అనుకున్నదే జరిగింది.. రోహిత్‌, కోహ్లికి డిమోషన్‌ | Virat Kohli, Rohit Sharma Demoted To Grade B In BCCI Central Contract List For 2025-26 | Sakshi
Sakshi News home page

అనుకున్నదే జరిగింది.. రోహిత్‌, కోహ్లికి డిమోషన్‌

Feb 9 2026 9:08 PM | Updated on Feb 9 2026 9:13 PM

Virat Kohli, Rohit Sharma Demoted To Grade B In BCCI Central Contract List For 2025-26

2025-26 బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ల విషయంలో అనుకున్నదే జరిగింది. టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి డిమోషన్‌కు గురయ్యారు. గత వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉండిన ఈ ఇద్దరు.. ఇవాళ (ఫిబ్రవరి 9) అధికారికంగా ప్రకటించిన కాంట్రాక్ట్‌ల్లో బి గ్రేడ్‌కు పడిపోయారు. 

ఇలా జరగడానికి కారణం​ లేకపోలేదు. రోహిత్‌, విరాట్‌ టీ20, టెస్ట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించి కేవలం​ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం కనీసం రెండు ఫార్మాట్లలోనైనా కొనసాగుతుంటేనే అత్యుత్తమ కాంట్రాక్ట్‌ లభిస్తుంది. 

తాజాగా బీసీసీఐ తమ అత్యుత్తమ కాంట్రాక్ట్‌ అయిన ఏ ప్లస్‌ గ్రేడ్‌ను పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు అత్యుత్తమ కాంట్రాక్ట్‌ అంటే ఏ గ్రేడ్‌ కేటగిరి. ఇందులో ఉండాలంటే టీమిండియా తరఫున కనీసం రెండు ఫార్మాట్లలోనైనా కొనసాగుతుండాలి. రో-కో ప్రస్తుతం ఒక్క ఫార్మాట్‌క మాత్రమే పరిమితమయ్యారు కాబట్టి ఆటోమేటిక్‌గా బి గ్రేడ్‌కి పడిపోయారు. 

తాజా వార్షిక కాంట్రాక్ట్‌ల్లో కేవలం ముగ్గురికి మాత్రమే ఏ గ్రేడ్‌ లభించింది. టెస్ట్‌, వన్డే జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మాత్రమే ఈ కాంట్రాక్ట్‌ పరిధిలో ఉన్నారు.

గ్రేడ్‌ బిలో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో పాటు కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు.

గ్రేడ్‌ సిలో అక్షర్‌ పటేల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, సంజూ శాంసన్‌, అర్షదీప్‌ సింగ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌, ధృవ్‌ జురెల్‌, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిషేక్‌ శర్మ, సాయి సుదర్శన్‌, రవి బిష్ణోయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉన్నారు. 

ఆయా కాంట్రాక్ట్‌ల్లో ఉన్న వారికి వార్షిక వేతనం కింద ఎంత మొత్తం అందనుందో తెలియరాలేదు. గత వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉండిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజాకు రూ. 7 కోట్లు లభించేవి. గ్రేడ్‌-ఏలో ఉండిన వారికి రూ. 5 కోట్లు, గ్రేడ్‌-బిలో ఉండిన వారికి రూ. 3 కోట్లు, గ్రేడ్‌-సిలో ఉండిన ప్లేయర్లకు రూ. కోటి రూపాయలు లభించేవి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement