breaking news
cricket news
-
లైవ్ మ్యాచ్లో భయానక ఘటన.. ఐసీయూ బెడ్పై అంపైర్!
ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, న్యూఢిల్లీ టైగర్స్ మధ్య మ్యాచ్లో భయానక సంఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఆశిష్ మీనా వేసిన 18వ ఓవర్లో బ్యాటర్ లక్ష్య థరేజా ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ నేరుగా అంపైర్ ధర్మేశ్ భరద్వాజ్ ముఖాన్ని బలంగా తాకింది. దీంతో అంపైర్ నొప్పితో విలవిల్లాడిపోయారు. అదే సమయంలో తాను కొట్టిన బంతి అంపైర్కు బలంగా తాకడంతో లక్ష్య థరేజా బాధను వ్యక్తం చేశాడు. అయితే తాజా నివేదిక ప్రకారం అంపైర్ భరద్వాజ్ పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే మ్యాచ్లో అంతకముందే అంపైర్ భుజం గాయానికి గురయ్యారు.మ్యాచ్ విషయానికొస్తే ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 36 పరుగుల తేడాతో న్యూఢిల్లీ టైగర్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. మయాంక్ రావత్ (40) టాప్ స్కోరర్గా నిలవగా, వాన్స్ మెహ్రా (35), అర్పిత్ రానా (33) రాణించారు. న్యూఢిల్లీ టైగర్స్ బౌలర్లలో రిషబ్ శర్మ 3 వికెట్లు తీయగా, లక్ష్మణ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూఢిల్లీ టైగర్స్ 19.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హిమ్మత్ సింగ్ (31), లక్ష్య థరేజా (21) పర్వాలేదనిపించారు. ఈస్ట్ ఢిల్లీ బౌలర్లలో ఆశిశ్ మీనా, మయాంక్ యాదవ్లు చెరో 3 వికెట్లు పడగొట్టారు.చదవండి: జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్.. కానీ ఒక కండిషన్! -
లంకకు ఎదురుదెబ్బ.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ క్రికెటర్!
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆ జట్టు ఆటగాడు దినేశ్ చందిమల్ గాయానికి గురయ్యాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో కేఎల్ రాహుల్ ఆడిన స్వీప్షాట్ను అడ్డుకునే ప్రయత్నంలో బౌండరీ లైన వద్ద ఉన్న రోప్ అడ్డుతగలడంతో అతడి మెడ బాగానికి గాయమైంది. దీంతో ఫిజియో వచ్చి చందిమల్ను పరీక్షించారు. నొప్పితో బాధపడుతున్న చందిమల్ను తదుపరి స్కానింగ్ల కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో పసిందు సూరియబండారా సబ్స్టిట్యూట్ ఫీల్డర్గాఆ వచ్చాడు. తాజా గాయంతో లంక రెండో ఇన్నింగ్స్ సమయంలో చందిమల్ బ్యాటింగ్కు వస్తాడా రాడా అనేది అనుమానంగా మారింది. ‘‘నాలుగో రోజు తొలి సెషన్లో ఫీల్డింగ్ చేస్తుండగా బౌండరీని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు దినేష్ చండిమాల్ కుడి భుజానికి, మెడకు గాయమైంది. మైదానంలోనే జట్టు ఫిజియోథెరపిస్ట్, వైద్యులు అతడిని పరీక్షించారు. ముందుజాగ్రత్తగా స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సి) తెలిపింది.నాలుగో ఇన్నింగ్స్ సమయానికి చందిమల్ కోలుకోకపోతే మాత్రం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే చందిమల్ దూరమైతే అప్పుడు లంక జట్టు 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. మరోవైపు లంక సీనియర్ బ్యాటర్ అయిన చందిమల్కు భారత్పై మంచి రికార్డు ఉంది. టీమిండియాపై 9 టెస్టులాడిన చందిమల్ 754 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, మూడు అర్ధసెంచరీలున్నాయి.ఇక టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించడంతో భారత్కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వేగంగా ఆడి లంక ఎదుట భారీ టార్గెట్ను నిర్దేశించాలని భావిస్తోంది. ఆటకు మరో రోజు సమయం మిగిలి ఉంది.Sri Lanka batter Dinesh Chandimal has been taken to the hospital for a precautionary scan after injuring his right shoulder and neck while diving to save a boundary on day four of the first Test against India at the Galle International Stadium on Tuesday."Dinesh Chandimal… pic.twitter.com/30cqMwPpcY— IANS (@ians_india) August 18, 2026Read: రాహుల్ను కాపాడిన పడిక్కల్.. ముద్దు పెట్టే ప్రయత్నం! -
రాహుల్ను కాపాడిన పడిక్కల్.. ముద్దు పెట్టే ప్రయత్నం!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ను తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ తెలివైన నిర్ణయంతో కాపాడాడు. విషయంలోకి వెళితే.. భారత్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 11వ ఓవర్ ప్రబాత్ జయసూరియా వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని 25 పరుగులతో ఆడుతున్న రాహుల్ భారీ సిక్సర్గా మలిచాడు. అయితే మరుసటి బంతిని రాహుల్ మిస్ చేయడంతో బంతి ప్యాడ్లను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీంతో లంక ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అయితే మొదట కేఎల్ రాహుల్ తాను ఔటయ్యానని భావించి రివ్యూ తీసుకోవడానికి ఆలోచించాడు. అదే సమయంలో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న పడిక్కల్ మాత్రం రివ్యూకు వెళ్లాలని రాహుల్కు సైగ చేశాడు. దీంతో రాహుల్ రివ్యూ కోరాడు. ఇక రివ్యూలో బంతి బ్యాట్కు ఎక్కడా తగల్లేదు, కానీ లైన్లోనే వెళ్లడంతో మొదట ఔట్ అనిపించినప్పటికీ, బంతి స్టంప్స్ పైనుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో లంక ఆటగాళ్లు నిరాశలో మునిగిపోగా, కేఎల్ రాహుల్ మాత్రం పడిక్కల్ వద్దకు వచ్చి అతన్ని హగ్ చేసుకున్నాడు. రివ్యూ తీసుకోమని చెప్పినందుకు థాంక్స్ అన్నట్లుగా రాహుల్ అతడికి ముద్దు పెడుతున్నట్లుగా బ్రొమాన్స్ చేయడం కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకవేళ పడిక్కల్ రివ్యూ తీసుకోవాలని చెప్పకపోయుంటే రాహుల్ పెవిలియన్ బాట పట్టేవాడే. అయితే తనకు లభించిన అవకాశాన్ని రాహుల్ వినియోగించు కోలేకపోయాడు. మళ్లీ అదే ప్రబాత్ జయసూరియా బౌలింగ్లో భారీ షషాట్కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు.ఇక టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించడంతో భారత్కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వేగంగా ఆడి లంక ఎదుట భారీ టార్గెట్ను నిర్దేశించాలని భావిస్తోంది. ఆటకు మరో రోజు సమయం మిగిలి ఉంది.KL Rahul hugged Devdutt Padikkal for asking Him to go upstairs to review the decision which was given out on-field. A beautiful moment. #SLVIND pic.twitter.com/ZhtI0jBzb2— Nibraz Ramzan (@nibraz88cricket) August 18, 2026KL Rahul hugging Devdutt Paddikal after a successful DRS suggested by him 😂 #SLvIND pic.twitter.com/vLEys0Vgk3— Prateek (@prateek_295) August 18, 2026 -
జైస్వాల్ ఏంటా పిచ్చి షాట్లు? రిపీటయితే అడ్రస్ గల్లంతే!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో దురదృష్టవశాత్తూ రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం తనకు అచ్చిరాని షాట్ ఆడి డకౌట్గా వెనుదిరిగాడు. టెస్టుల్లో జైస్వాల్ డకౌట్ కావడం ఇది ఏడోసారి. అశితా ఫెర్నాండో బంతిని స్టంప్ అవతల వేయగా, అనవసరంగా కట్షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే స్పందించిన కీపర్ డిక్వెల్లా ఎలాంటి తప్పు చేయకుండా ఎడ్జ్ తీసుకొని బంతిని అందుకున్నాడు. పేస్ బౌలింగ్లో కట్షాట్ ఆడే ప్రయత్నంలో జైస్వాల్ తరచూ విఫలమవుతున్నాడు. అయితే ఇదే జైస్వాల్ తన డెబ్యూ టూర్ ఇంగ్లండ్ సిరీస్లో 293 పరుగులు చేసి నాలుగుసార్లు మాత్రమే ఔటయ్యాడు. 2025 నుంచి చూసుకుంటే మాత్రం కట్షాట్ ఆడే ప్రయత్నంలో కేవలం 47 పరుగులు మాత్రమే చేసిన జైస్వాల్ నాలుగుసార్లు ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో తప్పుడు షాట్ల రేటు 31 శాతం నుంచి 48 శాతానికి పెరగడం గమనార్హం. అసలే టీమిండియా ఓపెనింగ్ స్లాట్కు పోటీ పెరిగిపోతున్న వేళ జైస్వాల్ విఫలమవ్వడం అతడి స్థానానికి ఎసరు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే వన్డే, టీ20 జట్టులో తీవ్ర పోటీ కారణంగా జైస్వాల్కు జట్టులో చోటు లభించడం లేదు. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తే త్వరలో ఇక్కడ కూడా చోటు కోల్పోవడం ఖాయం. పైగా సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి క్రికెటర్ల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోవడంతో సాయి సుదర్శన్ రెండో టెస్టు ఆడే అవకాశముంది. దీంతో రెండో టెస్టుకు జట్టు నుంచి సాయికి అవకాశమివ్వాలనుకుంటే జైస్వాల్ను తప్పించే చాన్స్ ఎక్కువగా ఉంటుంది."Yashasvi jaiswal Got out on 0 runs 😢He is good batsmen but he needs to be consistent.#SLvIND pic.twitter.com/q7cQeFsMch— Indian Cricket Team (@criclover451807) August 18, 2026Read: సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం! -
IND vs SL: విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్
SL Vs IND 1st Test Day-4 Updates: గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైన టీమిండియా.. శ్రీలంకకు 372 పరుగుల టార్గెట్ విధించింది.గెలుపునకు 6 వికెట్ల దూరంలో భారత్శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ గెలుపునకు 6 వికెట్ల దూరంలో ఉంది. 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవాలంటే చివరి రోజు 288 పరుగులు చేయాలి. ఇది అంతా సులువుగా జరిగే పని కాదు. భారత్ మాత్రం మరో 6 వికెట్లు తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. అయితే చివరి రోజు భారత గెలుపుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనల్ దినుష (25), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (31) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక21.4 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన లాహిరు ఉదార (16). శ్రీలంక స్కోరు: 47-4. సొనాల్ దినుష క్రీజులోకి రాగా.. ధనంజయ 19 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 33-3ఉదార 15, ధనంజయ 7 పరుగులతో ఉన్నారు. విజయానికి 339 పరుగుల దూరంలో శ్రీలంక.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక10.4 ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించిన కమిందు మెండిస్. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన కమిందు. లంక స్కోరు: 21-3. ఉదార 11 పరుగులతో ఉండగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ క్రీజులోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక7.2 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా పెవిలియన్ చేరిన పసిందు. అరంగేట్రంలోనే డకౌట్గా పసిందు. లంక స్కోరు 14-2. ఉదార 6 పరుగులతో ఉండగా.. కమిందు మెండిస్ క్రీజులోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక6.6: సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన నిశాన్ మధుష్క (6). లంక స్కోరు 13-1 (7). విజయానికి ఇంకా 359 పరుగులు కావాలి. ఉదార 5 పరుగులతో ఉండగా.. పసిందు సూరియబండారా క్రీజులోకి వచ్చాడు.లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకఆరు ఓవర్లలో స్కోరు: 12-0ఉదార 4, నిశాన్ 6 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 360 పరుగులు కావాలి.వర్షం వల్ల అంతరాయంశ్రీలంక లక్ష్య ఛేదనకు దిగాల్సి ఉండగా.. వాన వల్ల అంతరాయం కలిగింది193 పరుగులకు ఆలౌటైన టీమిండియాభారత్ రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైంది. తద్వారా శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ను ఉంచింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్190 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (5) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్188 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి మానవ్ సుతార్ (9) ఔటయ్యాడు.9 పరుగులు చేసిన జడేజాను లాహిరు కుమారా పెవిలియన్ చేర్చడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 357 పరుగులుగా ఉంది.పంత్ (66) ఔట్66 పరుగులు చేసిన పంత్ కుమారా బౌలింగ్లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో టీమిండియా 174 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 352 పరుగులుగా ఉంది.సిక్సర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పంత్లాహిరు కుమారా బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టిన పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న పంత్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యం 336 పరుగులు.36 ఓవర్లలో టీమిండియా స్కోరు 151-5పంత్ 47, జడేజా 4 పరుగులతో ఉన్నారు. భారత్ ఆధిక్యం 329 పరుగులు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియాఅసితా ఫెర్నాండో బౌలింగ్లో నిరోషన్ డిక్విల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధ్రువ్ జురెల్ (7). క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా. టీమిండియా స్కోరు 120-5 (31). పంత్ 23 పరుగులతో ఉన్నాడు.లంచ్ తర్వాత మొదలైన ఆటలంచ్ విరామంగాలే టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (21), ధ్రువ్ జురెల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 294 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో రాణించిన పడిక్కల్ (44) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ (35) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 2 వికెట్లు తీయగా, కెషారా, అశితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.పడిక్కల్ ఔట్.. నాలుగో వికెట్ డౌన్టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో తడబడుతోంది. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకుంటుంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో పడిక్కల్ 44 పరుగుల వద్ద కెషారా నువంతా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాఇన్నింగ్స్ 21వ ఓవర్లో శుబ్మన్ గిల్ (8) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. పడిక్కల్ (35), పంత్ (1) పరుగుతో ఆడుతున్నారు.రెండో వికెట్ డౌన్65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (35) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రబాత్ జయసూరియా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన రాహుల్ మిలన్ రత్ననాయకేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 243 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఫిఫ్టీ మార్క్ దాటిన టీమిండియారెండో ఇన్నింగ్స్లో 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 30, పడిక్కల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు భారత్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది.తొలి వికెట్ డౌన్గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 178 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. అశితా ఫెర్నాండో బౌలింగ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (1), పడిక్కల్ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. దినూష (100) శతకంతో రాణించగా, నిరోషన్ డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం!
గాలే వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, లంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా మధ్య జరిగిన మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, లంక బ్యాటర్లు డిక్వెల్లా, దినూషలు తమ జిడ్డు బ్యాటింగ్తో భారత బౌలర్లను ఇబ్బందిపెట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిరాజ్.. డిక్వెల్లాతో వాగ్వాదానికి దిగాడు. లంక ఇన్నింగ్స్ 54వ ఓవర్లో ఇది చోటచేసుకుంది. 54వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన సిరాజ్ డిక్వెల్లా బ్యాట్ను టార్గెట్గా చేసుకొని అదే పనిగా బంతులను విసిరాడు. పదే పదే తనను రెచ్చగొట్టేలా బంతులు వేయడంతో సహనం కోల్పోయిన డిక్వెల్లా సిరాజ్తో మాటల యుద్ధానికి దిగాడు. 'బంతులను సరిగ్గా వెయ్యు' అని డిక్వెల్లా అనగా.. సిరాజ్ 'సరే ఈసారి ఇంకా ఇబ్బంది పెడుతానులే' అని ఘాటుగా ప్రతిస్పందించాడు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరిని పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.ఇక టీమిండియాతో టెస్టు మ్యాచ్ ద్వారా మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నిరోషన్ డిక్వెల్లా మంచి ప్రదర్శనే చేశాడు. 115 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించిన అనంతరం ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్లో వెనుదిరిగాడు. డిక్వెల్లా కెరీర్లో ఇది 23వ అర్ధశతకం. అయితే 55 టెస్టులాడినప్పటికీ డిక్వెల్లా ఖాతాలో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అతడి అత్యధిక టెస్టు స్కోరు 96గా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యం లభించింది. సోనాల్ దినూష (100) సెంచరీ చేయగా, డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు తీయగా, జడేజా మూడు, కుల్దీప్, ప్రసిధ్, సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. పడిక్కల్ సెంచరీతో చెలరేగగా, కేఎల్ రాహుల్, జురెల్ అర్ధశతకాలు సాధించారు.🚨 Heated exchange between Mohammed Siraj & Niroshan Dickwella during the live match 🚨Mohammed Siraj was continuously beating Dickwella’s bat with his deliveries and kept troubling the Sri Lankan batter.After Dickwella appeared to lose his cool, the two players were involved… pic.twitter.com/kvGVWVo1sK— Central Cricket (@arshdeep3444) August 17, 2026 -
‘వర్షం ముప్పు.. భారత్ గెలవాలంటే అదొక్కటే దారి’
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పట్టు బిగించింది. కానీ ఆటకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడం, వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో టీమిండియా మ్యాచ్ గెలుస్తుందా లేక డ్రాగా ముగుస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. అయితే భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే నాలుగో రోజు ఆటలో వీలైనంత వేగంగా ఆడాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. గాలేలో వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో భారత్ 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి లంక ఎదుట సుమారు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే బాగుంటుందని తెలిపాడు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. "తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 178 పరుగులకు మరో 172 పరుగులు జోడిస్తే 350 పరుగుల దాకా వస్తాయి. మ్యాచ్కు వర్షం అంతరాయం ఉంటుంది కాబట్టి 40 ఓవర్లలో సాధ్యమైనంత ఎక్కువ పరుగులు ఓవర్కు ఐదు రన్స్ చొప్పున (దాదాపు 200 పరుగులు) చేస్తే బాగుంటుంది. ఆడుతున్నది టెస్టు మ్యాచ్ అయినప్పటికీ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మన బ్యాటర్లు ఆటను టెస్టు నుంచి వన్డే గేర్కు మార్చుకోవాలి. ఓపెనర్లుగా వచ్చే జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్లో దూకుడు ప్రదర్శించాలి. టీ20 క్రికెట్ కాకపోయినా, కనీసం వన్డే తరహాలో కాస్త ఫాస్ట్గా ఆడేందుకు ప్రయత్నించాలి. నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించకపోతే సమస్య లేదు. కానీ వర్షం పడితే మాత్రం భారత్కు దెబ్బ పడుతుంది. కాబట్టి వీలైనంత మేర ఫాస్ట్గా ఆడేందుకు యత్నించాలి. వర్షం పడే అవకాశం ఉండడంతో నేనైతే భారత్కు రెండో ఇన్నింగ్స్లో 40 ఓవర్లు ఇస్తాను. 150 నుంచి 175 పరుగులు చేశాకే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయాలి. ఒకవేళ వర్షం పడకపోతే నాలుగో రోజు మిగిలిన 50 ఓవర్లు, చివరి రోజు 90 ఓవర్ల ఆట ఉంటుంది కాబట్టి టీమిండియా ఫలితం అనుకూలంగా లేదా ప్రతికూలంగా వచ్చేందుకు కూడా అవకాశముంది." అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.Read: Virat Kohli: 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలు -
Virat Kohli: 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలు
ఆగస్టు 18, 2008.. శ్రీలంకతో మ్యాచ్లో ఒక 19 ఏళ్ల కుర్రాడు 18వ నెంబర్ జెర్సీ మైదానంలో బరిలోకి దిగాడు. నునుగు మీసాలతో ఉన్న ఆ కుర్రాడు మ్యాచ్లో 22 బంతులాడి 12 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే ఆ కుర్రాడే భారత క్రికెట్ను ఏలబోతున్నాడన్న విషయం అతడితో సహా అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. కట్చేస్తే 18 ఏళ్లు తిరిగేసరికి అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) కలిపి 28,359 పరుగులు చేసి ఆల్టైమ్ అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 85 సెంచరీలు, 125 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. 18 ఏళ్ల ప్రయాణంలో కోహ్లి ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. (18 Years Of Virat Kohli In International Cricket)విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం మొదలై ఇవాళ్టితో (ఆగస్టు 18) 18 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కోహ్లి లక్కీ నంబర్ 18 అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతడు వేసుకునే జెర్సీ నెంబర్ 18.. ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ సాధించింది 18వ ఎడిషన్లోనే కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే కోహ్లికి 18వ సంఖ్య అంటే బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో కోహ్లి 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకుందాం. (Virat Kohli Greatness)1) తండ్రి మరణం2006 రంజీ ట్రోఫీ మ్యాచ్లో, 18 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. డిసెంబర్ 19న 40 పరుగులతో ఆడుతున్న సమయంలో తన తండ్రి మరణవార్త తెలిసినప్పటికీ కోహ్లి ఆ వార్తను దిగమింగి 90 పరుగులతో ఢిల్లీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు.2) అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్మలేషియాలోని కౌలాలంపూర్లోని వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కోహ్లి తొలిసారి తనలోని వ్యూహాత్మకను ప్రదర్శించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లలో 116 పరుగుల సవరించిన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్లో భారత బౌలర్లలో ప్రతీ ఒక్కరు పది కంటే ఎక్కువ పరుగులే సమర్పించుకున్నారు. కానీ ఇక్కడే కోహ్లి తన తెలివిని ఉపయోగించి అజితేష్ అర్గల్ను సరైన సమయంలో వాడుకున్నాడు. ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన అజితేష్ రెండు వికెట్లు తీయడంతో పాటు ఇండియాకు టైటిల్ అందించాడు.3) 2011 వన్డే ప్రపంచకప్2011 వన్డే ప్రపంచకప్ను టీమిండియా సొంతం చేసుకుంది. లంకతో జరిగిన ఆనాటి ఫైనల్లో కోహ్లి 35 పరుగులే చేసినప్పటికీ, గంభీర్తో కలిసి ఒత్తిడిలో అతడు ఆడిన ఇన్నింగ్స్ విలువైనది. కోహ్లి ఇన్నింగ్స్లో పెద్ద సంచలనం లేకపోయినా, తర్వాతి కాలంలో అతడు అద్భుతమైన క్రికెటర్గా మారడానికి ఇదే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.4) 2012లో హోబార్ట్ వీరోచిత ఇన్నింగ్స్2012 ఫిబ్రవరి 28న, హోబర్ట్లో, విరాట్ కోహ్లీ శ్రీలంకపై 86 బంతుల్లో 133* పరుగులతో తన కెరీర్లోనే ఒక చిరస్మరణీయమైన వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో నిలవాలంటే, శ్రీలంక చేసిన 320/4 పరుగులను భారత్ కేవలం 40 ఓవర్లలోనే ఛేదించాల్సి వచ్చింది. అయితే భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించడం విశేషం. ఇక లసిత్ మలింగ వేసిన ఒక ఓవర్లో కోహ్లి 24 పరుగులు రాబట్టడం విశేషం.5) 2012 ఆసియా కప్2012 ఆసియా కప్ సందర్భంగా మీర్పూర్లో పాకిస్థాన్పై విరాట్ కోహ్లి 183 పరుగులు చేశాడు. కోహ్లి ఇన్నింగ్స్తో 330 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. కోహ్లి వన్డే కెరీర్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు.6) 2012 ఫిట్నెస్ విప్లవం2012 ఐపీఎల్లో పేలవ ప్రదర్శన తర్వాత, విరాట్ కోహ్లీ తాను తన శరీరాకృతిని ఎంతగా కోల్పోయాడో గ్రహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మారుతున్న ప్రమాణాలను గ్రహించిన కోహ్లీ, స్వీట్లు, జంక్ ఫుడ్, అర్ధరాత్రి పూట తినే స్నాక్స్ను మానేసి, ఆహార పరిమాణాన్ని కఠినంగా నియంత్రించుకుంటూ, ప్రతిరోజూ తీవ్రమైన వ్యాయామాలు చేయడం ప్రారంభించాడు.7) 2014 పీడకల2014 ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటన విరాట్ కోహ్లీ మానసిక స్థైర్యానికి, ఏకాగ్రతకు పెద్ద దెబ్బగా మారింది. ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ అండర్సన్, కోహ్లీకి ఆఫ్-స్టంప్ బయట బౌలింగ్ చేసే బలహీనతను నిరంతరం ఉపయోగించుకున్నాడు. అతను నాలుగు సార్లు ఔటయ్యాడు, 10 ఇన్నింగ్స్లలో కేవలం 134 పరుగులకే పరిమితమయ్యాడు.8) సాంకేతిక విప్లవంవిరాట్ కోహ్లీ తన స్టాన్స్ను వెడల్పుగా ఉంచి, బంతి వేగాన్ని తగ్గించడానికి ఫార్వర్డ్ ప్రెస్ మూవ్మెంట్ను ఉపయోగించడం ద్వారా తన సాంకేతిక సామర్థ్యాలను పునఃసమీక్షించుకున్నాడు. BGT తరఫున ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు, అడిలైడ్లో తన టెస్ట్ కెప్టెన్సీ అరంగేట్రంలో కోహ్లీ 115, 141 పరుగులు చేశాడు.9) 2022 టీ20 ప్రపంచ కప్పాకిస్థాన్పై కోహ్లీ చేసిన అజేయమైన 82* పరుగులు ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. కేవలం 3.1% గెలుపు శాతంతో ఆ దేశానికి 8 బంతుల్లో 28 పరుగులు అవసరం కాగా, కోహ్లీ దానిని సాధ్యం చేశాడు.10) 2016 ఐపీఎల్ సీజన్దేశీయ టీ20 లీగ్లో విరాట్ కోహ్లీ మరియు ఒక బ్యాటర్గా అతని అత్యుత్తమ ప్రదర్శన అది. అద్భుతమైన నిలకడతో, అతను 16 ఇన్నింగ్స్లలో నాలుగు సెంచరీలతో పాటు ఏడు అర్ధ సెంచరీలు సాధించాడు. ఆ సీజన్లో అతను 973 పరుగులు చేశాడు, ఇది ఆ టోర్నమెంట్ యొక్క ఒక ఎడిషన్లో ఇప్పటివరకు ఒక బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు.11) 2018లో ఫామ్లోకి వచ్చిన కోహ్లి2014 పర్యటన తర్వాత నాలుగేళ్లకు తిరిగి వచ్చిన కోహ్లీ, 59 సగటుతో 594 పరుగులు సాధించాడు. అతను తన టెక్నిక్, సహనం, ఆత్మాభిమానంతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, తన బ్యాటింగ్ విధానాన్ని పునరుద్ధరించుకోవడం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు.12) ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయంవిరాట్ సారథ్యంలో భారత్ ఆస్ట్రేలియా గడ్డపై మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. ఇది ఆసియా రెడ్-బాల్ క్రికెట్లో ఒక మైలురాయి వంటిది. అతను 4 మ్యాచ్లలో 282 పరుగులు చేసి ఆదర్శంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్ల నుండి పుజారా తీవ్రమైన దెబ్బలు తిన్న వివాదాస్పద సిడ్నీ టెస్ట్ కూడా ఇందులో ఉంది.13) 60 ఓవర్లపై స్పందనకోహ్లీ తన దూకుడును శక్తిగా మలచి, ఇతరులను బలోపేతం చేయడానికి తన తీవ్రతను ఉపయోగించాడు. 2021లో ఇంగ్లాండ్తో జరిగిన ఓవల్ టెస్టులో, తన సహచరులకు అతను చేసిన ప్రసిద్ధ '60 ఓవర్ల నరకం' ప్రసంగం, భారత్ను ఉత్తేజపరిచి నాటకీయ విజయాన్ని సాధించేలా చేసింది. అది కెప్టెన్గా కోహ్లీ యొక్క తీవ్రమైన, రాజీపడని ప్రతిబింబాన్ని చాటింది.14) 2022 ఆసియా కప్లో 71వ సెంచరీ2019లో ఏడు సెంచరీలు చేసిన తర్వాత, కోహ్లీ 2020, 2021లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆ తర్వాత రెండేళ్లకు, 2022 ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్పై సెంచరీతో పునరాగమనం చేశాడు. అది అతని తొలి టీ20ఐ సెంచరీ కూడా.15) 2023 వన్డే ప్రపంచకప్స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో అతను 765 పరుగులు చేసి, ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగుల కోసం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు, ఈ ఫార్మాట్లో అత్యధికమైన తన 50వ వన్డే సెంచరీని నమోదు చేశాడు.16) 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్2024 టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ అంతటా 1, 4, 0, 24, 37, 0, 9 పరుగులు చేసిన తర్వాత, కోహ్లీ అత్యంత కీలకమైన సమయంలో రాణించాడు. ఫైనల్లో అతను 59 బంతుల్లో 76 పరుగులు చేసి, 12 ఏళ్ల తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవడంలో సహాయపడ్డాడు.17) ఆర్సీబీకి తొలి టైటిల్ ఐపీఎల్లో 18 సీజన్ల తర్వాత ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. 18 ఏళ్లుగా ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కోహ్లి తొలి ఐపీఎల్ టైటిల్ అందుకున్న క్షణంలో భావోద్వేగానికి గురయ్యాడు.18) టెస్టు రిటైర్మెంట్పై కోహ్లీ స్పందనతన రెండో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడానికి ముందు, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక మీడియాలో చక్కర్లు కొట్టిన అన్ని ఊహాగానాలకు కోహ్లీ సమాధానమిచ్చాడు. ‘నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, కొనసాగించాలనుకుంటున్నాను. భారత్ తరఫున ప్రపంచ కప్ ఆడటం అద్భుతం. కానీ దాని విలువ స్పష్టంగా ఉండాలి” అని చెప్పుకొచ్చాడు. -
క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం
వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, డ్వేన్ బ్రావోలకు అరుదైన గౌరవం లభించింది. కరీబీయన్ ప్రీమియర్ లీగ్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఈ ఇద్దరిని చేర్చారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో మాజీ ఆటగాళ్లకు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి. ఇక ప్లేయర్ కేటగిరీలో బ్రావో తొలి క్రికెటర్గా హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోగా, నాన్ ప్లేయర్ కేటగిరీలో ఇయాన్ బిషప్కు చోటు కల్పించడం జరిగింది. విండీస్ స్టార్ ఆల్రౌండర్గా పేరు పొందిన డ్వేన్ బ్రావో కరీబియన్ ప్రీమియర్ లీగ్లో 100కు పైగా మ్యాచ్లు ఆడాడు. 2013లో ప్రారంభమైన కరీబియన్ ప్రీమియర్ లీగ్లో మొదటి సీజన్ నుంచి ఆడుతూ వచ్చిన బ్రావో 2024 వరకు లీగ్లో ఆటగాడిగా కొనసాగాడు. అదే సమయంలో ఇయాన్ బిషన్ 2013 నుంచి కరీబియన్ ప్రీమియర్ లీగ్లో లీడింగ్ కామెంటేటర్గా కొనసాగుతూ వస్తున్నాడు.ఇక ఈతరం టీ20 బెస్ట్ ఆల్రౌండర్లలో డ్వేన్ బ్రావో పేరు తప్పకుండా ఉంటుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వెస్టిండీస్ సాధించిన రెండు టీ20 ప్రపంచకప్పుల్లో బ్రావో సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్లో ఆరుసార్లు చాంపియన్గా నిలిచిన సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించాడు. వీటితో పాటు బీబీఎల్, బీపీఎల్ కూడా ఆడాడు. ఇక కరీబియన్ ప్రీమియర్ లీగ్లో 107 మ్యాచ్లాడిన బ్రావో ఇందులో ఒక్క ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫునే 89 మ్యాచ్లు ఆడడం విశేషం. ఇక 107 మ్యాచ్ల్లో వెయ్యికి పైగా పరుగులు, 129 వికెట్లు పడగొట్టాడు. తన సీపీఎల్ కెరీర్లో ఐదుసార్లు టైటిల్స్ అందుకున్న బ్రావో.. నాలుగుసార్లు నైట్రైడర్స్ తరఫున, ఒక్కసారి సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ కెప్టెన్గా సీపీఎల్ టైటిల్ అందుకున్నాడు.ఇక ఇయాన్ బిషప్ క్రికెటర్గా కంటే కామెంటేటర్గానే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. 2016 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వెస్టిండీస్ గెలిచిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చిరస్మరణీయం. ఆనాడు బిషప్ చేసిన క్రికెట్ వ్యాఖ్యానం క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ క్షణాల్లో ఒకటిగా గుర్తుండిపోనుంది.ఇదే మొదటిసారిలీగ్కు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు, వారి సేవలను గుర్తించే ప్రయత్నంలో, సీపీఎల్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా CPL హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మొట్టమొదటి CPL హాల్ ఆఫ్ ఫేమ్ వచ్చే నెల సెప్టెంబర్ 15న నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలోనే డ్వేన్ బ్రావో, ఇయాన్ బిషప్లు తమ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని అందుకోనున్నారు. The Republic Bank CPL today confirmed Dwayne Bravo and Ian Bishop as the two inaugural inductees into the newly established CPL Hall of Fame. They will be honoured in a Gala Dinner in Barbados on 15 Sep 2026. READ MORE: https://t.co/F9zsnxUMxk#CPL26 #CricketPlayedLouder pic.twitter.com/0t7gjeLgfJ— CPL T20 (@CPL) August 17, 2026 -
టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డు
శ్రీలంక వికెట్కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా లేకుండానే కెరీర్ను అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు 55 టెస్ట్లు ఆడిన అతడు.. 23 అర్ద సెంచరీల సాయంతో 2837 పరుగులు చేసి జట్టులో కొనసాగుతున్నాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో (తొలి ఇన్నింగ్స్) డిక్వెల్లా మరోసారి సెంచరీకి చేరువలో ఔట్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ స్పెషలిస్ట్ బ్యాటర్ ఇన్ని మ్యాచ్లు ఆడి సెంచరీ లేకుండా మనుగడ సాగించలేదు. డిక్వెల్లాకు మాత్రమే ఇది సాధ్యమైంది.సెంచరీ లేకుండానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ (3154) పేరిట ఉన్నప్పటికీ.. అతడు స్పెషలిస్ట్ బ్యాటర్ కాదు. అతడు తన అత్యుత్తమ లెగ్ స్పిన్ బౌలింగ్కు తోడుగా ఈ పరుగులు సాధించాడు. ఈ రికార్డుకు సంబంధించి వార్న్ తర్వాతి స్థానంలోనే డిక్వెల్లా కొనసాగుతున్నాడు.ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో సెంచరీ లేకుండానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డిక్వెల్లా చలామణి అవుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో మిచెల్ స్టార్క్ (106 టెస్ట్ల్లో (2497) ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. డిక్వెల్లా సెంచరీ చేయకుండానే ఔటైనప్పటికీ శ్రీలంక పరువు కాపాడాడు. సోనల్ దినుషాతో (86 నాటౌట్) కలిసి ఆరో వికెట్కు 146 పరుగులు జోడించి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను డిక్వెల్లా-దినుషా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ ప్రతిఘటించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.ప్రస్తుతం దినుషాకు జతగా ప్రభాత్ జయసూర్య (0) క్రీజ్లో ఉన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 212 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (167) భారీ శతకంతో సత్తా చాటాడు. కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ శ్రీలంకలో పర్యటిస్తుంది. -
ఏషియన్ గేమ్స్కు ఆఫ్ఘన్ జట్టు ప్రకటన.. రషీద్కు నో ప్లేస్
2026 ఏషియన్ గేమ్స్ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ ప్రకటించారు. జపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్న ఈ టోర్నీలో దర్విష్ రసూలీ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.ఈ జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. ఇటీవల ముగిసిన స్థానిక టోర్నీలో (షపగీజా క్రికెట్ లీగ్) రాణించిన పలువురు ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.రషీద్ ఖాన్కు చోటు లేదుఆఫ్ఘనిస్తాన్ రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ జట్టులో లేడు. స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్, ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా ఆసియా గేమ్స్కు దూరంగా ఉండనున్నారు.అయితే అనుభవజ్ఞులైన నజీబుల్లా జద్రాన్, కరీమ్ జనత్ జట్టులో కొనసాగనున్నారు. వీరి అనుభవం యువ ఆటగాళ్లకు ఉపయోగపడే అవకాశం ఉంది.షపగీజా లీగ్లో అదరగొట్టిన ఆటగాళ్లకు అవకాశంటాపార్డర్ బ్యాటర్ మొహమ్మద్ అక్రమ్ షపగీజా లీగ్లో అద్భుత ప్రదర్శనతో జట్టులో చోటు సంపాదించాడు. ఎనిమిది ఇన్నింగ్స్ల్లో అతడు 339 పరుగులు, ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేశాడు.ఆల్రౌండర్ ఇస్మత్ ఆలం కూడా లీగ్లో 294 పరుగులతో పాటు 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. అతడికి షపగీజా లీగ్ బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా లభించింది.వికెట్ కీపర్-బ్యాటర్ మొహమ్మద్ ఇషాక్, హసన్ ఈసాఖైల్, ఖాలిద్ తానివాల్, ఇమ్రాన్ మిర్ వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది.ఏషియన్ గేమ్స్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టుదర్విష్ రసూలీ (కెప్టెన్), మొహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), మొహమ్మద్ అక్రమ్, హసన్ ఈసాఖైల్, ఖాలిద్ తానివాల్, ఇమ్రాన్ మిర్, ఫైసల్ ఖాన్ షినోజాదా, నజీబుల్లా జద్రాన్, ఫర్మానుల్లా సఫీ, ఇస్మత్ ఆలం, కరీమ్ జనత్, నంగ్యాల్ ఖరోటీ, అరబ్ గుల్ మొమంద్, ఫరీదూన్ దావుద్జాయ్, అబ్దుల్లా అహ్మద్జాయ్.ఏషియన్ గేమ్స్కు ముందు ఆఫ్ఘనిస్తాన్ భారత్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ (ఢిల్లీలో) ఆడనుంది. దీంతో ఆసియా గేమ్స్కు ఎంపికైన యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం పొందే అవకాశం కూడా లభించనుంది. -
విండీస్ వీరుడి విధ్వంసం.. చివరి ఓవర్లో గట్టెక్కారు!
