ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో యూఎస్ఏ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమతమైంది. దీంతో 29 పరుగుల తేడాతో యూఎస్ఏ జట్టు ఓటమి చవిచూసింది. అమెరికా జట్టులో సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే చెరో 37 పరుగులు చేయగా, మిలింద్ కుమార్ 34 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్టు దక్కింది.
గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలి మ్యాచ్లో యూఎస్ఏతో భారత్ తలపడింది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన యూఎస్ఏ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్కు దిగింది.
సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్విక్ నాలుగు వికెట్లతో రాణించాడు. హర్మీత్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్ చెరో వికెట్టు తీశారు.


