేశంలో జరిగే ఈ సిరీస్ను ఆస్ట్రేలియా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్కు కమిన్స్ దూరం కావడం వారికి ఎదురుదెబ్బే. మరోవైపు ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ కూడా గట్టిగానే కసరత్తు చేస్తుంది. నెల ముందుగానే జట్టును ప్రకటించి సన్నద్దతను వ్యక్తం చేసింది.యాషెస్ సిరీస్ 2025-26కి ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేకబ్ బేతెల్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, ఓలీ పోప్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, మాథ్యూ పాట్స్చదవండి: అదరగొట్టిన తెలుగు టైటాన్స్ -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్కే పరిమితమైన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (అక్టోబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో (India vs Bangladesh) టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బంగ్లాదేశ్ను 119 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.బంగ్లా ఇన్నింగ్స్లో 36 పరుగులు చేసిన షర్మిన్ అక్తర్ టాప్ స్కోరర్గా నిలువగా.. శోభన మోస్తరి (26), రుబ్యా హైదర్ (13), రితూ మోనీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో సుమయ్యా అక్తర్ 2, కెప్టెన్ నిగార్ సుల్తానా 9, షోర్నా అక్తర్ 2, నహీద అక్తర్ 3, రబేయా ఖాన్ 3, నిషిత అక్తర్ 4 (నాటౌట్), మరుఫా అక్తర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు తీయగా.. శ్రీచరణి 2, రేణుకా సింగ్, దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ తలో వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం -
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కర్నూలు యువకుడు
రాంచీ వేదికగా జరిగిన నాలుగో దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో (South Asian Athletics Championship 2025) ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన మొగలి వెంకట్రాం రెడ్డి (Mogali Venkatramreddy) సత్తా చాటాడు. 800 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ ఈవెంట్ను వెంకట్రాం రెడ్డి 1:52.37 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.ఈ గేమ్స్లో భారత్తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు.వెంకట్రాం రెడ్డి పతకం సాధించిన అనంతరం హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అథ్లెటిక్స్ కోచ్ డా. జి.వి. సుబ్బారావు స్పందించారు. "ఇది దేశానికి గర్వకారణం. వెంకట్రాం రెడ్డి అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించాడు. ఇది అతని శ్రమకు ఫలితమని అన్నాడు.వెంకట్రాం రెడ్డి ఇటీవల భువనేశ్వర్లో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 800 మీటర్లు, 1500 మీటర్ల ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించి "గోల్డెన్ డబుల్" సాధించాడు. చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
సచిన్ గారాల పట్టీ.. సారా టెండూల్కర్ క్యూట్ ఫొటోస్ చూశారా?
-
ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే మ్యాచ్
-
అటు శర్మ.. ఇటు స్మృతి! ఇద్దరికి తిరుగులేదు
-
సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
2027 వరల్డ్ కప్ కొట్టాకే రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన హిట్ మ్యాన్
-
అంత పొగరెందుకు? అయ్యర్ పై మాజీ క్రికెటర్ ఫైర్!
-
పాక్ ను చిత్తు చేసిన భారత మహిళల జట్టు
-
వెండి బతుకమ్మ.. భర్తతో కలిసి ఆడిన పీవీ సింధు (ఫొటోలు)
-
తగ్గే సమస్యే లేదు.. తెగేసి చెప్పిన భారత్
-
తొలి మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ విజయం
-
నాడు అవమానించారు.. నేడు అతనే కాపాడాడు
-
తెలుగోడి సత్తా చాటిన తిలక్ వర్మ
-
పాక్ కు చెంపదెబ్బ.. ట్రోఫీ నిరాకరించిన భారత్
-
ఆసియా కప్ భారత్దే... ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో విజయకేతనం
-
ఫైనల్ లో పాక్ ను చీల్చి చెండాడిన భారత్
-
BCCI అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నిక
-
ఆసియా కప్ లో ఆఖరి పోరాటం
-
హార్దిక్ అవుట్? బుమ్రా డౌట్? అతడే దిక్కు!
