అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. కెనడాపై 57 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో శుభారంభం చేసింది. సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ 59 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన దక్షిణాఫ్రికా జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ 59 పరుగులు చేయగా..మిల్లర్ 39, స్టబ్స్ 34 తలో చేయి వేశారు. కెనడా జట్టులోని అన్ష్ పటేల్ 3 వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో కెనడా జట్టు మొదటి నుంచే వికెట్లు వరసగా కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత ఓవర్లన్నీ పూర్తి చేసినప్పటికీ 8వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.నవనీత్ దలివాళ్ 64, హర్ష్ థాకర్ 33 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4 వికెట్లు, జాన్సన్ 2, రబాడా, కార్బిన్ తలో వికెట్ పడగొట్టారు.