-
సూర్య వంశీ దెబ్బ.. వణికిన ఆస్ట్రేలియా.. సిరీస్ భారత్ కైవసం
-
ఆసియా కప్ లో ఫైనల్ కు టీమిండియా
-
మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైన భారత్
-
Asia Cup 2025: పాక్ ను చిత్తు చేసిన భారత్
-
సండే గ్రేట్ వార్.. మ్యాచ్ కు ముందు భారత్ కు షాక్
-
జస్ట్ మిస్..! టీమిండియాని వణికించిన ఒమన్
-
భారత్ అంటే ఇంత భయమా..? బయటపడ్డ పాక్ డ్రామా
-
మాజీ వరల్డ్ ఛాంపియన్ ఆన్ జొంగ్యీకి ముచ్చెమటలు పట్టించిన వైశాలి
-
షేక్ హ్యాండ్ వివాదంపై పాక్కు ఇచ్చిపడేసిన బీసీసీఐ
-
భారత్-పాక్ మ్యాచ్ లో హ్యాండ్ షేక్ వివాదం
-
చీల్చిచెండాడిన భారత్.. పాక్ చిత్తుచిత్తు.. హైలైట్స్ ఇవే
-
Team India: వాళ్ళు లేక విల విల! అది రో-కో రేంజ్
-
చిక్కుల్లో ఆసియా కప్
-
ఆసియా కప్ టీ-20లో టీమిండియా బోణి
-
ఆసియా కప్ టోర్నీలో నేడు భారత్ తొలి మ్యాచ్
-
వెన్నుపోటు భయ్యా! శాంసన్ Sad స్టోరీ
-
భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
-
రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్..! ద్రవిడ్ గుడ్ బై
-
నాపై కుట్ర.. షమి కంటతడి
-
క్రికెట్కు పుజారా గుడ్ బై
-
గిల్ దెబ్బకు ఆ ఇద్దరూ అబ్బా!
-
అసలు రంగు బయటపడింది
-
ధోని పై రివేంజ్.. గంభీర్ ది బాస్
-
India vs England: ఆఖరి పంచ్ ఎవరిది..?
-
ది ఓవల్ టెస్ట్ లో ముగిసిన మూడో రోజు ఆట
-
ఓవల్ టెస్ట్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడు
-
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్ట్ లో ముగిసిన తొలిరోజు ఆట
-
భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్
-
ఇంగ్లండ్ తో నాలుగో టెస్ట్ డ్రా
-
మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో భారత్ నాలుగో టెస్ట్
-
భారత మహిళలదే వన్డే క్రికెట్ సిరీస్
-
క్రికెట్ లోనూ ఇంతేనా? తమిళ కుర్రాడిపై ఢిల్లీ పెద్దల కుట్రలు
-
HCA అక్రమాలపై ఇవాళ రెండో రోజు విచారణ
-
మూడు వన్డేల సిరీస్ లో భారత్ శుభారంభం
-
లార్డ్స్ టెస్ట్ లో భారత్ ఓటమి
-
భర్తతో సైనా నెహ్వాల్ విడాకులు
-
లార్డ్స్ టెస్ట్: ముగిసిన నాలుగో రోజు ఆట
-
మరోసారి బజారున పడిన HCA ఇమేజ్
-
లార్డ్స్ టెస్ట్: ముగిసిన రెండో రోజు ఆట
-
తొలిరోజు ఆటలో భారత్దే పైచేయి
-
HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సహా ఐదుగురి ఎంక్వైరీ
-
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మరో టెస్ట్ మ్యాచ్ కు రంగం సిద్ధం
-
బర్మింగ్హామ్ రెండో టెస్టులో భారత్ ఘనవిజయం
-
టీమ్ లో కరివేపాక్.. గంభీర్ కోటాతో ఇండియా కొంపకూలుతుందా?
-
రెండో ఇన్నింగ్స్ లోనూ దంచి కొట్టిన టీమిండియా
-
ఇంగ్లండ్ తో రెండో టెస్టుపై పట్టుబిగించిన భారత్
-
సెకండ్ టెస్టులో ఇండియా ఓడిపోతుందా?
-
టీ-20 సిరీస్ లో బోణీ కొట్టిన టీమిండియా ఉమెన్స్ జట్టు
-
వెళ్లి పక్కన కూర్చొ.. గంభీర్ తో పంత్ ఫైట్
-
సత్తా చాటిన నీరజ్ చోప్రా
-
లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం
-
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట ముగింపు
-
ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్ట్ రెండో రోజు ముగిసిన ఆట
-
తొలిరోజే ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన భారత్
-
సన్ రైజర్స్ ఫ్రాంఛైజ్ రద్దు కానుందా..?
-
భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ మ్యాచ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం
-
ఇంగ్లండ్ తో టెస్ట్ ఛాంపియన్ షిప్ కు సిద్ధమైన భారత్
-
టీమిండియాకు బిగ్ షాక్
-
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత అల్కరాస్
-
RCB సంబరాల్లో విషాదం.. ఏడుగురు మృతి
-
Bangalore: చిన్నస్వామి స్టేడియంలో దారుణం
-
RCB Vs PBKS: ఈ సాలా కప్ నమ్దు.. 18 ఏళ్ల కల.. ఏడ్చేసిన కోహ్లి
-
ఐపీఎల్ 2025 విజేత RCB.. 18 ఏళ్ల కల
-
క్వాలిఫయర్-2లో ముంబైపై పంజాబ్ ఘనవిజయం
-
ఫైనల్స్ కి చేరేదెవరు?
-
నేడు IPL 18వ సీజన్ లో మరో ఆసక్తికర పోరు
-
గుజరాత్ పై 20 రన్స్ తేడాతో గెలిచిన ముంబై
-
ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశి
-
ఫైనల్స్ కు ఆర్సీబీ..
-
శ్రేయాస్ ఎవరో నాకు తెలీదు.. గంభీర్ నోటి దురద
-
ఇవాల్టి నుంచి ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ లు
-
ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB
-
సెంచరీలు మీద సెంచరీలు చేసినా..
టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, టైమ్ కూడా కలసిరావాలంటారు పెద్దవాళ్లు. అవును నిజమే.. ఎంత ప్రతిభ ఉన్నా కూడా, లక్ లేకపోతే వెనుబడిపోయే చాన్స్ ఉంది. టాలెంట్ను నిరూపించే వేదిక దొరక్కపోతే తెర మరుగు కావడం ఖాయం. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఆ బాధ వర్ణణాతీతం. పోటీ ఎక్కువగా ఉండే క్రీడల్లో దేశం తరపున ఆడే అవకాశం దక్కినా బరిలోకి దిగే చాన్స్ రాక చాలా మంది వెలుగులోకి రాలేకపోయారు.క్రికెట్ కెరీర్గా ఎంచుకున్న ప్రతి ప్లేయర్ దేశం తరపున ఆడాలని కలలుగంటారు. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా కష్టపడుతుంటారు. బ్లూ క్యాప్, జెర్సీతో బరిలోకి దిగాలని వర్ధమాన భారత క్రికెటర్లు అహరహం శ్రమిస్తుంటారు. కానీ జాతీయ జట్టులో ఆడే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. చాన్స్ దక్కించున్న వారిలో నిలదొక్కునే వారు అతి కొద్ది మంది మాత్రమే. ఇక జట్టులో చోటు దక్కినా మైదానంలో బరిలోకి దిగే అవకాశం రాని దురదృష్టవంతులూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఒకరు.విషయం అర్థమైందిదేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ప్రియాంక్ పంచల్ టీమిండియా (Team India) తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్మెన్లో ఒకరైన 35 ఏళ్ల ఈ స్టార్ గుజరాతీ బ్యాటర్.. మూడు ఫార్మాట్లలో ఏ ఒక్కదానిలోనూ భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. దీంతో 17 ఏళ్ల క్రికెట్ కెరీర్కు తాజాగా వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం ప్రకటించాడు. 'టీమిండియాలో ఎప్పటికీ నాకు చోటు దక్కదనే విషయం అర్థమైంది' అంటూ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.చాన్స్ రాలేదుడొమెస్టిక్ సూపర్స్టార్గా పేరొందిన ప్రియాంక్.. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించి సత్తా చాటాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్లలో ఒకరైన ప్రియాంక్ పేరు పలుమార్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందు వచ్చింది. 2021-22లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి దగ్గరగా వచ్చాడు కానీ బ్లూ క్యాప్ దక్కించులేకపోయాడు. టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మ స్థానంలో రిజర్వ్ ఓపెనర్గా ఎంపికయ్యాడు కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. 2022లోనూ శ్రీలంక టూర్కు సెలెక్ట్ అయినా అరంగ్రేటం చేసే చాన్స్ రాలేదు.టైమ్ ముఖ్యంతనకు జాతీయ జట్టులో ఆడేందుకు రాసిపెట్టి లేదని భావించిన ప్రియాంక్ ఇప్పటి వరకు దేశీయ క్రికెట్లోనే కొనసాగుతూ తానేంటో నిరూపించుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలు చేసినా, టైమ్ కలిసి రాకపోతే తనలాగే అవుతుందని సరిపెట్టుకున్నాడు. 'క్రికెట్లో నిలకడగా ఆడాలి. ఆటగాడిగా మంచి ప్రదర్శన ఇవ్వాలి. సరైన సమయంలో ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అంతర్జాతీయ క్రికెట్లో సమయం చాలా విలువైనది. నిలకడగా 100 తర్వాత 100 పరుగులు చేస్తూనే ఉన్నప్పటికీ.. మీ జట్టు గెలవకపోతే, అది సరైన సమయం కాదు. కానీ 30 పరుగులు చేసినప్పటికీ.. జట్టు గెలిస్తే మీ సహకారం చాలా విలువైనది. అంతర్జాతీయ క్రికెట్కు అది అవసరం. దాని నుండి నేను చాలా నేర్చుకున్నాన'ని ప్రియాంక్ పేర్కొన్నాడు.బాధగానే ఉంది.. కానీటీమిండియా తరపున ఆడలేకపోవడం బాధగానే ఉందని ప్రియాంక్ చెప్పాడు. అయితే క్రికెట్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకునే అవకాశం రావడం మామూలు విషయం కాదన్నాడు. రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా ఆలోచన చేస్తున్నానని, ఇప్పుడే సరైన సమయం అని భావించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. చదవండి: ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరేనా?'రిటైర్ అవ్వాలనే ఆలోచన నా మనసులో చాలా కాలంగా ఉంది. ఎందుకంటే, నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. టీమిండియాకు ఆడాలన్న ఆకాంక్ష నన్ను నడిపించేంది. క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడి జాతీయ జట్టులో చోటు కోసం శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అవకాశాలు చేజారాక నేను ఆచరణాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. టీమిండియాలో నాకు ఇక చోటు దక్కదని గ్రహించాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాన'ని ప్రియాంక్ వివరించాడు. -
కోల్ కతాపై హైదరాబాద్ ఘనవిజయం
-
IPL మ్యాచ్ లు ఎలా షూట్ చేస్తారు? తెరవెనుక రహస్యాలు..!
-
శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటించిన బీసీసీఐ
-
విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?
-
బెంగళూరుపై హైదరాబాద్ విజయం
-
ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై
-
తిరుమలలో గౌతమ్ గంభీర్
-
మళ్ళీ ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2025
-
రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం
-
కుళ్లుబోతు రాజకీయాలు
-
సచిన్, విరాట్ తర్వాత నంబర్-4 పొజిషన్ ఎవరిది?
-
గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!
-
రిటైర్ మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి
-
IPL రీస్టార్ట్ పై బీసీసీఐ కీలక నిర్ణయం
-
ఐపీఎల్ రద్దు
-
ఐపీఎల్ కు ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్
-
ఐపీఎల్ లో సన్ రైజర్స్ తో ఢిల్లీ కీలక పోరు
-
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం