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో బార్బడోస్ ట్రైడెంట్స్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్పై బార్బడోస్ ట్రైడెంట్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ (31 బంతుల్లో 61; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, బ్రాండన్ కింగ్ (39), క్వింటన్ డికాక్ (38) రాణించారు. 90 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో రివాల్డో క్లార్క్ (23)తో కలిసి రూథర్ఫోర్డ్ ఇన్నింగ్స్ నడిపించాడు. నాలుగో వికెట్కు ఈ జోడి 79 పరుగులు జోడించడంతో బార్బడోస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సెంట్ లూసియా బౌలర్లలో రోస్టన్ చేజ్, షెడ్లే వాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అకీమ్ ఆగస్టీ (34 బంతుల్లో 63) సిక్సర్లతో రెచ్చిపోయినప్పటికీ లాభం లేకపోయింది. రోస్టన్ చేజ్ (34), మాథ్యూ ఫోర్డ్ (24 నాటౌట్) చివరకు వరకు అజేయంగా నిలిచినప్పటికీ లాభం లేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు పడడంతో సెయింట్ లూసియా ఛేదనలో తడబడింది. ట్రైడెంట్స్ బౌలర్లలో గుదకేశ్ మోతి 3 వికెట్లు తీయగా, ముజీబ్ ఉర్ రెహ్మన్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీ సాధించిన రూథర్ఫోర్డ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.Ruthless Rutherford has unleashed! 😮💨Back to Back fifties for Sherfane! 🇱🇨 x 🇧🇧#CPL26 #SLKvBT #CricketPlayedLouder #BiggestPartyInSport #BYD pic.twitter.com/7SJWiO3s4Z— CPL T20 (@CPL) August 17, 2026CPL 2026 - Barbados Tridents defeated Saint Lucia Kings by 9 runs 🇧🇧 [DLS]Sherfane Rutherford hammered 61 in 31 balls and named as POTM for game defining inning.🎖️Ackeem Auguste smashed 63 from 34 balls 🇱🇨 pic.twitter.com/x1o95OKsIQ— Maina Singh (@Maina_Singhx77) August 17, 2026Read: 'నమ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే' -
'నమ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే'
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ తనకు అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు. మ్యాచ్లో ఇప్పటికే మానవ్ సుతార్ రెండు కీలక వికెట్లు తీశాడు. 27 పరుగులతో నిలకడగా ఆడుతున్న లాహిరు ఉడారాను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్ ఆ వెంటనే ఇన్ఫామ్ బ్యాటర్ దినేశ్ చందిమల్ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ‘బిగ్ స్పిన్నర్ అవుతాడు’ఈ నేపథ్యంలో మానవ్ సుతార్పై టీమిండియా మాజీ క్రికెటర్లు అజయ్ జడేజా, అజింక్య రహానేలు ప్రశంసల జల్లు కురిపించారు. తొలి టెస్టుకు ఈ ఇద్దరు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్నారు. చందిమల్ను ఔట్ చేసిన తర్వాత అజయ్ జడేజా మాట్లాడుతూ.. "టీమిండియా బిగ్ స్పిన్నర్ అయ్యేందుకు మానవ్ సుతార్కు అన్ని అర్హతలు ఉన్నాయి. బంతిని టర్న్ చేయడంలో అతడి సామర్థ్యం అసాధారణమైనది. దీంతో లంక బ్యాటర్లు అతడిని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. మానవ్ సుతార్పై నమ్మకముంచి అతడికి అవకాశం కల్పించిన కెప్టెన్ శుబ్మన్ గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే" అని చెప్పుకొచ్చాడు. అజయ్ జడేజా వ్యాఖ్యలను రహానే సమర్ధించాడు. ఆ ఇద్దరిని కలగలిపి.."జడేజా భాయ్, నేను మీ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. టెస్టు క్రికెట్లో టీమిండియాకు మ్యాచ్ విన్నర్గా మారే సత్తా మానవ్ సుతార్కు ఉంది. లంక పిచ్లపై అతడు అద్భుతమైన టర్న్ను రాబడుతున్నాడు. అతడి బౌలింగ్లో జడేజాలో ఉండే కచ్చితత్వం, అశ్విన్ లాగా బంతిని టర్న్ చేయడం లాంటి రెండు సామర్థ్యాలు ఒకేసారి ఉండడం సానుకూలాంశం. భవిష్యత్తులో భారత క్రికెట్లో మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించనున్నాడు" అని రహానే పేర్కొన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.ఇక మూడో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 🚨 Ajay Jadeja & Ajinkya Rahane Praise Manav Suthar During IND vs SL Live Match 🚨Ajay Jadeja 🗣️: Manav Suthar has the potential to become India’s next big Test spinner. His ability to turn the ball is exceptional, and the Sri Lankan batters are struggling against him. Credit… pic.twitter.com/BcZjpmepqy— Central Cricket (@arshdeep3444) August 17, 2026 Manav Suthar gets his second of the innings as Sri Lanka slip to three down on Day 3! 💥 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/FANRuZ6FDO— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤 Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Read: తప్పించాలని డిమాండ్లు; బ్యాట్తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే! -
తప్పించాలని డిమాండ్లు; బ్యాట్తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అర్ధశతకంతో మెరిశాడు. అయితే గత ఏడు ఇన్నింగ్స్ల్లో జురెల్ బ్యాట్ నుంచి ఒక్క ఫిఫ్టీ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో లంకతో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్కు అవకాశమివ్వాలని డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ జట్టు మేనేజ్మెంట్ మాత్రం జురెల్పై నమ్మకాన్ని ఉంచింది. అందుకే జురెల్ హాఫ్ సెంచరీ చేయగానే కోచ్ గంభీర్తో పాటు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చప్పట్లు కొడుతూ అభినందించడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తాజాగా జురెల్ లంకతో తొలి టెస్టులో ఫిఫ్టీ మార్క్ సాధించి జట్టుతో పాటు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జురెల్ తన ప్రదర్శనపై స్పందించాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. భారత్కు ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయంగా భావిస్తున్నా. నా ఆట విషయంలో అటు కోచ్.. ఇటు కెప్టెన్ అన్ని వేళలా మద్దతుగా నిలిచారు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ ఆడాలని సలహా ఇచ్చారు. వాళ్లు చెప్పినట్లే పరిస్థితులకు తగినట్లుగా ఆడి ఇవాళ అర్ధశతకంతో మెరిశాను. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. జట్టుకు ఏం కావాలో అది చేయడమే నా పని. ఇండియా-ఏ తరఫున మ్యాచ్ ఆడేందుకు పది రోజుల ముందే శ్రీలంకలో అడుగుపెట్టాము. కొలంబోలో ప్రాక్టీస్ చేయడం సహా గాలేలోనూ మ్యాచ్ ఆడాము. దీంతో రెండు వేదికలపై పూర్తి అవగాహన వచ్చింది, అది ఇవాళ బ్యాటింగ్లో రాణించేందుకు ఉపయోగపడుతోంది. అంతేకాదు ఇక్కడి వాతావరణం, పరిస్థితులు అర్థం చేసుకునేందుకు కూడా ఎంతో దోహదపడింది’’ అని చెప్పుకొచ్చాడు. Gautam Gambhir and Ajit Agarkar keeping an eye on Dhruv Jurel’s 50.He will definitely be in consideration for white-ball cricket. pic.twitter.com/72d1IXjZ2h— AS4 (@lostbeyond777) August 16, 2026చదవండి: భారత్ 462 ఆలౌట్.. అరంగేట్రంలోనే లంక బౌలర్ చెత్త రికార్డు -
భారత్ 462 ఆలౌట్.. అరంగేట్రంలోనే లంక బౌలర్ చెత్త రికార్డు
గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక డెబ్యూ బౌలర్ కెషారా నువంతా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్గా కెషారా నిలిచాడు. భారత తొలి ఇన్నింగ్స్లో 39 ఓవర్లు వేసిన కెషారా నువంతా మూడు వికెట్లు తీసి 175 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక లంక తరఫున అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా సూరజ్ రన్దివ్ నిలిచాడు. 2010లో కొలంబో వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 73 ఓవర్లు వేసిన సూరజ్ రన్దివ్ రికార్డు స్థాయిలో 222 పరుగులు సమర్పించుకున్నాడు. 2025లో గాలే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో తరిందు రత్ననాయకే 49.2 ఓవర్లలో 196 పరుగులు సమర్పించుకుని రెండో స్థానంలో ఉన్నాడు. 1999లో ఢాకా వేదికగా పాక్తో టెస్టులో ఉపుల్ చందన 47.5 ఓవర్లలో 179 పరుగులిచ్చుకొని మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 2020లో సౌతాఫ్రికాతో టెస్టులో 171 పరుగులు సమర్పించుకున్న వనిందు హసరంగ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.టీమిండియా ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'పంత్ వల్ల కాలేదు బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం' -
SL Vs IND: శ్రీలంక ఆలౌట్.. మూడో రోజు ముగిసిన ఆట
గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. సోమవారం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ అయింది. దినుష సెంచరీ (100), నిరోషన్ డిక్విల్లా 80 పరుగులతో అదరగొట్టారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకు ముందు భారత్ 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక లంక 284 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్కు 178 పరుగుల మేర భారీ ఆధిక్యం లభించింది. కాగా ముగిసిన మూడో రోజు ఆటలంక ఇన్నింగ్స్ తర్వాత ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. దీంతోగ్రౌండ్ సిబ్బంది వచ్చి కవర్లతో పిచ్ను కప్పివేశారు. భారీ వర్షం పడే సూచనలు ఉండటంతో మూడో రోజు ఆటను అంతటితో ముగించేశారు.UPDATESసొనాల్ దినుష అవుట్సెంచరీ పూర్తి చేసుకున్న సొనాల్ జడ్డూ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోగా.. అసిత ఫెర్నాండో క్రీజులోకి వచ్చాడు. లాహిరు కుమార 0 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 274-9.ఎనిమిదో వికెట్ డౌన్మానవ్ సుతార్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన ప్రభాత్ జయసూర్య (10). లంక స్కోరు 274-8 (78). లాహిరు కుమార క్రీజులోకి రాగా.. దినుష 100 పరుగులతో ఉన్నాడు.శతక్కొట్టిన దినుష167 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్న దినుష. మానవ్ సుతార్ బౌలింగ్లో సింగిల్ తీసి టెస్టుల్లో తొలి శతకం నమోదు చేసిన దినుష.ఏడో వికెట్ డౌన్66.4: జడేజా బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్గా పెవిలియన్ చేరిన కేశారా (2). లంక స్కోరు: 243-7. ప్రభాత్ జయసూర్య క్రీజులోకి రాగా.. దినుష 79 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంకక్రీజులో పాతుకుపోయిన నిరోషన్ డిక్వెల్లా- సొనాల్ దినుష జోడీని ప్రసిద్ కృష్ణ విడదీశాడు. ప్రసిద్ బౌలింగ్లో రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చిన డిక్వెల్లా ఆరో వికెట్గా పెవిలియన్ చేరాడు. 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అతడి స్థానంలో కేశారా నువాంత క్రీజులోకి రాగా.. దినుష 74 పరుగులతో ఆడుతున్నాడు. లంక స్కోరు: 236-6 (61.5). కాగా దినుషతో కలిసి డిక్విల్లా ఆరో వికెట్కు 146 పరుగులు జోడించాడు.టీ విరామానికి శ్రీలంక స్కోర్: 214/5టీ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో సోనల్(62), డిక్వెల్లా(71) ఉన్నారు. లంక ఇంకా తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే 248 పరుగులు వెనకబడి ఉంది.సొనాల్ అర్ధ శతకంకుల్దీప్ బౌలింగ్లో సింగిల్ తీసి సొనాల్ దినుష.. 92 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంకస్కోరు: 184-5 (49)ఫిఫ్టీ బాదిన డిక్వెల్లానిరోషన్ డిక్వెల్లా 68 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం లంక 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దినూష (39) అతడికి సహకరిస్తున్నాడు.దినూష, డిక్వెల్లా నిలకడలంచ్ విరామం అనంతరం లంక ఆట తిరిగి గాడిన పడింది. మిడిలార్డర్లో దినూష (34), డిక్వెల్లా (38) నిలకడగా ఆడుతుండడంతో లంక జట్టు 150 పరుగుల మార్క్ను దాటింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్కు లంక మరో 311 పరుగులు వెనుకబడి ఉంది.👉 లంచ్ విరామం అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. 30 ఓవర్లు ముగిసేసరికి లంక ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. దినుష (20), నిరోషన్ డిక్వెల్లా (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.లంచ్ విరామంలంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. లంక కోల్పోయిన ఐదు వికెట్లలో నాలుగు స్పిన్నర్లకే దక్కడం విశేషం. శ్రీలంక మరో 363 పరుగులు వెనుకబడి ఉంది.ఐదో వికెట్ డౌన్26.1: రవీంద్ర జడేజా బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధనంజయ డి సిల్వ (21). లంక స్కోరు 90-5 (26.1). సొనాల్ 13 పరుగులతో ఉండగా.. నిరోషన్ డెక్విల్లా క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక16.1: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన కమిందు మెండిస్ (14). క్రీజులోకి వచ్చిన సొనాల్ దినుష. 17 ఓవర్లలో లంక స్కోరు: 62-4. మూడో వికెట్ డౌన్53 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. 27 పరుగులు చేసిన లాహిరు ఉదారా మానవ్ సుతార్ బౌలింగ్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫిఫ్టీ మార్క్ దాటిన లంకశ్రీలంక 50 పరుగుల మార్క్ను దాటింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, లాహిరు ఉదారా (27 బ్యాటింగ్), కమిందు మెండిస్ (12 బ్యాటింగ్) ఆడుతుండడంతో లంక కుదురుకుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్తొలి టెస్టులో శ్రీలంక 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్లో 4 పరుగులు చేసిన దినేశ్ చందిమల్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.👉6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. లాహిరు ఉడారా (10), చందిమల్ (4) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లంకతమ ఇన్నింగ్స్ ఆరంభంలోనే శ్రీలంకకు షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్ నిశాన్ ఫెర్నాండో డకౌట్ అయ్యాడు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.👉అయితే రెండో రోజు ఆటలో దాదాపు సగం వర్షార్పణమయింది. దీంతో 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే మూడో రోజు మాత్రం ఉదయం నుంచి ఎండ కాస్తుండడం శుభ పరిణామం. అయితే మూడో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే మాత్రం బ్యాటింగ్ కష్టంగా మారనుంది.👉ఇక తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్నైట్ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.👉 సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్ కాగా... ధ్రువ్ జురేల్ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్) మరో ఐదు పరుగులే చేశాడు.Innings Break!#TeamIndia post 4⃣6⃣2⃣ in the first innings 👏👏Devdutt Padikkal top-scores with 1⃣6⃣7⃣ 🫡Fifties from KL Rahul & Dhruv Jurel 👌Over to our bowlers 💪Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/cdMA1JyumY— BCCI (@BCCI) August 17, 2026 -
'పంత్ వల్ల కాలేదు బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్జెయింట్స్ ప్రయాణం మొదలై నాలుగేళ్లు అయినప్పటికీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. కానీ హండ్రెడ్ లీగ్లో మాత్రం సంజీవ్ గోయెంకాకు చెందిన మాంచెస్టర్ సూపర్జెయింట్స్ తాము ఆడుతున్న తొలి సీజన్లోనే టైటిల్ సాధించడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సంజీవ్ గోయెంకా మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘‘మా తొలి సీజన్లోనే మేము చాంపియన్స్గా నిలిచాం. కంగ్రాట్స్ మాంచెస్టర్ సూపర్జెయింట్స్. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో మాంచెస్టర్ సాధించిన ఈ అద్భుత విజయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఈ విజయం మా సూపర్జెయింట్స్ ఫ్యామిలీకి గర్వకారణం. జట్టు సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది. టిమ్ సీఫెర్ట్ నిజంగా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నూర్ అహ్మద్ తన అద్భుత బౌలింగ్తో వికెట్లు పడగొట్టి టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించాడు. జోస్ బట్లర్ కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించడమే గాక అందరిని కలుపుకుపోయి సమిష్టిగా రాణించి టైటిల్ అందించడంలో విజయవంతమయ్యాడు. జోస్తో పాటు ప్రతీ ఆటగాడికి నా ప్రత్యేక అభినందనలు. మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు’’ అని గోయెంకా ముగించాడు.మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ గతంలో మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరుతో హండ్రెడ్ టోర్నీ ఆడింది. అయితే 2025లో జట్టు అమ్మకానికి వచ్చినప్పుడు సంజీవ్ గోయెంకా 70శాతం పెట్టుబడి పెట్టడంతో జట్టు కాస్తా మాంచెస్టర్ సూపర్జెయింట్స్గా మారిపోయింది. లంకాషైర్ వాటా 30 శాతంగా ఉంది.ఇక ఐపీఎల్ 2022 సీజన్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్జెయింట్స్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మంచి ప్రదర్శన చేసింది. తొలి రెండు సీజన్లలో లక్నో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్తో విబేధాలు రావడంతో అతడిని వదులుకుంది. రూ. 27 కోట్ల రికార్డు ధరకు పంత్ను కొనుగోలు చేసిన లక్నో సూపర్జెయింట్స్ అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కానీ పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ 2025, 2026 సీజన్లలో దారుణ ప్రదర్శన కనబరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ చేరడంలో కూడా లక్నో విఫలమైంది. దీంతో పంత్ ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ పదవికి రాజీనామా కూడా చేశాడు. వచ్చే సీజన్లో పంత్ స్థానంలో ఎవరు కెప్టెన్గా వ్యవహరిస్తారనేది చూడాలి.Sanjiv Goenka used to thank God for every win, now his team won the championship finally in cricket.🏆Congratulations to @DrSanjivGoenka and Manchester Super Giants🎉🎊 pic.twitter.com/qeZNY2U8Sn— कट्टर INDIA समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) August 16, 2026 Manchester Super Giants Clinch Maiden Hundred Title, Owner Sanjiv Goenka's Reaction Goes Viral#SanjivGoenka #ManchesterSuperGiants #Hundred https://t.co/k804UhYLHU pic.twitter.com/QxU6W8ILnd— NDTV Sports (@Sports_NDTV) August 17, 2026Read: బాంబు పేల్చిన రొనాల్డో.. షాక్లో అభిమానులు! -
‘కామన్సెన్స్ లేదు.. అతడిని పక్కనబెట్టడమే మంచిది’
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. రెండో రోజు ఆటలో పడిక్కల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 39 పరుగులతో టచ్లో కనిపించినప్పటికీ మరోసారి నిర్లక్ష్యంతో వికెట్ పారేసుకొని విమర్శలు మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా లంక ఆఫ్ స్పిన్నర్ కెషారా నువంతా తెలివిగా ఫ్లైటెడ్ డెలివరీలు వేసి పంత్ను బోల్తా కొట్టించాడు. దీంతో పంత్ కనీసం కామన్సెన్స్ ఉపయోగించకుండా బ్యాటింగ్ చేశాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. ‘రిషబ్ పంత్ ఔట్ విషయంలో నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. అతని ఆట విధానమే అలా ఉంటుంది. కానీ నా కంప్లైంట్ ఏంటంటే పంత్ కామన్సెన్స్ లేకుండా ఆడడమే. లంక జట్టు కొత్త బంతి తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే పంత్ ఔటయ్యాడు. ఆఫ్ స్పిన్నర్ కెషారా తెలివిగా ఫ్లైటెడ్ బంతులను డెలివరీ చేశాడు. అప్పటికే మూడుసార్లు కట్షాట్ ఆడేందుకు ప్రయత్నించి పంత్ విఫలమయ్యాడు. కానీ పంత్ ఇక్కడే కామన్సెన్స్ మరిచిపోయాడు. కొత్త బంతిని ఐదు నుంచి ఆరు ఓవర్ల దాకా జాగ్రత్తగా ఆడాలి. ఇది టెస్టు మ్యాచ్ అన్న సంగతి మరిచిపోయి అనవసర షాట్లకు యత్నించి పంత్ వికెట్ పారేసుకున్నాడు. అతను ఓవర్లోని మొదటి బంతికే అలా దూకుడుగా ఆడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక బ్యాటర్ 150 పరుగుల వద్ద ఉన్నప్పటికీ, కొత్త బంతి వచ్చినప్పుడు మరికొన్ని బంతులు ఆడతాడు. ఆ విషయంలో పంత్ను తప్పుబట్టాల్సిందే. లాజిక్ లేకుండా ఆడుతూ క్రికెట్ పరిజ్ఞానంలో పంత్ చాలా వెనుకబడిపోయాడనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. మరోవైపు అభిమానులు కూడా పంత్ నిర్లక్ష్యపు ఆటతీరును విమర్శించారు. పంత్ను పక్కనబెట్టి సర్ఫరాజ్కు అవకాశమివ్వడం మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రోజు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. సెంచరీ చేసిన పడిక్కల్ (167 పరుగులు) కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేయగా, ధ్రువ్ జురెల్ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ (12), ప్రసిధ్ క్రిష్ణ (1) క్రీజులో ఉన్నారు. ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు పడగొట్టాడు. -
కివీస్ బ్యాటర్ వన్మ్యాన్ షో.. బట్లర్ సేనదే హండ్రెడ్ టైటిల్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్ను ఈజీగా అందుకున్న సూపర్జెయింట్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు.ట్రెంట్ రాకెట్స్కు మెయిడెన్ టైటిల్మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్రైజర్స్ లీడ్స్ వుమెన్తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా, డాని గిబ్సన్ 22 పరుగులతో పర్వాలేదనిపించింది. ట్రెంట్ బౌలర్లలో కిమ్ గార్త్, సమంతా బేట్స్, చార్లీ ఫిలిప్స్, జార్జియా ఆడమ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ మరో 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లే (41) రాణించగా.. బెత్ మూనీ (31 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. జార్జియా ఆడమ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అన్నాబెల్ సదర్లాండ్ (315 పరుగులు, 11 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.We were all Jos Buttler watching that finish 🫣#TheHundredFinal pic.twitter.com/w06H16zE0z— The Hundred (@thehundred) August 16, 2026Five fifties in 10 innings for Tim Seifert in this year's Hundred 🔥pic.twitter.com/XFTJa0GeZV— Cricinfo (@cricinfo) August 16, 2026చదవండి: 'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే' -
'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే'
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఓటమి పాలవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రిపరేషన్లో ఎలాంటి లోపాలు లేవని.. ఓటమికి సాకులు వెతకనని, బంగ్లాదేశ్ తమకన్నా బాగా ఆడిందన్నాడు. ఈ విజయానికి వారే అర్హులని పేర్కొన్నాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ ఆడేందుకు కోట్ల రూపాయలు ఇచ్చే హండ్రెడ్ లీగ్ కాంట్రాక్టులను వదులుకొని తమ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారని తెలిపాడు. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు పడిన శ్రమను, చేసిన త్యాగాలను కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. 'తమ ఆటగాళ్లలో కొందరు కేవలం 20 రోజుల వ్యవధిలో దాదాపు అర మిలియన్ పౌండ్ల (రూ. 5 కోట్లకు పైగా) ఆదాయాన్ని ఇచ్చే ‘ది హండ్రెడ్’ లీగ్ కాంట్రాక్టులను కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశారు. మా ప్రాక్టీస్ సరైన రీతిలోనే సాగింది. అందులో ఎలాంటి లోపం, నిర్లక్ష్యం లేదు. అలానే ఓటమిపై ఎలాంటి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ జట్టు అద్భుతంగా ఆడింది. తొలి రోజు వికెట్ కాస్త అనుకూలించినప్పటికీ, మేము క్రీజులో ఎక్కువ సమయం నిలదొక్కుకోవాల్సి ఉంది. బౌలింగ్లోనూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయాం' అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్మద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.🔴BIG REALITY CHECK FOR PAT CUMMINS & AUSTRALIA 🤯Before Bangladesh test series:Cummins🎙️: Some of our guys are saying no to half-a-million pounds for 20 days' work to go and play those two Test matches against Bangladesh.🙄After such a confident statement from Pat,… pic.twitter.com/iS79Cmc6tr— Sam (@cricsam02) August 16, 2026🔴PAT CUMMINS BLAMES THE PITCH FOR AUSTRALIA’S LOSS 🤯Cummins🎙️: The pitch was rock hard with a bit of grass, so we thought the first hour might be tough. But after that, it felt like a pretty good batting track.We expected it to crack up in the heat and spin on Days 4 and 5,… pic.twitter.com/BJmiDYGe2L— Sam (@cricsam02) August 16, 2026Read: బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్ -
బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్లో తంజిద్, నజ్ముల్తో పాటు మెహదీ హసన్ కూడా రాణించాడు. బ్యాట్తో మెరిసిన మెహదీ హసన్ ఈసారి బంతితో కూడా మ్యాజిక్ చేశాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన మెహదీ హసన్ విజయంలో తన వంతు పాత్రను సమర్ధంగా పోషించాడు.ఈ నేపథ్యంలోనే ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో మెహదీ హసన్ వేసిన ఒక అద్భుత బంతికి వెబ్స్టర్ బిత్తరపోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. వెబ్స్టర్ 7వ స్థానంలో బ్యాటింగ్కు రాగా, మెహిదీ హసన్ మీరాజ్ తన ఆఫ్ స్పిన్తో ఆఫ్ స్టంప్ వద్దకు బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బంతిని విసిరాడు, బంతి పిచ్ అయి వెంటనే నిటారుగా వికెట్ల వైపు దూసుకొచ్చింది.బ్యూ వెబ్స్టర్ బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో లైన్ అండ్ లెంగ్త్ ను తప్పుగా అంచనా వేశాడు. దీంతో బంతి నేరుగా స్టంప్స్ను తాకడంతో వెబ్స్టర్ ఆశ్చర్యపోయాడు. ఇక తన అద్భుత బంతితో వికెట్ పడగొట్టిన సంతోషంలో మెహదీ హసన్ సంబరాలు షురూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మూడో బౌలర్గా రికార్డుఇక మ్యాచ్లో మెహదీ హసన్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మూడో బంగ్లా బౌలర్గా మెహదీ హసన్ నిలిచాడు. 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. హసన్ మహ్ముద్ (6/55), మొహమ్మద్ రఫీఖ్ (5/62) తొలి రెండు స్థానాల్లో నిలిచారు."Hellooooooooooooooooooo" - Kerry O'Keeffe enjoyed that beauty! #AUSvBAN pic.twitter.com/c6lvDgwe2P— cricket.com.au (@cricketcomau) August 16, 2026Read: లైవ్ మ్యాచ్లో వాంతి చేసుకున్న జకోవిచ్.. షాక్లో ఫ్యాన్స్! -
31 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డులు బద్దలు కొట్టిన బంగ్లాదేశ్
ఆస్ట్రేలియాను టెస్టుల్లో వారి సొంతగడ్డపైనే మట్టికరిపించిన బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్లోనే ఓడించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఒకసారి వాటిని పరిశీలిద్దాం.9 వికెట్లతో విజయం: వికెట్ల పరంగా బంగ్లాదేశ్కు ఇది రెండో అతిపెద్ద టెస్టు విజయం. 2024లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.2- బంగ్లాదేశ్కు ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఇది రెండో విజయం. గతంలో 2017 మీర్పూర్ టెస్టులో ఆసీస్ను తొలిసారి ఓడించింది. ఆసీస్ గడ్డపై మాత్రం బంగ్లాదేశ్కు ఇదే తొలి విజయం. అంతేకాదు ఆసీస్ను వారి సొంతగడ్డపైనే ఓడించడం కూడా ఇదే మొదటిసారి. కాగా ఆసీస్తో జరిగిన ఏడు టెస్టుల్లో బంగ్లాకు ఇది రెండో విజయం.SENA: సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో రెండింటి ఓడించిన జట్టుగా బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 2022లో మౌంట్ మాంగనుయిలో న్యూజిలాండ్ను చిత్తు చేసిన బంగ్లా తాజాగా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించింది.👉ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ ఇప్పటివరకు మూడు టెస్టులు మాత్రమే ఆడింది. అయితే కేవలం మూడు టెస్టుల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ ఫీట్ ఆసియా జట్ల పరంగా అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్కు ఏడు టెస్టుల తర్వాత, భారత్కు 12 టెస్టుల తర్వాత తొలి టెస్టు విజయం దక్కింది. ఈ రెండు దేశాలను బంగ్లాదేశ్ అధిగమించడం విశేషం. మరోవైపు శ్రీలంక మాత్రం ఆసీస్ గడ్డపై 15 టెస్టులు ఆడినప్పటికీ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది.👉1995 తర్వాత ఆస్ట్రేలియాను తమ సొంతగడ్డపై భారత్ కాకుండా మరో ఆసియా జట్టు (బంగ్లాదేశ్) ఓడించడం 31 ఏళ్లలో ఇదే తొలిసారి.👉సొంతగడ్డపై రెండుసార్లు ఆసియా జట్ల (భారత్, బంగ్లాదేశ్) చేతిలో ఓటమి చవిచూసిన తొలి కెప్టెన్గా పాట్ కమిన్స్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 2024లో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా తాజాగా బంగ్లాదేశ్ చేతిలో పరాజయం చవిచూసింది.Historic Win in Darwin! 🇧🇩🔥 Bangladesh beat Australia by 9 wickets to seal a memorable victory in the 1st Test! 🏏🏆#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/PDrWJS8ZEs— Bangladesh Cricket (@BCBtigers) August 16, 2026 HISTORY WRITTENBangladesh becomes the Asian team to take least number of Tests to beat Australia in #Australia 🤯#Banvsaus #Australiancricket #Bangladeshcricket #Cricket #BANVSAUS pic.twitter.com/SE42IBxCbo— PRAKASH (@CHPRAKASH07) August 16, 2026Read: ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్ముద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.అంతకముందు రెండో ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోరు 161 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (104 పరుగులు) శతకంతో మెరవగా, స్మిత్ (44), అలెక్స్ క్యారీ (30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా, హసన్ మహ్ముద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులకు ఆలౌటైంది. తంజిద్ సెంచరీతో చెలరేగగా, నజ్ముల్, మెహదీ హసన్లు అర్ధశతకాలతో రాణించారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మహ్ముద్ హసన్ 6 వికెట్లతో చెలరేగాడు. 👉23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్లో మట్టికరిపించడం ఇదే తొలిసారి. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాకు ఇది రెండోసారి. గతంలో 2017లో మీర్పూర్లో జరిగిన టెస్టులో ఆసీస్ను తొలిసారి ఓడించింది.సంక్షిప్త స్కోర్లు:ఆస్ట్రేలియా: 198 ఆలౌట్ & 284 ఆలౌట్బంగ్లాదేశ్: 426 ఆలౌట్ & 57/1Dominant. Commanding. Controlling.These are all words to describe a proud moment in Bangladesh history, because they have THUMPED Australia in Australia to win a Test by nine wickets! pic.twitter.com/MGUXtIySP9— 7Cricket (@7Cricket) August 16, 2026Read: క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్! -
ముగిసిన రెండో రోజు ఆట.. భారత స్కోరెంతంటే?
Sri Lanka Vs India 1st Test Day-2 Live Updates: గాలే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల చేసింది. క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. భారత బ్యాటర్లలో దేవ్దత్త్ పడిక్కల్(167) టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్ రాహుల్(82), ధ్రువ్ జురెల్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియాటీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 447 పరుగుల వద్ద తొలుత సిరాజ్ (11) ఆతర్వాత సుతార్ (24) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయింది.ఏడో వికెట్ కోల్పోయిన భారత్432 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో ధనంజయకు క్యాచ్ ఇచ్చి ధృవ్ జురెల్ (51) ఔటయ్యాడు. మానవ్ సుతార్ (21)కు జతగా సిరాజ్ క్రీజ్లోకి వచ్చాడు. టీమిండియా ఆరో వికెట్ డౌన్టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. కేశర నువంత బౌలింగ్లో ఔటయ్యాడు. 101 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది.టీ బ్రేక్కు భారత్ స్కోరెంతంటే?రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 364 పరుగుల స్కోర్ సాధించింది. క్రీజులో రవీంద్ర జడేజా(4), ధ్రువ్ జురెల్(19) ఉన్నారు.పడిక్కల్ అవుట్పడిక్కల్ రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 167 పరుగులు చేసిన పడిక్కల్.. ప్రభాత్ జైసూర్య బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. 93 ఓవర్లకు భారత్ స్కోర్: 361/5. క్రీజులో జురెల్(19), జడేజా(1) ఉన్నారుభారత్ నాలుగో వికెట్ డౌన్భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 82 పరుగులు చేసిన రాహుల్.. నువాంత బౌలింగ్లో ఔటయ్యాడు. 87 ఓవర్లకు భారత్ స్కోర్: 335/4భారత్ మూడో వికెట్ డౌన్భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన పంత్.. కేశర నువాంత బౌలింగ్లో ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో గాయపడిన కేఎల్ రాహుల్ తిరిగి బ్యాటింగ్కు వచ్చాడు. 81 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆట తిరిగి ప్రారంభంఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. దీంతో రెండో రోజు ఆట తిరిగి ప్రారంభమైంది. 75 ఓవర్లకు టీమిండియా స్కోర్: 296/2. క్రీజులో పడిక్కల్(133), రిషబ్ పంత్(32) ఉన్నారు.మళ్లీ మొదలైన వర్షంమధ్యాహ్నం 2:11 గంటలు- రెండు గంటల విరామం తర్వాత వర్షం మళ్లీ మొదలైంది. ఆట దాదాపుగా ప్రారంభం కావాల్సిన సమయంలో వరుణుడు మరోసారి పలకరించాడు. దంచుతున్న వానలంచ్ విరామం అనంతరం కాసేపు ఎండ పలకరించినప్పటికీ, వరుణుడు మరోసారి విజృంభించాడు. దీంతో స్టేడియంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమవుతుందా? లేదా అన్నది ఆసక్తిగా మారిపోయింది.శాంతించిన వరుణుడు..గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదటి సెషన్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. అయితే లంచ్ విరామ సమయానికి వర్షం ఆగిపోయింది. దీంతో లంచ్ బ్రేక్ అనంతరం మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పిచ్పై కవర్లను తొలగించిన సిబ్బంది గ్రౌండ్ను సాపింగ్ చేశారు.👉గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య మొదలైన తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో పిచ్పై కవర్లను కప్పి ఉంచారు. 👉రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (178 బంతుల్లో 131 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి సెంచరీతో అదరగొట్టాడు. పంత్ (36 బంతుల్లో 27 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు.👉 అంతకముందు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (162 బంతుల్లో 77; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా హాఫ్ సెంచరీతో మెరవడంతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అర్ధశతకం అనంతరం రాహుల్ గాయంతో మైదానాన్ని వీడగా... పడిక్కల్తో కలిసి యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 32; 5 ఫోర్లు) రనౌట్గా వెనుదిరగగా... కెప్టెన్ శుబ్మన్ గిల్ (16) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఏకైక వికెట్ పడగొట్టాడు. -
క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పడిక్కల్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక రికార్డు విషయంలో మాత్రం పడిక్కల్ తన గురువు విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు. అదేంటంటే విరాట్ కోహ్లి తన తొలి టెస్టు సెంచరీని రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) రోజున చేశాడు. 2012 జనవరి 26న అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కోహ్లి 116 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లికి టెస్టుల్లో అదే తొలి సెంచరీ కావడం విశేషం. తాజాగా దేవదత్ పడిక్కల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన తొలి టెస్టు సెంచరీని బాదడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఇలా తన గురువు కోహ్లి రిపబ్లిక్ డే రోజున మెయిడెన్ టెస్టు శతకం సాధిస్తే.. శిష్యుడు పడిక్కల్ ఇండిపెండెన్స్ రోజున తొలి టెస్టు శతకం అందుకోవడం గమనార్హం. మరో విషయమేంటంటే.. రిపబ్లిక్ డే రోజున సెంచరీ చేసిన ఒకే ఒక్క బ్యాటర్గా కోహ్లి చరిత్ర సృష్టిస్తే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీమిండియా తరఫున సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్గా పడిక్కల్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇండిపెండెన్స్ రోజున కూడా సెంచరీ బాదినప్పటికీ, అది వన్డే ఫార్మాట్లో వచ్చింది.తొలి బ్యాటర్గా రికార్డుపడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్గా పడిక్కల్ రికార్డులెక్కాడు.పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడమ చేతి వాటం బ్యాటర్గా సలీమ్ దురానీ, బాపూ నాడ్కర్ణి, అజిత్ వాడేకర్, ఏక్నాథ్ సోల్కర్, సురీందర్ అమర్నాథ్, వినోద్ కాంబ్లీ పడిక్కల్ చేరాడు.Virat Kohli was the only Indian batter to score a century on Republic Day, achieving the feat in 2012, which was also his maiden Test century. 🇮🇳Now, Devdutt Padikkal becomes the only Indian batter to score a century on Independence Day, and it’s his maiden Test century too!… pic.twitter.com/CxgE0Q3VnV— CREX (@Crex_live) August 15, 2026Read: మూడో స్థానంపై బేఫికర్.. గిల్ నమ్మినబంటు పడిక్కల్ -
మూడో స్థానంపై బేఫికర్.. గిల్ నమ్మినబంటు పడిక్కల్
దేశవాళీల్లో దుమ్మురేపి భారత జట్టుకు ఎంపికైన దేవదత్ పడిక్కల్ అంతర్జాతీయ స్థాయిలోనూ అదే జోరు కనబరిచాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రత్యర్థి బౌలర్లతో చెడుగుడు ఆడుకున్న పడిక్కల్ శ్రీలంకతో తొలి టెస్టులో అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ నమ్మకాన్ని ఒక్క శతకంతో పడిక్కల్ నిలబెట్టుకున్నాడు. 'లంకతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాలో మూడో స్థానంలో బ్యాటింగ్కు ఎవరు వస్తున్నారు?' అనే ప్రశ్న గిల్కు ఎదురైంది. కానీ గిల్ ఏమాత్రం తడబడకుండా దేవదత్ పడిక్కల్ పేరును బయటికి చెప్పాడు. మూడో స్థానంలో అంతకంటే మంచి బ్యాటర్ను తాను చూడలేదని, ఈ సిరీస్లో పడిక్కల్ బ్యాటింగ్కు వెన్నుముకలా మారుతాడని గిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా తొలి టెస్టులో సూపర్ సెంచరీతో గిల్కు నమ్మిన బంటు అయ్యాడు పడిక్కల్.2024లో అనూహ్య పిలుపు..2024లో ఆ్రస్టేలియాపై చివరి టెస్టు మ్యాచ్ ఆడిన దేవదత్ పడిక్కల్ శ్రీలంక పర్యటనకు ఎంపికైనా... అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే గాయం కారణంగా సాయి సుదర్శన్ సిరీస్కు దూరం కావడం... అదే సమయంలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారీ సెంచరీ చేయడంతో పడిక్కల్కు ఆ అవకాశం వచ్చింది. రెండేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న పడిక్కల్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గత 20 టెస్టుల్లో భారత జట్టు తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగిన ప్లేయర్ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోగా... ఆ లోటును పడిక్కల్ భర్తీ చేశాడు. ఆరంభంలో వన్డే తరహాలో బంతికో పరుగు చొప్పున రాబట్టిన అతడు... ఆ తర్వాత మంచి బంతులను గౌరవిస్తూ ముందుకు సాగాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో చక్కటి స్వీప్ షాట్లు ఆడిన పడిక్కల్... పేసర్లకు ‘నటరాజ్’ షాట్లతో బదులిచ్చాడు. స్క్వేర్ లెగ్ దిశగా సులువుగా పరుగులు రాబట్టిన అతడు... తన ట్రేడ్మార్క్ పంచ్ షాట్లతో అలరించాడు. కర్ణాటక తరఫున దేశవాళీల్లో రాహుల్తో కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్... అంతర్జాతీయ స్థాయిలోనూ అదే దూకుడు కనబర్చాడు. సెంచరీ అనంతరం కూడా అలసత్వానికి తావివ్వకుండా పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. రెండో రోజు కూడా అతడు ఇదే జోరు కొనసాగిస్తూ క్రీజులో పాతుకుపోతే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. అంతేకాదు పుజారా రిటైర్మెంట్ తర్వాత తన స్థానాన్ని భర్తీ చేసేందుకు పడిక్కల్కు ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు. ఈ సిరీస్లో విశేషంగా రాణిస్తే మాత్రం పడిక్కల్ స్థానానికి ఢోకా ఉండదు.MAIDEN TEST HUNDRED! 💯A special moment on a special day for Devdutt Padikkal in Galle 🥳Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/8x1HcYeFbA— BCCI (@BCCI) August 15, 2026Read: నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్.. గాయంపై బిగ్ అప్డేట్! -
నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్.. గాయంపై బిగ్ అప్డేట్!
గాలే వేదికగా మొదలైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ కండరాల నొప్పితో మైదానం వీడడం భారత శిబిరంలో ఆందోళన కలిగించింది. అర్ధశతకం సాధించిన రాహుల్ శతకం వైపు పరుగులు తీస్తున్న క్రమంలోనే కండరాల నొప్పితో విలవిల్లాడిపోయాడు. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో టీ బ్రేక్ తర్వాత బ్యాటింగ్కు రాలేకపోయాడు.దీంతో లంకతో టెస్టు సిరీస్కు కేఎల్ రాహుల్ దూరమవుతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కేఎల్ రాహుల్ గాయంపై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. రాహుల్ ఫిట్నెస్పై అందోళన వద్దని అంటున్నాడు. కండరాలు పట్టేశాయని, భారత ఓపెనర్ ఫిట్గానే ఉన్నాడని సితాన్షు వెల్లడించాడు.‘కేఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నా దృష్టిలో అతడికి క్రాంప్స్ వచ్చాయంతే. రోజు ముగిసే సరికి అతడు బాగానే ఉన్నాడు. కండరాలు పట్టేయడం మొదలయ్యాక .. తొడ కండరాలు నొప్పి మొదలవుతుంది. ఒక్కోసారి గజ్జల్లోనూ నొప్పి వస్తుంది. కానీ, అతడు బాగానే ఉన్నాడు. రేపు అతడు బ్యాటింగ్కు సిద్ధంగా ఉంటాడు’ అని సితాన్షు పేర్కొన్నాడు.గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టును భారత్ ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు ఆటలో ఆతిథ్య జట్టుపై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ బ్యాటర్ దేవ్దత్త్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పడిక్కల్ 131 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రిషబ్ పంత్ (31) క్రీజులో ఉన్నాడు. A worrying moment in Galle. 😟💔KL Rahul has retired hurt after struggling with an issue in his right-hand finger, along with severe cramps.He was seen receiving treatment before walking back to the dressing room. Hoping it’s nothing serious and KL is back soon. 🙏❤️📸:… pic.twitter.com/Q8w6XdHuwx— CricTracker (@Cricketracker) August 15, 2026Read: ఆఫ్గన్ కెప్టెన్ రికార్డు సెంచరీ.. ఐర్లాండ్ క్లీన్స్వీప్ -
ఆఫ్గన్ కెప్టెన్ రికార్డు సెంచరీ.. ఐర్లాండ్ క్లీన్స్వీప్
సొంతగడ్డపై ఐర్లాండ్కు భారీ షాక్ తగిలింది. ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను అఫ్గానిస్తాన్ (ఒక మ్యాచ్ రద్దు) 4-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. రహమత్ షా అజేయ సెంచరీతో చెలరేగి ఆఫ్గన్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. శనివారం జరిగిన ఐదో వన్డేలో అఫ్గానిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హారీ టెక్టర్ (53) అర్ధసెంచరీతో రాణించగా, లోయర్ ఆర్డర్లో కర్టిస్ కాంఫర్ (96) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. చివర్లో జార్జ్ డాక్రెల్ (31), జోర్డాన్ నీల్ (23 నాటౌట్) రాణించారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా 3 వికెట్లు తీయగా, గజన్ఫర్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు తొందరగానే ఔటైనప్పటికీ వన్డౌన్లో వచ్చిన సేదికుల్లా (98) వరుసగా రెండో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా, కెప్టెన్ రహమత్ షా (133 బంతుల్లో 143 నాటౌట్) ఆఖరి దాకా నిలిచి జట్టును గెలిపించాడు. అజ్మతుల్లా (24) రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో లియామ్ మెక్కార్తి 3 వికెట్లు తీశాడు.👉వన్డే క్రికెట్లో అఫ్గానిస్తాన్ ఇదే అత్యధిక పరుగుల ఛేదన కాగా, తొలి మ్యాచ్ రద్దు కారణంగా నాలుగు వన్డేల్లోనూ విజయం సాధించిన ఆఫ్గన్ ఐర్లాండ్ను 4-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక వన్డేల్లో కెప్టెన్గా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా రహ్మత్ షా నిలిచాడు. గతంలో అస్గర్ అఫ్గాన్, షాహిదిలు సెంచరీలు బాదారు. అయితే అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత స్కోరును రహ్మత్ షా తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో ఈ రికార్డు 2026 జూన్ 20న భారత్పై మ్యాచ్లో షాహిది (102 పరుగులు) పేరిట ఉండేది.👉ఇక వన్డేల్లో అఫ్గానిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రహ్మత్ షా ఆరో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఇబ్రహీం జర్దన్ కొనసాగుతున్నాడు. 2025లో లాహోర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో ఇబ్రహీం జర్దన్ 177 పరుగులు చేశాడు. రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా జర్దన్దే కావడం విశేషం. ఇక మూడో స్థానంలో రహమనుల్లా గుర్బాజ్ (151 పరుగులు) ఉన్నాడు.𝐀𝐅𝐆𝐇𝐀𝐍𝐈𝐒𝐓𝐀𝐍 𝐂𝐎𝐌𝐏𝐋𝐄𝐓𝐄 𝐀 𝟒–𝟎 𝐒𝐄𝐑𝐈𝐄𝐒 𝐕𝐈𝐂𝐓𝐎𝐑𝐘 𝐎𝐕𝐄𝐑 𝐈𝐑𝐄𝐋𝐀𝐍𝐃! 🔥AfghanAtalan produced a magnificent run chase in the fifth and final ODI and successfully chased down Ireland’s 299-run target to secure a six-wicket victory and complete a… pic.twitter.com/VrlXqRlbdu— Afghanistan Cricket Board (@ACBofficials) August 15, 2026 -
రాహుల్ దెబ్బకు మైదానం వీడిన లంక ప్లేయర్!
గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆటగాడు నిషాన్ మదుష్క గాయంతో మైదానం వీడడం కలకలం రేపింది. టీమిండియా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రబాత్ జయసూరియా వేసిన బంతిని కేఎల్ రాహుల్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో నిషాన్ మదుష్క మెడ భాగంలో బలంగా తగిలింది. దీంతో మైదానంలో కిందపడిపోయిన నిషాన్ వద్దకు ఫిజియో పరిగెత్తుకు వచ్చారు. అయితే నిషాన్ మెడపై బంతి తాకిన ప్రదేశంలో వాపు రావడంతో డాకర్లు వెంటనే అతడిని పెవిలియన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. దీంతో కంకషన్కు గురైన నిషాన్ మదుష్క స్థానంలో సూరియాబండారా సబ్స్టిట్యూట్గా వచ్చాడు. ఒకవేళ నిషాన్ మదుష్క గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం తొలి టెస్టుకు అతడు దూరమయ్యే అవకాశాలున్నాయి. అదే గనుక జరిగితే నిషాన్ స్థానంలో సూరియా బండారా టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఒకవేళ మదుష్క దూరమైతే మాత్రం శ్రీలంకకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఇటీవలే ఇండియా-ఏతో జరిగిన అనధికారిక మ్యాచ్లో ఆడిన నిషాన్ 4 ఇన్నింగ్స్లు కలిపి 256 పరుగులు సాధించాడు. అంతేకాదు శ్రీలంక తరఫున టెస్టుల్లో 64.50 సగటుతో పరుగులు సాధించిన మదుష్క ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. గాయంతో నిషాన్ మదుష్క దూరమైతే అతడి స్థానంలో రానున్న పసిందు సూరియబండారా కూడా ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 54.36 సగటుతో 4,893 పరుగులు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి టీమిండియా 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులు చేశారు. అంతకముందు జైస్వాల్ (32) రాహుల్తో సమన్వయ లోపంతో రనౌట్గా వెనుదిరిగాడు.😳 NASTY BLOW FOR NISHAN MADUSHKA!KL Rahul’s powerful sweep struck Nishan Madushka on the helmet, forcing the Sri Lankan fielder to leave the field. 🏏Hoping Madushka is absolutely fine and back on the field soon! 🙏🇱🇰#INDvsSL pic.twitter.com/MxtoXiJEuC— CricInformer (@CricInformer) August 15, 2026Read: ఆరు వికెట్లతో ఇరగదీశాడు.. ఆసీస్ బౌలర్ అరుదైన ఫీట్ -
ఆరు వికెట్లతో ఇరగదీశాడు.. ఆసీస్ బౌలర్ అరుదైన ఫీట్
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ ఆరు వికెట్లతో చెలరేగాడు. తద్వారా టెస్టుల్లో 300 వికెట్ల మార్క్ను అందుకున్న హాజిల్వుడ్ ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన 9వ బౌలర్గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో 14వ సారి ఐదు వికెట్ల హల్ అందుకున్న హాజిల్వుడ్.. ప్రస్తుతం ఆసీస్ జట్టులో 300 వికెట్ల మార్క్ చేరుకున్న నాథన్ లియోన్, కమిన్స్, స్టార్క్ సరసన నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఏడో పేసర్గా హాజిల్వుడ్ నిలిచాడు. గతంలో మెక్గ్రాత్ (563 వికెట్లు), మిచెల్ స్టార్క్ (435 వికెట్లు), డెన్నిస్ లిల్లీ (355 వికెట్లు), పాట్ కమిన్స్ (316 వికెట్లు), మిచెల్ జాన్సన్ (313 వికెట్లు), బ్రెట్ లీ (310) హాజిల్వుడ్ కంటే ముందున్నారు. టెస్టుల్లో 300 వికెట్లు పడగొట్టే క్రమంలో ఆస్ట్రేలియా తరఫున తక్కువ సగటుతో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలోనూ హాజిల్వుడ్ చోటు సంపాదించాడు. హాజిల్వుడ్ 24.02 సగటుతో 300 వికెట్ల మార్క్ చేరుకోగా, మెక్గ్రాత్ (21.64), కమిన్స్ (22.21), డెన్నిస్ లిల్లీ (23.92) ముందున్నారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తంజిద్ హసన్ (101) సెంచరీతో చెలరేగగా, నజ్ముల్ (84) రాణించాడు. మూడో రోజు ఆటలో మెహదీ హసన్ (65) అర్ధశతకం సాధించడంతో బంగ్లా 400 పరుగుల మార్క్ను దాటింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 228 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్వుడ్ ఆరు వికెట్లు తీయగా, స్టార్క్ 2, కమిన్స్, లియోన్ చెరొక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. స్మిత్ (37), గ్రీన్ (6) క్రీజులో ఉన్నారు. ఆసీస్ మరో 131 పరుగులు వెనుకబడి ఉంది.Josh Hazlewood joins an elite club - he becomes the 7th Australian pacer and 9th Australian bowler overall to 300 Test wickets 👏#AUSvBAN pic.twitter.com/Yag1VUY34k— Cricbuzz (@cricbuzz) August 15, 2026Josh Hazlewood also bagged his 14th fifer in Tests with his 300th scalp 🔥pic.twitter.com/7S6oFzafUq https://t.co/JB4JIGl9b7— Cricbuzz (@cricbuzz) August 15, 2026చదవండి: అగార్కర్ పదవి ఉంటుందా? ఊడుతుందా? డెడ్లైన్ అప్పుడే! -
IND vs SL: తొలి రోజు భారత్దే
Sri Lanka Vs India 1st Test Live Updates: గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(131), రిషబ్ పంత్(27) ఉన్నారు.శుబ్మన్ గిల్ అవుట్61.5: ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగిన గిల్ (16). స్కోరు 236-2. పడిక్కల్ 107 పరుగులతో ఉన్నాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు.పడిక్కల్ సెంచరీటీమిండియా వన్డౌన్బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శతక్కొట్టాడు. 134 బంతులలో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 235/1(61). పడిక్కల్ 106, గిల్ 16 పరుగులతో ఉన్నారు.కేఎల్ రాహుల్కు గాయంటీమిండియాకు భారీ షాక్ తగిలింది. సెంచరీ దిశగా దూసుకుపోతున్న కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అతడిస్థానంలో కెప్టెన్ గిల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీటీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. 46 ఓవర్లకు భారత్ స్కోర్: 166/1. క్రీజులో రాహుల్(53), పడిక్కల్(78) ఉన్నారు.పడిక్కల్ హాఫ్ సెంచరీదేవ్దత్త్ పడిక్కల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 81 బంతుల్లో తన రెండో ఆర్ధ శతకాన్ని అతడు అందుకున్నాడు. 37 ఓవర్లకు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్తో పాటు రాహుల్(41) ఉన్నాడు.తిరిగి మొదలైన ఆట2 PM: వాన తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది.మొదలైన జల్లులు!12.38 PM: గాలెలో చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ సిబ్బంది వచ్చి పిచ్ను కవర్లతో కప్పుతున్నట్లు సమాచారం. వాన వల్ల ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.లంచ్ బ్రేక్: టీమిండియా స్కోరు 101/1లంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్లో జైస్వాల్ రనౌట్ మినహా భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. Lunch on Day 1 of the First #SLvIND Test.A solid morning session as #TeamIndia move to 101/1 👌👌Stay tuned for the second session of the day. Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y pic.twitter.com/ru1NamfAn4— BCCI (@BCCI) August 15, 2026జైసూ స్థానంలోక్రీజులోకి పడిక్కల్👉18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (22), పడిక్కల్ (20) పరుగులతో ఆడుతున్నారు.👉 లంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్తో జరిగిన సమన్వయ లోపంతో ఇద్దరు ఒకే ఎండ్కు రావడంతో జైస్వాల్ (32) రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.👉 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. జైస్వాల్ (23), కేఎల్ రాహుల్ (10) పరుగులతో ఆడుతున్నారు.రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గాలే వేదికగా శనివారం శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతాడని అంతా భావించినప్పటికీ గిల్ మాత్రం ధ్రువ్ జురెల్వైపే మొగ్గుచూపాడు. ఇక ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్తో బరిలోకి దిగింది.తుది జట్లు:టీమిండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంక: లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్లో విజయం సాధించాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజ్ఞులు కరువయ్యారు. Captain Shubman Gill wins the toss and elects to bat first at Galle.A look at our Playing XI for the game.Live - https://t.co/bg2q0J2x1f #SLvIND pic.twitter.com/ll2Xa9sTm3— BCCI (@BCCI) August 15, 2026 టీమిండియా పంద్రాగష్టు సంబరాలు హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour 🇮🇳 ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU— BCCI (@BCCI) August 15, 2026 -
లైవ్ మ్యాచ్లో ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్.. లక్ష జరిమానా!
తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా, తన ప్రియురాలికి ఒక యువ బ్యాటర్ ఫోన్లో టెక్ట్స్ మెసేజ్ పంపాడు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనలను ఉల్లంఘించినందుకు, సదరు యువ బ్యాటర్కు బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) రూ. 1 లక్ష జరిమానా విధించింది. ‘‘విచారణ కొనసాగుతున్నందున తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆటగాడి పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. ‘జరిమానా విధించిన ఆటగాడు ఎడమచేతి వాటం బ్యాటర్ అని, గతేడాది రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున రెండు అర్ధశతకాలు సాధించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతను తన ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్లు పంపుతూ కనిపించాడు. ఇది ఎలాంటి అవినీతి ఆరోపణల కిందకు రానప్పటికీ, మ్యాచ్ జరుగుతున్నప్పుడు PMOAలో మొబైల్ ఫోన్ వాడటం నిషేధం. అందువల్ల ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే అతడికి లక్ష జరిమానా విధించాం" అని సీనియర్ అధికారి పేర్కొన్నాడు. మొదట యువ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధించాలనుకున్నప్పటికీ, నేరం పెద్దది కాకపోవడంతో జరిమానాతో సరిపెట్టారు.ఐపీఎల్ 2026 సీజన్లో, రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో ఫోన్ వాడడం అప్పట్లో సంచలనం కలిగించింది. రోమీ భిందర్ పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా అతడి ఫోన్ చూస్తుండడం వైరల్గా మారింది. దీంతో మ్యాచ్ జరుగున్న సమయంలో ఫోన్ చూడడం పీఎంవోఏ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. దీంతో బీసీసీఐ పీఎంవోఏ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రోమీ భిందర్కు లక్ష జరిమానా విధించిన బీసీసీఐ వైభవ్ను మాత్రం హెచ్చరికలతో సరిపెట్టింది. -
సన్రైజర్స్ కొంపముంచిన క్లాసెన్.. ఫైనల్లో సూపర్ జెయింట్స్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026లో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం సన్రైజర్స్ లీడ్స్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్, ఓపెనర్ పాల్ వాల్టర్ విధ్వంసానికి తోడుగా బౌలింగ్లో జోష్ టంగ్ అద్భుత ప్రదర్శన సూపర్ జెయింట్స్కు విక్టరీని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పాల్ వాల్టర్ (46 బంతుల్లో 80; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), క్లాసెన్ (26 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ జోస్ బట్లర్ (33) రాణించాడు. సన్రైజర్స్ లీడ్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, నాథన్ ఎల్లిస్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం సన్రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రియాన్ రికిల్టన్ (54 నాటౌట్) చివరివరకు అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. హ్యారీ బ్రూక్ (49) నిధానంగా ఆడడం జట్టు కొంపముంచింది. ఆద్యంతం సూపర్ జెయింట్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్రైజర్స్ లీడ్స్ పరుగులు చేయడంలో విఫలమైంది. సూపర్జెయింట్స్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. రేపు జరగనున్న హండ్రెడ్ మెన్స్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్తో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ తలపడనుంది. ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్లాసెన్ హండ్రెడ్లో మాత్రం సన్రైజర్స్కు ప్రత్యర్థిగా ఆడి వాళ్లు ఫైనల్ చేరకుండా సైంధవుడిలా అడ్డుపడ్డాడు.ఫైనల్లో సన్రైజర్స్ వుమెన్ టీంమరోవైపు హండ్రెడ్ వుమెన్ కాంపిటీషన్లో మాత్రం సన్రైజర్స్ లీడ్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సదరన్ బ్రేవ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో సన్రైజర్స్ లీడ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (32) టాప్ స్కోరర్. అన్నాబెల్ సదర్లాండ్, హన్నా బేకర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్రైజర్స్ లీడ్స్ వుమెన్ జట్టు 89 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. లారెన్ విన్ఫీల్డ్ (37), దీప్తి శర్మ (28 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. రేపే జరగనున్న వుమెన్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్తో సన్రైజర్స్ తలపడనుంది.SunRisers Leeds Women enters @thehundred final after beating Southern Brave Women, while Manchester Super Giants Men does so in other match beating #SRL.Lauren Winfield-Hill (37), Deepti Sharma (28* & 1/24) & Hannah Baker (2/13) led #SRLW, while #MSG had Paul Walter (80),…— The CricHub (@thecrichub_live) August 14, 2026 -
‘సారథ్యం భారం కాదు.. ఈ టెస్టు మ్యాచ్ నాకు ప్రత్యేకం’
గాలె: భారత క్రికెట్ జట్టు సరైన దిశలోనే ప్రయాణిస్తోందని టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ వెల్లడించాడు. సారథ్య బాధ్యతలు తనపై ఎలాంటి అదనపు భారం వేయడం లేదన్న గిల్... భవిష్యత్తులో జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశాడు. గతేడాది కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన గిల్... టీమిండియా 2–2తో సిరీస్ ‘డ్రా’ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు సిరీస్ పరాజయాలు ఎదుర్కొంది. 2027లో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు భారత జట్టు ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో సింహభాగం విజయాలు సాధిస్తేనే తుదిపోరుకు చేరనుంది. ఈ క్రమంలో నేటి నుంచి శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, ప్లేయర్ల దృక్పథం, కీలక ఆటగాళ్ల గాయాలపై గిల్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... అదే ప్రధాన లక్ష్యం... కెప్టెన్సీతో నాకెలాంటి ఇబ్బంది లేదు. గతేడాది కాలంగా నా ప్రదర్శనను గమనిస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. నా దృష్టిలో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం నా ఆటతీరు మరింత మెరుగైందనిపిస్తుంది. ప్రస్తుతం జట్టు సరైన దిశలోనే సాగుతోంది. ఇప్పుడు మా ముందున్న ప్రధాన లక్ష్యం వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించడమే. రానున్న ఆరు, ఏడు మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తే అది సాధ్యమవుతుంది. శ్రీలంక పర్యటనతోనే ఆ దిశగా ముందడుగు వేయాలనుకుంటున్నాం. అందుకోసం బాగా సన్నద్ధమయ్యాం. నెట్స్లో తీవ్రంగా శ్రమించడంతో పాటు... ప్రాక్టీస్ మ్యాచ్లో సైతం మెరుగైన ప్రదర్శన చేశాం. అరుదైన 600వ టెస్టు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప అవకాశం. అందులో సారథ్యం వహించడం మరింత గర్వకారణం. అలాంటిది టీమిండియా మైలురాయి టెస్టు మ్యాచ్లో జట్టును నడిపించనుండటం ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. భారత్ ఆడిన 100వ టెస్టు మ్యాచ్కు మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యం వహించగా... 500వ మ్యాచ్కు విరాట్ కోహ్లి కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు 600వ మ్యాచ్కు నేను కెప్టెన్ కావడం... అది కూడా దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు కావడం మరింత ప్రత్యేకం. శ్రీలంక పిచ్లు స్పిన్కు అనుకూలించడం పరిపాటి కాగా... పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితేనే మెరుగైన ఫలితాలు సాధించగలం. ప్రసిధ్కే మొగ్గు... ఫాస్ట్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. గుర్నూర్ బ్రార్, ఆఖిబ్ నబీలో ఎంతో నైపుణ్యం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్లో గుర్నూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. బంతి పాతబడ్డ తర్వాత అతడు మరింత ప్రమాదకరం. అదనపు బౌన్స్, అదనపు వేగంతో ప్రత్యరి్థని సులువుగా బోల్తా కొట్టించగలడు. అదే సమయంలో ప్రసిధ్ కృష్ణ నిలకడ కనబరుస్తున్నాడు. అతడికి అనుభవం కూడా ఉంది. దీంతో తుది జట్టు ఎంపిక మరింత కష్టమవుతుంది. స్టార్ పేసర్ బుమ్రా గైర్హాజరీలో ఇతర బౌలర్లు సత్తాచాటేందుకు ఇది సరైన సమయం. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి వికెట్లు రాబడితేనే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. నైపుణ్యానికి కొదవలేదు... జట్టులో నైపుణ్యం గల ఆటగాళ్లకు కొదవలేదు. ఏ స్థానానికైనా తగిన రిప్లేస్మెంట్ సిద్ధంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎవరికి అవకాశం ఇచ్చినా వారు సత్తా చాటగలరు. సుదీర్ఘ ఫార్మాట్లో పరుగులు సాధించడం అంత సులువు కాదు. జట్టులోకి వచ్చిన వెంటనే పరుగుల వరద పారించడం ఎవరికీ సాధ్యం కాదు. కొంతమంది ఆటగాళ్లు త్వరగా లయ అందుకుంటారు. మరికొంతమందికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అది ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పడిక్కల్ చాలా మంచి ప్లేయర్. గతంలోనూ అతడు చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ ఫార్మాట్లో విజయవంతం అయ్యేందుకు అవసరమైన సత్తా అతడిలో పుష్కలంగా ఉంది. 2017లో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడిన రాహుల్, రవీంద్ర జడేజా అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రిస్క్ తీసుకోలేం... ప్లేయర్ల జీవితంలో గాయాలు సహజం. ఈ సిరీస్కు మొదట ఎంపిక చేసిన బుమ్రా, సాయి సుదర్శన్ గాయాలతోనే దూరమయ్యారు. దీంతో ఒకింత ఇబ్బందికి గురయ్యాం. అయితే వారితో నిరంతరం టచ్లో ఉంటూ పురోగతి తెలుసుకుంటున్నాం. సుదీర్ఘ ఫార్మాట్లో రిస్క్ తీసుకోలేం. ఐదు రోజుల పాటు మైదానంలో గడపాలంటే మెరుగైన ఫిట్నెస్ తప్పనిసరి. టి20, వన్డేలతో పోల్చుకుంటే... ప్లేయర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు టెస్టుల్లో ఎక్కువ అవకాశాలుంటాయి. తొలి రోజు మెరుగ్గా ఆడలేకపోతే... రెండో రోజు దాన్ని మరిపించే ప్రదర్శనతో మన్ననలు అందుకునే చాన్స్ టెస్టుల్లోనే ఉంటుంది. మానవ్ సుతార్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో జట్టులో ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉన్నట్లే. -
తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లతో.. సర్ఫరాజ్కు చాన్స్!
శ్రీలంకతో గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాలే పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాతి మూడు రోజులు స్పిన్నర్లకు ఉపయుక్తంగా ఉంటుందని పిచ్ రిపోర్ట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మ్యాచ్కు ఒక్కరోజు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ, తుదిజట్టు ఇంకా ఖరారు కాలేదు. గాలే పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఈ లెక్కన కుల్దీప్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ లేదా సారాంశ్ జైన్లో ఒకరు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు దక్కించుకోనున్నారు. ఇక సిరాజ్, గుర్నూర్ బ్రార్ లేదా ప్రసిధ్ క్రిష్ణలు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో తొలి ఐదు స్థానాల్లో (జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, గిల్, పంత్) ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఆరో స్థానంపై తెగ చర్చ నడుస్తోంది. ఆరో స్థానంలో జురెల్ లేదా సర్ఫరాజ్ల్లో ఒకరికే చాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే సీనియార్టీ ప్రకారం జురెల్ కంటే సర్ఫరాజ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్ఫరాజ్ లంకతో తొలి టెస్టులో ఆడడం దాదాపు ఖాయమైనట్లే.టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్/సారాంశ్, సిరాజ్, గుర్నూర్/ప్రసిధ్ క్రిష్ణ.🚨 NOT A TURNER ❌ - Galle pitch is likely to be batting friendly in first 2 days. [Sahil Malhotra from TOI]India likely to field 2 quicks & 3 spinners for depth and balance. pic.twitter.com/vx6k5h5aLy— Johns. (@CricCrazyJohns) August 14, 2026Read: వీవీఎస్ లక్ష్మణ్కు బీసీసీఐ అత్యున్నత పదవి? -
వీవీఎస్ లక్ష్మణ్కు బీసీసీఐ అత్యున్నత పదవి?
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే బీసీసీఐ అత్యున్నత పదవిని అలంకరించనున్నట్లు సమాచారం. గంభీర్ స్థానంలో టీమిండియా హెడ్కోచ్గా రానున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్కు బీసీసీఐ (హెడ్కోచ్ పదవికి మించి) డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.కొత్తగా రూపొందించనున్న డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవికి లక్ష్మణ్ అయితేనే మంచి ఫలితం ఉంటుందని బీసీసీఐ భావించింది. అంతేకాదు లక్ష్మణ్ ఆ పదవిలో తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహిస్తాడని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు సీఈవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.ప్రస్తుతం లక్ష్మణ్ సీవోఈ హెడ్గా ఆటగాళ్ల పునరావాసం, శిక్షణ వంటి బాధ్యతలు చూస్తున్నాడు. 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా నియమితులైతే, ఆయన పరిధి మరింత విస్తృతం కానుంది. సీనియర్ పురుషుల, మహిళల జట్ల వ్యూహరచన, జాతీయ సెలక్షన్ కమిటీతో సమన్వయం, జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకు ఆటగాళ్ల ప్రగతిని పర్యవేక్షించడం వంటి కీలక అధికారాలు ఆయన చేతికి రానున్నాయి.ఇదే సమయంలో, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం కూడా సెప్టెంబర్తో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించాలా? లేక కొత్త వారిని నియమించాలా? అనే అంశంపై కూడా బీసీసీఐ చర్చిస్తోంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కొత్త కోచింగ్ బృందంతో సమన్వయం కోసం లక్ష్మణ్ లాంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.గతంలో రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టాలని బీసీసీఐ కోరినప్పటికీ, లక్ష్మణ్ సున్నితంగా తిరస్కరించాడు. బెంగళూరులోని నూతన సీవోఈ ప్రాజెక్టుపై దృష్టి సారించేందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు గాడిన పడటంతో, ఆయన అనుభవాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది. Read: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్ -
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ (197 బంతుల్లో 101 పరుగులు) శతకంతో చెలరేగాడు. డార్విన్ వేదికగా ఆడుతున్న టెస్టులో తంజిద్ తన కెరీర్లో డెబ్యూ సెంచరీ అందుకున్నాడు. అయితే తంజిద్కు ఇది రెండో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అంతేకాదు ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా తంజిద్ చరిత్ర సృష్టించాడు. అంతకముందు ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో బంగ్లాదేశ్కు హసన్ సర్కార్ సాధించిన 76 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డు కనుమరుగైంది. ఓవరాల్గా విదేశాల్లో సెంచరీ సాధించిన రెండో బ్యాటర్గా తంజిద్ నిలిచాడు. 2022లో మహ్మదుల్ హసన్ డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 137 పరుగులు సాధించాడు. ఇక ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన రెండో బంగ్లాదేశ్ క్రికెటర్గా తంజిద్ మరో రికార్డు అందుకున్నాడు. గతంలో 2006లో షాహ్రియర్ నఫీ 138 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే బంగ్లాదేశ్ ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. నజ్ముల్ షాంటో (75 బ్యాటింగ్), ముష్ఫికర్ రహీమ్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక తంజిద్, నజ్ముల్ కలిసి మూడో వికెట్కు 93 పరుగులు జోడించారు. అంతకముందు మోమినుల్ హక్ (49) అర్ధసెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. బంగ్లా బౌలర్ మహ్ముద్ హసన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇదే మ్యాచ్లో తస్కిన్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఆరో బంగ్లాదేశ్ బౌలర్గా తస్కిన్ నిలిచాడు. తస్కిన్ కంటే ముందు షకీబ్ అల్ హసన్ (712 వికెట్లు), ముష్రఫె మోర్తజా (389), ముస్తాఫిజుర్ రెహ్మన్ (383), మెహదీ హసన్ (369 వికెట్లు), తైజుల్ ఇస్లామ్ (302 వికెట్లు) ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 77 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.Tanzid Hasan has the first Test century of his career! 👏#MilestoneMoment | @NRMAInsurance | #AUSvBAN pic.twitter.com/lXkIJrXHAO— cricket.com.au (@cricketcomau) August 14, 2026 A moment to remember. 💯🇧🇩 Tanzid Hasan Tamim celebrates a maiden Test century in Darwin! What a knock. 🔥🏏#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/WypnVcwYBw— Bangladesh Cricket (@BCBtigers) August 14, 2026Read: 47 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్న మాజీ స్పిన్నర్ -
47 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్న మాజీ స్పిన్నర్
యాభై ఏళ్లకు దగ్గరగా ఉన్న ఆటగాళ్లు మహా అయితే ఏం చేస్తారు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి హాయిగా విశ్రాంతి తీసుకోవడం చూస్తుంటాం. కానీ సౌతాఫ్రికా మాజీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మాత్రం 47 ఏళ్ల వయసులోనూ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఇమ్రాన్ తాహిర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2026లో గయానా అమెజాన్ వారియర్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. వయసు పెరిగినా తన స్పిన్లో పదును తగ్గలేదని నిరూపిస్తూ ఇమ్రాన్ తాహిర్ సూపర్ బౌలింగ్తో అదరగొట్టాడు. జమైకా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ఇమ్రాన్ తాహిర్ రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడం విశేషం. అంతేకాదు వయసుకు ఫిట్నెస్తో సంబంధం లేదని నిరూపిస్తూ ఇమ్రాన్ తాహిర్ రీజా హెండ్రిక్స్ ఇచ్చిన క్యాచ్ను ముందుకు వంగి అందుకోవడం ద్వారా అబ్బురపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇమ్రాన్ తాహిర్ 2011లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 20 టెస్టుల్లో 57 వికెట్లు, 107 వన్డేల్లో 173 వికెట్లు, 38 టీ20ల్లో 63 వికెట్లు పడగొట్టాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే జమైకా కింగ్స్మెన్పై గయానా అమెజాన్ వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా కింగ్స్మెన్ 19.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. రీజా హెండ్రిక్స్ (40) టాప్ స్కోరర్. గయానా బౌలర్లలో మొహమ్మద్ నబీ 4 వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహిర్, షమర్ జోసెఫ్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం గయానా వారియర్స్ 14.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షెయ్ హోప్ (56 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ చేయగా, గ్లెన్ ఫిలిప్స్ (28), నబీ (19) రాణించారు.47-YEAR-OLD IMRAN TAHIR IS STILL STRONG 😁🔥- He is dominating CPL as Captain & Bowler. pic.twitter.com/DsFm7dCLqA— Johns. (@CricCrazyJohns) August 14, 2026Read: ‘ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు’.. స్టార్ ప్లేయర్కు గంభీర్ వార్నింగ్! -
‘ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు’.. స్టార్ ప్లేయర్కు గంభీర్ వార్నింగ్!
గాలే వేదికగా రేపటి నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇంకా ఖరారు కాలేదు. తుది జట్టుపై ఒక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక్క స్థానం విషయంలో మాత్రం మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. సాయి సుదర్శన్ గాయపడడంతో సర్ఫరాజ్ ఖాన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. దీంతో ధ్రువ్ జురెల్ తుది జట్టులో కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి.జురెల్తో పోలిస్తే సర్ఫరాజ్ ఖాన్కు టెస్టుల్లో మంచి రికార్డు ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ధ్రువ్ జురెల్కు మేనేజ్మెంట్ నుంచి హెచ్చరికలు వస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ జట్టులో చోటు ఉండాలంటే ధ్రువ్ జురెల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని, లేదంటే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని కోచ్ గంభీర్ అతడికి సున్నితంగానే హెచ్చరించినట్లు సమాచారం. పంత్ రెగ్యులర్ వికెట్ కీపర్గా ఉండడంతో ఇంతకాలం జురెల్ అదనపు బ్యాటర్గా జట్టులో కొనసాగాడు. తాను ఆడిన 10 టెస్టుల్లో బ్యాటింగ్కు మాత్రమే పరిమితమయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్ల్లో జురెల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక 2025లో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లోనూ ధ్రువ్ జురెల్ విఫలమయ్యాడు. దీంతో ప్లేయింగ్ ఎలెవెన్లో చోటు నిలుపుకోవాలంటే జురెల్ తన ప్రదర్శనను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరముందని యాజమాన్యం భావిస్తోంది. ఆఫ్గన్తో ఏకైక టెస్టులోనూ జురెల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అయితే లంక-ఏ జట్టుపై సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించి టచ్లోకి వచ్చినట్లు అనిపించాడు. కానీ ఇటీవలే లంక ఎలెవెన్తో వార్మప్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో జురెల్ వరుసగా 1, 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రావడంతో జురెల్పై ఒత్తిడి పెరిగిపోయింది. ఆరో స్థానంలో ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనే దానిపై మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతున్న వేళ ధ్రువ్ జురెల్ రాణించకపోవడం అతడికి మైనస్గా మారే అవకాశముంది. అంతేకాదు జురెల్తో పోలిస్తే సర్ఫరాజ్ నాలుగు టెస్టులు తక్కువే ఆడినప్పటికీ, ఒక సెంచరీతో పాటు రెండు అర్ధసెంచరీలు ఎక్కువగా సాధించడం విశేషం. దీంతో లంకతో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్కు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.Read: లంకతో తొలి టెస్టు.. రికార్డుల వేటకు టీమిండియా సిద్ధం! -
లంకతో తొలి టెస్టు.. రికార్డుల వేటకు టీమిండియా సిద్ధం!
శ్రీలంక, భారత్ మధ్య శనివారం నుంచి గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే లంక తొలి టెస్టు కోసం తమ తుది జట్టును ప్రకటించగా, భారత్ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. తుది జట్టుపై ఒక అంచనా ఉన్నప్పటికీ, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో గాలేలో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేశారు.👉భారత వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే టెస్ట్ క్రికెట్లో వంద సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే డబ్ల్యూటీసీ చరిత్రలో మూడువేల పరుగులు పూర్తి చేసిన మొదటి వికెట్ కీపర్గా నిలవడానికి పంత్కు మరో 220 పరుగులు కావాలి. శ్రీలంకలో ఇప్పటివరకు ఏ భారతీయ వికెట్ కీపర్ కూడా టెస్ట్ సెంచరీ చేయలేదు, ఈసారి పంత్ ఆ రికార్డును అందుకుంటాడా అన్నది చూడాలి.👉యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో 50 సిక్సర్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ఓపెనర్గా జైస్వాల్ నిలవనున్నాడు. 24 ఏళ్ల వయసులోనే 5 వేర్వేరు దేశాల్లో టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ సరసన చేరేందుకు జైస్వాల్కు ఒక్క శతకం అవసరం.👉అంతర్జాతీయ క్రికెట్లో 10వేల పరుగులు (అన్ని ఫార్మాట్లు) పూర్తి చేసుకోవడానికి కేఎల్ రాహుల్ మరో 170 పరుగుల దూరంలో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ తర్వాత విదేశాల్లో 10 టెస్ట్ సెంచరీలు చేసిన రెండో ఆసియా ఓపెనర్ నిలిచేందుకు రాహుల్ కు రెండు సెంచరీలు దూరంలో నిలిచాడు.👉ఇక టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ టెస్ట్ క్రికెట్లో మూడువేల పరుగులు పూర్తి చేసుకోవడానికి మరో 31 పరుగులు అవసరం. కెప్టెన్గా 2వేల పరుగులు సాధించడానికి అతడికి 150 పరుగులు కావాలి. ఇక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల తర్వాత శ్రీలంకలో టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్గా నిలిచేందుకు గిల్ ఎదుట సువర్ణావకాశం ఉంది.👉లంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను గెలుచుకుని, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. -
క్రికెట్లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక కోచ్ మృతి
శ్రీలంక క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రికెటర్ల మధ్య జరిగిన దాడిలో 62 ఏళ్ల లంక క్రికెట్ కోచ్ సుమిత్ ఫెర్నాండో కన్నుమూశారు. కొలంబోలో మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇది చోటుచేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఫెర్నాండో గురువారం రాత్రి చికిత్స పొందుతూ మరణించారు.కాగా సుమిత్ ఫెర్నాండో గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుశాల్ మెండిస్కు పాఠశాల స్థాయిలో కోచ్గా వ్యవహరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 8న ఒక క్రీడా ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న కొంతమంది యువ క్రికెటర్లు తాగునీటి కోసం వెళ్లగా, అక్కడ నీటి వసతి అందుబాటులో లేదు. ఈ విషయంపై ఆటగాళ్లకు, స్టేడియం సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ముదరడంతో సుమిత్ ఫెర్నాండో జోక్యం చేసుకున్నారు. దీంతో ఇద్దరు యువ క్రికెటర్లు కోచ్ ఫెర్నాండోపై భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుమిత్ ఫెర్నాండోను కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన చికిత్స పొందుతూ మరణించడంతో లంక క్రికెట్ విషాదంలో మునిగిపోయింది.మొరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీలో మాజీ కోచ్గా పనిచేసిన ఫెర్నాండో.. పలువురు పాఠశాల స్థాయి క్రికెటర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన శిక్షణ ఇచ్చిన వారిలో ఒకరైన మెండిస్.. ఆ తర్వాత శ్రీలంక వన్డే కెప్టెన్గా ఎదిగారు. అనంతరం ఫెర్నాండో.. శ్రీలంక దేశీయ క్రికెట్ వ్యవస్థలో ఒక ప్రముఖ క్లబ్ అయిన బ్లూమ్ఫీల్డ్ క్రికెట్ & అథ్లెటిక్ క్లబ్లో గ్రౌండ్స్ క్యూరేటర్గా పనిచేశారు.అయితే సుమిత్ ఫెర్నాండోతో ఘర్షణకు దిగిన ఇద్దరు ఆటగాళ్లలో ఒక 17 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ఇప్పుడు, ఆ గొడవ జరిగిన దాదాపు వారం రోజుల తర్వాత, కొలంబో పోలీసులు ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. కోచ్ ఫెర్నాండోపై దాడి చేశాడనే అనుమానంతో అతడిని అరెస్టు చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నందున, అతను ఆగస్టు 17 వరకు కస్టడీలో ఉండే అవకాశం ఉంది. అతని ప్రాథమిక కస్టడీని కోర్టు పొడిగించినట్లు సమాచారం.చదవండి: సెంచరీ దిశగా తంజిద్.. ఆసీస్కు చుక్కలు చూపిస్తున్న బంగ్లా! -
సెంచరీ దిశగా తంజిద్.. బంగ్లా చేతిలో ఆసీస్కు చుక్కలు!
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ (20) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, మరో ఓపెనర్ తంజిమ్ హసన్ (71 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతుండగా, అతడికి షాంటో సహకరిస్తున్నాడు. అంతకముందు మోమినుల్ హక్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ పేసర్లు మెరిసిన చోట ఆస్ట్రేలియా పేస్ త్రయం వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. కమిన్స్, హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్ బౌలింగ్ను ఆచితూచి ఆడిన బంగ్లా బ్యాటర్లు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించడం విశేషం. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ (71) అర్ధసెంచరీ చేయగా, మిగతావాళ్లు పూర్తిగా తేలిపోయారు. హసన్ మహ్ముద్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా, తస్కిన్ అహ్మద్, ఇబదత్ హొస్సేన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. అనంతరం ఆసీస్ బౌలింగ్ను బంగ్లాదేశ్ సమర్థంగా ఎదుర్కొంది. అయితే సున్నా పరుగుల వద్ద లయన్ క్యాచ్ వదిలేయడంతో తంజిద్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుచకున్నాడు.చదవండి: క్రికెట్లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక కోచ్ మృతి -
ఈసారి భారత్-పాక్ మ్యాచ్ సాధారణ మ్యాచ్ కాదు..!
భారత్-పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఈసారి జరుగబోయే మ్యాచ్ సాధారణ మ్యాచ్గా ఉండదని క్రిక్బజ్ ఓ నివేదికలో తెలిపింది. ఇరు జట్లు త్వరలో జరుగబోయే ఏషియన్ గేమ్స్లో తలపడాల్సి ఉండగా.. అది పతక పోరే ఉంటుందని సదరు క్రికెట్ వెబ్సైట్ అంచనా వేస్తుంది. 2026 ఏషియన్ గేమ్స్లో భారత్-పాక్ మ్యాచ్ లీగ్ లేదా గ్రూప్ దశలో ఉండదు.పురుషుల విభాగంలో భారత్, పాక్ టాప్-2 సీడెడ్ జట్లుగా నేరుగా క్వార్టర్ఫైనల్కు అర్హత సాధించాయి. భారత్ క్వార్టర్ఫైనల్-2లో, పాక్ క్వార్టర్ఫైనల్-1లో సెప్టెంబర్ 28న బరిలోకి దిగనున్నాయి.క్వార్టర్ఫైనల్లో గెలిచిన భారత్ అక్టోబర్ 1న క్వార్టర్ఫైనల్-3 విజేతతో సెమీఫైనల్ ఆడుతుంది. పాక్ క్వార్టర్ఫైనల్-4 విజేతతో సెమీస్లో తలపడుతుంది. ఈ డ్రా ప్రకారం భారత్, పాక్ సెమీఫైనల్లో ఎదురుపడే అవకాశం లేదు.ఇరు జట్లు ఫైనల్కు చేరితే అక్టోబర్ 3న బంగారు పతకం కోసం పోటీ జరుగుతుంది. ఒకవేళ సెమీఫైనల్లో ఓడితే అదే రోజు కాంస్య పతకం కోసం జరిగే మూడో స్థానం మ్యాచ్లో ఇరు జట్లు తలపడే అవకాశం ఉంటుంది.మహిళల క్రికెట్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. భారత్ టాప్ సీడ్గా, పాక్ నాలుగో సీడ్గా ఉన్నాయి. భారత్ క్వార్టర్ఫైనల్లో జపాన్తో, పాక్ థాయ్లాండ్తో తలపడనున్నాయి. ఈ విభాగంలోనూ భారత్-పాక్ మ్యాచ్ జరిగితే అది ఫైనల్ లేదా కాంస్య పతక పోరులోనే ఉండే అవకాశం ఉంది.ఈసారి ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు నాగోయాలో జరగనున్నాయి. క్రికెట్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 17 నుంచే ప్రారంభం కానున్నాయి. అన్ని మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు.భారత పురుషుల జట్టుకు శ్రేయాస్ అయ్యర్, మహిళల జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనున్నారు. -
ఎలిమినేటర్ ముంగిట సన్రైజర్స్ విధ్వంసం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో సన్రైజర్స్ లీడ్స్ జట్టు ఐదో విజయంతో పట్టికలో రెండో స్థానానికి చేరుకొని ఎలిమినేటర్ పోరుకు మరింత దగ్గరైంది. మంగళవారం రాత్రి మాంచెస్టర్ సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ లీడ్స్ వుమెన్ 41 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్లాండ్ (36 బంతుల్లో 62 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ డాని గిబ్సన్ (13 బంతుల్లో 24) రాణించడంతో సన్రైజర్స్ భారీ స్కోరు చేసింది. సూపర్జెయింట్స్ బౌలర్లలో మాడీ విల్లర్స్ 2 వికెట్లు తీసింది. అనంతరం మాంచెస్టర్ సూపర్జెయింట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఓపెనర్లు స్మృతి మంధాన (17 బంతుల్లో 28), గ్రేస్ స్క్రీవెన్స్ (24 బంతుల్లో 31) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. సన్రైజర్స్ బౌలర్లలో జొనాసన్ 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ, అన్నాబెల్ సదర్లాండ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన అన్నాబెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకుంది.Annabel Sutherland just smashed THREE sixes in a row off the final three balls of the innings 🤯That was special. #TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/oQ9EswA72z— The Hundred (@thehundred) August 11, 2026Smriti Mandhana is on the charge 💥Watch the #RoadToTheEliminator action LIVE on Sky Sports Main Event, Sky Sports Cricket and YouTube 📺#TheHundred pic.twitter.com/VDCdJJu8sk— The Hundred (@thehundred) August 11, 2026చదవండి: తొలి టెస్టుకు వర్షం ముప్పు.. గాలే చేరుకున్న టీమిండియా -
తొలి టెస్టుకు వర్షం ముప్పు.. గాలే చేరుకున్న టీమిండియా
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆగస్టు 5న లంక గడ్డపై అడుగుపెట్టింది. ఆగస్టు 7 నుంచి మూడు రోజుల పాటు కొలంబో వేదికగా లంక ఎలెవెన్తో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. వార్మప్ మ్యాచ్ ఇచ్చిన విజయం జోష్తో టీమిండియా తొలి టెస్టు ఆడేందుకు గాలేలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గాలే ఎయిర్పోర్టు నుంచి టీమిండియా ఆటగాళ్లు బయటికి వస్తున్న ఫొటోలను బీసీసీఐ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకుంది. జడేజా, పంత్, జైస్వాల్, సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్ సహా ఇతర ఆటగాళ్లు, కోచ్ గంభీర్ కనిపించారు. ఆ తర్వాత ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో గాలే స్టేడియం సమీపంలోని హోటల్కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి తీసుకోనున్న గిల్ సేన గురువారం ప్రాక్టీస్ చేయనుంది. శనివారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.దంచికొట్టిన వాన..అయితే గాలేలో వాతావరణం రెండు రోజుల నుంచి చల్లగానే ఉంది. సోమవారం నుంచి మేఘావృతమై ఉన్న గాలేలో మంగళవారం వాన దంచికొట్టింది. రాబోయే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ టెస్టు సిరీస్ రెండు జట్లకు కీలకమే. 2027లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్లో విజయం తప్పనిసరి. ఒక్క మ్యాచ్ రద్దయినా అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.కోహ్లి కెప్టెన్సీలో ఘన విజయంగాలేలో గతంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. 2017లో కోహ్లి కెప్టెన్సీలో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన టెస్టులో ఇన్నింగ్స్ 304 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 600 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (190), పుజారా (153) సెంచరీలతో చెలరేగారు. లంక తమ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో కోహ్లి సెంచరీ, అభినవ్ ముకుంద్ 81 పరుగులు చేయడంతో టీమిండియా 241 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో లంక ముంగిట 550 పరుగుల భారీ టార్గెట్ను ఉంచగా, భారత బౌలర్ల ధాటికి లంక 245 పరుగులకే కుప్పకూలింది. దీంతో గాలే టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. జడేజా ఒక్కడే..కాగా అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్న జడేజాకు మాత్రమే గాలేలో ఆడిన అనుభవముంది. పడిక్కల్, గుర్నూర్ బ్రార్, సారాంశ్ జైన్, అకిబ్ నబీలు ఇటీవలే ఇదే గాలే వేదికగా లంక-ఏ జట్టుతో అనధికారిక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టు శనివారం నుంచి జరగనుండగా, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనుంది.Colombo 🚌 Galle#TeamIndia have arrived for the #SLvIND Test series opener 🙌 pic.twitter.com/UXoo0gTzCv— BCCI (@BCCI) August 12, 2026Read: బంగ్లాను తేలిగ్గా తీసుకోం.. బలమైన జట్టుతోనే బరిలోకి! -
బంగ్లాను తేలిగ్గా తీసుకోం.. బలమైన జట్టుతోనే బరిలోకి!
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియా సీరియస్గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. జట్టులో ప్రధాన బౌలర్లకు రెస్ట్ ఇస్తారని భావించినప్పటికీ, దానిని కొట్టిపారేస్తూ ఆసీస్ జట్టు బలమైన బౌలింగ్ లైనప్తో బరిలోకి దిగనుంది. పేస్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్తో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్లను తొలి టెస్టులో ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. తుది జట్టు ఖరారు కాకపోయినప్పటికీ జట్టులోని ప్రధాన బౌలర్లను కొనసాగించాలని చూస్తోంది. దీంతో డబ్ల్యూటీసీ పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ తమ స్థానాన్ని నిలుపుకోవాలంటే కష్టపడాల్సిందే. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దానిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. వచ్చే ఏడాదిలోగా ఆస్ట్రేలియా మరో 21 టెస్టులు ఆడనున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కమిన్స్, హాజిల్వుడ్ లేనప్పటికీ యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా చెలరేగిందంటే దానికి ప్రధాన కారణం స్కాట్ బోలండ్. ఫామ్లో ఉన్నప్పటికీ హాజిల్వుడ్ కోసం బోలండ్ను తప్పించాల్సిన పరిస్థితి క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎదురైంది. ఇక జట్టులో ఏకైక స్పిన్నర్గా నాథన్ లియోన్ కీలకం కానున్నాడు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న నాథన్ లియోన్ పునరాగమనం ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ను మరింత బలంగా మార్చింది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లుగా జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్ రానుండగా, లబుషేన్, స్మిత్ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ ఆడనున్నారు. కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, బ్యూ వెబస్టర్లతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది.ఇక 2003 తర్వాత బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడనుంది. చివరిసారి తలపడినప్పుడు రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్స్వీప్ చేసింది. డార్విన్, కెయిర్న్స్ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ విజయాలతో బంగ్లాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, బో వెబ్స్టర్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హేజిల్వుడ్సిరీస్ షెడ్యూల్:మొదటి టెస్ట్: ఆగస్టు 13-17, డార్విన్రెండవ టెస్ట్: ఆగస్టు 22-26, మెకేRead: హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం! -
హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే ఐపీఎల్ సీజన్కు వేరే ఫ్రాంచైజీకి ఆడుతాడనే వదంతులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తనను తీసుకునేందుకు సీఎస్కే, ఇతర జట్లు పోటీ పడుతున్న వేళ గుజరాత్ టైటాన్స్ మాత్రం అతడి ప్రతిపాదన (కెప్టెన్సీ)ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్గా గతంలో చాంపియన్గా నిలిపిన జట్టు నుంచి అతడికి చేదు అనుభవం ఎదురైనట్లయింది. 2022 సీజన్ ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ మొదటి సీజన్లోనే చాంపియన్గా నిలిచింది.ఈ జట్టుకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలా గుజరాత్ను ఒకసారి చాంపియన్, మరోసారి రన్నరప్గా నిలిపిన పాండ్యాకు మళ్లీ ఆ జట్టు తరఫున ఆడే అవకాశం లభిస్తే రెడ్ కార్పెట్ వేయాల్సిన చోట అవమానం చేసినట్లు సమాచారం. అయితే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్లోకి తిరిగి రావడానికి కెప్టెన్సీని అప్పగించాలనే మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ఒప్పుకోలేదని వార్తలు వస్తున్నాయి. అయితే పాండ్యాను ట్రేడింగ్లో తమ జట్టులోకి తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావించింది. ఇదే విషయమై కెప్టెన్ శుబ్మన్ గిల్కు చెప్పగా, పాండ్యాను తీసుకోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినట్లు సమాచారం. కానీ పాండ్యా జట్టులోకి రావాలంటే తనకు కెప్టెన్సీ తిరిగి ఇప్పించాలని యాజమాన్యం ఎదుట షరతు పెట్టాడట. పాండ్యా షరతులకు గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం అంగీకరించలేదట. ఇక ఐపీఎల్ 2027 సీజన్లో కొత్త జట్టుకు ఆడాలనుకుంటున్న పాండ్యా కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరు పాండ్యాను ట్రేడింగ్ చేసుకోనున్నారట. కానీ పాండ్యాను వదులుకోవడంపై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ కేకేఆర్ లేదా సీఎస్కేకు పాండ్యా వెళితే మాత్రం కెప్టెన్సీ ఆఫర్ కూడా ఇచ్చే చాన్స్ ఉంది. 2022, 2023 సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు ఆడిన పాండ్యాను 2024లో ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ చేసుకొని రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రోహిత్ను తొలగించి పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడంపై అప్పట్లో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దీనికి తోడు జట్టు చెత్త ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే 2025 సీజన్లో క్వాలిఫయర్-2 చేరినప్పటికీ పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇక 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ మరోసారి నిరాశపరిచింది. కెప్టెన్గా, ఆల్రౌండర్గా పాండ్యా పూర్తిగా విఫలమవ్వడంతో అతడిని జట్టు నుంచి తీసేయాలనే డిమాండ్లు కూడా పెరిగిపోయాయి. ఈలోగా అతడు గాయపడడంతో ముంబై సీజన్ను 9వ స్థానంతో ముగించింది.గిల్ సారథ్యంలో..ఇక పాండ్యా ముంబై ఇండియన్స్కు వెళ్లిపోయిన తర్వాత శుబ్మన్ గిల్కు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. గిల్ సారథ్యంలో గుజరాత్ 2025 సీజన్లో ఎలిమినేటర్లో ఓటమి పాలైంది. ఇక 2026 సీజన్లో మంచి ప్రదర్శన చేసింది. మూడోసారి ఫైనల్ ఆడిన గుజరాత్.. ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. గుజరాత్ కెప్టెన్గా గిల్కు మంచి రికార్డు ఉండడంతో అతడిని మార్చే యోచనలో లేదన్న విషయం పాండ్యా విషయంతో రుజువైంది.🚨 GT DENIED TO TAKE HARDIK. 🚨- Hardik Pandya discussed a possible return with Gujarat Titans, but GT rejected after Hardik made it conditional on being reinstated as captain. (Indian Express). pic.twitter.com/6fkK0gSwjg— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2026చదవండి: టెస్టుల్లో ఎవరికీ సాధ్యం కాలేదు.. జైస్వాల్ సరికొత్త ఫీట్ -
టెస్టుల్లో ఎవరికీ సాధ్యం కాలేదు.. జైస్వాల్ సరికొత్త ఫీట్
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో ఒక అరుదైన ఫీట్ సాధించాడు. బహుశా జైస్వాల్ సాధించిన ఫీట్ ఎవరికీ సాధ్యం కాలేదనుకుంటా. ఇప్పటివరకు జైస్వాల్ తన కెరీర్లో 29 టెస్టు మ్యాచ్లు ఆడితే అవన్నీ వివిధ వేదికల్లోనే ఆడడం విశేషం. మాములుగా ఒక ఆటగాడు వేర్వేరు వేదికల్లోనే మ్యాచ్లు ఆడినప్పటికీ, కొన్నిసార్లు ఒకే మైదానంలో మ్యాచ్లు ఆడడం చూస్తుంటాం.కానీ జైస్వాల్ విషయంలో మాత్రం లెక్క మారింది. అతడు ఆడిన 29 టెస్టులకు సంబంధించిన వేదికలు మళ్లీ రిపీట్ కాకపోవమే ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో జైస్వాల్ ఫీట్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘటనగా నిలిచిపోనుంది. ఇక శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్లోని తొలి మ్యాచ్ ద్వారా అతను తన 30వ టెస్టు మ్యాచ్ను గాలే వేదికగా ఆడబోతున్నాడు. గాలేలో జైస్వాల్కు ఇదే తొలి మ్యాచ్ కావడంతో, ఈ 30వ మ్యాచ్ ద్వారా కూడా అతని వేదికల వైవిధ్యం సజీవంగా కొనసాగనుంది. ఇక శ్రీలంక ఎలెవెన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో అర్ధసెంచరీ చేయడం ద్వారా జైస్వాల్ టచ్లోకి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇప్పటివరకు జైస్వాల్ 29 టెస్టుల్లో 48.75 సగటుతో మొత్తం 2,535 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 214 పరుగులు కాగా, కెరీర్లో రెండు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు.2023లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్ అఫ్గానిస్థాన్తో చివరి టెస్టు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కూడా అవకాశాలు పొందినప్పటికీ, టెస్టుల్లో మాత్రం భారత జట్టుకు రెగ్యులర్ ఓపెనర్ గా మారాడు. ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్లో భాగంగా గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి 19 వరకు తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరగనున్నాయి. మొత్తంగా ప్రపంచ క్రికెట్లో వరుసగా 30 మ్యాచ్లు వేర్వేరు స్టేడియాల్లో ఆడిన ఏకైక ఆటగాడిగా జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.చదవండి: ‘కెప్టెన్గా ఫెయిలైనా ఫిట్నెస్కు కొత్త అర్ధం చెప్పాడు’ -
‘కెప్టెన్గా ఫెయిలైనా ఫిట్నెస్కు కొత్త అర్ధం చెప్పాడు’
టీమిండియాలో ఫిట్నెస్, పదునైన ఫీల్డింగ్ కల్చర్ అనేది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాకతోనే మొదలైందని సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో ఒక జట్టుగా ఉన్న రోటర్డామ్ డాకర్స్ జెర్సీని మంగళవారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జాంటీ రోడ్స్తో పాటు కో-ఓనర్, మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్భంగా టీమిండియాలో పదునైన ఫీల్డింగ్, కెప్టెన్సీలో దూకుడు వంటి మార్పుల గురించి జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎంఎస్ ధోని కెప్టెన్ అయ్యాకా టీమిండియాలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు జట్టులో ఉన్న సీనియర్లు ఒక్కొక్కరుగా వైదొలగడంతో యువ ఆటగాళ్లతో నిండిపోయింది. ఇక కోహ్లి రాకతో ఫిట్నెస్కు ప్రాధాన్యం పెరగడంతో పాటు పదునైన ఫీల్డింగ్కు బాటలు పడ్డాయి. కోహ్లి కెప్టెన్గా అంతగా రాణించనప్పటికీ జట్టులో అందరూ ఫిట్గా ఉండాలని మాత్రం పట్టుబట్టేవాడు. ఎందుకంటే మైదానంలో ఒక మంచి ఫీల్డర్గా ఎదగాలంటే, ధృడంగా, చురుగ్గా ఉండాల్సిన అవసరముంది. అందుకే కోహ్లి ఫిట్నెస్కు చాలా ప్రాధాన్యమిచ్చేవాడు. ఇప్పటికీ అదే ఫిట్నెస్ను కొనసాగిస్తూ జట్టులో కొనసాగుతున్నాడు. భారత జట్టులో గొప్ప ఫీల్డర్లు కొంతమందే ఉన్నారు. వారిలో కోహ్లి అగ్రస్థానంలో ఉంటాడనంలో సందేహం లేదు. ఇక ఫీల్డింగ్లో నేను ప్రాణం పెట్టేవాడిని. ఎంత ఒత్తిడి ఉన్నా మైదానంలో మాత్రం స్వేచ్ఛగా ఉండేవాడిని. 1993 హీరోకప్లో నేను ఐదు క్యాచ్లను సర్కిల్ లోపలే పట్టాను. అది ఒక అద్భతమని చెప్పొచ్చు. ఇక ఫీల్డింగ్ కోచ్గా మారిన తర్వాత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు చాలాకాలం పనిచేశాను. ఈ సమయంలో కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉండేది. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి తోసేసి క్యాచ్ తీసుకున్న మొదటి ఆటగాడు అతడే. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఫీల్డింగ్లో సరికొత్త మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జట్టులో ఒకరు లేదా ఇద్దరు బెస్ట్ ఫీల్డర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం నలుగురు నుంచి ఐదుగురు బెస్ట్ ఫీల్డర్లు ఉంటున్నారు.’ అని చెప్పుకొచ్చాడు.ఇదే మంచి అవకాశంఇక 2027 వన్డే ప్రపంచకప్కు నమీబియా,జింబాబ్వేలతో కలిసి సౌతాఫ్రికా ఆతిథ్యమిస్తుండడంతో సఫారీ జట్టుకు గెలుపు అవకాశమెంత అనే దానిపై రోడ్స్ స్పందించాడు. ‘మాకు ఇదే సరైన సమయం. సౌతాఫ్రికా జట్టు చాలా బాగా ఆడుతోంది. ప్రపంచకప్ అనేది చాలా ప్రత్యేకమైనది. సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడుతుండడం ఏ జట్టుకైనా బలమే. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మహాసంగ్రామానికి ఈసారి మేము ఆతిథ్యమివ్వనుండడం మాకు కలిసొస్తుందని అనుకుంటున్నా. చోకర్స్ ముద్రను చెరిపేసుకొని ఈసారి ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నాడు.ఫీల్డింగ్కు కొత్త నిర్వచనంఇక 1992 నుంచి 2003 వరకు సౌతాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన జాంటీ రోడ్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్గా పేరు పొందాడు. 1993 హీరోకప్లో వెస్టిండీస్తో వన్డే మ్యాచ్లో సర్కిల్ లోపలే ఐదు క్యాచ్లు పట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఫీల్డింగ్కు సరికొత్త నిర్వచనం చెప్పిన జాంటీ రోడ్స్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ తన ఫీల్డింగ్తో 30 నుంచి 40 పరుగులు సేవ్ చేసి ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారాడు.ఇంజమామ్ రనౌట్..ఇక 1992 వన్డే ప్రపంచకప్లో పాక్ బ్యాటర్ ఇంజమామ్ ఉల్ హక్ను జాంటీ రోడ్స్ రనౌట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చిరుత కన్నా వేగంతో పరిగెత్తిన జాంటీ రోడ్స్ డైవ్ చేస్తూ బంతితో వికెట్లను గిరాటేసిన ఫొటో ఐసీసీ ఆల్ టైమ్ క్రికెట్ హిస్టరీ గ్యాలరీలో చేర్చింది. ఇక దక్షిణాఫ్రికా తరఫున జాంటీ రోడ్స్ 52 టెస్టుల్లో 2,523 పరుగులు, 245 వన్డేల్లో 5,935 పరుగులు సాధించాడు. రెండు ఫార్మాట్లు కలిపి రోడ్స్ 139 క్యాచ్లు అందుకున్నాడు.VIDEO | Mumbai, Maharashtra: "ETPL will conquer last frontier for cricket's expansion in Europe," says former South African cricket coach and co-owner of the Rotterdam Dockers Jonty Rhodes.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/P6rCrsJpXA— Press Trust of India (@PTI_News) August 11, 2026Jonty Rhodes said "Kohli insisted that you had to be fit because, to be a good fielder, you obviously have to be fairly robust in the field & athletic, so fitness levels were important. So, we've seen this evolution in the Indian team that had one or two great fielders to now a… pic.twitter.com/F9fp0u02X8— Johns. (@CricCrazyJohns) August 12, 2026 Read: ప్రేయసిని పెళ్లాడిన క్రిస్టియానో రొనాల్డో -
శతక్కొట్టిన ఇంగ్లండ్ దిగ్గజం కుమారుడు
ఇంగ్లండ్ దిగ్గజం, మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. వన్డే కప్లో భాగంగా రాకీ ఫ్లింటాఫ్ అద్భుత శతకంతో మెరిశాడు. 76 బంతుల్లోనే 123 పరుగులు చేసిన రాకీ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయం ఆసన్నమైందంటూ సెలెక్టర్లకు సందేశాన్ని పంపించాడు. లంకాషైర్, సోమర్సెట్ మధ్య మ్యాచ్లో 65 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న రాకీ ఫ్లింటాఫ్, పనిలో పనిగా సీనియర్ జట్టు తరఫున మెయిడెన్ శతకాన్ని నమోదు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే రాకీ ఫ్లింటాఫ్, కీటన్ జెన్నింగ్స్ విధ్వంసంతో సోమర్సెట్పై లంకాషైర్ 174 పరుగుల రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 443 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్ (127 బంతుల్లో 156; 15 ఫోర్లు, 7 సిక్సర్లు), రాకీ ఫ్లింటాఫ్ (76 బంతుల్లో 123; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకాలతో విధ్వంసం సృష్టించగా, మాటీ హస్ట్ (47), ఆఖర్లో జాక్ బ్లాథర్విక్ (10 బంతుల్లో 32 నాటౌట్) మెరుపులతో లంకాషైర్ భారీ స్కోరు చేసింది. సోమర్సెట్ బౌలర్లలో మిగెల్ ప్రిటోరియస్, ఆర్చీ వాగన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్సెట్ 39.2 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. టామ్ లామ్మోబి (68) టాప్ స్కోరర్గా నిలవగా, జోషువా థామస్ (42), జోష్ షా (34) పర్వాలేదనిపించారు. భారీ టార్గెట్ ముందు ఉండడంతో ఒత్తిడికి లోనయ్యి సోమర్సెట్ పూర్తిగా తడబడింది. లంకాషైర్ బౌలర్లలో టామ్ అస్పిన్వాల్, జార్జ్ బాల్డర్సన్ చెరో 4 వికెట్లు తీశారు.ఆండ్రూ ఫ్లింటాఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇంగ్లండ్ తరఫున స్టార్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న ఫ్లింటాఫ్ 1998 నుంచి 2009 మధ్య ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడాడు. వన్డే, టెస్టుల్లో మేటి ఆల్రౌండర్గా పేరు పొందిన ఫ్లింటాఫ్ 79 టెస్టుల్లో 3,845 పరుగులు, 226 వికెట్లు తీశాడు. ఇక 141 వన్డేల్లో 3,394 పరుగులతో పాటు 169 వికెట్లు పడగొట్టాడు.ఫ్లింటాఫ్ అనగానే గుర్తొచ్చేది అదే..మనకు ఆండ్రూ ఫ్లింటాఫ్ అనగానే గుర్తుకొచ్చేది మాత్రం యువరాజ్ ఆరు బంతుల్లో కొట్టిన ఆరు సిక్సర్లు. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా యువరాజ్ ఈ అద్భుతం నమోదు చేశాడు. తన చేష్టలతో రెచ్చగొట్టిన ఆండ్రూ ఫ్లింటాఫ్కు యువరాజ్ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. అయితే ఫ్లింటాఫ్పై ఉన్న కోపాన్ని స్టువర్ట్ బ్రాడ్ వేసిన తర్వాతి ఓవర్లో చూపించాడు. ఆ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్ కోపానికి స్టువర్ట్ బ్రాడ్ బలిపశువయ్యాడు.JUNIOR ANDREW FLINTOFF HAS ARRIVED 🔥- 18 year old Rocky Flintoff smashed 123 runs from just 76 balls in the One-Day Cup. pic.twitter.com/sL1z2kjiDv— Johns. (@CricCrazyJohns) August 11, 2026చదవండి: హండ్రెడ్లో విధ్వంసం.. కివీస్ బ్యాటర్ సిక్సర్ల వర్షం -
హండ్రెడ్లో విధ్వంసం.. కివీస్ బ్యాటర్ సిక్సర్ల వర్షం
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం రాత్రి సన్రైజర్స్ లీడ్స్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సూపర్ జెయింట్స్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (40 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ వాల్టర్ (28 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో 128 పరుగుల టార్గెట్ను మరో 33 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సూపర్జెయింట్స్ పట్టికలో రెండో స్థానానికి చేరింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 127 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32), జాక్ క్రాలీ (31) రాణించగా, రికెల్టన్ (17) పర్వాలేదనిపించాడు. సూపర్జెయింట్స్ బౌలర్లలో గస్ అకిన్సన్ మూడు వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు బాదిన టిమ్ సీఫర్ట్ బ్రైడన్ కార్స్ బౌలింగ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. అతడు వేసిన ఇన్నింగ్స్ 7, 8, 9 బంతులను సీఫర్ట్ వరుసగా సిక్సర్లు సంధించాడు. ఇప్పటికే ట్రెంట్ రాకెట్స్ ఫైనల్లో అడుగుపెట్టగా, ఎలిమినేటర్ పోరు కోసం నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. ఇందులో సూపర్జెయింట్స్ రెండో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరులో ముందు వరుసలో ఉంది. ఆగస్టు 15న ఎలిమినేటర్ పోరు, ఆగస్టు 16న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.THREE SIXES IN A ROW FOR TIM SEIFERT! 💥#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/rMG9rIKmYE— The Hundred (@thehundred) August 11, 2026Read: స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్కు షాక్! -
స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్కు షాక్!
హండ్రెడ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సదరన్ బ్రేవ్.. వరుస విజయాలతో పట్టికలో తొలి స్థానంలో ఉన్న ట్రెంట్ రాకెట్స్ను ఊహించని దెబ్బ కొట్టింది. ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ట్రెంట్ రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో సదరన్ బ్రేవ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ (35 నాటౌట్), లూయిస్ జార్జరీ (28 నాటౌట్) ఆఖర్లో మెరవడంతో ట్రెంట్ రాకెట్స్ మంచి స్కోరును సాధించింది. అంతకముందు ఫిన్ అలెన్ (23) పర్వాలేదనిపించాడు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో నిఖిల్ చౌదరీ, డానియెల్ వోర్రల్, స్టోయినిస్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం సదరన్ బ్రేవ్ 97 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రిస్టన్ స్టబ్స్ (28 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, మార్కస్ స్టోయినిస్ (25 బంతుల్లో 46) మెరిశాడు. ఓపెనర్ జేమి స్మిత్ (26) పరుగులు చేశాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో క్లావిన్ హారిసన్ 2 వికెట్లు తీయగా, బెన్ సాండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరొక వికెట్ పడగొట్టారు.Tristan Stubbs reaches his 50 with a six! It's game on 👊#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/yfoaFvNGMK— The Hundred (@thehundred) August 8, 2026Read: లంకతో తొలి టెస్టుకు భారత జట్టు.. తెరపైకి ఊహించని పేరు! -
కళ్లు చెదిరే ఎండార్స్మెంట్లు.. వైభవ్ సంపాదన ఎంతంటే?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడు. మ్యాచ్ల పరంగా ఆట ఎలా ఉన్నా ఎండార్స్మెంట్ల విషయంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ దూసుకెళ్తున్నాడు. దీంతో 15 ఏళ్ల వయసుకే కళ్లు చెదిరే మొత్తాన్ని అందుకుంటున్న వైభవ్ సంపాదనలోనూ స్టార్ హోదా పొందాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న సమయంలోనే వైభవ్ సూర్యవంశీ తన బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు పెంచినట్లు సమాచారం. అయినప్పటికీ అతడి కోసం ఎండార్స్మెంట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వైభవ్ వాణిజ్య విలువకు సంబంధించి ఒక్కోటి కోటి రూపాయల మార్కును దాటినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అతడి నికర ఆస్తి విలువ రూ. 7 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. దీనికి తోడు ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, దేశవాళీ క్రికెట్ రూపంలో వస్తున్న డబులు అదనమని చెప్పొచ్చు.వైభవ్ ఆమోదించిన బ్రాండ్లు..👉ఎస్ఎస్ బ్యాట్స్: సచిన్ టెండూల్కర్ తన ఐకానిక్ MRF బ్యాట్ స్పాన్సర్షిప్తో ప్రసిద్ధి చెందగా, సూర్యవంశీ ఇంకా ఏ కార్పొరేట్ దిగ్గజంతోనూ భారీ ఒప్పందం కుదుర్చుకోలేదు. అయితే, అతను ప్రస్తుతం సరీన్ స్పోర్ట్స్ (SS)తో సంవత్సరానికి సుమారు రూ. 50 లక్షల విలువైన పరికరాల ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. SS మార్కెట్లో ప్రత్యేకమైన "వైభవ్ సూర్యవంశీ ఎడిషన్" బ్యాట్లను కూడా విడుదల చేసింది.👉కాంప్లాన్: 2026 ప్రారంభంలో వైభవ్ కాంప్లాన్ వారి "థోడా ప్లాన్, థోడా కాంప్లాన్" ప్రకటన ప్రచారానికి అంబాసిడర్గా మారాడు. సరైన పోషణ , అంకితభావంపై దృష్టి సారించే ఈ ప్రకటన, ఒక యువ అథ్లెట్గా సూర్యవంశీ నిజ జీవిత దినచర్యను ప్రతిబింబిస్తుండడం విశేషం.👉గూగుల్ పే: ప్రస్తుతం వైభవ్ గూగుల్ పే ప్రచారకర్తగా ఉన్నాడు. ఈ ప్రకటనలో, అతడు తన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానించబడిన UPIని ఉపయోగిస్తూ, టీనేజర్ల కోసం సురక్షితమైన డబ్బు నిర్వహణను హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు.👉రెడ్బుల్: ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్తో కలిసి వైభవ్ రెడ్బుల్ చాలెంజ్లో పాల్గొని అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు.👉జార్ఖండ్ ఆరోగ్యశాఖ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను చురుకుగా, ఫిట్గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రేరేపించడానికి వైభవ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తామని జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి 2026 మేలో ఒక ప్రకటన విడుదల చేశారు.👉ఇక ఇంగ్లండ్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ గత నెలలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో రెండు మెరుపు అర్ధశతకాలతో 151 పరుగులు చేశాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహించనున్న వైభవ్ వైస్కెప్టెన్గా జట్టును నడిపించనున్నాడు.Read: ‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్! -
ఆ ముగ్గురి నుంచి ఫోన్కాల్.. అందరికీ ఒకటే సమాధానం!
అజింక్యా రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో స్వదేశంలో కంటే విదేశీ టూర్లలో ఎక్కువగా రాణించిన రహానే సంతృప్తిగానే వీడ్కోలు పలికినట్లు పేర్కొన్నాడు. అయితే తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించిన సమయంలో సచిన్, కోహ్లి, రోహిత్లు తనకు ఫోన్కాల్ చేసి నిర్ణయంపై పునరాలోచన చేయాలని తెలిపారు. కానీ ఆ ముగ్గురికి తాను ఒకటే సమాధానం చెప్పానని, ఇష్టపూర్వకంగానే తాను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వాళ్లకు చెప్పానని రహానే చెప్పుకొచ్చాడు. వీళ్లతో పాటు ఇర్ఫాన్ పఠాన్, బుమ్రా నుంచి కూడా తనకు సందేశాలు వచ్చాయని తెలిపాడు. రిటైర్మెంట్ వీడియోనూ పోస్టు చేసిన తర్వాత తనకు మొదటి కాల్ సచిన్ టెండూల్కర్ నుంచి వచ్చిందని రహానే వెల్లడించాడు.'రహానే.. నువ్ ఇంకా ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడతావు అనుకున్నా' అని సచిన్ చెప్పినట్లు తెలిపాడు. ఇకపై క్రికెట్ను సాగదీయకుండా, ఎలాంటి అసంతృప్తి లేకుండా కెరీర్ ముగించాలనే నిర్ణయం తీసుకున్నానని సచిన్కు చెప్పినట్లు రహానే పేర్కొన్నాడు. ఇక మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా రహానేకి ఫోన్ చేసి మాట్లాడాడు. మరోవైపు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్లు రహానేకి మెసేజెస్ అండ్ కాల్స్ చేశారు. అయితే వీరందరికీ రహానే ఒకటే సమాధానం ఇచ్చినట్లు తెలిపాడు. క్రికెట్కు తాను పూర్తిగా న్యాయం చేశాననే సంతృప్తితో ఉన్నానని, తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేసినట్లు రహానే వెల్లడించాడు.కోహ్లి, పుజరాలతో ఉన్న బంధం గురించి రహానే స్పందించాడు. ‘దేశీయ క్రికెట్లో నేను, పుజారా చాలా కాలం కలిసి ఆడాము. అయితే, భారత్ తరఫున ఆడుతున్నప్పుడు నేను, విరాట్ ఎక్కువ సమయం కలిసి గడిపాము. కానీ మా మధ్య బంధం చాలా బలంగా ఉండేది. భారత టెస్ట్ జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లడమే మా ఉమ్మడి లక్ష్యం. 2015లో ఆరో, ఏడో ర్యాంకులో ఉన్న మేము, క్రమంగా నంబర్ 1 టెస్ట్ జట్టుగా ఎదిగాము. మేము నిరంతరం ఆట గురించి చర్చించుకుంటూ, విశ్లేషించుకుంటూ, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాము. చాంపియన్లుగా మారకముందు, టెస్టుల్లో మేమిద్దరం కలిసి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాము. అది ఎంతో ఆనందాన్నిచ్చింది.’ అని చెప్పుకొచ్చాడు.రహానే తన 15 ఏళ్ల కెరీర్లో భారత్ తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 8414 పరుగులు చేశాడు. అందులో 5077 రన్స్ టెస్ట్ క్రికెట్లో సాధించినవే కావడం గమనార్హం. అతడి పేరిట 12 టెస్టు సెంచరీలు ఉన్నాయి.చదవండి: విండీస్ ఆశలపై నీళ్లు చల్లిన అఫ్గానిస్తాన్ -
విండీస్ ఆశలపై నీళ్లు చల్లిన అఫ్గానిస్తాన్
ఐర్లాండ్పై విజయంతో 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించిన అఫ్గానిస్తాన్.. వెస్టిండీస్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని విండీస్ కోల్పోయింది. ఇక ప్రపంచకప్కు అర్హత సాధించేందుకు విండీస్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఎనిమిది జట్లు నేరుగా వన్డే ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. ఇక ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు కూడా అర్హత సాధించాయి. అయితే వెస్టిండీస్ ప్రస్తుతం ర్యాంకింగ్స్లో పదో స్థానంలో కొనసాగుతోంది. జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నప్పటికీ ఆతిథ్య హోదాలో ఆ జట్టు అర్హత సాధించడంతో కటాఫ్ తేదీ సమయానికి వెస్టిండీస్కు టాప్-9లో ప్రవేశించేందుకు చాన్స్ లేదు. ఒకవేళ సెప్టెంబర్-అక్టోబర్లో భారత్తో జరగనున్న వన్డే సిరీస్లో వెస్టిండీస్ అన్ని మ్యాచ్లు గెలిచినప్పటికీ వరల్డ్కప్కు అర్హత సాధించే అవకాశం మాత్రం వారికి లేదు. సెప్టెంబర్ 30 డెడ్లైన్ ప్రకారం టాప్-8లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అప్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు సౌతాఫ్రికా (ఆతిథ్య దేశం), జింబాబ్వే (ఆతిథ్య దేశం) నేరుగా వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించనున్నాయి. ఇక వెస్టిండీస్ మాత్రం వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించకపోవడం ఇది వరుసగా మూడోసారి. 2019, 2023 ఎడిషన్లలోనూ విండీస్ డైరెక్ట్ క్వాలిఫై సాధించడంలో విఫలమైంది. ఇక వెస్టిండీస్ ఈసారి కూడా ప్రపంచకప్లో ఆడాలంటే ఇతర అసోసియేట్ దేశాలతో కలిసి వరల్డ్కప్ క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా రెండో రౌండ్లో అడుగుపెడుతుంది.కాగా మిగిలిన జట్లు రెండో రౌండ్కు అర్హత సాధించేందుక సూపర్ సిరీస్ ఆడనున్నాయి. రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేత అయిన వెస్టిండీస్ దారుణ ఆటతీరుతో ర్యాంకింగ్స్లో అట్టడుగు స్థానంలో నిలుస్తూ నేరుగా అర్హత సాధించడంలో విఫలమవుతూనే వస్తోంది.Read: ఐసీసీకీ షాక్.. ఆక్రోశం వెళ్లగక్కిన స్కాట్లాండ్, నెదర్లాండ్ -
రషీద్ మెరుపులు.. వన్డే ప్రపంచకప్కు అఫ్గానిస్తాన్ అర్హత
అఫ్గానిస్తాన్ జట్టు 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించింది. రషీద్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడు ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా అఫ్గానిస్తాన్ నేరుగా ఈ అవకాశాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన వన్డేలో అఫ్గాన్ మూడు వికెట్ల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 46.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. గావిన్ హోయ్ (36) టాప్ స్కోరర్గా నిలవగా, కేడ్ కార్మిచల్ (32), జై మూంద్రా (31) పర్వాలేదనిపించారు. అప్గానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, గజన్ఫర్చెరో మూడు వికెట్లతో విజృంభించగా, యామిన్ అహ్మద్జయ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 44.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (71) అర్ధసెంచరీతో రాణించగా, ఆఖర్లో రషీద్ ఖాన్ (37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఐర్లాండ్ బౌలర్లలో గావిన్ హోయ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో అఫ్గానిస్తాన్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం జరగనుంది.డెడ్లైన్ సెప్టెంబర్..సెప్టెంబర్ 2026 వరకు ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్–8 స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. దక్షిణాఫ్రికా ఆతిథ్య జట్టు కావడంతో టాప్–9కు అవకాశం దక్కుతుంది. బంగ్లాదేశ్ కూడా క్వాలిఫై అయింది. అయితే రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ ఈ అవకాశం కోల్పోయింది. దాంతో విండీస్ వరల్డ్ కప్కు అర్హత సాధించాలంటే క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది.𝐌𝐀𝐓𝐂𝐇-𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆 𝐑𝐀𝐒𝐇𝐈𝐃 𝐊𝐇𝐀𝐍! 🪄3/44 with the ball! 🎯37* with the bat! 💥@rashidkhan_19 delivered another brilliant all-round performance to guide Afghanistan to victory and claim his second successive Player of the Match award! 👏💙#AfghanAtalan |… pic.twitter.com/r4JZlbJJNk— Afghanistan Cricket Board (@ACBofficials) August 10, 2026Read: మాజీ క్రికెటర్ గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖ! -
‘షమీ అదొక్కటి చెయ్యు.. నీ రీఎంట్రీ తథ్యం’
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తు ఏంటనేది బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందే చెప్పేశాడు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాము యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహించనున్నామని, షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లు గతంలో టీమిండియాకు విలువైన సేవలు అందించినప్పటికీ ఇప్పుడు అతడి సేవలు జట్టుకు అవసరం లేదని భావిస్తున్నట్లు అగార్కర్ పరోక్షంగా పేర్కొన్నాడు. దీంతో షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అనే వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందనే వార్తలు వినిపిస్తన్నాయి. అయితే బుమ్రా లాంటి టాప్ బౌలర్ తరచూ గాయాల బారిన పడుతుండడం ఇప్పుడు టీమిండియాను ఆందోళనలోకి నెట్టేస్తుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. షమీ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎంపిక కావడం లేదన్న నిరాశను పక్కనబెట్టి జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తూనే ఉండాలని, షమీకి తానిచ్చే సలహా అదొక్కటేనని జహీర్ పేర్కొన్నాడు.‘‘ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది షమీనే. మ్యాచ్లు ఆడుతూ బాగా రాణిస్తే జాతీయ జట్టుకు అందుబాటులో ఉన్నట్టే. ప్రస్తుతం జట్టు ఆలోచన మరోలా ఉండొచ్చు. కానీ ఆటగాడిగా మన ఆలోచన, మనం జట్టుకు ఎలా ఉపయోగపడగలమన్నది ముఖ్యం. షమీ ఇప్పుడు చేస్తున్నదే కొనసాగించాలి. మ్యాచ్లు ఆడటం, రాణించడమే చాలా ముఖ్యం’’ అని జహీర్ చెప్పాడు.ఇక జస్ప్రీత్ బుమ్రా వరుస సిరీస్లకు ఫిట్గా ఉండకపోవడం, సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లు ఫిట్నెస్ కాపాడుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జహీర్ టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడడంపై స్పందించాడు."గాయాలు ఆటలో సహజం. అవి ప్రతి వ్యక్తి ప్రయాణంలో అంతర్భాగం. ఆటగాళ్ల పని భారం తగ్గించడం అవసరమే అయినా.. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా పేసర్ గాయపడినప్పుడు లేదా కష్టమైన దశను ఎదుర్కొంటు న్నప్పుడు మన నియంత్రణలో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. గాయానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే వరకు ముందుకు సాగడం కష్టం" అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.Read: బాడీ షేమింగ్పై ట్రోల్స్.. కట్చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ! -
బాడీ షేమింగ్ ట్రోల్స్.. కట్చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ!
శ్రీలంకతో టెస్టు సిరీస్కు గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో అవకాశం కల్పించింది. అయితే రెండేళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ తన ఎంపికపై తొలిసారి స్పందించాడు. తన బాడీషేమింగ్పై వచ్చిన ట్రోల్స్ను చాలెంజ్గా తీసుకున్న సర్ఫరాజ్ ఖాన్ సీరియస్ వర్కౌట్స్ చేసి బరువు తగ్గిన కొత్త ఫొటోలను పంచుకున్నాడు. తొలి ఫోటోలో తనను జట్టులోకి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా షేక్ హ్యాండ్ ఇస్తున్న ఎమోజీతో పాటు లవ్ ఇండియా సింబల్ను ట్యాగ్ చేశాడు. ఇక రెండో ఫొటోలో తన తండ్రి నౌషద్ ఖాన్తో కలిసి ఉన్న క్లిప్ను పంచుకున్నాడు. స్వతహాగా క్రికెట్ కోచ్ అయిన నౌషద్ ఖాన్ భారత్ తరఫున తన కుమారుడి అంతర్జాతీయ అరంగేట్రం కోసం చాలానే కష్టపడ్డాడు. 2024లో తన కుమారుడు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంలో నౌషద్ ఖాన్ హర్షం వ్యక్తం చేసిన ఫొటోలు అప్పట్లో వైరలయ్యాయి. తండ్రి పర్యవేక్షణలో..అంతేకాదు ఫామ్లేమి, ఫిట్నెస్ సమస్యలతో జట్టులో చోటు కోల్పోయి ఇబ్బంది పడుతున్న కొడుకుకు అండగా నిలిచి, అతడు బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో గాయపడ్డ సాయి సుదర్శన్ స్థానంలో జట్టుకు ఎంపిక కావడంతో సర్ఫరాజ్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. కాగా తండ్రితో కలిసి దిగిన ఫొటోకు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. 13 గంటల్లోనే 169 లక్షల వ్యూస్ రావడం విశేషం.2024లో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు అనూహ్యంగా చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ ఆ సిరీస్లో 371 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. సూపర్ ఫామ్తో న్యూజీలాండ్తో సిరీస్కు కూడా ఎంపికయ్యాడు. అయితే తొలి మ్యాచ్లో 150 పరుగుల ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఆ తర్వాత వరుసగా 11, 9, 0, 1.. విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు.జురెల్, పడిక్కల్తో పోటీఇదే సమయంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ ఇవ్వడం, ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ రాణించడంతో సర్ఫరాజ్ ఖాన్ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే తాజాగా సాయి సుదర్శన్ గాయంతో లంకతో సిరీస్కు దూరమవ్వడంతో అతడి స్థానంలో సర్ఫరాజ్ జట్టులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్ ఇప్పటికే జట్టులో ఉండడంతో లంకతో తొలి టెస్టుకు సర్ఫరాజ్కు అవకాశం రావడం కష్టమే.2024లో టీమిండియాలో చోటు కోల్పోయిన సర్ఫరాజ్ తొలుత ఫిట్నెస్పై దృష్టి సారించాడు. కఠిన శిక్షణతో బరువు తగ్గిన సర్ఫరాజ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఆ తర్వాత 2025-26 రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ తొమ్మిది ఇన్నింగ్స్ల్లో ఒక డబుల్ సెంచరీ సాయంతో 429 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతోనే సర్ఫరాజ్.. ఆరో స్థానం కోసం ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్తో పోటీ పడుతున్నాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పడిక్కల్ తొలి టెస్టులో ఆడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక లంకతో తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.Sarfaraz Khan in India kit with his Father. Deserved comeback 🤝. pic.twitter.com/asooA1XJxY— CricketGully (@thecricketgully) August 10, 2026SARFARAZ KHAN ON THE WAY TO SRI LANKA 🔥 [Sahil Malhotra] - All the best, Sarfaraz Khan. pic.twitter.com/dBp2cQ2RC7— Johns. (@CricCrazyJohns) August 9, 2026 Sarfaraz Khan’s special words for his son after being picked once again for the Indian Test team.🇮🇳❤️ pic.twitter.com/VogFjGFOZ4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 10, 2026Read: భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్! -
భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ఫిట్నెస్పై జట్టు మేనేజ్మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది. తొలి టెస్టుకు ముందు లంకతో ఆడిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో బరిలోకి దిగిన గిల్ చేతి వేలికి చిన్న గాయమైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దూరంగా ఉన్న గిల్.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ చేతి వేలి గాయంతో ఏమైనా బాధపడ్డాడా లేక బాగానే ఉన్నాడా అన్నదానిపై భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు. 'నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ చేతి వేలికి చిన్న గాయమైంది. అయితే అతడికి అయిన గాయం మైనర్దే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే వార్మప్ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆటకు దూరంగానే ఉన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. దీంతో అతడి చేతివేలి గాయం పూర్తిగా తగ్గిపోయినట్లే. తన బ్యాటింగ్తో తొలి టెస్టుకు దూరమవుతాడన్న సందేహాలను కూడా గిల్ పటాపంచలు చేశాడు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియాకు ఎంపికైన 13 మంది ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల బారిన పడి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాస కేంద్రంలో గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరే ఆటగాడు గాయపడ్డా టీమిండియాకు ఎదురుదెబ్బ అవుతుందని భయపడుతున్నాం. అందుకే గిల్కు చిన్న గాయమే అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవాలనే వార్మప్ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆడించలేదు. చేతి వేలి గాయం మానడంతో చివరి రోజు బ్యాటింగ్కు దిగిన గిల్ మంచి ఈజ్తో బ్యాటింగ్ చేసి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలిచ్చాడు.' అని చెప్పుకొచ్చాడు. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన గిల్ 55 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 21వ ఓవర్లో కేషారా నువంతా బౌలింగ్లో గిల్ వెనుదిరిగాడు. ఇక గిల్ గాయం మొదట మేనేజ్మెంట్ను భయపెట్టినప్పటికీ, అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక 2025 నుంచి గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తున్నాడు. అంతకముందు 2020 నుంచి 2023 వరకు గిల్ టెస్టుల్లో ఓపెనర్గా ఆడాడు. అయితే జైస్వాల్కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్గా అదరగొట్టడంతో వీరి జోడినే శ్రీలంక టెస్టు సిరీస్లోనూ కంటిన్యూ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ లెక్కన గిల్ మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్కు రానున్నాడు. ఇక టెస్టుల్లో గిల్కు నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్ల్లో 88.75 సగటుతో గిల్ ఆరు సెంచరీలు సాధించడం విశేషం. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది.Read: ఐదేళ్ల వయసులోనే MMA చాంపియన్.. ఎవరీ బుడ్డోడు! -
నామమాత్రపు మ్యాచ్.. లివింగ్స్టోన్, జూనియర్ ఏబీ విధ్వంసం
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ నుంచి ఇప్పటికే వైదొలిగిన లండన్ స్పిరిట్, బర్మింగ్హమ్ ఫోనిక్స్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లండన్ స్పిరిట్ బ్యాటర్లు లియామ్ లివింగ్స్టోన్, డెవాల్డ్ బ్రెవిస్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బర్మింగ్హమ్ ఫోనిక్స్పై 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ జో క్లార్క్ (42 బంతుల్లో 73) రాణించగా, ఆఖర్లో సీన్ డిక్సన్ (28 బంతుల్లో 51 నాటౌట్), డొనోవన్ ఫెరీరా (5 బంతుల్లో 14 నాటౌట్) విధ్వంసం చేయడంతో బర్మింగ్హమ్ భారీ స్కోరు సాధించింది. లండన్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, జేమ్స్ కోల్స్, మాసన్ క్రేన్, హెన్రీ క్రొకొంబెలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లండన్ స్పిరిట్ 82 బంతుల్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ లియామ్ లివింగ్స్టోన్ (30 బంతుల్లో 66), డెవాల్డ్ బ్రెవిస్ (31 బంతుల్లో 55 నాటౌట్) విధ్వంసంతో లండన్ స్పిరిట్ ఈజీ విక్టరీ అందుకుంది. బర్మింగ్హమ్ బౌలర్లలో జోర్డాన్ థాంప్సన్, సకిబ్ మహ్మూద్, టామ్ హెల్మ్లు తలా ఒక వికెట్ తీశారు. టోర్నీలో చివరి రెండు స్థానాల్లో ఉన్న లండన్ స్పిరిట్, బర్మింగ్ హమ్ ఫోనిక్స్ ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ కాగా, ట్రెంట్ రాకెట్స్ ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో టాప్లో నిలిచి క్వాలిఫయర్కు అర్హత సాధించింది. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే..!
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబోలో జరుగనుంది.దీనికి ముందు శ్రీలంక ఎలెవెన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మాంచి జోరు ప్రదర్శించింది. ఈ మ్యాచ్తో భారత్కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. సాయి సుదర్శన్ గైర్హాజరీలో దేవదత్ పడిక్కల్ రూపంలో వన్ డౌన్లో మంచి ఆప్షన్ లభించింది. రెగ్యులర్ బ్యాటర్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్. కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాట్తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా, స్పిన్నర్లు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొని తొలి టెస్ట్లో టీమిండియా ఎలా ఉండబోతుందో ఓ అంచనా వేద్దాం.ఓపెనర్లు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్తొలి టెస్ట్లో వీరిద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఇద్దరూ వార్మప్ మ్యాచ్లో పరుగులు సాధించడం సానుకూల అంశం. జైస్వాల్ దూకుడుగా ఆడితే.. రాహుల్ పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ను నిర్మించగలడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో ఈ జోడీ కీలకంగా మారనుంది.నంబర్ 3లో దేవదత్ పడిక్కల్సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో నంబర్ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్కు అవకాశం దక్కడం ఖాయమైపోయింది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పడిక్కల్ అద్భుతమైన సెంచరీ సాధించి తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు.నాలుగో స్థానంలో గిల్నంబర్ 4లో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయం కారణంగా బ్యాటింగ్కు రాని గిల్.. రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగి మంచి టచ్లో కనిపించాడు.నంబర్ 5లో రిషభ్ పంత్కు చోటు దక్కే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతడు విఫలమైనప్పటికీ.. టెస్టుల్లో భారత్కు ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్-బ్యాటర్లలో పంత్ ఒకడు. అందువల్ల అతడికి తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమే.నంబర్ 6లో ధ్రువ్ జురెల్కు అవకాశం లభించవచ్చు. వార్మప్ మ్యాచ్లో అతడూ పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ టెస్టుల్లో బ్యాటింగ్ లైనప్ను మరింత లోతుగా ఉంచాలన్న భారత వ్యూహంలో భాగంగా జురెల్ను ఆడించే అవకాశం ఉంది.ఆల్రౌండర్లుగా జడేజా, సుతార్ఆల్రౌండర్ స్థానాల్లో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జడేజా టెస్టు క్రికెట్లో భారత్కు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. బ్యాటింగ్లో 38కు పైగా సగటుతో అతడు మిడిలార్డర్కు అదనపు బలం అందించగలడు.మరోవైపు సుతార్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో సుమారు 26 సగటు కలిగి ఉన్నాడు. నంబర్ 8 వరకు బ్యాటింగ్ను తీసుకెళ్లడంతో పాటు స్పిన్ బౌలింగ్లోనూ అతడు ఉపయోగపడనున్నాడు.స్పిన్ బాధ్యతలు కుల్దీప్వేగాలే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ ముగ్గురు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, సుతార్తో పాటు కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్గా వ్యవహరించనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. గాలేలో టర్నింగ్ పిచ్ లభిస్తే శ్రీలంక బ్యాటర్లకు అతడు పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. శ్రీలంకలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన కుల్దీప్.. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.పేసర్లుగా సిరాజ్, గర్నూర్ బ్రార్తొలి టెస్ట్లో భారత్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తే.. సిరాజ్తో పాటు గర్నూర్ బ్రార్కు అవకాశం లభించవచ్చు. బ్రార్ వార్మప్ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు.శ్రీలంకతో తొలి టెస్ట్కు టీమిండియా (అంచనా)కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ -
టీమిండియాలో నో చాన్స్.. కౌంటీ బరిలో సీనియర్ క్రికెటర్!
భారత జట్టులో అవకాశాలు రాకపోవడంతో వెటరన్ క్రికెటర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ క్రికెట్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ససెక్స్ తరఫున కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు జైదేవ్ ఉనాద్కట్ ఈ వారం చివర్లో ఇంగ్లండ్కు బయల్దేరి వెళ్లనున్నాడు. ప్రస్తుతం హండ్రెడ్ టోర్నీతో పాటు వన్డే కప్ జరుగుతుండడంతో కౌంటీ క్రికెట్కు చిన్న బ్రేక్ వచ్చింది. కౌంటీ క్రికెట్ ప్రారంభమవ్వగానే ఉనాద్కట్ జట్టుతో జాయిన్ అవనున్నాడు. ఓలీ రాబిన్సన్ నేతృత్వంలోని ససెక్స్ జట్టు ఈ సీజన్లో మంచి ప్రదర్శనే చేసింది. ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు, రెండు ఓటములు, రెండు డ్రాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆగస్టు 20న తిరిగి ప్రారంభం కానున్న కౌంటీ చాంపియన్షిప్లో ఉనాద్కట్ ససెక్స్ తరఫున వార్విక్షైర్తో బర్మింగ్హమ్ వేదికగా మ్యాచ్లో ఆడనున్నాడు. కాగా ఉనాద్కట్ 2023 నుంచే కౌంటీల్లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. మొత్తం ఇప్పటివరకు ససెక్స్ తరఫున 13 మ్యాచ్లాడిన ఉనాద్కట్ 57 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున ఉనాద్కట్ నాలుగు టెస్టులు, ఎనిమిది వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక ఉనాద్కట్ చివరగా ఆగస్టు 2023లో వెస్టిండీస్తో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తోనే చివరి టెస్టు ఆడాడు. ఇక ఉనాద్కట్ చివరి టీ20 మ్యాచ్ ఆడి 8 సంవత్సరాలు దాటింది. ఇక జైదేవ్ ఉనాద్కట్తో పాటు ప్రస్తుతం చాహల్ నాటింగ్హమ్షైర్కు, సర్రీ తరఫున రాహుల్ చాహర్ ఆడుతున్నారు. ఇక యార్క్షైర్ తరఫున కుల్దీప్ యాదవ్ వన్డే కప్ ఆడుతుండగా, స్నిన్నర్ మానవ్ సుతార్ వార్విక్షైర్ తరఫున రెండు కౌంటీ మ్యాచ్లు ఆడాడు.చదవండి: ‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’ -
‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో వైట్బాల్ ఫార్మాట్లో తనదైన ముద్ర వేయగల సామర్థ్యం వైభవ్ కలిగి ఉన్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. గతంలో పృథ్వీ షా తక్కువ వయసులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత వేరే విషయాలపై దృష్టి పెట్టడంతో కెరీర్ దారి తప్పిందని, వైభవ్ అలా దారి తప్పకూడదని పరోక్షంగా హెచ్చరించాడు.ఒక మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఊతప్ప మాట్లాడాడు. ‘వైట్బాల్ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడు. ఎందుకంటే సచిన్ లాగే చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. సచిన్ ఎంతటి పేరు ప్రతిష్టలు సాధించాడన్నది అందరికీ తెలిసింది. మరి వైభవ్ దానిని ఎలా నిలబెట్టుకుంటాడనేది ఆసక్తిగా మారింది. అంధఃపాతాళానికి పృథ్వీ షా..‘భారత క్రికెట్లో చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో పైకి వచ్చినవాళ్లను అరుదుగా చూశాం. ఉదాహరణకు వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలను తమ కెరీర్ను 17-18 ఏళ్ల వయసులోనే ప్రారంభించారు. ఈ ఇద్దరు భారత క్రికెట్లో ఎంతో ముద్ర వేస్తారని అంతా భావించారు. కాంబ్లీ సంగతి పక్కనబెడితే, పృథ్వీ షా కెరీర్ ట్రాక్ తప్పడానికి ప్రధాన కారణం అతడి వయస్సే. చిన్న వయసులోనే స్టార్డమ్ చూసిన పృథ్వీ షాకు కెరీర్ కంటే మిగతా విషయాలపై ఫోకస్ పెరిగింది. గర్ల్ఫ్రెండ్స్ మోజుతో పాటు ఎండార్స్మెంట్ రూపంలో యాడ్ చేయడంతో సంపాదనపై ఆసక్తి పెరిగింది. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న పృథ్వీ షా కెరీర్ అంధఃపాతాళానికి పడిపోయింది. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి అతడి వయస్సే పెద్ద సవాల్ కానుంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న వైభవ్ రానున్న ఐదేళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా ఆటపై దృష్టి పెడతాడా అన్నది చూడాలి. వీలైనంత వరకు వయసు రీత్యా గర్ల్ఫ్రెండ్స్పై మోజు, ఎడాపెడా ఎండార్స్మెంట్లకు సంతకాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. సరైన దారిలోనే..ఇప్పటికైతే వైభవ్ తనకు ఎలాంటి ఎండార్స్మెంట్ ఆఫర్ వచ్చినా ఆలోచించి అడుగు వేస్తున్నాడు. అంతేకాదు కేవలం ఆటపైనే దృష్టి పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే వైట్బాల్లో సచిన్ను మించిన అద్భుతం అవుతాడు. అలా కాదని వ్యవహరిస్తే మాత్రం మరో పృథ్వీషాగా మిగిలిపోవడం ఖాయం. ఇప్పటికిప్పుడు సచిన్తో పోల్చడం సరైన చర్య కాకపోయినప్పటికీ, వైభవ్లో దాగున్న అపారమైన సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలుపుతుంది’ అని చెప్పుకొచ్చాడు.Read: సామ్ బిల్లింగ్స్ సిక్సర్ల వర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్ రాకెట్స్ -
సామ్ బిల్లింగ్స్ సిక్సర్ల వర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్ రాకెట్స్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్-2026లో ట్రెంట్ రాకెట్స్ ఐదో విజయాన్ని అందుకొని టాప్గేర్లో దూసుకెళ్తోంది. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ విధ్వంసానికి తోడు ఓపెనర్లు రాణించడంతో 7 వికెట్ల తేడాతో బర్మింగ్హమ్ ఫోనిక్స్పై గెలుపొందింది. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్ 83 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. సామ్ బిలింగ్స్ (19 బంతుల్లో 31 నాటౌట్, 1 ఫోర్, మూడు సిక్సర్లు) అజేయం కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించగా, ఓపెనర్లు బెన్ డకెట్ (22), ఫిన్ అలెన్ (28) రాణించారు. బర్మింగ్హమ్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ 2 వికెట్లు తీయగా, బెన్డార్ఫుసిస్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫొనిక్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. జో క్లార్క్ (45 బంతుల్లో 62) అర్ధసెంచరీ మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. లారి ఎవన్స్ (19) పర్వాలేదనిపించాడు. ట్రెంట్ బౌలర్లలో లూయిస్ గ్రెగొరి 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ ఆమిర్, మాట్ హెన్రీ,మిచెల్ సాంట్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఆరు మ్యాచ్ల్లో ఐదో విజయంతో ట్రెంట్ రాకెట్స్ 20 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉండగా, బర్మింగ్హమ్ ఫొనిక్స్ నాలుగో పరాజయంతో పట్టికలో అట్టడుగున నిలిచింది. 🚨 Crowd catch! Sam Billings smashes it into the crowd, and the safe hands of this fan 🙌#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/8MTtMl4pbT— The Hundred (@thehundred) August 5, 2026Sam Billings Is A Very Clean Hitter. Great Technique pic.twitter.com/7nZ2qPFP2m— Aryan Goel 2.0 (@AryanGoelNew) August 5, 2026చదవండి: కళ్లు చెదిరేలా షకీబ్ అల్ హసన్ ఆస్తుల విలువ! -
కళ్లు చెదిరేలా షకీబ్ అల్ హసన్ ఆస్తుల విలువ!
బంగ్లాదేశ్లో రాజకీయం మరోసారి వేడెక్కింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి కలకలం రేపింది. కాగా తన ఇంటిపై దాడితో షకీబ్ అల్ హసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో పాటు విదేశాల్లోనూ అనేక అక్రమాస్తులు కూడగట్టాడన్న ఆరోపణలు షకీబ్ అల్ హసన్పై వెల్లువెత్తాయి. దీంతో అసలు షకీబ్ అల్ హసన్ ఆస్తుల నికర విలువ మొత్తం ఎంత? ఏయే దేశాల్లో అతడి పేరిట ఆస్తులు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.బంగ్లాదేశ్ క్రికెట్లో స్టార్ ఆల్రౌండర్గా పేరు పొందిన షకీబ్ అల్ హసన్ నికర ఆస్తుల విలువ అంచనా 20 నుంచి 25 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 190 నుంచి 230 కోట్ల పైచిలుకు మాటే) ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రిటైర్మెంట్ ప్రకటించకపోవడంతో బంగ్లాదేశ్ అగ్రశ్రేణి క్రికెటర్గా, షకీబ్ అల్ హసన్ తన సహచరులందరికంటే అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు. Photo Credit: Twitterకోట్ల ఆస్తులు..బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో అతని సెంట్రల్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు , బోనస్లతో కలిపి, సాధారణంగా సంవత్సరానికి సుమారు రూ. 2.85 కోట్ల నుంచి 4.75 కోట్ల వరకు అందుకుంటున్నాడు. దీంతో పాటు షకీబ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో సహా ఇతర టీ20 లీగ్ల ద్వారా కూడా భారీ మొత్తంలో అందుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో యాక్టివ్గా లేనప్పటికీ, ఇతర టీ20 లీగుల్లో ఆడుతూ బాగానే సంపాదిస్తున్నాడు. ఇక బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఇతర ఫ్రాంచైజీ లీగ్లను పరిగణలోకి తీసుకొని, పన్నులు, ఇతర ఖర్చులు పోను క్రికెట్ రూపంలోనే షకీబ్ ఏడాదికి 95 నుంచి వంద కోట్ల రూపాయలు అర్జిస్తున్నాడు. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు నుంచి వచ్చిన షకీబ్కు ఇది పెద్ద మొత్తమనే చెప్పొచ్చు. అమెరికా నుంచి బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందిన షకీబ్ అల్ హసన్.. షకీబ్ మోనార్క్ హోల్డింగ్స్ అనే బ్రోకరేజ్ సంస్థకు చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక బురాక్ కమోడిటీస్ ఎక్స్చేంజీ ద్వారా బంగారం వ్యాపారంలోనూ షకీబ్ యాక్టివ్గా కొనసాగుతున్నాడు. ఇవే గాక విదేశాల్లోనూ షకీబ్ పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం.స్టార్ ఆల్రౌండర్గా..2006లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షకీబ్ అల్ హసన్ జట్టులో స్టార్ ఆల్రౌండర్గా ఎదిగాడు. షకీబ్ తన కెరీర్లో 71 టెస్టుల్లో 4,609 పరుగులు చేయడంతో పాటు 246 వికెట్లు తీశాడు. 247 వన్డేల్లో 7,570 పరుగులు, 317 వికెట్లు, 129 టీ20ల్లో 2551 పరుగులు, 149 వికెట్లు పడగొట్టాడు. ఇక షకీబ్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ 19 టెస్టుల్లో 4 విజయాలు, 62 వన్డేల్లో 27 విజయాలు, 39 టీ20ల్లో 16 విజయాలు సాధించింది.Photo Credit: Twitterవివాదాలు..షకీబ్ క్రికెట్ ప్రపంచంలోనూ, వెలుపలా అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ఉన్నాడు. ఒక క్రికెటర్గా, అతను తన తొందరపాటు స్వభావం, దుష్ప్రవర్తనకు సంబంధించిన అనేక క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని నివేదించడంలో విఫలమైనందుకు, ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందున షకీబ్పై రెండేళ్ల నిషేధం విధించింది.ఇక 2024లో షకీబ్పై స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలు రాగా, బంగ్లాదేశ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అతనికి జరిమానా విధించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే, 2017లో అతని కంపెనీ IFIC బ్యాంక్ నుండి తీసుకున్న చెల్లించని రుణానికి సంబంధించి చెక్ మోసం ఆరోపణలు అతనిపై వచ్చాయి. 2025 ప్రారంభంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో, షకీబ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది.Photo Credit: Twitterవ్యక్తిగత జీవితం..2012లో షకీబ్ అల్ హసన్.. బంగ్లాదేశీ అమెరికన్ అయిన ఉమ్మే అహ్మద్ శిశిర్ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. షకీబ్ ఇంగ్లీష్ క్లబ్ వోర్సెస్టర్షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆమెను తొలిసారి కలిశాడు. వారికి అలైనా, ఎర్రమ్ అనే ఇద్దరు కుమార్తెలు సహా ఐజా అనే కుమారుడు ఉన్నారు.చదవండి: స్వదేశానికి రషీద్ ఖాన్.. జింబాబ్వే ఆల్రౌండర్కు జాక్పాట్! -
స్వదేశానికి రషీద్ ఖాన్.. జింబాబ్వే ఆల్రౌండర్కు జాక్పాట్!
జింబాబ్వే స్టార్ ఆల్రౌండర్ సికందర్ రజా హండ్రెడ్ కాంపిటీషన్లో బంపరాఫర్ కొట్టేశాడు. ఐర్లాండ్తో వన్డే సిరీస్ కారణంగా అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎంఐ లండన్ను వీడాడు. దీంతో రషీద్ ఖాన్ స్థానంలో సికందర్ రజాను తాత్కాలిక విదేశీ ఆటగాడిగా ఎంపిక చేసినట్లు ఎంఐ లండన్ ఫ్రాంచైజీ తెలిపింది. ఐర్లాండ్తో సిరీస్ కోసం రషీద్ వెళ్లిపోవడంతో రజాతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంఐ లండన్ మిగతా మ్యాచ్లకు అతడిని అందుబాటులో ఉండాలని కోరింది. దీనికి సికందర్ రజా కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎంఐ లండన్ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. 'రషీద్ ఖాన్ స్థానంలో తాత్కాలిక ఆటగాడిగా జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజాను ఎంపిక చేశాం. రషీద్ స్థానంలో మిగిలిన మ్యాచ్లను సికందర్ రజా ఆడనున్నాడు. ఎంఐ లండన్లోకి నీకు స్వాగతం రజా' అని తెలిపింది. ఇక హండ్రెడ్ టోర్నీలో చాంపియన్గా నిలవాలని తాపత్రయపడుతున్న ఎంఐ లండన్ జట్టులో సికందర్ రజా చేరికతో మిడిలార్డర్ బలోపేతం కావడంతో పాటు అతడి స్పిన్ సేవలు జట్టుకు ఎంతో ఉపయోగపడనుందని చెప్పొచ్చు.ఇక సికందర్ రజా స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్లతో జరిగిన వైట్బాల్ సిరీస్ అనంతరం వైటాలిటీ బ్లాస్ట్ టోర్నీలో పాల్గొన్నాడు. టోర్నీలో వోర్సెస్టర్షైర్ తరఫున ఆడిన సికందర్ రజా తొమ్మిది మ్యాచ్లాడి 258 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఎంఐ లండన్ ప్రాంచైజీ నుంచి పిలుపు రావడంతో సికందర్ రజా హండ్రెడ్ టోర్నీ ఆడేందుకు లండన్కు చేరుకున్నాడు. ఇటీవలి కాలంలో టీ20 క్రికెట్లో సికందర్ రజా బెస్ట్ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 376 టీ20 మ్యాచ్లాడిన సికందర్ రజా 136 స్ట్రైక్రేట్తో 7,609 పరుగులు సాధించాడు. ఇక తన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో 255 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్లో తన సారథ్యంలోనే జింబాబ్వే సూపర్-6 స్టేజీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాకౌట్ స్టేజీల్లో సికందర్ రజాకు మంచి రికార్డు ఉంది.Sikandar Raza will temporarily replace Rashid Khan as an overseas player for MI London.Rashid Khan has joined up with Afghanistan for their white-ball series in Ireland. The experienced Zimbabwe all-rounder joins MI London after being on international duty for his home… pic.twitter.com/zSufGHOwZu— MI London (@MILondonCricket) August 5, 2026Read: విండీస్పై పాక్ విజయం.. డబ్ల్యూటీసీ లెక్కలు తారుమారు! -
విండీస్పై పాక్ విజయం.. డబ్ల్యూటీసీ లెక్కలు తారుమారు!
వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. అయితే డబ్ల్యూటీసీ పాయింట్ల విషయంలో విండీస్పై విజయం పాకిస్తాన్కు కాస్త ఉపశమనమిచ్చింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పరంగా మార్పు లేనప్పటికీ పాకిస్తాన్ ఒక స్థానం ఎగబాకి 8వ స్థానానికి చేరుకోగా, విండీస్ 9వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం పాక్ ఆరు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి 22.22 పర్సంటేజ్ పాయింట్లు (పీసీటీ) కలిగి ఉంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 87.50 పీసీటీతో టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ ఆడిన 8 మ్యాచ్ల్లో ఏడు విజయాలు అందుకుంది. ఇక ఆ తర్వాత సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వరుసగా 75, 72.22 పీసీటీతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. వీరి తర్వాత బంగ్లాదేశ్ 58.33 పీసీటీతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రా నమోదు చేసింది. టీమిండియా 48.15 పీసీటీతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. అయితే శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేస్తే పాయింట్ల పరంగా భారత్ టాప్-3కి దూసుకెళ్లే అవకాశముంది. ఇప్పటివరకు భారత్ 9 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రా చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంక (41.67), ఇంగ్లండ్ (24.36) పర్సంటేజ్ పాయింట్లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2027లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుండడంతో టీమిండియా మూడోసారి ఫైనల్కు చేరుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్తో రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్లోని తొలి మ్యాచ్లో వెస్టిండీస్ గెలిచింది. ఓవర్నైట్ స్కోరు 103/6తో బుధవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ చివరకు 46.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హెడ్జ్ (71 బంతుల్లో 34; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తేజ్నారాయన్ చందర్పాల్ (17), అమిర్ జంగూ (13), కెప్టెన్ రోస్టన్ చేజ్ (17), షై హోప్ (15), సీల్స్ (0), గ్రీవ్స్ (3) విఫలమయ్యారు.పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 75 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. అజాన్ అవైస్ (18), ఇమాముల్ హక్ (9) ఎక్కువసేపు నిలవలేకపోగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అబ్దుల్లా షఫీఖ్ (24 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 344 పరుగులు చేయగా... పాకిస్తాన్ జట్టు 387 పరుగులు చేసింది. 2023 తర్వాత విదేశాల్లో పాకిస్తాన్కిదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. 📊 The World Test Championship standings have a new look! 🏏The points table has been updated after the West Indies vs Pakistan Test series. West Indies now sit at the bottom, while Pakistan are second-last as the race to the WTC Final continues to heat up. 👀🔥#WTC… pic.twitter.com/OU6eTJj1W6— Sportskeeda (@Sportskeeda) August 5, 2026చదవండి: లైవ్ మ్యాచ్.. హఠాత్తుగా పిడుగు; ఫుట్బాలర్ మృత్యువాత! -
టీ20 క్రికెట్లో జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా వెల్ష్ఫైర్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ 20 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచి టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు (491 ఇన్నింగ్స్ల్లో 14,833 పరుగులు) చేసిన బ్యాటర్గా బట్లర్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (14,803 పరుగులు)రికార్డు బట్లర్ బద్దలు కొట్టాడు. బట్లర్, పొలార్డ్ తర్వాత విండీస్ హార్డ్ హిట్టర్, మాజీ ఆటగాడు క్రిస్ గేల్ (14, 562 పరుగులు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెల్ష్ఫైర్పై మాంచెస్టర్ సూపర్జెయింట్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వెల్ష్ఫైర్ విధించిన 156 పరుగుల టార్గెట్ను మాంచెస్టర్ జెయింట్స్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (36 బంతుల్లో 62 నాటౌట్), బట్లర్ (20 బంతుల్లో 51 నాటౌట్) ధాటిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. మరో ఓపెనర్ పాల్ వాల్టర్ (18 బంతుల్లో 37) రాణించాడు. అంతకముందు వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ (47 బంతుల్లో 71) విధ్వంసం సృష్టించగా, మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (48) రాణించాడు. మాంచెస్టర్ బౌలర్లలో గస్ అకిన్సన్ 2 వికెట్లు తీయగా, జోష్ టంగ్, పాల్ వాల్టర్ చెరొక వికెట్ తీశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.మార్కరమ్ స్థానంలో కెప్టెన్గాఇక మాంచెస్టర్ రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలగడంతో బట్లర్ తొలిసారి జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే విజయాన్ని సాధించాడు. ఇప్పటికే సౌతాఫ్రికా వెళ్లిపోయిన మార్కరమ్ మిగతా టోర్నీకి దూరమవ్వడంతో బట్లర్ జట్టును నడిపించనున్నాడు. ఇక బట్లర్ బ్యాటర్గా హండ్రెడ్ టోర్నీలో అదరగొడుతున్నాడు. ఈ వికెట్ కీపర్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో 92.3 స్ట్రైక్ రేట్తో 277 పరుగులు సాధించాడు. ఇక మార్కరమ్ స్థానంలో మైకెల్ బ్రాస్వెల్ను తీసుకున్నట్లు మాంచెస్టర్ ఫ్రాంచైజీ ప్రకటించింది. #JosButtler leaves the bowlers stunned 💥He has now surpassed #KieronPollard to become the leading run scorer in T20 history! 🙌#TheHundred 2026 👉 Welsh Fire vs Manchester Super Giants | LIVE NOW! pic.twitter.com/AO9Q7O9TbK— Star Sports (@StarSportsIndia) August 5, 2026 Record breaker 📈👑 @josbuttler Congratulations to Jos Buttler on becoming the all-time leading run scorer in T20 cricket. ⚡️ #StrikeTogether pic.twitter.com/FMuMEetTzL— Lancashire Cricket (@lancscricket) August 5, 2026 There’s a new king of T20 batting 👑Jos Buttler surpasses Kieron Pollard’s 14,803 runs to become the leading run-scorer in T20 history ✨ pic.twitter.com/QlAYAFwKFU— Cricinfo (@cricinfo) August 5, 2026Read: నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ -
ఇదేమి ఆటతీరు.. స్వల్ప ఛేదనలో నానా తంటాలు!
సాధారణంగా 100 బంతుల్లో 86 పరుగుల టార్గెట్ అంటే సునాయాసంగా ఊదిపారేయచ్చు. కానీ వెల్ష్ ఫైర్ జట్టు మాత్రం ఆ చిన్న టార్గెట్ను అందుకోవడానికి నానా తంటాలు పడింది. చివరకు ఎలాగోలా 3 వికెట్ల తేడాతో గెలిచి గట్టెక్కింది. హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్జెయింట్స్పై వెల్ష్ఫైర్ కష్టపడి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. రియానా మెక్డొనాల్డ్ (18), స్మృతి మంధాన (15) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లలో ఎవరు పెద్దగా రాణించలేదు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో ఒర్లా ప్రెండెగాస్ట్ 4 వికెట్లతో చెలరేగగా, హెథర్ గ్రహమ్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెల్ష్పైర్ కూడా పూర్తిగా తడబడినప్పటికీ మరో 9 బంతులు మిగిలి ఉండగా 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. అయితే ఒక దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వెల్ష్ఫైర్ను హెథర్ గ్రాహం (16 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. ఓపెనర్లు జార్జియా వోల్ (16), సారా బ్రైస్ (16) రాణించారు. మాంచెస్టర్ బౌలర్లలో సోఫీ ఎసెల్స్టోన్ 3 వికెట్లు తీయగా, రెబెక్కా టైసన్, మాడీ విల్లర్స్, కేథరిన్ బ్రైస్ తలా ఒక వికెట్ తీశారు.కాగా వెల్ష్ఫైర్కు ఇది ఆరు మ్యాచ్ల్లో మూడో విజయం కాగా, మాంచెస్టర్ సూపర్జెయింట్స్కు రెండో పరాజయం. 14 పాయింట్లతో మాంచెస్టర్ జెయింట్స్ మూడో స్థానంలో ఉండగా, వెల్ష్ఫైర్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.Read: ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్గా ఆసీస్ దిగ్గజం! -
ఐర్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్ రద్దు
ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బ్రెడీ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 5) జరగాల్సి ఉన్న తొలి వన్డే వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 10:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో 12:27 గంటల సమయంలో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఈ మ్యాచ్ ఐర్లాండ్ కొత్త ప్రధాన కోచ్ గ్యారీ విల్సన్కు తొలి మ్యాచ్ కావాల్సింది. 2025 మే తర్వాత ఐర్లాండ్ ఆడుతున్న తొలి 50 ఓవర్ల మ్యాచ్ కూడా ఇదే. వర్షం కారణంగా ఈ రెండు సందర్భాలు వాయిదా పడ్డాయి. జూన్లో భారత్పై 2-0తో టీ20 సిరీస్ విజయం సాధించిన తర్వాత ఐర్లాండ్ ఆడాల్సిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఇదే.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఐర్లాండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని మిగతా నాలుగు వన్డేలు ఆగస్ట్ 7, 10, 12, 14 తేదీల్లో జరుగనున్నాయి. రెండో వన్డే బ్రెడీలో, ఆఖరి మూడు వన్డేలు బెల్ఫాస్ట్లో షెడ్యూలయ్యాయి.క్రికెట్ ఐర్లాండ్ అసంతృప్తిఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల నేపథ్యంలో ఆ దేశానికి ఆతిథ్యం ఇవ్వడంపై ఐర్లాండ్ క్రికెట్ అసౌకర్యం వ్యక్తం చేసింది. ఆ దేశ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సారా కీన్ ఈ విషయమై నైతిక అసౌకర్యం ఉందని గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐర్లాండ్ ఈ సిరీస్కు ఆతిథ్యం ఇస్తోంది. -
ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్గా ఆసీస్ దిగ్గజం!
ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ ఇదే విషయమై మైక్ హస్సీని సంప్రదించినట్లు సమాచారం. మైక్ హస్సీ కూడా ప్లెమింగ్ ప్రతిపాదనపై సానుకూల స్పందనే వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మైక్ హస్సీ హండ్రెడ్ కాంపిటీషన్లో వెల్ష్ ఫైర్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక గతంలో ప్లెమింగ్, మైక్ హస్సీ కలిసి 15 ఏళ్ల పాటు చెన్నై సూపర్కింగ్స్ మేనేజ్మెంట్లో కలిసి పని చేశారు. చాలాకాలం పాటు సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన మైక్ హస్సీ ఆ తర్వాత సీఎస్కేకు మెంటార్గా వ్యహరించాడు. ఈ సమయంలో స్టీఫెన్ ప్లెమింగ్ హెడ్కోచ్గా ఉన్నాడు. 15 ఏళ్ల బంధమే ఇవాళ ప్లెమింగ్ను ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ పదవికి మైక్ హస్సీ పేరును ప్రతిపాదించేలా చేసిందని చెప్పొచ్చు.ఇక న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం బ్రెండన్ మెక్కల్లమ్ టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో స్టీఫెన్ ప్లెమింగ్ను రెడ్బాల్ క్రికెట్ కోచ్ పదవికి ఎంపిక చేసింది. ఇక స్టీఫెన్ ప్లెమింగ్ సీఎస్కే జట్టు కోచ్ పదవికి రాజీనామా చేసి 18 ఏళ్ల బంధానికి స్వస్తి పలికాడు. ప్రస్తుతం సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్తో టెస్టు సిరీస్ ఆడనుంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 19 నుంచి 23 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది. ఆగస్టు 27 నుంచి 31 వరకు రెండో టెస్టు, సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు మూడో టెస్టు మ్యాచ్ ఆడనుంది.ఆస్ట్రేలియా తరఫున 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మైక్ హస్సీ ఆ జట్టు తరఫున బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున హస్సీ 79 టెస్టుల్లో 6,235 పరుగులు, 185 వన్డేల్లో 5,442 పరుగులు, 38 టీ20ల్లో 721 పరుగులు సాధించాడు. తన కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 22 సెంచరీలు సాధించాడు. ఇక ఐపీఎల్లో 59 మ్యాచ్లు ఆడిన మైక్ హస్సీ 1,977 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం.England Head Coach Stephen Fleming has approached Mike Hussey to become England’s batting coach. (Tom Morris). pic.twitter.com/Jr1cdsaSyl— Mufaddal Vohra (@mufaddal_vohra) August 5, 2026Read: ఈసీబీ కీలక నిర్ణయం.. ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై నిషేధం? -
ఈసీబీ కీలక నిర్ణయం.. ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై నిషేధం?
అప్గానిస్తాన్తో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ నిర్వహణకు సిద్ధమైన ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్తో వన్డే సిరీస్ ఆడడం ఇంగ్లండ్కు ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం ఆఫ్గన్లో మహిళల పట్ల తాలిబన్ల ప్రవర్తన, లింగ వివక్ష అని తెలుస్తోంది. 2025 చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్తో ఇంగ్లండ్ తలపడినప్పుడు లండన్లో వివిధ పార్టీలకు చెందిన 160 మంది ఎంపీల బృందం ఈసీబీని తీవ్రంగా విమర్శించింది. అప్పటి నుంచి అఫ్గాన్తో క్రికెట్ ఆడేందుకు నిరాకరించిన ఇంగ్లండ్ కేవలం ఐసీసీ మేజర్ టోర్నీల్లో మాత్రమే మ్యాచ్లు ఆడుతోంది. తాజాగా తమ కనుసన్నల్లో ఉండే ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆఫ్గన్తో సిరీస్ నిర్వహణకు సిద్దమవ్వడం ఈసీబీకి కోపం తెప్పించింది. ఈ చర్య వల్ల ఇంగ్లండ్తో భవిష్యత్తులో ఆడాల్సిన అంతర్జాతీయ మ్యాచ్లను ఐర్లాండ్ కోల్పోయే ప్రమాదముందని చెప్పొచ్చు. గతంలో స్వదేశంలో యాషెస్ సిరీస్ ఆడడానికి ముందు ఇంగ్లండ్ సన్నాహకంగా ఐర్లాండ్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. 2019, 2023లో ఇది రిపీట్ అయింది. అయితే 2027 యాషెస్ సిరీస్కు ముందు మాత్రం ఈసారి ఐర్లాండ్తో కాకుండా బంగ్లాదేశ్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాలని ఈసీబీ నిర్ణయం తీసుకోవడం చూస్తే ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఏర్పడిన వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుతో (ఏసీబీ) సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నట్లు కనిపిస్తోంది. గత 10 సంవత్సరాల్లో ఐర్లాండ్, ఆఫ్గన్ల మధ్య ఇది ఐదో సిరీస్ కావడం విశేషం.అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ నిర్వహించడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆడడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బిగ్-త్రీ (బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా)లో రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తీరును వ్యతిరేకిస్తున్న వేళ అది క్రమంగా ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.చదవండి: తొలి టెస్టులో చోటు కష్టమే.. అందుకేనా బ్యాటింగ్ ప్రాక్టీస్! -
ఆసీస్తో టెస్ట్ సిరీస్ మధ్యలో మరో సిరీస్ ఆడనున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఒకేసారి రెండు సిరీస్లు ఆడనున్నాయి. సీనియర్ పురుషుల జట్టు ఆసీస్తో రెండు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ ఆడనుండగా.. బంగ్లాదేశ్ హై పెర్ఫార్మెన్స్ (HP) జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్ 2026లో పాల్గొననుంది.వార్మప్ మ్యాచ్తో ప్రారంభంబంగ్లాదేశ్ ఆస్ట్రేలియా పర్యటన ఆగస్టు 6న క్రికెట్ ఆస్ట్రేలియా XIతో జరిగే మూడు రోజుల వార్మప్ మ్యాచ్తో ప్రారంభమవుతుంది.ఆ తర్వాత ఆగస్టు 13న డార్విన్లోని మారారా క్రికెట్ గ్రౌండ్లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మెక్కేలో ఆగస్టు 22న మొదలవుతుంది. 23 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్న ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ ఇది.అదే రోజు బంగ్లాదేశ్ HP జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్లో తన పోరాటాన్ని ప్రారంభించనుంది. బంగ్లాదేశ్ HP జట్టు వరుసగా మూడో ఏడాది టాప్ ఎండ్ టీ20 సిరీస్లో పాల్గొంటోంది. ఈసారి ఈ టోర్నీలో మొత్తం 30 మ్యాచ్లు జరగనున్నాయి. సెమీఫైనల్స్, ఫైనల్ ఒకే రోజు నిర్వహించనున్నారు.ఈ టోర్నీలో బంగ్లాదేశ్ HPతో పాటు నేపాల్, న్యూజిలాండ్ A, ఆతిథ్య NT స్ట్రైక్, హోబార్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్, విక్టోరియా జట్లు పాల్గొంటాయి.2024లో ఫైనల్కు చేరిన బంగ్లాదేశ్టాప్ ఎండ్ టీ20 సిరీస్ 2024లో అక్బర్ అలీ నేతృత్వంలోని బంగ్లాదేశ్ HP జట్టు ఫైనల్కు చేరింది. అయితే టైటిల్ పోరులో అడిలైడ్ స్ట్రైకర్స్ చేతిలో ఓటమిపాలైంది.ఆ టోర్నీలో బంగ్లాదేశ్ బౌలర్ రిపోన్ మొండోల్ 15 వికెట్లతో అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు. బ్యాటింగ్లో పర్వేజ్ హొసైన్ ఎమోన్ ఎనిమిది ఇన్నింగ్స్ల్లో 186 పరుగులతో ఆకట్టుకున్నాడు.అయితే 2025 సీజన్లో బంగ్లాదేశ్ HP ఆరు మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలే సాధించింది. నేపాల్, NT స్ట్రైక్పై గెలిచిన బంగ్లాదేశ్.. పాకిస్థాన్ A, పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ స్టార్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ చేతిలో ఓడిపోయింది. -
తొలి టెస్టులో చోటుకోసం కుల్దీప్ మాస్టర్ ప్లాన్!
శ్రీలంకతో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు కోసం మాస్టర్ప్లాన్ వేసినట్లు అనిపిస్తోంది. తొలి టెస్టుకు సంబంధించి తుది జట్టును ప్రకటించినప్పటికీ, కుల్దీప్ తొలి టెస్టులో ఆడుతాడా లేదా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో లంక గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా బృందం ఇప్పటికే కొలంబో మైదానంలో ప్రాక్టీస్ను ఆరంభించింది. ఈ ప్రాక్టీస్లో కుల్దీప్ తన శైలికి భిన్నంగా బంతితో కాకుండా బ్యాట్తో ప్రాక్టీస్ చేయడం విశేషం. దాదాపు 40 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగించిన కుల్దీప్ ఒక్కసారి కూడా బౌలింగ్ వేయలేదు. అయితే తొలి టెస్టులో కుల్దీప్కు చోటు దక్కడం అనుమానంగా ఉండడంతో జట్టులో బ్యాటర్గానైనా చాన్స్ అందుకోవాలనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.టీమిండియాను వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో దూరమవ్వగా, ఫిట్నెస్ టెస్టు పాసైనప్పటికీ బుమ్రా కూడా చివరి నిమిషంలో లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. దీంతో లంకతో సిరీస్కు కుల్దీప్ ఎంపికైనప్పటికీ, ఆప్షనల్గా కనిపించాడు. ఇప్పుడు టీమిండియాను గాయాలు వెంటాడడంతో కుల్దీప్ తొలి టెస్టు ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం జడేజాతో కలిసి కుల్దీప్ బౌలింగ్ను పంచుకోనున్నాడు. అంతేకాదు కుల్దీప్ యాదవ్కు టెస్టుల్లో బ్యాటింగ్లోనూ మంచి రికార్డే ఉంది. ఈ మణికట్టు స్పిన్నర్ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 234 పరుగులు సాధించాడు. 40 పరుగులు అతడి అత్యుత్తమంగా ఉంది. అయితే తొలి టెస్టులో కుల్దీప్ చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది జట్టు ప్రకటన వరకు ఎదురుచూడాల్సిందే. అయితే లంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు కొలంబో వేదికగా మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక తొలి టెస్టు ఆగస్టు 15న గాలే వేదికగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా జరగనున్నాయి.లంకతో టెస్టు సిరీస్ భారత్కు కీలకమైంది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించాలంటే లంకపై సిరీస్ గెలవడం తప్పనిసరి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, లంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: శకం ముగిసింది.. డబ్ల్యూడబ్ల్యూఈకి స్టార్ రెజ్లర్ గుడ్ బై -
22 బంతుల్లోనే రికార్డు శతకం.. 95 ఏళ్ల క్రితమే!
టీ20 క్రికెట్ వచ్చాకా ఆటలో వేగం పెరిగిపోయింది. దీంతో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీలు నమోదు చేస్తున్న బ్యాటర్ల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సెంచరీ భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ నుంచి వచ్చింది. రెండు వరుస ఐపీఎల్ సీజన్లలో తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 37 బంతుల్లో శతకం సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన వైభవ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వైభవ్ను ఆకాశానికెత్తుతున్నాం కానీ 95 ఏళ్ల క్రితమే టెస్టు క్రికెట్లో ఆసీస్ దిగ్గజ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్మన్ కేవలం మూడు ఓవర్లలోనే సెంచరీ మార్క్ సాధించడం విశేషం. 1931 నవంబర్ 2న బ్లాక్హెత్ తరఫున బ్రాడ్మన్ న్యూ సౌత్వేల్స్ వేదికగా లిత్గో పొటరీస్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటేంటే అప్పట్లో ఒక ఓవర్కు ఆరు బంతులకు బదులు 8 బంతులుండేవి. తాను ఎదుర్కొన్న తొలి ఓవర్లో 33 పరుగులు (8 బంతులు), రెండో ఓవర్లో 40 పరుగులు (8 బంతులు), మూడో ఓవర్లో 27 పరుగులు (ఆరు బంతులు).. మొత్తంగా 22 బంతులెదుర్కొని కేవలం 18 నిమిషాల్లోనే బ్రాడ్మన్ 100 పరుగుల మార్క్ను చేరుకోవడం విశేషం. ఇక ఆ మ్యాచ్లో ఓవరాల్గా బ్రాడ్మన్ 256 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 14 సిక్సర్లు, 29 ఫోర్లు ఉన్నాయి.అప్పటికే సూపర్ ఫామ్లో ఉన్న బ్రాడ్మన్కు ఈ రికార్డు పెద్ద లెక్క కాదు. ఎందుకంటే టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రాడ్మన్ ప్రపంచ రికార్డు సృష్టించారు. టెస్టుల్లో బ్రాడ్మన్ సగటు 99.94. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. మొత్తంగా బ్రాడ్మన్ 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6,996 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలు, రికార్డు స్థాయిలో 12 డబుల్ సెంచరీలున్నాయి. తన కెరీర్లో చివరి టెస్టు ఇన్నింగ్స్లో ఒక్క పరుగు చేసి ఉన్నా బ్రాడ్మన్ సగటు వందగా ఉండేది. కానీ తన చివరి మ్యాచ్లో బ్రాడ్మన్ డకౌట్ అయ్యాడు.Read: పంత్ హవా.. ఆదాయపు పన్ను చెల్లింపులో అగ్రస్థానం! -
పంత్ హవా.. ఆదాయపు పన్ను చెల్లింపులో అగ్రస్థానం!
దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్న జాబితాలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు సంపాదించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉత్తరాఖండ్లో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా పంత్ రికార్డులకెక్కాడు. ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వ్యక్తుల జాబితాను విడుదల చేయగా.. అందులో పంత్ అత్యధిక పన్ను చెల్లించి అగ్రస్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. రూర్కీలో జన్మించిన పంత్ బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్లో ప్రస్తుతం లక్నో క్యాపిటల్స్ నుంచి అందుకున్న మొత్తం, మ్యాచ్ ఫీజులు, ఇతర వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు ఇతరత్రా ఆదాయ మార్గాల ద్వారా సంపాదిస్తున్నాడు. అయితే గతేడాదితో పోలిస్తే పంత్ ఈసారి చెల్లించిన పన్ను మొత్తం రెండింతలకు పైనే ఉండడం గమనార్హం. గతేడాది పంత్ సుమారు రూ. 10.5 కోట్ల పన్ను చెల్లించాడు. ఈసారి మాత్రం అతడి పన్ను చెల్లింపు మొత్తం గణీనీయంగా పెరిగింది. రికార్డు స్థాయిలో రూ. 23.84 కోట్లు చెల్లించి రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా పంత్ నిలిచాడు. మరోవైపు జార్ఖండ్-బీహార్ రాష్ట్రాల్లో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వారిలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.ప్రస్తుతం రిషబ్ పంత్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. లంక గడ్డపై రాణించాలనే పట్టుదలతో ఉన్న పంత్ ఇటీవలే తన గురువు ఎంఎస్ ధోని వద్ద ప్రత్యేక సలహాలు, సూచనలు అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో తరఫున పంత్ 14 మ్యాచ్లో 312 పరుగులు సాధించాడు. లక్నోను క్వాలిఫయర్ చేర్చడంలో పంత్ విఫలమయ్యాడు. ఇక ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో ఆడిన పంత్ 81 పరుగులతో రాణించాడు. ఇక పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి రెండేళ్లు కావొస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది. PANT BECOMES THE HIGHEST TAXPAYER FROM UTTARAKHAND. 💰 - Rishabh Pant emerged as the highest individual taxpayer in Uttarakhand after paying ₹23.84cr income tax for 2025-26 financial year. (ABP). pic.twitter.com/33xkT1Ev6r— Mufaddal Vohra (@mufaddal_vohra) August 5, 2026చదవండి: నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ -
జెమీమా మెరుపులు వృథా.. ఆఖరి బంతికి సంచలన విజయం!
హండ్రెడ్ వుమెన్ కాంపిటీషన్లో సదరన్ బ్రేవ్ వుమెన్ తొలి ఓటమిని చవిచూసింది. సోమవారం రాత్రి సదరన్ బ్రేవ్తో జరిగిన మ్యాచ్లో వెల్ష్ ఫైర్తో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులుచేసింది. లారా వోల్వర్ట్ (45 బంతుల్లో 48), జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 25) రాణించారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో హెథర్ గ్రహమ్, గ్రేస్ పాట్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెల్ష్ ఫైర్ నిర్ణీత వంద బంతుల్లోనే 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వెల్ష్ ఫైర్ బ్యాటింగ్లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో హెథర్ గ్రహమ్ (28 బంతుల్లో 35 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. ఆమెకు గ్రేస్ థాంప్సన్ (16), నిమ్హ్ హోలండ్ (12 నాటౌట్) సహకారం అందించారు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో టిల్లీ కోర్టీన్ 3 వికెట్లు తీయగా, ఇస్సీ వాంగ్ 2 వికెట్లు తీసింది. ఈ విజయంతో వెల్ష్ ఫైర్ 5 మ్యాచ్ల్లో రెండో విజయంతో పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా, సదరన్ బ్రేవ్ ఓటమి పాలైనప్పటికీ టాప్లోనే కొనసాగుతోంది.#JemimahRodrigues showcases her trademark timing with a beautifully placed boundary! 💥#TheHundred 2026 👉 Welsh Fire vs Southern Brave | LIVE NOW! pic.twitter.com/8Y8tt9CPhe— Star Sports (@StarSportsIndia) August 3, 2026Read: నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ -
నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ చానాళ్ల క్రితమే జట్టుకు దూరమయ్యాడు. అయితే 2023 వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం బారిన పడిన షమీ మళ్లీ తిరిగి జట్టులోకి రాలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న షమీ ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో రాణించినప్పటికీ సెలెక్టర్ల నుంచి పిలుపు మాత్రం రాలేదు. తాజాగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో జట్టులో యువ బౌలర్లకే ఎక్కువ అవకాశం ఉంటుందని, వయసు మీద పడిన క్రికెటర్లకు తాము అవకాశాలు ఇవ్వబోమని బాంబు పేల్చాడు. అంతేకాదు షమీ లాంటి సీనియర్ బౌలర్ల సేవలను తాము గుర్తుంచుకుంటామని, వారు చాలా సార్లు జట్టుకు విజయాలు అందించారని తెలిపారు. అగార్కర్ వ్యాఖ్యలు షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్ ఆటగాళ్లకు పరోక్షంగా రిటైరవ్వాలని హింట్ ఇచ్చినట్లుగా అనిపించింది. దీంతో షమీ అంతర్జాతీయ కెరీర్కు దాదాపు ఎండ్కార్డ్ పడినట్లే. ఇటీవలే ఒక మీడియా చానెల్కు షమీ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా మీ ఫెవరెట్ కోచ్ ఎవరు అని ప్రశ్న వేశారు. దీనిపై షమీ స్పందిస్తూ.. ‘ఎవరు బెస్ట్ కోచ్ అనేది పోల్చడం చాలా కష్టం. అయితే నేను గంభీర్ సారథ్యంలో టీమిండియాకు పెద్దగా మ్యాచ్లు ఆడలేదు. ఇక రాహుల్ బాయ్, అనిల్ బాయ్, రవిశాస్త్రిల హయాంలో మంచి క్రికెట్ ఆడాను. కానీ ఈ నలుగురిలో ఒకరిని ఎంపిక చేసుకోమంటే మాత్రం నేను రవిశాస్త్రి బాయ్ నా మొదటి ప్రాధాన్యత. అతడు కోచ్గా ఉన్న సమయంలో నేను స్వేచ్ఛగా ఆడానన్న ఫీలింగ్ వచ్చేది. అంతేకాదు రవి భాయ్ అగ్రెసివ్ ఎంతలా ఉండేదంటే ప్రతీ మ్యాచ్ మేము గెలవడానికే ఆడుతున్నామా అన్నట్లుగా ఉండేది. రవిశాస్త్రి కోచింగ్ను బాగా ఎంజాయ్ చేసేవాడిని’ అని షమీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఆ తర్వాత 2023 వన్డే ప్రపంచకప్లో భారత ప్రదర్శనను మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘‘2023 వన్డే ప్రపంచకప్ నాకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. కానీ నా మైండ్లో కప్ గెలవలేదన్న బాధ మాత్రం అలాగే ఉండిపోయింది. ‘అతను ఇన్ని మ్యాచ్లు ఆడాడు, ఇన్ని వికెట్లు తీశాడు’ అని చూపిస్తూ ఒక రీల్ నా ముందు వచ్చినప్పుడు, నేను ఐసీసీ ఈవెంట్లలో ఆడలేకపోయిన మ్యాచ్లు నా మనసులోకి వస్తాయి. ఇన్నేళ్ల కెరీర్లో ఐసీసీ మెగా టోర్నీల్లో నేను మూడు, నాలుగు లేదా ఐదు మ్యాచ్లు ఆడలేకపోయాను. ఒకవేళ నేను ఇవి ఆడి ఉంటే, ఇవాళ అగ్రస్థానంలో ఉండేవాడిని." అని షమీ చెప్పుకొచ్చాడు.ఇక షమీ తన కెరీర్లోనే అత్యున్నత ప్రదర్శన 2023 వన్డే వరల్డ్కప్లో నమోదు చేశాడు. ఆ టోర్నీలో 24 వికెట్లు తీసిన షమీ వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఏ ఎడిషన్కైనా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులకెక్కాడు. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో టీమిండియా రన్నరప్కే పరిమితమైంది. -
‘జడ్డూతో జాగ్రత్త.. లంక బ్యాటర్లకు ఇదే నా హెచ్చరిక!’
జింబాబ్వేతో సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి ఇరుజట్ల మధ్య గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్లో టీమిండియాకు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక ఆయుధంగా మారనున్నాడని మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా జోస్యం చెప్పాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్లో జడేజా గతంలో పరుగులు కట్టడి చేయడంపైనే దృష్టి సారించేవాడని, కానీ కొన్నాళ్లుగా అతడు వికెట్ల కోసమే బంతులు వేస్తున్నట్లుగా అనిపిస్తోందని తెలిపాడు. జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా మాట్లాడాడు. 'కెరీర్ ఆరంభంలో జడేజా తన బౌలింగ్లో పరుగులు ఎక్కువగా రాకూడదనే మైండ్సెట్తో ఉండేవాడు. రెడ్బాల్ క్రికెట్లో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. అయితే వికెట్ కొద్దిగా సహకరించినా, అతడు వికెట్లు తీయడానికి ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం జడేజా పూర్తిగా మారిపోయాడు. తనకున్న బలాబలాలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతడు వికెట్లు తీయడంలో నేర్పరి. ఇక జడ్డూ ప్రతి గేమ్లోనూ బంతిని స్టంప్ లైన్లో వేసి ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో అతడి ఆలోచన కాస్త రక్షణాత్మక ధోరణిలో ఉండేది. కానీ ఇప్పుడు వికెట్ తీయాలనే ఉద్దేశంతోనే బంతులను విసురుతున్నాడు' అని పుజారా చెప్పుకొచ్చాడు.ఇక జడేజా ఆరు నెలల తర్వాత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. గతేడాది నవంబర్లో గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్లో జడేజా ఆరు వికెట్లు పడగొట్టడంతో పాటు అర్ధసెంచరీ సాధించాడు. ఇక 37 ఏళ్ల జడేజాకు శ్రీలంకపై అద్భుతమైన రికార్డు ఉంది. గతంలో లంకతో ఆడిన ఏడు టెస్టుల్లో జడేజా 65 సగటుతో 326 పరుగులు చేశాడు. లంకపైనే అతడి కెరీర్ బెస్ట్ (175 నాటౌట్) స్కోరు నమోదు చేశాడు. ఇక బౌలింగ్లో 24 సగటుతో 33 వికెట్లు తీశాడు. ఇక లంక గడ్డపై గతంలో ఆడిన రెండు టెస్టులు కలిపి మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్గా జడేజా 85 టెస్టుల్లో 348 వికెట్లు తీశాడు. ఇందులో 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలున్నాయి. బ్యాటింగ్లో 4,095 పరుగులు సాధించిన జడేజా ఖతాలో ఆరు సెంచరీలు, 28 అర్ధసెంచరీలున్నాయి.Read: ‘రొనాల్డోనే స్ఫూర్తి.. నా తండ్రి కూడా అలానే మరణించాడు’ -
ధోని కనుసన్నల్లో ట్రైనింగ్.. లంకను కుమ్మేస్తాడా?
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్లో తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు వికెట్కీపర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలోనే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కనుసన్నల్లో రాంచీలో ప్రత్యేక పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈ సిరీస్ పంత్కు చాలా కీలకమని చెప్పొచ్చు. ఒక ఎండ్లో ధ్రువ్ జురెల్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వేళ లంక పర్యటనలో పంత్ రాణించాల్సిన అసవరముంది. అంతేకాదు మిడిలార్డర్లో బ్యాటింగ్లో పంత్ కీలకం కానున్నాడు. స్పిన్నర్లకు బాగా అనుకూలించే లంక పిచ్లపై రాణించాలని పంత్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోని సూచనలు తీసుకునేందుకు పంత్ రాంచీ వెళ్లాడు. తాజాగా ధోని సలహాలు, సూచనలు తీసుకుంటున్న ఫొటోలను పంత్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో ధోని, పంత్తో పాటు మాజీ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ కూడా ఉన్నాడు. ట్రెయినింగ్లో భాగంగా స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలి, వికెట్కీపింగ్ కండిషన్లు ఎలా ఉంటాయన్న దానిపై పంత్ ధోని నుంచి సలహాలు తీసుకున్నాడు. ఇక ధోని స్పిన్ బౌలింగ్ను అర్థం చేసుకోవడంలో మంచి నేర్పరి. ఇన్నేళ్ల తన అనుభవంలో ఉపఖండపు పిచ్లపై వికెట్ కీపింగ్ కండిషన్ను కూడా అంచనా వేయడంలో ధోని దిట్ట. మరి లంక పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ధోని ఇచ్చిన సలహాలతో పంత్ చెలరేగుతాడేమో చూడాలి. ఇటీవలే వైట్బాల్ క్రికెట్లోనూ తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న పంత్ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను కలిసి సలహాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక గడ్డపై టీమిండియా రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి 19 వరకు, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనున్నాయి.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్) కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, అకీబ్ నబీ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్. MS Dhoni sharing his experience with Rishabh Pant.💛 pic.twitter.com/uuvEOKfgT7— Cricket Central (@CricketCentrl) July 31, 2026Rishabh Pant taking a ride in Ranchi with Thala 🤩#Cricket #Dhoni pic.twitter.com/YtbFlCawol— CREX (@Crex_live) August 2, 2026 -
ఆసీస్, ఇంగ్లండ్ వల్ల కాలేదు.. చరిత్ర సృష్టించిన బీసీసీఐ!
భారత ఆటగాడు అజింక్య రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ పొందిన ఆటగాళ్లకు బీసీసీఐ పెన్షన్ అందిస్తుంది. రహానే సీనియర్ టెస్టు క్రికెటర్ కావడంతో, అతడు నెలకు పెన్షన్ కింద రూ. 70వేలు అందుకోనున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే క్రికెట్ చరిత్రలో బీసీసీఐ (భారత్), ఈసీబీ (ఇంగ్లండ్), క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ సంపన్న బోర్డులుగా గుర్తింపు పొందాయి. కానీ ఈ మూడు బోర్డుల్లో బీసీసీఐ మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లకు గౌరవ వేతనం కింద పెన్షన్ అందిస్తుండడం విశేషం.అటు ఆస్ట్రేలియా కానీ.. ఇటు ఇంగ్లండ్ కానీ తమ మాజీ ఆటగాళ్లకు ఎలాంటి పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదు. దీంతో క్రికెట్ చరిత్రలోనే మాజీ ఆటగాళ్లకు పెన్షన్ కల్పిస్తున్న ఏకైక బోర్డుగా బీసీసీఐ చరిత్ర సృష్టించింది. బీసీసీఐ అందిస్తున్న పెన్షన్ విధానాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం.బీసీసీఐ కల్పిస్తున్న పెన్షన్ వివరాలు👉మాజీ క్రికెటర్లు: నెలకు రూ. 58,750👉టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 60 వేలు👉సీనియర్ టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 70 వేలు👉ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు: నెలకు రూ. 30 వేల నుంచి 45వేలు👉అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 52,500👉దేశవాళీ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 45వేలుఇక దేశవాళీ క్రికెట్లో రాష్ట్రాల వారీగా చూసుకుంటే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తమ రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ ఆడిన 150 మంది మాజీ క్రికెటర్లకు పెన్షన్తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదర్శంగా నిలిచింది. మిగతా రాష్ట్రాల బోర్డులు కూడా తమ మాజీ క్రికెటర్లకు తమకు తోచినంత పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. 🔴 NO AUSTRALIA, NO ENGLAND- ONLY BCCI PAYS CRICKETERS AFTER RETIREMENT 🤯- Cricket Australia: No pension system- England Cricket: No pension systemBCCI: Pays an avg pension of ₹58,750/month to former cricketers.Current BCCI pension structure:- Test cricketers:… pic.twitter.com/HM0Y3aBMqr— Sam (@cricsam02) August 3, 2026Read: ప్రేమకు ఎండ్కార్డ్.. గర్ల్ఫ్రెండ్తో రొనాల్డో పెళ్లి ఎప్పుడంటే? -
భారత సంతతి క్రికెటర్పై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం!
భారత సంతతికి చెందిన అమెరికా క్రికెటర్ బొదుగుమ్ అఖిలేశ్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 8 ఏళ్లు నిషేధం విధించింది. అబుదాబి టీ20 లీగ్లో అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు గతేడాది నవంబర్లో అతడిపై అభియోగాలు వచ్చాయి. ఆరోపణలు నిజమని తేలడంతో అప్పట్లో ఐసీసీ అఖిలేష్పై తాత్కాలిక నిషేధం విధించింది. తాజాగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.1.1, ఆర్టికల్ 2.1.4, ఆర్టికల్ 2.4.7కు చెందిన మూడు నిబంధనలను అఖిలేష్ ఉల్లంఘించినట్లు తేలడంతో ఐసీసీ అతడిని దోషిగా నిర్ధారించింది. అతడిపై విధించిన 8 ఏళ్ల నిషేధం నవంబర్ 21, 2025 నుంచే అమల్లోకి వచ్చిందని ఐసీసీ తెలిపింది. 8 ఏళ్ల తర్వాత అంటే 2033లో అఖిలేష్ మళ్లీ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఉంటుంది. అప్పటికీ అతడి వయసు 33 ఏళ్లు నిండుతాయి కాబట్టి అతడి కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లే. యూఎస్ఏ తరఫున క్రికెట్ ఆడిన అఖిలేష్ రెడ్డి 2000లో అమెరికాలోనే జన్మించాడు. అమెరికాలో జన్మించినప్పటికీ క్రికెట్లో పేరు వచ్చింది మాత్రం హైదరాబాద్కు ఆడడం ద్వారానే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తరఫున దేశవాళీ డొమొస్టిక్ టోర్నీల్లో ఆడిన అఖిలేష్ అబుదాబి టీ10 లీగ్లో యూపీ నవాబ్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ ఫ్రాంచైజీకి ఆడుతున్న సమయంలో అతడిపై అవినీతి నిరోధక నియమాల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.అఖిలేష్ ఉల్లంఘించిన నిబంధనలివే..👉ఆర్టికల్ 2.1.1-అబుదాబి టీ10 లీగ్ 2025లో మ్యాచ్ల ఫలితం, పురోగతి, నిర్వహణ లేదా ఇతర అంశాన్ని నిర్ధారించడానికి, కుట్ర పన్నడానికి లేదా ఇతరత్రా అనుచితంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, లేదా ఏ విధంగానైనా నిర్ధారించడానికి లేదా కుట్ర పన్నడానికి లేదా ఇతరత్రా అనుచితంగా ప్రభావితం చేయడానికి చేసే ఒప్పందంలో కుట్రదారుడిగా తేలడం.👉ఆర్టికల్ 2.1.4- అబుదాబి టీ10 లీగ్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లలో ఆర్టికల్ 2.1.1ను ఉల్లంఘించాలని వేరే వాళ్లను ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించడం, ప్రలోభాలకు గురి చేయడం, ప్రోత్సహించడం లేదా ఉద్దేశపూర్వకంగా సులభతరం చేయడానికి ప్రయత్నించడం.👉ఆర్టికల్ 2.4.7-విచారణలో భాగంగా దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా తన వద్ద ఉన్న డేటా, సమాచారాన్ని దొరక్కుండా చేయడం లేదా తొలగించడం.👉ఇక బొదుగుమ్ అఖిలేష్ రెడ్డి అమెరికా తరఫున నాలుగు టీ20 మ్యాచ్లు ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్లు కలిపి అఖిలేష్ ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఇక మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో తొలి రెండు ఎడిషన్లలో వాషింగ్టన్ ఫ్రీడమ్కు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఒక్కసారి కూడా జట్టులో ఆడే అవకాశం లభించలేదు.Read: సొంత జట్టుతో గొడవ.. పంజాబ్ ఆల్రౌండర్ కీలక నిర్ణయం! -
16 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. ఎవరీ నీల్ పటేల్?
ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్లో వచ్చే నెలలో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 16 మందితో కూడిన జట్టులో భారత సంతతి టీనేజర్ అయిన నీల్ పటేల్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. అతడి తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్ కావడంతో నీల్ పటేల్ వచ్చే నెలలో పేరేంట్స్ పుట్టిన గడ్డపై మ్యాచ్లు ఆడేందుకు వస్తుండడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నీల్ పటేల్ ఎవరు? ఆస్ట్రేలియా తరఫున అతడు క్రికెటర్గా ఎలా ఎదిగాడన్నది ఆసక్తిగా మారింది.సిడ్నీకి చెందిన నీల్ పటేల్ న్యూసౌత్ వేల్స్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. న్యూసౌత్ వేల్స్ తరఫున ఓపెనర్ బ్యాటర్గా జూనియర్ లెవెల్ కెరీర్ను ప్రారంభించాడు. సిడ్నీ ప్రీమియర్ క్రికెట్ ఫస్ట్ గ్రేడ్లో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగా (16 ఏళ్లు) నీల్ పటేల్ ప్రపంచ రికార్డు అందుకున్నాడు. బ్యాట్తోనే గాక తన ఆఫ్ స్పిన్తోనూ ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడంలో నీల్ పటేల్ సమర్థుడు. నీల్ పటేల్ అండర్-19 జట్టుకు ఎంపిక కావడం వెనుక అతడి కఠోర శ్రమ దాగుంది. అడిలైడ్ వేదికగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 వరకు సాగిన అండర్-19 టాలెంట్ క్యాంప్కు ఎంపికైన నీల్ పటేల్ తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా బృందం కళ్లలో పడిన నీల్ పటేల్ ఇవాళ మల్టీ ఫార్మాట్ సిరీస్కు ఎంపికయ్యాడు. అంతేకాదు బాక్ ఫుట్ ప్లే షాట్స్ను కచ్చితంగా ఆడే నైపుణ్యం సాధించాడు.ఇక నీల్ పటేల్ కంటే ముందు జాసన్ సంఘా భారత్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడిన తొలి భారత సంతతి క్రికెటర్గా ఉన్నాడు. ఇక ప్రస్తుతం అండర్-19 చాంపియన్షిప్ ట్యాగ్ భారత్ వద్దే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ను 100 పరుగులతో ఓడించిన భారత అండర్-19 జట్టు టైటిల్ను ఎగరేసుకుపోయింది.సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జరగనున్న ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మూడు యూత్ వన్డేలతో పాటు రెండు యూత్ టెస్టులు (నాలుగు రోజులు) ఆడనుంది. మ్యాచ్లన్నీ రాజ్కోట్, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. Read: భారత్లో మల్టీ ఫార్మాట్ సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన -
భారత్లో మల్టీ ఫార్మాట్ సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన
ఆస్ట్రేలియా సీనియర్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ టూర్ వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, తాజాగా వచ్చే నెలలో భారత్లో జరగనున్న అండర్-19 మల్టీ ఫార్మాట్ సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా 16 మందితో కూడిన అండర్-19 జట్టును ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జరగనున్న ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మూడు యూత్ వన్డేలతో పాటు రెండు యూత్ టెస్టులు (నాలుగు రోజులు) ఆడనుంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం 16 మందితో జట్టును ప్రకటించింది. కేసీ బార్టన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, విల్ బైరోమ్ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. 16 మందిలో కేసీ బార్టన్, విల్ బైరోమ్ మాత్రమే జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్లో ఆడారు. ఇక ఇదే జట్టులో భారత సంతతి కుర్రాడు, గుజరాత్కు చెందిన నీల్ పటేల్ చోటు దక్కించుకున్నాడు.ఇక జట్టులో క్వీన్స్లాండ్ నుంచి ఐదుగురు ఆటగాళ్లు ఉండగా, విక్టోరియా, న్యూ సౌత్వేల్స్ నుంచి ముగ్గురేసి, తస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి మిగిలిన ఆటగాళ్లు ఉన్నారు. ఇక మ్యాచ్లన్నీ రాజ్కోట్, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.భారత్లో ఆసీస్ సిరీస్ షెడ్యూల్👉తొలి యూత్ వన్డే – శుక్రవారం, సెప్టెంబర్ 18👉రెండో యూత్ వన్డే – సోమవారం, సెప్టెంబర్ 21👉మూడో యూత్ వన్డే – బుధవారం, సెప్టెంబర్ 23👉మొదటి యూత్ టెస్ట్ – ఆదివారం, సెప్టెంబర్ 27-30 వరకు👉రెండో యూత్ టెస్ట్ – సోమవారం, అక్టోబర్ 5-8 వరకుభారత్లో సిరీస్ నిర్వహణ ఎందుకంటే?ఇండియా అండర్-19 జట్టుతో మల్టీ ఫార్మాట్లో సిరీస్ నిర్వహణ ఎందుకు అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ అధికారిణి సొన్యా థాంప్సన్ వివరణ ఇచ్చారు. "మా పాత్వేస్ ప్రోగ్రామ్లో భాగంగా ఆస్ట్రేలియాలోని కొంతమంది అత్యుత్తమ యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలను కల్పించి వారిని ప్రోత్సహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కఠిన పరిస్థితుల్లో భారత్ను ఎదుర్కోవడం ఆటగాళ్లకు సాంకేతికంగా, మానసికంగా ఎదగడానికి సహాయపడుతుంది. భారత్లో పర్యటించడం, సవాలుతో కూడిన పరిస్థితుల్లో అత్యున్నత స్థాయి ప్రత్యర్థులతో తలపడడం ద్వారా అనుభవంతో కూడిన పాఠాలు నేర్చుకుంటారు. ఇది అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లను సాంకేతికంగా, మానసికంగా పరీక్షిస్తుంది," అని థాంప్సన్ తెలిపారు. మరోవైపు ఆసీస్తో మల్టీ ఫార్మాట్ సిరీస్కు భారత అండర్-19 జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.ఆస్ట్రేలియా అండర్-19 జట్టు:కేసీ బార్టన్ (కెప్టెన్), హేడెన్ బార్బులోవిక్, ఎలీ బ్రెయిన్, విల్ బైరోమ్ (వైస్ కెప్టెన్), బ్లేక్ క్యాటిల్, జాక్ జోస్నెక్, స్పెన్సర్ గ్రీన్, కానర్ గ్రెగొరీ, చార్లీ హెండర్సన్, జెడ్ హోలిక్, మాథ్యూ లాఫ్, నీల్ పటేల్, జాకబ్ పీట్జ్, పాట్రిక్ సుల్లివన్, థియో సింగోస్, థామస్ వాసియో.Introducing our Australian Men's Under 19 squad to tour India next month 👋 pic.twitter.com/1z8Vf6erj7— Cricket Australia (@CricketAus) August 2, 2026చదవండి: విండీస్కు ఆపద్బాంధవుడిలా.. మొన్న బంతితో, ఇవాళ బ్యాట్తో! -
విండీస్కు ఆపద్బాంధవుడిలా.. మొన్న బంతితో, ఇవాళ బ్యాట్తో!
ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. అయితే ఈసారి బౌలర్గా కాకుండా బ్యాటర్గా తన విలువను ప్రదర్శించాడు. పాక్తో జరిగిన తొలి టెస్టులో వరుస ఐదు ఓవర్లలో ఐదు మెయిడెన్ వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన జస్టిన్ గ్రీవ్స్ ఈసారి బ్యాట్తో (125 బంతుల్లో 64 నాటౌట్) రాణించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. గ్రీవ్స్తో పాటు కెప్టెన్ రోస్టన్ చేజ్ (36 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నాడు. అంతకముందు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (46) అర్ధశతకం మిస్ చేసుకోగా, అమిర్ జాంగో (26), షెయ్ హోప్ (29) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 2 వికెట్లు తీయగా, ఉబైద్ షా, అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు. ఇదే స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇక తొలి వికెట్కు బ్రాండన్ కింగ్, టగ్ నరైన్ చంద్రపాల్ (15) 49 పరుగులు జోడించిన తర్వాత విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో పెద్దగా ఎవరు ఆకట్టుకోలేదు. 120 పరుగుల వద్ద వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోవడంతో జస్టిన్ గ్రీవ్స్ క్రీజులోకి వచ్చాడు. క్రీజులోకి వచ్చిందే మొదలు తనలోని క్లాస్ బ్యాటర్ను బయటికి తీసిన గ్రీవ్స్ నింపాదిగా ఆడాడు. వీలైనప్పుడల్లా బంతులను బౌండరీలను తరలించాడు. షెయ్ హోప్ ఔటైన తర్వాత మరింత బాధ్యతగా ఆడిన గ్రీవ్స్ టెస్టుల్లో మూడో అర్థసెంచరీని సాధించాడు. చేజ్తో కలిసి ఆరో వికెట్కు గ్రీవ్స్ అజేయంగా 66 పరుగులు జోడించడంతో విండీస్ మళ్లీ ట్రాక్లో పడింది. రెండో రోజు ఆటలో ఈ ఇద్దరు ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారనే దానిపై విండీస్ స్కోరు ఆధారపడి ఉంది. Justin Greaves Is A Classy Batter. Very Fluent Batter. His Drives Are Awesome pic.twitter.com/QfKDf5rWT0— Aryan Goel 2.0 (@AryanGoelNew) August 2, 2026Read: తీవ్ర అసంతృప్తిలో గిల్, గంభీర్.. వాళ్లపై బీసీసీఐ వేటు! -
హండ్రెడ్ టోర్నీలో స్మృతి మంధాన విధ్వంసం!
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన ప్రదర్శనతో అదరగొట్టింది. హండ్రెడ్ టోర్నీలో మంధాన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ వుమెన్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆదివారం లండన్ వేదికగా ఎంఐ లండన్ వుమెన్స్తో జరిగిన మ్యాచ్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 34 ; 4 ఫోర్లు, ఒక సిక్సర్) దనాధన్ ఇన్నింగ్స్తో అలరించింది. మరో ఓపెనర్ అయిన కెప్టెన్ మెగ్ లానింగ్ (31 బంతుల్లో 43) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో ఎంఐ లండన్ విధించిన 93 పరుగుల టార్గెట్ను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ వుమెన్స్ జట్టు 99 బంతుల్లో 92 పరుగులకు ఆలౌటైంది. కిరా ఛత్లీ (18), నికోలా కేరీ (17), చిన్నెల్లె హెన్రీ (16) పర్వాలేదనిపించారు. మాంచెస్టర్ బౌలర్లలో రియానా మెక్డొనాల్డ్ మూడు వికెట్లు తీయగా, మైట్లన్ బ్రౌన్, సోఫి ఎసెల్స్టోన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మాంచెస్టర్ సూపర్జెయింట్స్కు ఇది మూడో విజయం కాగా.. ఎంఐ లండన్ వుమెన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో సీజన్లో ఇప్పటివరకు ఖాతా తెరవని జట్టుగా ఎంఐ లండన్ వుమెన్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. Smriti Mandhana continuing her form and playing some spectacular shots pic.twitter.com/x19qUEPpXq— Nalin Kumar Awasthi (@cricnalin) August 2, 2026Read: యువరాజ్ సింగ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు! -
‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’
భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తాజాగా భువనేశ్వర్ కుమార్తో పాటు మహమ్మద్ షమీ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. అయితే ఇందులో అందరూ యంగ్ బౌలర్లే ఉంటారని అగార్కర్ పేర్కొన్నాడు. 30 సంవత్సరాలు దాటిన బౌలర్లను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని బాంబు పేల్చాడు.'షమీ టీమిండియా అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో షమీ ఛాంపియన్. కానీ భవిష్యత్తు కోసం మేము యువ పేస్ బౌలింగ్ దళానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. భారత క్రికెట్కు అతని సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మేము అతడిని గౌరవిస్తున్నాము.’ అని చెప్పుకొచ్చాడు. అగార్కర్ వ్యాఖ్యల ను బట్టి చూస్తే మాత్రం షమీ రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందంటూ పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది.ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన బలంగా నిలిచిన షమీ.. ఇప్పుడు సెలెక్టర్ల దీర్ఘకాలిక ప్రణాళికల్లో చోటు దక్కించు కోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా భారత జట్టు తరఫున వన్డే ఆడగా, అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో చివరిసారి కనిపించాడు. షమీతో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఎదురుచూస్తున్నారు. దీనికి తగినట్లుగానే గత రెండేళ్లుగా వీళ్లిద్దరి గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దేశవాళీ, రంజీలు అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను పట్టించుకోవడం లేదు. అవకాశాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా హెడ్కోచ్గా గంభీర్, సెలెక్టర్గా అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత వీళ్ల అడ్రస్ గల్లంతయ్యింది.🚨 Ajit Agarkar breaks silence on Mohammed Shami .🚨🔹We've picked our group of 15 fast bowlers for the future and want to give young players more opportunities ahead of the World Test Championship and the 2027 ODI World Cup.Shami has been one of India's finest match-winners… pic.twitter.com/p0mEPybruS— Indian cricket (@Cricketpaglu45) August 1, 2026చదవండి: హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర విమర్శలు! -
గుండుతో దర్శనం.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ వైరల్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్తో దర్శనమిచ్చాడు. తన గర్ల్ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకున్న పాండ్యా క్లీన్ హెడ్షేవ్ (గుండు)తో కనిపించాడు. దీంతో పాండ్యా కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తిరుమల పర్యటనలో హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మొక్కుబడి తీర్చుకునే భాగంగానే తలనీలాలు సమర్పించారా.? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనేది తెలియాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయానికి గురైన పాండ్యా స్వదేశంలో అప్గానిస్తాన్తో సిరీస్తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)లో పాండ్యా రీహాబిలిటేషన్లో గడుపుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవడంపై బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే పరిమితంగానే పాండ్యా సేవలు ఉపయోగించుకోవాలని చూస్తోంది. మరోవైపు పాండ్యా కూడా 2027 వన్డే ప్రపంచకప్ వరకు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. 2024 సీజన్కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించినప్పటికీ.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాండ్యా కెప్టెన్గా వచ్చిన తర్వాత కూడా ముంబై గత మూడు సీజన్లలో నిరాశాజనక ఫలితాలే అందుకుంది. దీంతో పాండ్యాను ముంబై ఇండియన్స్ వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు పాండ్యా వేరే జట్టులో దర్శనమిచ్చే అవకాశముంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ స్టార్ ఆల్రౌండర్ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ట్రేడ్ లేదా ఒప్పందం ఖరారు కాలేదు. మొత్తంగా 2027 సీజన్లో హార్దిక్ ఏ జట్టు జెర్సీలో కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.Indian cricketer Hardik Pandya visited the Sri Venkateswara Swamy Temple in Tirumala today with Mahika Sharma.Hardik offered his hair as part of a religious vow and was seen in a new bald look. The two also took part in the early morning Suprabhatha Seva. 🙏 pic.twitter.com/mdkQlecKLv— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) August 2, 2026 Hardik Pandya with Mahieka at the Tirumala Temple. pic.twitter.com/3FjJ33ltw8— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2026Read: అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు -
అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఇదిలా ఉంటే, అభిషేక్ ఇటీవలికాలంలో టీమిండియా తరఫున వరుసగా విఫలమయ్యాడు. గత ఏడు టీ20 మ్యాచ్ల్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. చివరిగా ఇంగ్లండ్ పర్యటనలో తొలి మ్యాచ్లో అర్ద సెంచరీ చేశాడు. దానికి ముందు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. అతడు చివరి సారిగా మూడంకెల స్కోర్ చేసింది ఐపీఎల్ 2026లో. డీసీతో జరిగిన మ్యాచ్లో అతడు 68 బంతుల్లో అజేయమైన 135 పరుగులు చేశాడు.తాజాగా జింబాబ్వేతో ముగిసిన 3 మ్యాచ్ల సిరీస్లో అభిషేక్ ఫామ్ ఘోరంగా పడిపోయింది. ఆ మూడు మ్యాచ్ల్లో అతడు వరుసగా 1, 8, 2 స్కోర్లు చేశాడు. ఈ సిరీస్లో అభిషేక్ కనీసం రెండంకెల స్కోర్ను కూడా చేయలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టు ఖాళీగా ఉండటంతో స్థానిక వన్డే మ్యాచ్ ఆడిన అభిషేక్ ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు.త్వరలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుండగా, ఆ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో అభిషేక్కు చోటు దక్కలేదు. అభిషేక్కు గతకొంతకాలంగా టీ20ల్లో మాత్రమే అవకాశం వస్తుంది. తాజా ప్రదర్శనతో అతడు వన్డే జట్టులో స్థానంపై కూడా కన్నేయవచ్చు. టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నిమిత్తం ఆగస్ట్ 4న శ్రీలంక పర్యటనకు బయల్దేరనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15న ప్రారంభం కానుంది. దీనికి ముందు భారత జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. -
అసలెప్పుడు విడిపోయారు.. కలిసిపోవడానికి?
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా.. టీమిండియా క్రికెటర్లయిన పాండ్యా బ్రదర్స్కు సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అన్నదమ్ముల్లో తమ్ముడైన హార్దిక్ టీమిండియాలో ఒక వెలుగు వెలుగుతున్నాడు. తమ్ముడంత కాకపోయినా కృనాల్ కూడా ఐపీఎల్ ద్వారా బాగానే గుర్తింపు పొందాడు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. అటు పాండ్యా కూడా ఈ రికార్డులో ముందువరుసలో ఉన్నాడు. మరి ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. తాజాగా హార్దిక్, కృనాల్లు కలిసిపోయారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ముంబై ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ బయటకి వస్తున్న ఫొటోలో సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. అయితే రియాల్టీలో ఇది పాత వీడియో అని, ఇప్పుడు కూడా హర్దిక్, కృనాల్ పాండ్యాలు మాట్లాడుకోవడం లేదని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై కొంతమంది ఫ్యాన్స్ మాత్రం 'అసలెప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలవడానికి’ అని కామెంట్ పెట్టారు.ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హార్దిక్ ఔటైనప్పుడు కృనాల్ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి తోడు, ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత హార్దిక్ తన సోదరుడిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది.ఈ ఊహాగానాలపై కృనాల్ స్పందిస్తూ, "మేమిద్దరం కలిసే క్రికెట్ ఆడాం. ఆటలోని వ్యూహాలు, టెక్నిక్ గురించి ఎప్పుడూ చర్చించుకుంటాం. మా మధ్య ఆరోగ్యకరమైన చర్చే ఉంటుంది. ఒకే క్రీడలో ఇద్దరు సోదరులు ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తారు. దేవుడి దయవల్ల పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉండటం చిన్న విషయం కాదు" అని వివరించాడు. హార్దిక్ 5, తాను 5 ఐపీఎల్ టైటిళ్లు గెలిచామని తెలిపాడు.ఇక టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తొడ కండరాల గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెక్స్ (సీవోఈ)లో రీహాబిలిటేషన్లో ఉన్న పాండ్యా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. 2027 వన్డే వరల్డ్కప్ దృష్టిలో పెట్టుకొని పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.It's hard to understand what changed between Hardik Pandya and Krunal Pandya. There was a time when the Pandya brothers were always seen together. But for the last two years, they haven't been seen together, and they don't talk to each other anymore. pic.twitter.com/Q71CCwo6HU— Sonu (@Cricket_live247) August 1, 2026Read: రేపే భారత్, పాక్ మ్యాచ్.. ఫెవరెట్గా గబ్బర్ సేన! -
రేపే భారత్, పాక్ మ్యాచ్.. ఫెవరెట్గా గబ్బర్ సేన!
మ్యాచ్ ఏదైనా భారత్, పాకిస్తాన్ మధ్య పోరు అంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడంటే ఎక్కువగా వన్సైడ్ ఫలితాలు వస్తున్నాయి కానీ దశాబ్దం కిందట టీమిండియా, పాకిస్తాన్లు తలపడుతున్నాయంటే ఎంతో థ్రిల్లింగ్ ఉండేది. ఆఖరి దాకా నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్లు సాగేవి. తాజాగా భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అదేంటి.. ఇప్పుడు ఎలాంటి ఐసీసీ మేజర్ టోర్నీలు జరగడం లేదు కదా? చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అంటారేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం (ఆగస్టు 2) భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఇండియన్ రాయల్స్, పాకిస్థాన్ పాంథర్స్ జట్ల మధ్య జరిగే ఈ ఆరో మ్యాచ్ జాంబియాలోని లుసాకా నగరంలో ఉన్న లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ హై-వోల్టేజ్ పోరు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియన్ రాయల్స్ జట్టును మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ నడిపించనుండగా.. దినేష్ కార్తీక్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, అంబటి రాయుడు, రిషి ధావన్, స్టువర్ట్ బిన్ని వంటి స్టార్ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. ఇక తమ తొలి మ్యాచ్లో గబ్బర్ సేన బంగ్లాదేశ్ టైగర్స్ జట్టును 19 పరుగుల తేడాతో ఓడించి మంచి ఫామ్లో ఉంది. మరోవైపు.. మహమ్మద్ హఫీజ్ సారథ్యంలో ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్, వహాబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, సయీద్ అజ్మల్ వంటి వెటరన్ ఆటగాళ్లతో కూడిన పాకిస్థాన్ పాంథర్స్ జట్టు తమ మొదటి మ్యాచ్లో ఏషియన్ స్టార్స్ చేతిలో 85 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. దీంతో మ్యాచ్లో భారత జట్టు ఫెవరెట్గా కనిపిస్తోంది. ఆసియా ఖండానికి చెందిన రిటైర్డ్ దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న ఎషియన్ లెజెండ్స్ లీగ్ సీజన్-2 జూలై 30న ప్రారంభమై ఆగస్టు 10న ముగియనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 19 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. గతేడాది జరిగిన తొలి సీజన్లో భారత్ ఫైనల్ చేరుకుని రన్నరప్ నిలిచింది. మొత్తంగా మ్యాచ్లు లేక జుట్టు పీక్కుంటున్న క్రికెట్ అభిమానులకు భారత్, పాక్ పోరు ఫుల్ మీల్స్ అందించనుంది.Read: మేరీ కోమ్ స్ఫూర్తి.. కామన్వెల్త్లో పాకిస్తాన్కు తొలి పతకం -
సెంట్రల్ జోన్ కెప్టెన్గా పటీదార్.. అందరి కళ్లు అతడిపైనే!
దులీప్ ట్రోఫీ 2026కు సంబంధించి సెంట్రల్ జోన్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రజత్ పటీదార్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, ఫినిషర్ రింకూ సింగ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు మోయనున్నాడు. 15 మందితో పాటు అమన్దీప్ ఖరె, మయాంక్ మిశ్రా, సౌరబ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయలు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఆగస్టు 23న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఐదు టెస్టులు జరగనున్నాయి. సెంట్రల్ జోన్తో పాటు నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్తో పాటు సౌత్జోన్ ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది. అయితే ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ సారాంశ్ జైన్ కూడా సెంట్రల్ జోన్లో చోటు లభించింది. సారాంశ్తో పాటు ఎస్ఆర్హెచ్ బౌలర్లు జీషన్ అన్సారి, హర్ష్ దూబేలకు కూడా జట్టులో చోటు లభించింది.గతేడాది జరిగిన దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆయేడు ఫైనల్లో సౌత్జోన్ను మట్టికరిపించిన సెంట్రల్ జోన్ను పటీదార్ దశాబ్ద కాలంలో తొలిసారి చాంపియన్గా నిలిపాడు. అంతేకాదు ఆ సీజన్లో 382 పరుగులు చేసిన పటీదార్ ఖాతాలో ఒక సెంచరీ ఉంది. ఈసారి చాంపియన్ హోదాలో సెంట్రల్ జోన్ నేరుగా సెమీఫైనల్ ఆడనుంది. ఆగస్టు 23 నుంచి 26 మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్స్లో ఈస్ట్ జోన్తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్తో వెస్ట్జోన్ తలపడనున్నాయి. ఈ రెండింటిలో గెలిచిన జట్లు సెమీస్లో చాంపియన్ సెంట్రల్ జోన్తో పాటు రన్నరప్ సౌత్జోన్తో ఆడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది.సెంట్రల్ జోన్ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), రింకు సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, అమన్ మొఖాడే, కునాల్ చండేలా, జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్ (వికెట్ కీపర్), యాష్ ఠాకూర్, నాచికేత్ భూటెస్టాండ్ బై ప్లేయర్స్: అమన్దీప్ ఖరే, మయాంక్ మిశ్రా, సౌరభ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయ.సపోర్ట్ స్టాఫ్: నిఖిల్ డోరు - హెడ్ కోచ్, దేశ్రాజ్ చౌహాన్ - ఫిజియో, చంద్రశేఖర్ రావు - వీడియో అసిస్టెంట్, మోహిత్ కుమార్ - మసీర్, మనీష్ ఝా - అసిస్ట్ కోచ్, మయాంక్ అగర్వాల్ - ట్రైనర్, జుఫ్రీ జకేరియా - మేనేజర్.చదవండి: నీరజ్కు చెక్.. ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ చాంపియన్ దాకా -
భారత్-శ్రీలంక సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్స్
టీమిండియా శ్రీలంక పర్యటనకు సంబంధించి ఓ అప్డేట్ అందుతోంది. ఈ పర్యటనలో భారత్ ముందుగా ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్, ఆతర్వాత రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. వార్మప్ మ్యాచ్ వ్యవధిని నాలుగు నుంచి మూడు రోజులకు తగ్గించారు. అప్డేట్ తర్వాత వార్మప్ మ్యాచ్ ఆగస్టు 7న ప్రారంభమై, ఆగస్టు 9న ముగియనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని NCC గ్రౌండ్లో జరుగనుంది. వార్మప్ మ్యాచ్ను ఒక రోజుకు కుదించడానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ మ్యాచ్కు సంబంధించి మరో కీలక విషయం ఏంటంటే, ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా, శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆగస్టు 4న కొలంబోకు బయలుదేరనుంది. మూడు రోజుల వార్మప్ మ్యాచ్ అనంతరం గాలేకు వెళ్లనుంది.తొలి టెస్టు ఆగస్టు 15న గాలేలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని SSC మైదానంలో జరగనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా జరుగనుంది.గుడ్ న్యూస్లంక సిరీస్కు ఫిట్నెస్ ఆధారంగా జట్టులోకి ఎంపికైన సాయి సుదర్శన్ కోలుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. బొటనవేలికి స్వల్ప గాయం కారణంగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్న అతను ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.అదేవిధంగా మోకాలి సమస్య కారణంగా షరతులతో ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా కూడా పూర్తి ఫిట్నెస్ సాధించే దిశగా ఉన్నట్లు సమాచారం. సిరీస్ ప్రారంభానికి ముందే ఇద్దరూ అందుబాటులోకి వస్తారని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. -
కొత్త లుక్లో రోహిత్ శర్మ.. వయసులో పదేళ్లు వెనక్కి!
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ కొత్త లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. శుక్రవారం భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రితో కలిసి దిగిన ఫొటోలో రోహిత్ శర్మ క్లీన్ షేవ్తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. దీంతో వయసులో రోహిత్ శర్మ ఒక పదేళ్లు వెనక్కి మళ్లినట్లుగా అనిపించింది. ఇక రవిశాస్త్రి కూడా రోహిత్ కొత్త లుక్పై ఆసక్తికర పోస్టును పెట్టాడు. రోహిత్ను ఇలా చూస్తుంటే చాలా రిలాక్స్గా అనిపిస్తోంది అని కామెంట్ చేశాడు.ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్తో జరిగిన చివరి వన్డేలో 39 ఏళ్ల రోహిత్ 110 బంతుల్లో 138 పరుగులతో రాణించాడు. అయితే ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సమయంలోనే అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వచ్చాయి. రోహిత్ శర్మ తనపై వచ్చిన వార్తలను కొట్టిపారేయగా, బీసీసీఐ కూడా 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉంటాడని కుండబద్దలు కొట్టడంతో రిటైర్మెంట్ వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఇక కోహ్లితో పాటు రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్ వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్లో జరగనుంది. ఇక రోహిత్ శర్మ సెప్టెంబర్లో వెస్టిండీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో దర్శనమివ్వనున్నాడు. Great bumping into a relaxed Shaaaarma on a stroll in London @ImRo45 pic.twitter.com/g3NSLef3n5— Ravi Shastri (@RaviShastriOfc) July 31, 2026His transformation is WOW. He is definitely aiming- The unfinished man is more dangerous than a new potential man.— Vinod Joshi (@Vinod_Joshii) July 31, 2026Rohit looks young, just like before pic.twitter.com/sqxZLQpwOv— GB (@GB80000) July 31, 2026చదవండి: ఇటలీ దిగ్గజ ఫుట్బాలర్ కన్నుమూత -
శతక్కొట్టిన లంక బ్యాటర్.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్
సొంతగడ్డపై శ్రీలంక మహిళల జట్టు గర్జించింది. డంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక ఓపెనర్ ఇమేషా దులాని (64 బంతుల్లో 101 నాటౌట్) అజేయ సెంచరీ చేయడంతో పాకిస్తాన్పై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇమేషాకు తోడుగా కెప్టెన్ చమేరి ఆటపట్టు (22 బంతుల్లో 39) రాణించడంతో పాక్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు 2 వికెట్లు తీసింది.కాగా తన టీ20 కెరీర్లో తొలి సెంచరీ సాధించి ఇమేషా దులాని లంక తరఫున టీ20 క్రికెట్లో సెంచరీ సాధించిన రెండో మహిళా క్రికెటర్గా నిలిచింది. ఇంతకముందు 2024లో మలేషియాతో జరిగిన మ్యాచ్లో చమేరి ఆటపట్టు (119 నాటౌట్) లంక తరఫున శతక్కొట్టిన తొలి వుమెన్ బ్యాటర్గా నిలిచింది. సమరవిక్రమ (86 నాటౌట్, 2024లో ఐర్లాండ్పై) మూడో స్థానంలో ఉంది.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు షావాల్ జుల్ఫికర్ (41 బంతుల్లో 63) అర్ధసెంచరీ చేయగా, మునీబా అలీ (24 బంతుల్లో 42) రాణించింది. ఎమన్ నసీర్ (21), అయేషా జఫర్ (17) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో కవిషా దిల్హరి 2 వికెట్లు తీయగా, కాయా కవింది, సుగందిక, చమోడి ప్రబోద తలా ఒక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. A sensational unbeaten century! 💯🔥Imesha Dulani stands tall with a magnificent 101* runs, guiding Sri Lanka Women with a classy batting masterclass. 🇱🇰🏏#SriLankaCricket #SLvPAK pic.twitter.com/2aMMTCsbtx— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 31, 2026చదవండి: CWG 2026: ఫైనల్లో ప్రీతి.. బాక్సింగ్లో పతకం ఖాయం -
క్యాచ్ మిస్ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా!
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా వరుసగా మూడో మ్యాచ్లోనూ మెరిసింది. గురువారం రాత్రి బర్మింగ్హమ్ ఫోనిక్స్తో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో సదరన్ బ్రేవ్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని టేబుల్ టాపర్లుగా నిలవగా, ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూసిన బర్మింగ్హమ్ మాత్రం విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉంది. అయితే సదరన్ బ్రేవ్ విజయంలో జెమీమా మరోసారి కీలకపాత్ర పోషించింది. ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చిన జెమీమా 18 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులతో అజేయంగా నిలిచింది. అయితే క్రీజులోకి వచ్చిన వెంటనే క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జెమీమా తనకు వచ్చిన రెండో చాన్స్ను రెండు చేతులా ఒడిసిపట్టింది. మూడు ఫోర్లతో చివర్లో సదరన్ బ్రేవ్ భారీ స్కోరు చేయడంలో సహాయపడింది. ఒకవేళ జెమీమా ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ జట్టు 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు మయియా బౌచర్ (31 బంతుల్లో 45), లిజెల్లే లీ (28 బంతుల్లో 43) ధాటిగా ఆడారు. వీరిద్దరు ఔటైన తర్వాత జెమీమా (18 బంతుల్లో 28 నాటౌట్) అజేయంగా నిలిచింది. బర్మింగ్హమ్ బౌలర్లలో లారెన్ ఫైలర్, అలానా కింగ్, అలిస్ కాప్సీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బర్మింగ్హమ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ డేవినా పెర్రిన్ (43 బంతుల్లో 52) అర్ధసెంచరీ వృథాగా మారగా, టామీ బ్యూమౌంట్ (22) పర్వాలేదనిపించింది. సదరన్ బౌలర్లలో సోఫీ మొలినెక్స్ రెండు వికెట్లు తీయగా, టిల్లీ కొర్టీన్, సారా గ్లెన్, లారెన్ బెల్లు తలా ఒక వికెట్ తీశారు. Never give #JemimahRodrigues a second chance! 🫣She powered three boundaries to wrap up the innings on a high for Southern Brave! ⚡#TheHundred 2026 👉 Southern Brave vs Birmingham Phoenix | LIVE NOW pic.twitter.com/KqBGgsVVen— Star Sports (@StarSportsIndia) July 30, 2026Read: రహానే వీడ్కోలుపై లేటుగా స్పందించిన రోహిత్! -
రహానే వీడ్కోలుపై లేటుగా స్పందించిన రోహిత్!
అజింక్య రహానే రిటైర్మెంట్పై భారత సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆలస్యంగా స్పందించాడు. రోహిత్తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేకు బెస్ట్ విషెస్ చెప్పాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. రహానేతో కలిసి గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో స్పందించాడు. 'మేమిద్దరం చాలా ఏళ్ల పాటు డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నాం. రహానే ఎంత కష్టపడతాడో నాకు బాగా తెలుసు. నువ్వు సాధించిన విజయాలు అద్భుతం. నీ నిబద్ధత, వృత్తిపట్ల అంకితభావం నిజంగా ప్రత్యేకమైనవి. అద్భుతమైన కెరీర్కు అభినందనలు. నీ భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్' అని రోహిత్ వెల్లడించాడు.ఇక టీమిండియా టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేకు భావోద్వేగ సందేశం పంపాడు. 'అజ్జూ భాయ్.. నీతో కలిసి మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్లోనూ గడపడం నాకు గౌరవంగా భావిస్తున్నా. నీ ప్రశాంత స్వభావం, ఆటపట్ల అంకితభావం అద్భుతం. నువ్వు ఎప్పుడూ మాకు స్ఫూర్తిగా నిలిచావు. నీ జీవితంలోని రెండో ఇన్నింగ్స్ కూడా అంతే విజయవంతంగా, సంతోషంగా సాగాలని నీకు, నీ కుటుంబ సభ్యులకు ఇదే నా ప్రత్యేక శుభాకాంక్షలు' అని సూర్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రహానే హండ్రెడ్ కాంపిటీషన్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. అక్కడి నుంచే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిటైర్మెంట్ వార్తను పంచుకున్నాడు. జెర్సీ నెంబర్ 278కి వీడ్కోలు అంటే రహానే ఒక వీడియోను సోషల్మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్పై భావోద్వేగ సందేశాన్ని వినిపించాడు. ఈ సందర్భంగా అతడి సహచరులు, దిగ్గజ క్రికెటర్లు రహానే కెరీర్ను కొనియాడుతూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఫస్ట్ క్లాస్లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో రహానే అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. We've shared the dressing room for so many years and I know how much hard work has gone into everything you've achieved. Your commitment and professionalism have always set you apart. Congratulations on a wonderful career. Best wishes! @ajinkyarahane88 pic.twitter.com/r7eXb1yrUz— Rohit Sharma (@ImRo45) July 30, 2026Read: పక్కలో బల్లెంలా తయారయ్యాడు.. పంత్ కెరీర్కు ఎండ్కార్డ్! -
పక్కలో బల్లెంలా తయారయ్యాడు.. పంత్ కెరీర్కు ఎండ్కార్డ్!
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ, శ్రీలంకతో జరగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఊహించిన విధంగానే, దక్షిణాఫ్రికా టెస్ట్ పర్యటనలో నిరాశాజనక ప్రదర్శన, ఆఫ్ఘనిస్తాన్పై సాధారణ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ , ప్రధాన వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే మరోవైపు ధ్రువ్ జురెల్ రెండో వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. పంత్కు బ్యాకప్గా ప్రతీ సిరీస్కు ఎంపికవుతూ వస్తున్న ధ్రువ్ జురేల్ సిరీస్ సిరీస్కు రాటుదేలుతూ పంత్కు పక్కలో బల్లెంలా తయారయ్యాడనిపిస్తోంది. టెస్టు క్రికెట్లో ఇప్పటికైతే టీమిండియా వికెట్ కీపర్గా మొదటి ప్రాధాన్యత పంతకే ఉన్నప్పటికీ, జురేల్ రాకతో పోటీ తీవ్రమయింది. జురెల్ తనకు అవకాశాలు వచ్చినప్పుడల్లా బ్యాటింగ్తో పాటు వికెట్ల వెనుక కూడా నిలకడ ప్రదర్శిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకునే పనిలో పడ్డాడు.Photo Credit: BCCI Twitterఈ నేపథ్యంలోనే పంత్ స్థానాన్ని భర్తీ చేయడానికి జురెల్ నిజంగా అర్హుడేనా అని చూస్తే మాత్రం తొలి 10 టెస్టుల్లో పంత్ 727 పరుగులు చేస్తే, ధ్రువ్ జురెల్ 478 పరుగులు సాధించాడు. అయితే పంత్ టెస్టుల్లో ప్రధానంగా ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. కానీ జురెల్ జట్టులో ఉంటే అతడి బ్యాటింగ్ స్థానం ఆరు లేదా ఏడు. దీనివల్ల జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్లంతా ఔటైన తర్వాత కానీ ధ్రువ్ జురెల్కు అవకాశం రావడం లేదు. దీంతో అతడు పెద్ద ఇన్నింగ్స్లు ఆడేందుకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే ఒత్తిడి పరిస్థితులు ఉన్నప్పుడు సంయమనం పాటించడంలో పంత్తో పోలిస్తే జురెల్ ఒక మెట్టుపైనే ఉంటాడు. ఇక జురెల్తో పోలిస్తే పంత్ ప్రతీ 100 బంతులకు 18 పరుగులు వేగంగా సాధించడంలో దిట్ట. ఇంగ్లండ్లో జేమ్స్ అండర్సన్, ఆస్ట్రేలియాలో నాథన్ లయన్ ఇలా విదేశీ గడ్డపై ఎలాంటి బౌలర్లనైనా తన దూకుడైన బ్యాటింగ్తో పరుగులు సాధించడంలో ముందుంటాడు. అయితే పంత్తో పోలిస్తే ధ్రువ్ జురెల్ది పూర్తిగా భిన్నమైన బ్యాటింగ్. టెక్నికల్గా బ్యాటింగ్ ఆడడంలో నేర్పరి అయిన ధ్రువ్ జురెల్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. తర్వాత ఓపికతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్లు నిర్మించడంలోనూ జురెల్ ముందు వరుసలో ఉంటాడు.బ్యాటింగ్ సంగతి పక్కనబెడితే, వికెట్కీపింగ్ నైపుణ్యంలో మాత్రం పంత్, జురెల్ సమానంగానే కనిపిస్తున్నారు. పది టెస్టుల తర్వాత పంత్ వికెట్ల వెనుక 47 డిస్మిసల్స్ చేస్తే, జురెల్ 15 నమోదు చేశాడు. ఇది పంత్కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, పంత్ కీపర్గా లేని 10 ఇన్నింగ్స్ల్లో మాత్రమే కీపింగ్ చేశాడు. అదీగాక జురెల్ తుదిజట్టులో ఉన్నప్పటికీ, అనేక మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్ లేదా పంత్లో ఒకరు గ్లోవ్స్ చేపట్టేవారు. అయితే 2026లో దేశీయంగా జురెల్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ, విదేశీ పర్యటనలన్నింటిలోనూ పంత్కు ప్రత్యామ్నాయంగా జురెల్ను ఎంపిక చేస్తూ ఉండడం, అతడి వికెట్కీపింగ్ సామర్థ్యాలపై యాజమాన్యానికి నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది.Read: ‘కంగ్రాట్స్ జింక్స్.. నువ్వు నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్’ -
‘కంగ్రాట్స్ జింక్స్.. నువ్వు నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్’
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అజింక్య రహానేకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అభినందనలు తెలిపాడు. సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన అతడి కెరీర్ గొప్పగా సాగిందని పేర్కొన్న విరాట్.. ఇకపై కూడా అతడికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించాడు. ఎన్నో ఏళ్లు తామిద్దరం కలిసి దేశానికి ఆడామని, జింక్స్ తన పార్టనర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని కోహ్లి తెలిపాడు. ‘జింక్స్.. నీ క్రికెట్ కెరీర్ గొప్పగా సాగినందుకు అభినందనలు. భారత క్రికెటర్గా నువ్వు అద్భుతాలు చేశావు. నీ ఈ ప్రయాణం పట్ల నువ్వు చాలా గర్వపడాలి. స్లిప్లో నీ చేతులు చాలా సురక్షితమైనవి. టెస్టుల్లో నాకు ఇష్టమైన భాగస్వామివి నువ్వే. నువ్వు ఎల్లప్పుడూ బాగుండాలి. దేవుడి ఆశీర్వాదం నీకు ఉంటుంది’ అని కోహ్లీ తన పోస్ట్లో వెల్లడించాడు.కోహ్లి హయాంలోనే స్టార్ హోదా..ఇక కోహ్లీ కెప్టెన్సీలోనే రహానే కెరీర్ గొప్పగా సాగింది. కోహ్లి హయాంలోనే అతడు వైస్ కెప్టెన్గా, మిడిలార్డర్ బ్యాటర్గానూ స్థిరంగా రాణించాడు. కోహ్లి, రహానేలు కలిసి టీమిండియా తరఫున 67 టెస్టుల్లో ఆడారు. వీరిద్దరు కలిసి 3,661 పరుగులు జోడించారు. ఇందులో 10 శతక భాగస్వామ్యాలున్నాయి. ఈ ఇద్దరి మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం 2016లో న్యూజిలాండ్తో టెస్టులో (365 పరుగులు) నమోదయ్యింది. ఇక ఇద్దరు కలిసి 33 వన్డేలు ఆడి 1717 పరుగులు జోడించారు. ఇందులో ఆరు శతక భాగస్వామ్యాలున్నాయి. అయితే మూడేళ్ల క్రితం వరకు కోహ్లి, పుజారా, రహానే, రోహిత్.. వీళ్లు లేని భారత టెస్టు జట్టును ఊహించలేం. ఎందుకంటే.. సుదీర్గ అనుభమున్న ఈ నలుగురికి కష్ట సమయంలో ఇన్నింగ్స్ నిర్మించడం, ప్రత్యర్ధి బౌలర్లను విసిగించడం ఎలాగో బాగా తెలుసు. టీమిండియా వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు టెస్టుల్లో రోహిత్ సేన అగ్రస్థానంలో నిలవడంలో వీళ్ల పాత్ర మరువలేనిది.ఫస్ట్ క్లాస్లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో రహానే అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. Jinks, congratulations on a great career, buddy. You’ve done wonders for Indian cricket, and you can be very proud of your journey. The safest pair of hands in the slips and my favourite Test batting partner. Wishing you well always. God bless. 🤝🇮🇳@ajinkyarahane88 pic.twitter.com/bHGaas41gO— Virat Kohli (@imVkohli) July 30, 2026 -
రహానే స్థాయిని అమాంతం పెంచిన టాప్-5 ఇన్నింగ్స్లు!
టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే గురువారం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. 90వ దశకం నుంచి 2010 వరకు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ తరం భారత టెస్టు క్రికెట్ను నిలబెట్టారు. ఆ తర్వాత వీరి లెగసీని కోహ్లి, రోహిత్, రహానే, పుజారాలు విజయవంతంగా కొనసాగించారు. ద్రవిడ్ తర్వాత అజింక్య రహానే భారత్కు ఎన్నో ఇన్నింగ్స్లో ఆపద్భాందవుడి పాత్రను పోషించాడు. వన్డేలు, టెస్టుల్లో ఎన్నో మైలురాయి ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే వాటిలో ఒక ఐదు ఇన్నింగ్స్లు మాత్రం రహానే స్థాయిని అమాంతం పెంచేశాయి. రహానే టాప్-5 బెస్ట్ ఇన్నింగ్స్లపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.👉112 పరుగులు(2020 మెల్బోర్న్ టెస్టులో, ఆసీస్పై)Photo Credit: BCCI Twitterఅజింక్య రహానే కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయిన ఇన్నింగ్స్కు మెల్బోర్న్ వేదికగా నిలిచింది. అప్పటికే అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ (డే అండ్ నైట్) టెస్టులో 36 పరుగులకే ఆలౌటై టీమిండియా పరువు పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లి కూడా తన కూతురు తొలి బర్త్డే కోసమని ఇండియాకు వెళ్లిపోయాడు. దీంతో రహానే కెప్టెన్సీ బాధ్యతను తీసుకున్నాడు. తొలి టెస్టులో ఘోర ఓటమితో పూర్తి ఒత్తిడిలో మునిగిపోయిన టీమిండియాను తన కెప్టెన్సీతో పూర్తిగా మార్చేశాడు. తొలి ఇన్నింగ్స్లో ఎంతో ఓపికగా ఆడిన రహానే 223 బంతుల్లో 112 పరుగుల వీరోచిత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడమే కాదు ఆ తర్వాత సిరీస్ను కూడా 2-1తో గెలుచుకొని రహానే సారథ్యంలో చారిత్రక విజయాన్ని అందుకుంది.👉103 పరుగులు (లార్డ్స్ టెస్ట్, 2014లో ఇంగ్లండ్పై)Photo Credit: BCCI Twitterమెల్బోర్న్ వేదికగా సాధించిన సెంచరీ కంటే ముందు, ఆరేళ్ల క్రితమే లార్డ్స్ గడ్డపై రహానే మరో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. మెల్బోర్న్ లేకపోయుంటే లార్డ్స్దే రహానే కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. మెల్బోర్న్ టెస్టుకు ఏమాత్రం తీసిపోని లార్డ్స్ టెస్టులో 154 బంతుల్లో 103 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జేమ్స్ అండర్సన్ బంతితో నిప్పులు చెరుగుతున్న వేళ భారత టాప్ బ్యాటర్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. కానీ రహానే మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ (36) తన కెరీర్ అత్యధిక స్కోరు సాధించడం విశేషం.అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో రహానే ఇన్నింగ్స్ ఎవర్గ్రీన్గా నిలిచిపోయింది.👉ఢిల్లీ టెస్టులో రెండు సెంచరీలు (2015లో సౌతాఫ్రికాపై)Photo Credit: BCCI Twitter2015లో సౌతాఫ్రికా జట్టు భారత్లో పర్యటించింది. ఢిల్లీ వేదికగా ఇరుజట్లు నాలుగో టెస్టు మ్యాచ్ ఆడాయి. స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్పై రహానే రెండు సెంచరీలతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులు సాధించిన రహానే.. రెండో ఇన్నింగ్స్లో కోహ్లితో కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. పనిలో పనిగా అజేయ సెంచరీ (100 నాటౌట్) సాధించిన రహానే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ను సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన రహానే సిరీస్ మొత్తంలో రెండు దేశాల తరఫున సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా రహానే నిలవడం విశేషం.👉79 పరుగులు (2015 వన్డే ప్రపంచకప్, సౌతాఫ్రికాపై)Photo Credit: BCCI Twitterకెరీర్ ఆరంభంలో వరుసగా వన్డే మ్యాచ్లు ఆడిన రహానే ఆ తర్వాత టెస్టులకే ఎక్కువగా పరిమితమయ్యాడు. అయితే 2015 వన్డే ప్రపంచకప్లో సౌతాఫ్రికాపై ఆడిన 79 పరుగుల ఇన్నింగ్స్ మాత్రం టాప్-5లో ఒకటిగా నిలుస్తోంది. ఆ మ్యాచ్లో రహానే 60 బంతుల్లోనే 79 పరుగులు సాధించడంతో టీమిండియా 300 పరుగుల మార్క్ను దాటింది. మ్యాచ్లో సౌతాఫ్రికా ఓటమికి పరోక్షంగా రహానే ఆడిన ఇన్నింగ్స్ కారణమైంది.👉39 బంతుల్లో 61 పరుగులు (2011లో ఇంగ్లండ్పై టీ20 మ్యాచ్లో)Photo Credit: BCCI Twitterరహానే అంటే క్లాస్ ఆటకు మారుపేరు అని ముద్ర పడిన రోజుల్లో తనలో మాస్ యాంగిల్ ఉందని నిరూపించిన ఇన్నింగ్స్ ఇది. ఇంగ్లండ్ గడ్డపై మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా, టీ20 సిరీస్లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రహానే ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే 61 పరుగులు చేసిన రహానే ఇంగ్లండ్ గడ్డపై టీ20ల్లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఇవేగాక రహానే బ్యాట్ నుంచి జాలువారిన అమోఘమైన ఇన్నింగ్స్లు చాలానే ఉన్నప్పటికీ, మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ఇన్నింగ్స్లను చూసుకుంటే ఈ ఐదు కచ్చితంగా టాప్లోనే ఉంటాయి.చదవండి: పాకిస్తానీ కాదు.. ‘రియల్ పెద్ది’తోనే నీరజ్కు సవాల్! -
జూనియర్ ఏబీ విధ్వంసం.. బంతిని చూడకుండానే!
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో లండన్ స్పిరిట్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఎంఐ లండన్తో జరిగిన మ్యాచ్లో లండన్ స్పిరిట్స్ 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. మ్యాచ్లో ప్రిటోరియస్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రిటోరియస్తో పాటు జూనియర్ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిడ్ ఇన్నింగ్స్ కూడా మ్యాచ్లో హైలైట్ అని చెప్పొచ్చు.18 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచిన బ్రెవిస్ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ కొట్టిన నో-లుక్ సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్నింగ్స్ 68వ బంతికి ఈ అద్భుతం చోటుచేసకుంది. ఓలీ స్టోన్ వేసిన బంతిని ముందే అంచనా వేసిన డెవాల్డ్ బ్రెవిస్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి స్టాండ్స్ దిశగా వెళ్తున్న సమయంలో డెవాల్డ్ బ్రెవిస్ ఒక్కసారి కూడా తాను కొట్టిన షాట్ను చూడకుండా గ్రౌండ్నే చూడడం హైలైట్గా మారింది. ఇది చూసిన అభిమానులు @నీ కాన్ఫిడెన్స్కు సలాం.. బ్రెవిస్*, ఇదెక్కడి మాస్ రా మావ.. అని కామెంట్లు పెట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం బ్రెవిస్ నో లుక్ సిక్స్ను మీరు కూడా వీక్షించండి. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విల్ జాక్స్ (44 బంతుల్లో 65), రూథర్ఫోర్డ్ (19 బంతుల్లో 41) ధాటిగా ఆడారు. లండన్ స్పిరిట్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు తీయగా, ఆండ్రూ టై, జేమ్స్ కోల్స్ చెరొక వికెట్ తీశారు.అనంతరం లండన్ స్పిరిట్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్రిటోరియస్ (28 బంతుల్లో 64), బ్రెవిస్ (18 బంతుల్లో 37 నాటౌట్) భారీ ఇన్నింగ్స్లతో జట్టుకు విజయాన్ని అందించారు. Simply sensational from Dewald Brevis 🤯Watch his head position as he hits the ball...#TheHundred pic.twitter.com/eWOtOJlVXo— The Hundred (@thehundred) July 29, 2026Dewald Brevis. No-look six. Enjoy. 🥶 pic.twitter.com/qgQoBKwvkz— Lord's Cricket Ground (@HomeOfCricket) July 29, 2026Read: రహానే రిటైర్మెంట్పై బీసీసీఐ తొలి స్పందన -
బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్లో వయో మోసాన్ని (Age Fraud) అరికట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు చేపట్టింది. వయో విభాగాల క్రికెట్లో పారదర్శకత పెంచేందుకు స్వతంత్ర సంస్థను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.అండర్-16, అండర్-19, అండర్-23 విభాగాల్లో ఆడే క్రికెటర్ల పత్రాలన్నింటినీ ఈ స్వతంత్ర సంస్థ పరిశీలించనుంది. ఆటగాళ్ల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు వంటి వివరాలను సంబంధిత అధికారులు, విద్యాసంస్థలతో సరిపోల్చి వాటి ప్రామాణికతను నిర్ధారించనుంది.పత్రాల్లో ఏవైనా తేడాలు లేదా తారుమార్లు ఉన్నట్లు తేలితే, సంబంధిత ఆటగాడిని బీసీసీఐ వయో విభాగాల టోర్నీల్లో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించకుండా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే చర్యలు తీసుకునే ముందు ఆటగాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, తమ వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించనుంది.ఇకపై అన్ని వయో విభాగాల క్రికెటర్లకు బయోమెట్రిక్ ధ్రువీకరణ కూడా తప్పనిసరి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. గతంలో వయో మోసం ఆరోపణలతో రసిఖ్ సలామ్, ప్రిన్స్ యాదవ్, మంజోత్ కల్రా, నితీష్ రాణా వంటి పలువురు ఆటగాళ్లు బీసీసీఐ చర్యలను ఎదుర్కొన్నారు.ఆధార్లో చిరునామా మార్చాలిఅలాగే 2026-27 సీజన్కు రాష్ట్ర సంఘాన్ని మార్చుకోవాలనుకునే ఆటగాళ్లు సెప్టెంబర్ 1లోపు తమ ఆధార్ కార్డులో చిరునామాను నవీకరించి బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం నిరీక్షణ కాలం పూర్తయిన తర్వాతే వారు కొత్త రాష్ట్రం తరఫున ఆడేందుకు అర్హత పొందుతారు. -
రహానే రిటైర్మెంట్పై బీసీసీఐ తొలి స్పందన
టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే గురువారం తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దశాబ్దంన్నర పాటు భారత క్రికెట్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రహానే ఇటీవలే ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. వయసు మీదపడడం, ఫామ్ లేమి, జట్టులో యువకుల రాక పెరగడం వెరసి రహానే క్రమంగా టీమిండియాకు దూరమవుతూ వచ్చాడు. అయితే ఐపీఎల్లో మాత్రం రహానే ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రహానే వచ్చే ఐపీఎల్ సీజన్లో మనకు మరోసారి కనిపించొచ్చు. ఇదిలా ఉంటే రహానే రిటైర్మెంట్ పోస్టుపై బీసీసీఐ తొలిసారి తన స్పందన వ్యక్తం చేసింది. భారత క్రికెట్కు రహానే అందించిన సేవలకు కృతజ్క్షతలు తెలుపుతూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది. 'ఒక అద్భుతమైన కెరీర్ ముగిసింది. క్రికెటర్గా భారత క్రికెట్కు మీరు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు అజింక్య రహానే. క్రికెటర్గా మీరు సాధించిన అద్భుత విజయాలు ఒక జ్ఞాపకాలుగా ఎప్పటికీ గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు. రిటైర్మెంట్ తర్వాతి చాప్టర్కు ‘ఆల్ ది బెస్ట్ రహానే'’ అంటూ బీసీసీఐ ఎమోషనల్ ట్వీట్ చేసింది..15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. రహానేకు టెస్టు కెప్టెన్గా అజేయమైన రికార్డు ఉంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం. 2020-21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీని రహానే సారథ్యంలోనే టీమిండియా 2-1 తేడాతో చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాపై టెస్టు విజయం, 2018లో అఫ్గానిస్తాన్పై విజయంలో రహానే కెప్టెన్గా, బ్యాటర్గా కీలకపాత్ర పోషించాడు. An illustrious career comes to an end 🇮🇳Thank you @ajinkyarahane88 for your immense contribution to Indian cricket and all the memories that will be cherished forever Wishing you the very best in your next chapter #TeamIndia | #ThankYouAjinkya pic.twitter.com/Gbi7sIcgwS— BCCI (@BCCI) July 30, 2026 AJINKYA RAHANE IN TEARS 🥹- The moment ajji announced his retirement, Cap 278 Signing off forever 🥹❤️ pic.twitter.com/jgCCXh8kv8— Sam (@cricsam02) July 30, 2026Read: జెమీమా విధ్వంసం.. పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయం -
బంగ్లాదేశ్కు కొత్త కెప్టెన్
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. వన్డే జట్టుకు కొత్త కెప్టెన్గా సీనియర్ బ్యాటర్ లిట్టన్ దాస్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.ఇటీవలి కాలంలో మెహిదీ హసన్ మిరాజ్ సారథ్యంలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో నాయకత్వంలో మార్పు చేయాలని బోర్డు నిర్ణయించింది.లిట్టన్ దాస్కు నాయకత్వ అనుభవం కూడా బాగానే ఉంది. గతంలో బంగ్లాదేశ్ వన్డే జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన ఆయన, 2021 నుంచి 2026 వరకు టీ20 జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒక టెస్టులో కూడా జట్టును నడిపించాడు.ఈ ఏడాది డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగే వన్డే సిరీస్ నుంచి లిట్టన్ దాస్ అధికారికంగా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. దాస్ వన్డే, టీ20 జట్లకు నాయకత్వం వహించనుండగా.. నజ్ముల్ హసన్ షాంటో టెస్ట్ జట్టు సారధిగా ఉన్నాడు. బంగ్లాదేశ్ తాజాగా జింబాబ్వే పర్యటనలో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆగస్ట్లో ఈ జట్టు ఆస్ట్రేలియాలో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. -
జెమీమా విధ్వంసం.. పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో సదరన్ బ్రేవ్ వుమెన్ జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం సృష్టించగా, సదరన్ బ్రేవ్స్ పరుగు తేడాతో ఎంఐ లండన్ జట్టుపై థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 32, 3 ఫోర్లు), లారా వోల్వర్ట్ (30 బంతుల్లో 35, 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, ఓపెనర్ మయియా బౌచర్ (33 బంతుల్లో 31) రాణించింది. ఎంఐ లండన్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 4 వికెట్లు పడగొట్టగా, తారా నొర్రిస్, అమేలియా కెర్, నికోలా కేరీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో ఎంఐ లండన్ వుమెన్ జట్టు 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. Photo Credit: Hundred Twitterఓపెనర్ డానీ వాట్హెడ్జ్ (42 బంతుల్లో 52 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయింది. మరో ఓపెనర్హేలీ మాథ్యూస్ (28 బంతుల్లో 32) పర్వాలేదనిపించింది. సదరన్ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్ తలా ఒక వికెట్ తీశారు. కీలక ఇన్నింగ్స్తో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకుంది.Photo Credit: Hundred Twitterహ్యాట్రిక్ పరాజయంఇక పురుషుల హండ్రెడ్ టోర్నీలో మాత్రం సదరన్ బ్రేవ్ జట్టు హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. సదరన్ బ్రేవ్తో జరిగిన మ్యాచ్లో ఎంఐ లండన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్ జేక్ స్మిత్ (26 బంతుల్లో 49) పరుగు తేడాతో అర్ధసెంచరీ మిస్ చేసుకోగా, ట్రిస్టన్ స్టబ్స్ (31 బంతుల్లో 38) రాణించాడు. బౌల్ట్, టామ్ కరన్, రిచర్డ్ గ్లెసన్, సామ్ కరన్లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం ఎంఐ లండన్ 100 బంతుల్లో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ విల్ జాక్స్ (41 బంతుల్లో 54) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. సామ్ కరన్ (30), రూథర్ఫోర్డ్ (21) ఆఖర్లో ధాటిగా ఆడారు. మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, నికిల్ చౌదరీ చెరొక వికెట్ పడగొట్టారు.విల్ జాక్స్ (Photo Credit: Hundred Twitter) The timing and placement from Jemimah Rodrigues 🤌#CricketTwitter pic.twitter.com/sdfSEc0UJP— Female Cricket (@imfemalecricket) July 27, 2026Read: సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్? -
సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్?
టీమిండియా తరఫున సారాన్ష్ జైన్ రూపంలో దేశవాళీ సీనియర్ క్రికెటర్ అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ సారాన్ష్ జైన్ను బీసీసీఐ ఎంపిక చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సారాన్ష్ జైన్ లోయర్ ఆర్డర్లో బ్యాటర్గా పరుగులు సాధించడంలో సమర్థుడు. దీంతో లంకతో సిరీస్లో సారాన్ష్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు కూడా దీనికి మరో ప్రధాన కారణం. 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాన్ష్ 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్కు ప్రధాన ఆటగాడిగా మారిపోయిన సారాన్ష్ ఆ తర్వాత సెంట్రల్ జోన్తో పాటు రెస్టాఫ్ ఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. తండ్రి కూడా క్రికెటరే.. స్పిన్ బౌలర్ అయిన సారాన్ష్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 181 వికెట్లతో పాటు 2,223 పరుగులు సాధించాడు. సారాన్ష్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే. మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడారు. రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్ తొమ్మిది మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించారు. ఇక సారాన్ష్ జైన్ దేశవాళీ సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద శిక్షణ పొంది ఆటలో మరింత రాటుదేలాడు. 2022లో తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సారాన్ష్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో కీలక హాఫ్ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. లంక-ఏపై రాణించి సెలెక్టర్ల దృష్టిలో..ఇటీవలే శ్రీలంక-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో సారాన్ష్ జైన్ రాణించాడు. బ్యాట్తో 70 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడిన సారాన్ష్ జైన్ తాజాగా సుందర్ స్థానంలో లంకతో సిరీస్కు ఎంపికయ్యాడు. వేలంలో అన్సోల్డ్ఇక ఐపీఎల్ 2024 నుంచి 2026 వరకు సారాన్ష్ జైన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వేలంలో అతడిని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ద్వారా కాకుండా దేశవాలీ క్రికెట్లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అరుదైన క్రికెటర్ల జాబితాలో సారాన్ష్ జైన్ పేరును లిఖించుకున్నాడు.Saransh Jain has earned his maiden Test call-up 👏Take a look at the new off-spinner, who set the stage on fire with his stunning 5/49 in the Duleep Trophy final. 👌 pic.twitter.com/VIlTxFDhAy— BCCI Domestic (@BCCIdomestic) July 28, 2026Read: కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే! -
కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే!
జింబాబ్వేపై టీ20 సిరీస్ విజయం తర్వాత టీమిండియా కోచ్ మార్పు అంశం సోమవారం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. గంభీర్ను తీసేసి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్కు పూర్తిస్థాయి హెడ్కోచ్ బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేశారు. రోజంతా ఇదే అంశంపై సోషల్ మీడియాలో వాడీవేడి చర్చ కూడా జరిగింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుస సిరీస్ ఓటములు టీమిండియాను తీవ్రంగా దెబ్బకొట్టాయి. దీంతో జింబాబ్వే పర్యటనకు ప్రధాన కోచ్ గంభీర్కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ను తాత్కాలిక కోచ్గా జట్టుతో పాటు పంపించారు. జింబాబ్వే చిన్నజట్టే అయినప్పటికీ, లక్ష్మణ్ కోచింగ్ విధానం టీమిండియా ఆటగాళ్లకు బాగా వంటబట్టింది. అందుకే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్స్వీప్ చేసింది. ఈ విజయం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఎదురైన పరాభవాలను మర్చిపోయేట్లు చేసింది. బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ, జింబాబ్వే గడ్డపై మన యువ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దీని వెనుక వీవీఎస్ లక్ష్మణ్ వ్యూహాలు, ఆలోచనలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఒక నాలుగు అంశాలు గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న కోచింగ్ తేడాలను స్పష్టంగా చూపిస్తోంది.స్థిరమైన ఓపెనింగ్ జోడిఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తరఫున అభిషేక్, సంజూ శాంసన్ ఓపెనర్లుగా వచ్చారు. వైభవ్ ఈ సిరీస్లకు ఎంపికైనప్పటికీ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్కు విశ్రాంతినిచ్చి, అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఎంపిక చేశారు. అయితే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో విశేషంగా రాణించిన అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక్కదాంట్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మరోవైపు తనకు వచ్చిన అవకాశాన్ని వైభవ్ రెండు చేతులా ఒడిసిపట్టాడు. రెండు అర్ధసెంచరీలు సహా 155 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎగరేసుకుపోయాడు. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్లో కోచ్గా లక్ష్మణ్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశాడు. అభిషేక్ విఫలమైనప్పటికీ అతడికి అవకాశాలు ఇచ్చి స్థిరమైన ఓపెనింగ్ జోడిని కొనసాగించాడు.ముగ్గురు పేసర్లతో బరిలోకియూకే పర్యటనలో కోచ్ గౌతమ్ గంభీర్ బౌలర్లను ఉపయోగించిన తీరు విమర్శలకు దారి తీసింది. పేస్కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్లపై అనవసర ప్రయోగాలకు పోయి స్పిన్-ఆల్రౌండర్ల కలయికపై ఎక్కువగా ఆధారపడి గంభీర్ చేతులు కాల్చుకున్నాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో ఒక మ్యాచ్లో మొత్తం ఐదుగురిలో ఒకే ఒక పేసర్ను ఆడించడం గమనార్హం. ఇక వన్డే సిరీస్లోనూ గంభీర్ వ్యూహాలు పనిచేయలేదు. బౌలర్లంతా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. అయితే జింబాబ్వే పర్యటనలో మాత్రం లక్ష్మణ్ గంభీర్కు విరుద్ధంగా వ్యవహరించాడు. టీ20 సిరీస్లో ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో ఆడాలని నిర్ణయించిన లక్ష్మణ్.. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్లతో పాటు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ సేవలు వినియోగించుకొని అద్భుత ఫలితాలు రాబట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్పై నమ్మకముంచిన లక్ష్మణ్ అవకాశాలిచ్చాడు. దీంతో మయాంక్ తన బౌలింగ్తో అదరగొట్టాడు.ఆల్రౌండర్ల వినియోగంఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రానాలకు గంభీర్ తుది 11 మందిలో చోటిచ్చాడు. దీని ఫలితంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ లోపించడంతో పాటు, తన నాలుగు ఓవర్ల కోటాను నమ్మకంగా పూర్తి చేయగల స్పెషలిస్ట్ బౌలర్ కొరత కూడా ఏర్పడింది. కానీ లక్ష్మణ్ మాత్రం కేవలం ఒక్క ఆల్రౌండర్కే చోటు కల్పించాడు. తొలి రెండు టీ20ల్లో శివమ్ దూబేను ఆడిపించిన లక్ష్మణ్ చివరి టీ20 మ్యాచ్కు సూర్యాంశ్ షెడ్గేను చాన్స్ ఇచ్చాడు. ఇలా చేయడం వల్ల జట్టులో ఒక పూర్తిస్థాయి బ్యాటర్కు అవకాశం కల్పించడంతో పాటు ఒక స్పిన్నర్కు అవకాశం కల్పించినట్లయింది. రింకూ సింగ్ ఫినిషర్గా, రవి బిష్ణోయ్ స్పిన్నర్గా తమ పాత్రను సమర్థంగా పోషించారు.ఆటగాళ్లపై నమ్మకంజింబాబ్వేలో భారత్ 3-0తో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన సమయంలో అభిషేక్, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు ఫామ్తో ఇబ్బంది పడుతున్నప్పటికీ తాత్కాలిక కోచ్గా లక్ష్మణ్ వారికి అండగా నిలిచాడు. కండరాల గాయానికి గురైన వరుణ్ చక్రవర్తి స్థానంలో, చివరి నిమిషంలో బిష్ణోయ్ను జట్టులోకి తీసుకున్నారు. ముఖ్యంగా, ఇంగ్లాండ్తో జరిగిన ఒక క్లిష్టమైన టీ20 మ్యాచ్లో బిష్ణోయ్ అధిక ఎకానమీ రేటుతో ఇబ్బంది పడ్డాడు.అయినప్పటికీ జింబాబ్వేతో టీ20 సిరీస్లో రవి బిష్ణోయ్ను ప్రధాన స్పిన్నర్గా ఆడించి ఫుంజుకోవడానికి తోడ్పడ్డాడు. ఈ సిరీస్లో రవి బిష్ణోయ్ మొత్తంలో 5.667 సగటు ఎకానమీతో 3 మ్యాచ్ల్లో 3 వికెట్లు పడగొట్టాడు.చదవండి: శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విండీస్ బౌలర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ క్రికెటర్ జస్టిన్ గ్రీవ్స్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు సాధించాడు. పాకిస్తాన్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో బౌలింగ్లో ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు తీసిన తొలి బౌలర్గా జస్టిన్ గ్రీవ్స్ రికార్డులకెక్కాడు. గ్రీవ్స్ తన తొలి ఆరు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే మలి విడత బౌలింగ్కు వచ్చిన గ్రీవ్స్ తాను వేసిన వరుస 5 ఓవర్లలో ఓవర్కు ఒక్కో వికెట్ చొప్పున ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే ఆ ఐదు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్లు నమోదు చేయడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో 5 వికెట్లు తీసే క్రమంలో ఒక్క పరుగు ఇవ్వకుండా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా జస్టిన్ గ్రీవ్స్ నిలిచాడు. ఒక దశలో మ్యాచ్ పాకిస్తాన్వైపు మొaగ్గు చూపిందని అంతా భావించగా, రెండో స్పెల్ బౌలింగ్కు వచ్చిన జస్టిన్ గ్రీవ్స్ తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను పూర్తిగా తిప్పేశాడు. మూడో రోజు ఆట ప్రారంభంలో 3 వికెట్ల నష్టానికి 244 పరుగులతో మంచి పట్టు సాధించిన పాకిస్తాన్కు గ్రీవ్స్ చుక్కలు చూపించాడు. తన వరుస ఐదు ఓవర్లలో పాక్ బ్యాటర్లు షాన్ మసూద్, మహ్మద్ రిజ్వాన్, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహ్మద్ అబ్బాస్లను పెవిలియన్ చేర్చాడు. జస్టిన్ గ్రీవ్స్కు టెస్టుల్లో ఇదే తొలి ఐదు వికెట్లు ప్రదర్శన కావడం విశేషం. గ్రీవ్స్ దెబ్బకు భారీ స్కోరు చేస్తుందనుకున్న పాకిస్తాన్ 282 పరుగులకు ఆలౌటైంది. మూడు వికెట్ల నష్టానికి 244 పరుగులతో పటిష్టంగా కనిపించిన పాక్ తన చివరి ఏడు వికెట్లను 38 పరుగులతో చేజార్చుకోవడం విశేషం. మూడోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కీమర్ రోచ్ (5), షమర్ జోసెఫ్ (22) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ 155 పరుగుల ఆధిక్యంలో ఉంది. బౌలింగ్కు బాగా అనుకూలిస్తున్న పిచ్పై విజయం ఎవరిదనేది ఆసక్తిగా మారింది. 🚨Justin Greaves claims his maiden five-wicket haul in Test cricket. 🇼🇸Figures: 11 overs, 5/27- Pakistan: 267/9 (72 overs), trail by 44 runs. pic.twitter.com/eiZDyVLSiz— Talha Nawaz (@TalhaDigital007) July 27, 2026An unbelievable spell of fast bowling from West Indies seamer Justin Greaves that netted five consecutive wicket maidens in the first #WTC27 Test 💥More 👉 https://t.co/7XajvpaQ4g pic.twitter.com/aM1vcGFKDq— ICC (@ICC) July 28, 2026Read: రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్! -
నేపాల్ పేసర్ చారిత్రక ఘనత
నేపాల్ పేస్ బౌలర్ కరణ్ కేసీ వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి నేపాల్ పేసర్గా, సందీప్ లామిచ్ఛానే తర్వాత రెండో నేపాల్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు.ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లీగ్-2లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో కరణ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో కరణ్ 10 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో రెండో వికెట్తో అతను 100 వికెట్ల మైలురాయిని తాకాడు.2018లో నెదర్లాండ్స్పై వన్డే అరంగేట్రం చేసిన కరణ్.. 72 ఇన్నింగ్స్ల్లో 103 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ సామర్థ్యం కూడా కలిగిన కరణ్, ఈ ఫార్మాట్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 700 పరుగులు కూడా చేశాడు. 34 ఏళ్ల కరణ్ టీ20 ఫార్మాట్లోనూ సత్తా చాటుతే 112 వికెట్లు తీశాడు.నమీబియా-నేపాల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ (100) సెంచరీతో సత్తా చాటగా.. స్టీన్క్యాంప్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ క్రీజ్లో ఉండగా.. నమీబియా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే కరణ్ (10-2-29-5) అద్భుత స్పెల్తో వారి ఆశలు అడియాశలు చేశాడు. -
రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్!
జింబాబ్వేతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా తర్వాతి సిరీస్ శ్రీలంకతో ఆడనుంది. లంక పర్యటనలో ఈసారి వైట్బాల్ సిరీస్కు బదులుగా సంప్రదాయ టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు భారత్ జట్టును మంగళవారం ప్రకటించనుంది. ఏడాది కాలంగా టెస్టు క్రికెట్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తిరిగి టెస్టుల్లో ఆడనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే లంకతో టెస్టు సిరీస్కు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుమ్రా ఒకవేళ లంకతో టెస్టు సిరీస్కు దూరమైతే అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లంక-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో 10 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేసిన గుర్నూర్ బ్రార్ ఎంపికలో ముందు వరుసలో ఉన్నాడు. స్వదేశంలో ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టుకు ఎంపికైనప్పటికీ గుర్నూర్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టు క్రికెట్లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వని గుర్నూర్, లంకతో సిరీస్లో బుమ్రా స్థానంలో ఆడే అవకాశాలున్నాయి. బుమ్రా దూరమైతే మాత్రం సిరాజ్, ప్రసిధ్ భారత పేస్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నారు.ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా రెండో వన్డే సమయంలో మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో చివరి వన్డేకు దూరమయ్యాడు. జూలై 24న బుమ్రాకు నిర్వహించిన పరీక్షల్లో అతడి మోకాలు వాపు ఉందని తేలింది. దీంతో తదుపరి పరీక్షల కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ లెక్కన బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంలో విఫలమైతే లంకతో సిరీస్కు అతడు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, నితీశ్ కుమార్రెడ్డి, వాషింగ్టన్ సుందర్లు కూడా గాయాలతో బాధపడుతూ లంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమానంగా మారింది. టీమిండియా 2017లో చివరిసారి లంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పటి సిరీస్లో కోహ్లి, అశ్విన్తో పాటు పుజారా ఆడారు. ఈ సిరీస్లో ఆతిథ్య లంక జట్టును వైట్వాష్ చేసింది. తాజాగా గిల్ నేతృత్వంలోని టీమిండియా లంక గడ్డపై సరికొత్త సవాల్కు సిద్ధమయింది.Read: ‘అగార్కర్ వింటున్నావా? వైభవ్ను రోహిత్కు జతగా పంపాలి’ -
‘అగార్కర్ వింటున్నావా? వైభవ్ను రోహిత్కు జతగా పంపాలి’
వన్డే ప్రపంచకప్ 2027 దృష్ట్యా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్లో రోహిత్కు జతగా వైభవ్ను పంపించి కెప్టెన్ శుబ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని వెల్లడించాడు. దీనివల్ల మిడిలార్డర్ కూడా బలంగా మారుతుందని ఫరూఖ్ వెల్లడించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూఖ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. 'గిల్ క్లాస్ ప్లేయర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. అయితే ఆరంభంలోనే దూకుడుగా ఆడే స్వభావం గిల్కు లేదు. అయితే వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పాటు రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించగలడు. వైభవ్ ధాటిగా ఆడుతున్నాడంటే ఒక ఎండ్లో రోహిత్ క్రీజులో నిలబడేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ తన బ్యాట్కు పని చెప్పాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఇక క్లాస్ బ్యాటర్ అయిన గిల్కు నాలుగో స్థానం సరైనది. కోహ్లి ఎలాగూ మూడో స్థానంలో వస్తాడు. ఐదు, ఆరు స్థానాల్లో శ్రేయస్, రాహుల్ వస్తారు. అయితే వైభవ్ను వయసుతో ముడిపెడుతూ వన్డేల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. నా వరకు 15 ఏళ్ల వయసు అనేది వన్డే క్రికెట్లో ఎంట్రీకి అర్హతే. అయితే కొందరు మాత్రం వైభవ్ను టీ20ల్లోనే ఆడించాలని, వన్డేల్లో ఇప్పుడే అవసరం లేదని అంటున్నారు. కానీ ఒక బ్యాటర్కు ఏ ఫార్మాట్ అయినా పరుగులు చేయడమే ప్రధానం. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్లు విఫలమైనప్పటికీ, కుదురుకుంటే ఎంత ప్రమాదకారో ఇప్పటికే వైభవ్ రుచి చూపించాడు. అతడు ఆడితే ఓడినవాటి కంటే గెలిచే మ్యాచ్లే ఎక్కువగా ఉంటాయి. నా దృష్టిలో సర్ వీవీ రిచర్డ్స్ గొప్ప బ్యాటర్. అతడంత గొప్ప బ్యాటర్ను నేను చూడలేదు. ఇప్పుడు సూర్యవంశీ కూడా అలానే కనిపిస్తున్నాడు. రాబోయే కాలంలో వైభవ్ కచ్చితంగా భారతదేశ భవిష్యత్తు ఆశాకిరణంగా మారనున్నాడు.'అని ఫరూఖ్ ఇంజినీర్ చెప్పుకొచ్చాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్తో సిరీస్ల్లో అంతగా ఆకట్టుకోని వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో టీ20 సిరీస్లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్లు కలిపి 151 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు.Read: కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా! -
ట్విన్ బ్రదర్స్ పోరు.. సీఎస్కే బౌలర్కు చుక్కెదురు
ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్లో ట్విన్ బ్రదర్స్ పోరు అభిమానులను అలరించింది. 2026 ఎడిషన్లో భాగంగా ట్రెంట్ రాకెట్స్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన మ్యాచ్లో కవల సోదరులు క్రెయిగ్ ఓవర్టన్, జేమీ ఓవర్టన్ తలపడ్డారు. ఈ పోరులో ట్రెంట్ రాకెట్స్ ఆల్రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ పైచేయి సాధించాడు.చివరి ఐదు బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో తన కవల సోదరుడు జేమీ ఓవర్టన్ (లండన్ స్పిరిట్) బౌలింగ్ను ధాటిగా ఎదుర్కొని ట్రెంట్ రాకెట్స్కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. జేమీ ఓవర్టన్ ఐపీఎల్ 2026లో సీఎస్కే ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్కు బెన్ డకెట్ 47 బంతుల్లో 75 పరుగులతో అద్భుత ఆరంభం అందించాడు. చివర్లో క్రెయిగ్ ఓవర్టన్ కేవలం 6 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. జేమీ వేసిన చివరి ఓవర్లో సిక్సర్తో పాటు రెండు వరుస డబుల్స్ సాధించి మ్యాచ్ను ముగించాడు.అంతకుముందు లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 159/9 స్కోరు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ 24 బంతుల్లో 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ లియామ్ లివింగ్స్టోన్ 33 పరుగులు చేశాడు. క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్లోనూ సత్తా చాటి రెండు వికెట్లు తీశాడు.బట్లర్ విధ్వంసంమరో మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. బర్మింగ్హామ్ ఫీనిక్స్పై 87 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.బట్లర్ 50 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టుకు 187/5 భారీ స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో టామ్ మూర్స్ 17 బంతుల్లో అజేయంగా 39 పరుగులు జోడించాడు.188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్హామ్ ఫీనిక్స్ కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. లియామ్ డాసన్ 3/15తో రాణించగా, జోష్ టంగ్, సోనీ బేకర్, నూర్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టి ఫీనిక్స్ బ్యాటింగ్ను కుప్పకూల్చారు. కెప్టెన్ డొనోవన్ ఫెరెరా చేసిన 23 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు. -
కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ కసిగా కనిపిస్తున్నాడు. పేలవ ఫామ్తో జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ రీఎంట్రీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని వాసూ పరన్జేప్ క్రికెట్ అకాడమీలో సూర్యకుమార్ మూడు గంటల పాటు నెట్స్లో సాధన చేశాడు. దాదాపు 3 గంటల పాటు వెయ్యి బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ వినూత్న షాట్లు ఆడి అలరించాడు. మళ్లీ టీమిండియాలో ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అన్నంతగా సూర్యలో కసి కనిపిస్తుంది. నెట్స్లో చెమటోడ్చిన వీడియోను ఎక్స్లో పంచుకున్న సూర్య.. ‘సండే ఫన్డే. క్విక్ రన్. 3 గంటల పాటు వెయ్యి బంతులు ఆడాను. మంచి ఫీల్ వచ్చింది’ అని క్యాప్షన్ జత చేశాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్స్వీప్ చేసింది. ఇక 35 ఏళ్ల సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్గా 2026 టీ20 ప్రపంచకప్ను అందుకున్నాడు. అయితే బ్యాటర్గా విఫలమవుతూ వచ్చిన సూర్యకుమార్ ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో టీ20 కెప్టెన్సీ పదవిని కోల్పోయిన సూర్యకుమార్కు జట్టులోనూ చోటు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సూర్య టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత మహారాజ ట్రోఫీలో తన బ్యాటింగ్తో అదరగొట్టాడు. అప్పటినుంచి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న సూర్యకుమార్ కఠోర సాధన కొనసాగిస్తున్నాడు. Sunday was fun. Quick run 🏃🏾 Batted around 1000 balls for 3 hours. Felt good 💪 pic.twitter.com/x6wH9Ebpmv— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2026Read: మీరాబాయి స్వర్ణ పతకం వెనుక కన్నీటిగాథ! -
'గంభీర్ వద్దు; లక్ష్మణ్ ముద్దు'.. బీసీసీఐకి ఆటగాళ్ల విజ్ఞప్తి!
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గంభీర్ కోచ్గా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న వేళ.. తాత్కాలిక కోచ్గా లక్ష్మణ్ అదరగొట్టడంతో కోచ్ మార్పు చేయాలని కొందరు టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ వద్ద వాపోయినట్లు సమాచారం. టీమిండియా హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ను తొలగించి, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్కు పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాజాగా వరుస వైఫల్యాలతో జింబాబ్వే టూర్కు గంభీర్కు విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ను తాత్కాలిక కోచ్గా జట్టుతో పంపించారు. గంభీర్ కోచ్గా ఉన్న సమయంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ల్లో వరుస ఓటములు చవిచూసిన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జింబాబ్వే గడ్డపై తొలి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు లక్ష్మణ్ రాకతోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వే చిన్న జట్టే అయినప్పటికీ, వారిపై సాధించిన ఏకపక్ష విజయాలు మాత్రం టీమిండియా దూకుడును చూపెట్టింది. దీంతో కెప్టెన్తో పాటు పలువురు ఆటగాళ్లు గంభీర్ను తొలగించి లక్ష్మణ్ను కోచ్గా ఎంపిక చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ బీసీసీఐ గంభీర్ స్థానంలో లక్ష్మణ్కు హెడ్కోచ్ పదవి కట్టబెడితే, దానిని స్వీకరించడానికి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.ఇక టీమిండియా తాత్కాలిక కోచ్గా లక్ష్మణ్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. అతడి కోచింగ్లో టీమిండియా 2022లో వరుసగా ఐర్లాండ్పై 2-0తో, జింబాబ్వేపై 3-0తో, న్యూజిలాండ్పై 1-0తో టీ20 సిరీస్లు గెలుచుకుంది. అయితే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయినప్పటికీ, మళ్లీ 2024లో జింబాబ్వేపై 4-1 తేడాతో, సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్లు గెలుచుకుంది. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియాకు వీవీఎస్ లక్ష్మణ్ లక్కీ కోచ్గా మారిపోయాడు. మరి టీమిండియా కోచ్ మార్పు తధ్యమేనా! 🚨 BREAKING NEWS 🚨🚨 INDIA PLAYERS REPORTEDLY WANT VVS LAXMAN AS PERMANENT HEAD COACH 🚨According to reports, several Indian team players have reportedly requested the BCCI to consider appointing VVS Laxman as the permanent head coach. The reports claim some players believe… pic.twitter.com/uiwSTwNi38— Muffatball vikrant (@Vikrant_1589) July 26, 2026చదవండి: ‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్కు చురకలు! -
‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్కు చురకలు!
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగుల మెరపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్లో రెండు అర్ధసెంచరీలు సాధించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా ఎగరేసుకుపోయాడు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే టూర్కు గంభీర్ స్థానంలో కోచ్గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న వైభవ్కు ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. చిన్న వయసులో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వైభవ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం మరింత కష్టపడాలని యాజమాన్యం కోరుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. 'వైభవ్ గురించి మాకు బాగా తెలుసు. సుమారు రెండున్నరేళ్ల క్రితం, 2024 అండర్-19 ప్రపంచకప్నకు ముందే అతని ప్రతిభను గుర్తించాం. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్లో ఇండియా-బి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వైభవ్ ఒకడిగా ఉన్నాడు. అప్పటి నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్యాంపుల్లో వైభవ్ నిరంతరం శిక్షణ పొందుతున్నాడు. అంతేకాదు అండర్-19 ప్రపంచకప్లోనూ వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్గానూ నిలిచాడు. వైభవ్లో వచ్చిన పరిణతి, అవగాహన అసాధారణంగా పెరిగాయి. అందుకే కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని, ఒత్తిడిలో మేటి ఆటగాళ్లపై రాణించగలుగుతున్నాడు. అయితే, అతను మెరుగుపరుచుకోవాల్సిన ముఖ్యమైన అంశం అతని ఫిట్నెస్. అతని వయసు కేవలం 15 ఏళ్లేనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆఖరి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడినా, మైదానంలోనే ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ, మా ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు పంపించాల్సి వచ్చింది. జట్టు కోసం ప్రతీ విషయంలోనూ ది బెస్ట్ అందించాలనే తపన అతనిలో ఉంది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ये #VaibhavSooryavanshi के बारे में बात कर रहे है।“वैभव हर कीर्तिमान पार करेगा”इनका नाम VVS Laxman हैं जिन्हें तब की Mighty आस्ट्रेलियाई खिलाड़ी और मीडिया "Very Very special "Laxman" बोला करती थी।जिसने 134 टेस्ट मैच खेला है और कभी टीम इंडिया के मशहूर fab-4 का हिस्सा थे।…— Uday Yadav (@USY_79) July 27, 2026 -
టీమిండియాలోకి కొత్తగా ఎనిమిది మంది
భారత క్రికెట్ జట్టు 2026లో యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా అన్ని ఫార్మాట్లలో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. టెస్టుల్లో మానవ్ సుతార్ అరంగేట్రం చేయగా, వన్డేల్లో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ భారత జెర్సీ ధరించారు. టీ20ల్లో ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగు వేశారు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా రాబోయే ఐసీసీ టోర్నీలు, 2028 ఒలింపిక్స్ వంటి ప్రధాన ఈవెంట్ల కోసం బలమైన బెంచ్ స్ట్రెంగ్త్ను సిద్ధం చేయాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది.2026లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు:టెస్టులు: * మానవ్ సుతార్ – ఆఫ్ఘనిస్తాన్తో, ముల్లాన్పూర్వన్డేలు:* హర్ష్ దుబే – ఆఫ్ఘనిస్తాన్తో, ధర్మశాల* గుర్నూర్ బ్రార్ – ఆఫ్ఘనిస్తాన్తో, ధర్మశాల* ప్రిన్స్ యాదవ్ – ఆఫ్ఘనిస్తాన్తో, లక్నోటీ20లు:* ప్రిన్స్ యాదవ్ – ఐర్లాండ్తో, బెల్ఫాస్ట్* సూర్యాంశ్ షెడ్గే – ఐర్లాండ్తో, బెల్ఫాస్ట్* వైభవ్ సూర్యవంశీ – ఇంగ్లండ్తో, మాంచెస్టర్* అశోక్ శర్మ – జింబాబ్వేతో, హరారే* యశ్ ఠాకూర్ – జింబాబ్వేతో, హరారేఈ ఏడాది అరంగేట్రం చేసిన ఈ ఎనిమిది మందిలో వైభవ్ సూర్యవంశీపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అతను సత్తా చాటకపోయినా, ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో అతను 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. బౌలర్ల విషయానికొస్తే..ప్రిన్స్ యాదవ్ (6 టీ20ల్లో 9 వికెట్లు), గుర్నూర్ బ్రార్ (6 మ్యాచ్ల్లో 11 వికెట్లు) సత్తా చాటారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ దృష్ట్యా ఈ ఏడాది మరికొంత మంది ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. -
సిక్సర్లతో షెపర్డ్ విధ్వంసం.. గయానాకు భారీ విజయం!
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ రొమారియో షెపర్డ్ గ్లోబల్ టీ20 లీగ్లో విధ్వంసం సృష్టించాడు. ఆరు సిక్సర్లతో షెపర్డ్ (21 బంతుల్లో 52 నాటౌట్) గయానా అమెజాన్ వారియర్స్ను ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రిలీ రోసౌ (48 బంతుల్లో 61) అర్ధసెంచరీ సాధించగా, కైల్ మేయర్స్ (18 బంతుల్లో 35), బెవన్ జాకబ్స్ (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో వృత్యా అరవింద్ (11 బంతుల్లో 28 నాటౌట్) ధాటిగా ఆడడంతో డెసర్ట్ వైపర్స్ 200 పరుగుల మార్క్ను దాటింది. అనంతరం గయానా అమెజాన్ వారియర్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మొహమ్మద్ నబీ (29 బంతుల్లో 40 నాటౌట్) యాంకర్ రోల్ పోషించాడు. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్ (15 బంతుల్లో 31), క్వింటిన్ సాంప్సన్ (17 బంతుల్లో 35) తొలి వికెట్కు 55 పరుగులు జోడించారు. మధ్యలో వికెట్లు కోల్పోయిన గయానా ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో నబీకి జత కలిసిన షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షంతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 21 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న షెపర్డ్ చివర్లో ఔటైనా డ్వేన్ ప్రిటోరియస్ (9 బంతుల్లో 17 నాటౌట్)తో కలిసి నబీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, కారీ పియర్రే, విటెల్ లాస్ చెరో 2 వికెట్లు తీశారు.Runs - 52.Fours - 2.Sixes - 6.Strike rate - 247.61ROMARIO SHEPHERD SMASHED FIFTY OF JUST 21 BALLS.🥶🙇♂️#GSL | #Cricket pic.twitter.com/0bg3vaT4tZ— Rana Ahmad. (@AhmadRana056) July 26, 2026Read: కామన్వెల్త్ గేమ్స్లో అపశ్రుతి.. జిమ్నాస్టిక్స్లో భయానక దృశ్యం! -
హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ప్లాన్!
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. 2027 వన్డే వరల్డ్కప్ వరకు పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించాలనే ఉద్దేశంతో అప్పటివరకు జరగనున్న ద్వైపాక్షిక సిరీస్లకు అతడిని ఎంపిక చేయబోమని బీసీసీఐ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయం బారిన పడ్డ పాండ్యా కోలుకొని ఫిట్నెస్ సాధించిన పాండ్యాను మొదట అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేశారు. కానీ ఇదే సమయంలో పాండ్యాకు తొడ కండరాల్లో గాయం తిరగబెట్టడంతో ఆఫ్గన్తో పాటు ఇంగ్లండ్ సిరీస్కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరంలోనే చికిత్స తీసుకుంటున్న పాండ్యా పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నాడు. రేవ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం పాండ్యా తన ఫిట్నెస్పైనే పూర్తి దృష్టి సారించాడని తెలుస్తోంది. అందుకే పూర్తిగా కోలుకున్నా ఇప్పుడే టీమిండియాలోకి రాకూడదనే ఉద్దేశంతో పాండ్యా 'పర్ఫార్మెన్స్ బ్లాక్' పేరిట దీర్ఘకాలిక ఫిట్నెస్ టార్గెట్ చేసుకొని దానిని అనుసరిస్తున్నట్లు సమాచారం. 32 ఏళ్ల వయసున్న పాండ్యా ఇప్పటికే తన ప్రోగ్రామ్లో గరిష్ట ఫిట్నెస్ను సాధించేందుకు దగ్గర్లో ఉన్నాడని, అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కూడా పాండ్యాను 2027 వన్డే వరల్డ్కప్ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆచితూచి వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. అందుకే వన్డే ప్రపంచకప్లోపు జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో పాండ్యాను ఎక్కువగా ఆడించే అవకాశం లేదనిపిస్తోంది. ఒకవేళ సెలెక్ట్ చేసినా అది 50 ఓవర్ల ఫార్మాట్ మాత్రమే అతడికి ప్రాధాన్యమివ్వనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 వన్డే ప్రపంచకప్లో ఆల్రౌండర్గా పాండ్యా కీలకం కానున్నాడని బీసీసీఐ బలంగా నమ్ముతోంది. అందుకే ప్రపంచకప్ సమీపిస్తుందనగా, అప్పుడు జరిగే వన్డే సిరీస్లకు పాండ్యాను ఎంపిక చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యాను ఆ ఫ్రాంచైజీ విడుదల చేయనుంది. దీంతో ట్రేడింగ్లో పాండ్యా కేకేఆర్ లేదా చెన్నై జట్లకు వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.Read: ‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’ -
‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’
జింబాబ్వే పర్యటనలో తొలి టీ20లో మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ రెండో టీ20లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లతో టీమిండియా రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇషాన్ కిషన్ వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్తో పాటు సీనియర్ ప్లేయర్లు వైభవ్కు ఎలాంటి సలహాలు ఇస్తుందని ఇషాన్ కిషన్ను అడిగారు. దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. సోషల్ మీడియా, ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం తన ఆటపై దృష్టి పెట్టాలని మాత్రమే వైభవ్కు ఒక అన్నలా సలహా ఇస్తుంటానని పేర్కొన్నాడు. వైభవ్కు ఎంతో భవిష్యత్తు ఉన్న కారణంగా అతడిని కాపాడుకునేందుకు భారత జట్టు ఒక స్పష్టమైన వ్యూహాన్ని, ప్రణాళికలను రచించిందని ఇషాన్ కిషన్ తెలిపాడు.ఇషాన్ మాట్లాడుతూ.. ‘వైభవ్ నిజానికి చాలా తెలివైనవాడు. తాను ఏం చేస్తున్నాడో, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ప్రవర్తించాలో, మైదానంలో ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. అదే సమయంలో, అతను వచ్చిన నేపథ్యం వల్ల కావొచ్చు కొంత పరధ్యానం ఉండొచ్చు. మన స్నేహితుల వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. నేను కూడా అదే నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. క్రికెట్ ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు దేనిపై దృష్టి పెట్టాలన్న దానిపై క్లియర్గా ఉన్నాను. నేను మాత్రమే కాదు, వైభవ్తో పాటు అభిషేక్, అక్షర్ భాయ్, ఇంకా అతనితో మాట్లాడే చాలా మంది ఆటగాళ్లు ఇదే దృష్టితో వ్యవహరిస్తారు. ప్రస్తుతం వైభవ్ సోషల్ మీడియాలో ఏం జరుగుతోందన్నది, బయటి గోల ఏంటనేది, పరుగులు చేయడంలో విఫలమైనప్పుడు తనపై వచ్చే విమర్శలను పక్కనబెట్టి కేవలం క్రికెట్ గురించే ఆలోచించేలా చూసుకుంటాము. వైభవ్ది చిన్న వయసు కాబట్టి తప్పుడు కారణల వల్ల పరధ్యానంలోకి వెళ్లకూడదని కోరుకుంటాం. సహచరులుగా మేమంతా వైభవ్ను ఒక తమ్ముడిలానే చూసుకుంటాం. వైభవ్ గనుక క్రీజులో నిలదొక్కుకుంటే పవర్ ప్లేలోనే 80-90 పరుగులు రాబట్టగలడు, అతనొక్కడే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. 🚨 ISHAN KISHAN ON VAIBHAV SOORYAVANSHI 🇮🇳"We're all trying to guide Vaibhav like an elder brother so he avoids the mistakes we made early in our careers. Axar, Abhishek and the whole group are doing their best to help him."#IshanKishan #VaibhavSooryavanshi #TeamIndia…— KUMAR (@MyCric101) July 25, 2026Read: హండ్రెడ్లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం -
హండ్రెడ్లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. తాజాగా సదరన్ బ్రేవ్ జట్టు ప్లేయర్ జేమిమా రోడ్రిగ్స్ అజేయ ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో జట్టును గెలిపించింది. విషయంలోకి వెళితే శనివారం డబుల్ హెడర్లో భాగంగా తొలి మ్యాచ్లో సన్రైజర్స్ లీడ్స్, సదరన్ బ్రేవ్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 116 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాని స్మిత్ (48), అనాబెల్ సదర్లాండ్ (22), దీప్తి శర్మ (23) రాణించారు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో ఇస్సీ వాంగ్ మూడు వికెట్లు తీయగా, టిల్లీ కొలెమన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం సదరన్ బ్రేవ్స్ 96 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జేమిమా రోడ్రిగ్స్ (34 బంతుల్లో 42 నాటౌట్, 4 ఫోర్లు) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. సన్రైజర్స్ లీడ్స్ బౌలర్లలో కాసిడి మెక్కార్తీ 2 వికెట్లు తీయగా, జెస్ జొనాసన్, అనాబెల్ సదర్లాండ్, డానియెల్లె గిబ్సన్ తలా ఒక వికెట్ తీశారు. మరో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లండన్పై వెల్ష్ ఫైర్ జట్టు 60 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ వుమెన్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సోఫి డివైన్ (52) అర్ధసెంచరీ సాధించగా, జార్జియా వోల్ (42), జార్జియా వర్హెమ్ (43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ లండన్ 92 బంతుల్లో 117 పరుగులకు కుప్పకూలింది. చినెల్లి హెన్రీ (30) టాప్ స్కోరర్గా నిలిచింది. గ్రేస్ పాట్స్ 3 వికెట్లు పడగొట్టింది. Ice in her veins! Jemimah Rodrigues closes out the chase 💫She delivers a memorable victory under pressure!#TheHundred 2026 👉 Sunrisers Leeds v Southern Brave pic.twitter.com/6YyTj5DWuM— Star Sports (@StarSportsIndia) July 25, 2026"Stay calm, stick to our plans, keep it simple and enjoy cricket" 🏏Hear from the Match Hero Jemimah Rodrigues after her fantastic knock to help Southern Brave beat Sunrisers Leeds 💯 pic.twitter.com/5aXY4eGnZ9— Sky Sports Cricket (@SkyCricket) July 25, 2026చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్! -
ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్!
నీట్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా యువతరం భగ్గుమనడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఉద్యమానికి యువతరం పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో చివరకు కేంద్రం తలవంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత జట్టు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. నీట్ లీకేజీ వ్యవహారంలో తన బాధ్యతల్లో విఫలమైన ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లే.. గంభీర్ కూడా టీమిండియా వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ హెడ్కోచ్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ డిమాండ్ చేయడం ఆసక్తి కనిపించింది. విద్యార్థులు చేసిన ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చినట్లే.. గంభీర్ కూడా తమ నిరసనలకు దిగిరావాలని, లేకుంటే రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సి వస్తుందని హెచ్చరించడం గమనార్హం. గంభీర్ ఇలాగే కోచ్గా కొనసాగితే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్లో భారత్ ఓటమి ఖాయమని కొందరు జోస్యం చెబుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ హర్షిత్ రానా, సుందర్ లాంటి క్రికెటర్లకు తరచూ అవకాశాలు ఇస్తున్నాడని, సీనియర్లకు అవకాశాలు తగ్గేలా చేయడంలో గంభీర్దే కీలకపాత్ర అని విమర్శిస్తున్నారు. అయితే ఇటీవలే గంభీర్ హెడ్కోచ్గా ఐర్లాండ్ చేతిలో 2-0తో, ఇంగ్లండ్ చేతిలో 4-0తో ఓడిన టీమిండియా ఆ తర్వాత వన్డే సిరీస్ను కూడా 2-1తో కోల్పోయింది. దీంతో ప్రస్తుతం జింబాబ్వే టూర్కు గంభీర్కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ను మెంటార్గా జట్టుతో పంపించారు. కోచ్ మారగానే టీమిండియా టీ20 సిరీస్ను గెలుచుకోవడంతో పాటు, తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్ కూడా గంభీర్ను ట్రోల్స్కు గురయ్యేలా చేసింది. అయితే కొంతమంది గంభీర్ మద్దతుదారులు మాత్రం అతడి కోచింగ్ సారథ్యంలోనే టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిందన్న విషయం మరువకూడదని కామెంట్లు చేశారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్తో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్కు సెగ తగిలినట్లయింది. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ మాత్రమే కావడంతో బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. Education Minister Dharmendra Pradhan resigned. pic.twitter.com/Ne2s3DMB50— TukTuk Academy (@TukTuk_Academy) July 25, 2026🚨 FAN PROTESTS GROW AGAINST GAMBHIR 🚨Growing frustration over Team India's recent performances has sparked fresh online campaigns and fan protests demanding Gautam Gambhir step down as head coach! 🇮🇳🏏🔥 pic.twitter.com/KlXfpDb364— CreaseBuzz (@CreaseBuzz) July 25, 2026Ab resignation aa gaya hai toh asli protest shuru karein?#CJP #dharmendrapradharesign pic.twitter.com/GmC7Ze5S5e— Tigerexch.ai (@Tigerexch_ai) July 25, 2026 -
సిరీస్ విజయం.. టీ20ల్లో నంబర్వన్గా టీమిండియా
ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లు కోల్పోయిన టీమిండియా నెంబర్వన్ ర్యాంకును కూడా కోల్పోయింది. తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పనిలో పనిగా మరోసారి పొట్టి ఫార్మాట్లో అగ్రపీఠాన్ని అందుకుంది. 60 మ్యాచ్లాడిన టీమిండియా 268 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లండ్ (268 పాయింట్లు) ఉండగా, 260 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, భారత్ మధ్య పాయింట్ల మధ్య వ్యత్యాసం లేకున్నప్పటికీ భారత్ ఎక్కువ మ్యాచ్లు ఆడడంతో నంబర్వన్ స్థానాన్నితిరిగి హస్తగతం చేసుకుంది. మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే మాత్రం టీమిండియా నంబర్వన్ ర్యాంకు మరింత పటిష్టం కానుంది.శనివారం జరిగిన రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకాలతో మెరిశారు.అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది. చదవండి: ఫైనల్కు దూసుకెళ్లిన అనాహత్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు -
టీమిండియా మాజీ క్రికెటర్పై చీటింగ్ కేసు
టీమిండియా మాజీ క్రికెటర్ రాజేశ్ చౌహాన్పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తిని రూ. 15 లక్షలకు పైగా మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా స్థానిక కోర్టు ఆదేశాల మేరకు జులై 24న మోహన్ నగర్ పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ సెక్షన్ 316(2) (నమ్మకద్రోహం) కింద కేసు నమోదైంది.ఆరోపణ ఏంటంటే..?మాజీ భారత, మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహాన్, జిందాల్ స్టీల్ కంపెనీతో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు కుదిర్చిస్తానని దింకర్ విశ్వమిత్ర అనే వ్యక్తికి హామీ ఇచ్చి రూ. 15.1 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణ. ఈ మేరకు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించగా, పోలీస్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చౌహాన్ హామీ ఇచ్చారు. దీంతో 2021 జులైలో చౌహాన్ సంస్థ 'గోవింద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ'తో విశ్వమిత్ర ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట చెక్కు రూపంలో రూ. 2.51 లక్షలు, అనంతరం మిగిలిన రూ. 12 లక్షలను సంస్థ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు.అయితే పెట్టుబడి అనంతరం చౌహాన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఫిర్యాదుదారు నేరుగా జిందాల్ స్టీల్ లిమిటెడ్ను సంప్రదించగా, చౌహాన్కు కానీ, గోవింద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి కానీ ఎలాంటి కాంట్రాక్టు ఇవ్వలేదని తేలింది. దీంతో తాను మోసపోయినట్లు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించారు.చౌహాన్ స్పందనఈ వ్యవహారంపై గతంలో పీటీఐతో మాట్లాడిన చౌహాన్, ఇది వ్యాపార వివాదం మాత్రమేనని పేర్కొన్నారు. "ఫిర్యాదుదారుకు చెందిన కొంత మొత్తాన్ని ఇప్పటికే తిరిగి చెల్లించాం. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన మొత్తం చెల్లింపులో ఆలస్యం జరిగింది" అని ఆయన వివరణ ఇచ్చారు.క్రికెట్ కెరీర్బిహార్లో జన్మించిన రాజేష్ చౌహాన్ 1988/89 నుంచి 2000/01 వరకు మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. 1993లో ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 21 టెస్టులు, 35 వన్డేలు ఆడి 76 వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్లో దాదాపు 100 ఫస్ట్-క్లాస్, అంతే సంఖ్యలో లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడి 400కు పైగా వికెట్లు తీశారు. 2000/01లో క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత, 59 ఏళ్ల చౌహాన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. -
జింబాబ్వేతో రెండో టీ20.. అభిషేక్పై వేటు పడనుందా!
హరారే వేదికగా ఇవాళ జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్కు సిద్ధమైన టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. తొలి టీ20 మ్యాచ్లో బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవ్వడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకొని మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరోసారి అదే వేదికలో మ్యాచ్ ఆడుతుండడంతో, రెండో టీ20లోనూ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది. అయితే ఓపెనింగ్లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అనుకుంటే మాత్రం తొలి టీ20లో ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మను తప్పించి అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఆడించే అవకాశముంది.ఇది మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మూడో స్థానంలో హార్డ్ హిట్టర్ ఇషాన్ కిషన్ రానుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో తిలక్ వర్మ, రింకూ సింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఫినిషర్గా శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.ఇక బౌలింగ్ విషయానికొస్తే రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మయాంక్ తాను ఆడిన తొలి మ్యాచ్లోనే ప్రభావం చూపించాడు. మయాంక్ యాదవ్తో పాటు ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మలతో పేస్ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయి మరోసారి కీలకంగా మారనున్నాడు. టీమిండియా ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, ఒక ఆల్రౌండర్ కాంబినేషన్తో రెండో టీ20లో బరిలోకి దిగనుంది.భారత తుదిజట్టు అంచనా: వైభవ్ సూర్యవంశీ, ప్రబ్సిమ్రాన్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్. -
‘హ్యాండ్షేక్’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్!
ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో విరాట్ కోహ్లి, ట్రావిస్ హెడ్ల మధ్య షేక్ హ్యాండ్ ఘటన ఎంత పెద్ద వివాదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఐపీఎల్ ముగిసిన రెండు నెలల తర్వాత హెడ్ 'హ్యాండ్షేక్' వివాదం ఘటనపై మౌనం వీడాడు. ఈ సంఘటన తర్వాత హెడ్, కోహ్లి మధ్య బంధం పూర్తిగా చెడిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై హెడ్ స్పందిస్తూ.. 'మా మధ్య ప్యాచ్-అప్ (రాజీ) చేసుకోవడానికి ఏమీ లేదు. కోహ్లితో నా సంబంధాలు ఎప్పటిలాగే సాధారణంగా ఉన్నాయి. మైదానంలో ఏం జరిగిందో అది లీగ్ ప్రక్రియలో భాగమే తప్ప, మా మధ్య ఎలాంటి వివాదం లేదు' అని స్పష్టం చేశాడు. అయితే మైదానంలో జరిగే విషయాలను ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా స్వీకరిస్తానని, కానీ సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం బాధించిందని హెడ్ ఆవేదన వ్యక్తం చేశాడు.'ఇలాంటి ఘటనలు క్రీడా ప్రపంచంలో సహజమేనని నేను, జెస్సికా ముందే గ్రహించాం. కానీ కొంతమంది పనిగట్టుకొని నా కుటుంబంపై అసభ్యకర కామెంట్లు చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. జెస్సికా ఈ పరిస్థితిపై చాలా పరిణితితో వ్యవహరించడంతోనే సమస్య పెద్దది కాలేదు. మరో ఐపీఎల్ వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు అందరూ మర్చిపోతారు. కానీ ఇలాంటి విషయాలను సీరియస్గా తీసుకుంటున్న కొందరు మాత్రం అదే పనిగా ఆటగాళ్ల కుటుంబాలను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసి వేధించడం నిజంగా బాధాకరం.' అని హెడ్ విచారం వ్యక్తం చేశాడు.ఆరోజు ఏం జరిగింది?ఐపీఎల్ 2026 సీజన్లో మే 22న జరిగిన ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ భారీ షాట్లు ఆడుతుండగా.. కోహ్లి హెడ్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించాడు. నువ్వే వచ్చి బౌలింగ్ చేయ్యి అంటూ సైగలు చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. హెడ్ మాత్రం చిరునవ్వుతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్షేక్లు చేసుకుంటుండగా.. కోహ్లి హెడ్ పట్ల మరోసారి అవమానకరంగా ప్రవర్తించాడు. కమిన్స్, అభిషేక్ శర్మలతో మాట్లాడి.. హెడ్ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగిపోయాడు. కోహ్లి ఇలా చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన అప్పట్లో వైరల్ అయింది.Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026#ViratKohli 🆚 #TravisHead 🥵🤯Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T— Star Sports (@StarSportsIndia) May 22, 2026Read: పాక్తో సిరీస్కు ఎంపిక.. ఆడేందుకు విండీస్ ప్లేయర్ నిరాకరణ! -
పాక్తో సిరీస్కు ఎంపిక.. ఆడేందుకు విండీస్ ప్లేయర్ నిరాకరణ!
పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం జట్టును ప్రకటించింది. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ పాక్తో సిరీస్కు దూరమైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడడం తనకు ఇష్టం లేదన్న కారణంగానే, జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ అల్జారీ జోసెఫ్ ఆడేందుకు నిరాకరించాడని విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్జారీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకోలేదని, పాక్తో మ్యాచ్లు ఆడేందుకు అతడు నిరాకరించడంతో జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని సామీ పేర్కొన్నాడు. జోసెఫ్ లేకపోవడం విండీస్కు పెద్ద లోటు అని, కానీ తమ జట్టు పాక్పై రాణిస్తుందని సామీ ధీమా వ్యక్తం చేశాడు. జట్టు ఎంపిక అనంతరం కోచ్ డారెన్ సామీ మీడియాతో మాట్లాడాడు. జోసెఫ్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సామీ మాట్లాడుతూ.. ‘అల్జారీ జోసెఫ్ పాక్తో ఆడేందుకు నిరాకరించిన విషయం నా పరిధిలో లేదు. సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నఒక ఆటగాడు ఇలా జట్టు ఎంపికను తిరస్కరించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా లేదా పరిష్కారాలు కనుగొనాలన్నా అది బోర్డు డైరెక్టర్లకే వదిలేస్తున్నా’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. 29 ఏళ్ల అల్జారీ జోసెఫ్ ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్లో ఆడాడు. రెండు మ్యాచులలో 6 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అల్జారీ జోసెఫ్ వెస్టిండీస్ తరఫున 42 టెస్టులు ఆడాడు. ఇందులో ఏకంగా 130 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 141, 45 టీ20లలో 62 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. వెస్టిండీస్, పాక్ మధ్య తొలి టెస్టు శనివారం ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 2 నుంచి జరుగుతుంది. -
బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. ఆఫ్గన్తో టీ20 సిరీస్ వాయిదా?
టీమిండియాతో ఢిల్లీ వేదికగా చారిత్రక టీ20 సిరీస్ ఆడాలని భావించిన అఫ్గానిస్తాన్కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సెప్టెంబర్లో జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో టీమిండియాతో వైట్బాల్ టూర్ ప్లాన్ చేయనుండడమే వాయిదాకు కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్లో రాజకీయ అస్థిరత కారణంగానే ఆ జట్టు తమ మ్యాచ్లను యూఏఈ లేదా భారత్ వేదికగా ఆడాలని నిర్ణయిం చుకుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాతో టీ20 సిరీస్కు ప్లాన్ చేసింది. ఢిల్లీ వేదికగా ప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్ల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ సిరీస్కు అఫ్గానిస్తాన్ హోస్ట్గా వ్యవహరిస్తుండగా, సొంతగడ్డపై టీమిండియా పర్యాటక జట్టుగా మ్యాచ్లు ఆడనుండడం విశేషం.బంగ్లాదేశ్ అడ్డుపుల్ల..కొన్నాళ్ల కిందట భారత్తో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం మనతో సంబంధాలు తిరిగి బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికా వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సమావేశాల్లోనూ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్తోనే ఆ బంధాన్ని తిరిగి మొదలుపెట్టాలని బంగ్లా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య టీమిండియా తమ గడ్డపై ఆరు మ్యాచ్ల వైట్ బాల్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) ఆడేలా ఇప్పటికే బీసీసీఐకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే బీసీసీఐ బంగ్లాదేశ్ టూర్కు పచ్చజెండా ఉపనుంది. ఒకవేళ బీసీసీఐ ఆమోదం పొందితే మాత్రం అదే సమయంలో జరగాల్సిన ఆఫ్గన్తో టీ20 సిరీస్ వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి ఆసియా గేమ్స్ ఉండడం, ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్తో సిరీస్ ఉండడంతో అఫ్గానిస్తాన్తో సిరీస్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ లెక్కన విండీస్తో సిరీస్ ముగిసిన తర్వాత అంటే నవంబర్లో ఆఫ్గన్తో టీ20 సిరీస్ ఆడే అవకాశముంటుంది.రాజకీయ వివాదం..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలోని యువత భారత్పై విష ప్రచారాలు చేస్తూ మతోన్మాద చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ చర్యలను సీరియస్గా తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత ప్రభుత్వం ఆదేశాలతో కేకేఆర్ జట్టు బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ను తొలగించింది. దీంతో ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆడలేమంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయినప్పటికీ బంగ్లా తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఆ టోర్నీకి బంగ్లాదేశ్ దూరంగా ఉండిపోయింది. అయితే బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత తారిక్ రెహమాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలోనే క్రికెట్ ద్వారా భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తారిక్ రెహమాన్ ప్రభుత్వం భావిస్తోంది. మరి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ టూర్లో పాల్గొనేందుకు బీసీసీఐకి అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.Read: బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్గా తిలక్ వర్మ రికార్డు -
బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్గా తిలక్ వర్మ రికార్డు
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా తొలి టీ20లో విజయం ద్వారా టీమిండియా వరుస ఓటములకు చెక్ పెట్టింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్ ఆ తర్వాత వైభవ్ విధ్వంసంతో సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. ఇవాళ హరారే వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ఒడిసిపట్టాలని చూస్తోంది. ఇదిలా ఉంటే, జింబాబ్వే సిరీస్కు హెడ్కోచ్ గంభీర్కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ను మెంటార్గా జట్టుతో పంపించారు. తొలి టీ20లో విజయం తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ డ్రెస్సింగ్ రూమ్లో విన్నింగ్ సందేశాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్లో అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. Photo Credit: BCCI Twitterఅయితే బీసీసీఐ ఇటీవల ‘బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ప్రవేశపెట్టింది. తాజాగా ఈ అవార్డును తిలక్ వర్మ అందుకున్నాడు. తిలక్వర్మకు అవార్డు ఇవ్వడంపై లక్ష్మణ్ వివరణ ఇచ్చాడు. ‘గ్రౌండ్తో పాటు మైదానం వెలుపల కూడా తన నైపుణ్యంతో అద్భుత వైఖరి ప్రదర్శించినందుకు తిలక్ వర్మకు ఈ అవార్డు ఇస్తున్నట్లు’ లక్ష్మణ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్గా తిలక్ వర్మ నిలిచాడు. తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘జట్టుకు నా నుండి ఏమి అవసరమో అది చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను, దానికోసం నా వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. మరో విషయమేమిటంటే, నేను మైదానం వెలుపల చేసే కఠోర శ్రమ మైదానంలో నన్ను మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుంది. ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని తిలక్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. BCCI introduces a new 'Best Attitude of the Match' award, with Tilak Varma becoming its first-ever recipient following the 1st India vs Zimbabwe T20I at Harare!!! pic.twitter.com/FQv7VH5FDx— 𝓝𝓾𝓽𝓽𝔂𝓣𝓲𝓵𝓪𝓴 (@TilakVarmaaa) July 24, 2026Read: కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ -
సిక్సర్లతో జట్టును గెలిపించిన భారత బ్యాటర్!
హండ్రెడ్ కాంపిటీషన్ 2026లో భారత మహిళా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత వికెట్కీపర్ రిచా ఘోష్ రెండు భారీ సిక్సర్లతో తన జట్టును విజయతీరాలకు చేర్చడం మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ రిచా ( 5 బంతుల్లో 15 నాటౌట్, రెండు సిక్సర్లు) ధాటికి 59 బంతుల్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మిగిలినవారిలో పేజ్ స్కోఫీల్డ్ (15 బంతుల్లో 22 నాటౌట్), మెగ్ లానింగ్ (24 బంతుల్లో 21) రాణించారు. అంతకముందు లండన్ స్పిరిట్ వుమెన్ 91 బంతుల్లో 80 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చార్లెట్ డీన్ (14), చారిస్ పవెలి (13) పర్వాలేదనిపించారు. మాంచెస్టర్ బౌలర్లలో రియానా మెక్డొనాల్డ్ 4 వికెట్లతో సత్తా చాటింది.ఇక పురుషుల క్రికెట్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఏడు పరుగుల తేడాతో లండన్ స్పిరిట్పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. టిమ్ సిఫెర్ట్ (45 బంతుల్లో 67) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం లండన్ నైట్స్ 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 69 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించకలేకపోయాడు. Power-hitting at its finest! 💥#RichaGhosh dispatches two massive sixes to power Manchester Super Giants to a comfortable win over London Spirit! 🔥#TheHundred 2026 👉 London Spirit vs Manchester Super Giants | LIVE NOW! pic.twitter.com/dMeQaYE6Ol— Star Sports (@StarSportsIndia) July 23, 2026Read: ప్లాన్ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్ అప్పుడే! -
‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్లో బౌలర్లు రాణించగా, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీ సాధించడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయంలో తన పాత్రేమి లేదని, నిజానికి బౌలర్లే మ్యాచ్ విన్నర్లంటూ వైభవ్ పేర్కొన్నాడు. తానింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని.. గెలుపునకు అర్హుడిని కాదని వెల్లడించాడు.మ్యాచ్ విజయం తర్వాత బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్పగా బ్యాటింగ్ చేయడానికే ప్రయత్నిస్తాను. జట్టు కోసం ఎప్పుడూ నా బెస్ట్ ఇచ్చేందుకే కష్టపడుతుంటా. జింబాబ్వేపై విజయంలో నేను క్రెడిట్ తీసుకోలేను. దానికి నేను అర్హుడిని కాను. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నా’ అని వైభవ్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్లో ఫిఫ్టీ అనంతరం చేతి వేళ్లలో 'A' అక్షరం చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకోవడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు. ''A' అనేది మా అమ్మ పేరులో (Aarti Suryavanshi) మొదటి అక్షరం. నా హాఫ్ సెంచరీ సెలబ్రేషన్ను అందుకే A సంకేతంతో చూపించాను. నా కెరీర్లో సాధించిన తొలి అంతర్జాతీయ అర్ధసెంచరీని నా కుటుంబానికి, కోచ్లతో పాటు నా జర్నీలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ ఇన్నింగ్స్ను అంకితమి స్తున్నా.' అని వెల్లడించాడు. హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకు పరిమితమైంది. అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ 19 బంతుల్లో ఫిఫ్టీ సాధించగా, ఇషాన్ కిషన్ 35 పరుగులు చేశాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) జట్టును గెలిపించాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది.Read: అతడికి 2 నెలలే డెడ్లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు! -
అతడికి 2 నెలలే డెడ్లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు!
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ సెప్టెంబర్తో ముగియనున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే ప్రపంచకప్ వరకు తనను సెలెక్టర్గా కొనసాగేందుకు అవకాశమివ్వాలని అగార్కర్ చేసిన అభ్యర్థనను బీసీసీఐ పట్టించుకోనట్లుగా అనిపిస్తోంది. సెలెక్టర్గా ఎంపికైన తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్స్ సాధించినప్పటికీ అగార్కర్ విషయంలో మాత్రం విమర్శలే వ్యక్తమయ్యాయి. అందుకే అగార్కర్ను సెలెక్టర్గా కొనసాగించేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో కొత్త సెలెక్టర్ కోసం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. ఇక అగార్కర్ సెలెక్టర్ పదవి నుంచి దిగిపోతే మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు వన్డే వరల్డ్కప్ 2027 ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం సెప్టెంబర్ తర్వాత టీమిండియాకు కొత్త సెలెక్టర్ను చూసే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి జరగనున్న సిరీస్లకు కొత్త సెలెక్టర్ నేతృత్వంలోనే జట్టు ఎంపిక జరగనుంది. ఇక అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నాడు. Photo Credit: BCCI Twitterఅగార్కర్ పదవీకాలంలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నీలు ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024, చాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026.. వీటిల్లో మూడు టైటిళ్లు భారత జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయినప్పటికీ సెలెక్టర్గా అగార్కర్పై మాత్రం విమర్శలే రావడం గమనార్హం. జట్టు సెలక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టుకు కెప్టెన్ చేయడం, హార్దిక్ పాండ్యకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై అభిమానులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. తన నిర్ణయాలను మాత్రం అగార్కర్ బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చాడు. సెలక్షన్ అనేది కేవలం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమని అగార్కర్ ప్యానెల్ నిరూపించింది. టీ20 ప్రపంచకప్తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కారణంగా 2025లోనే అగార్కర్ సెలెక్టర్ పదవీకాలన్ని మరో ఏడాది పొడిగించిన బీసీసీఐ మరోసారి అతడి పదవీకాలాన్న పొడిగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదు.చదవండి: Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? -
Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ప్రతిష్టాత్మక 2026 ఆసియా గేమ్స్కు సంబంధించి క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏకకాలంలో పురుషుల, మహిళల క్రికెట్మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించారు. రెండు విభాగాల్లో టెస్టు సభ్యత్వం కలిగిన నాలుగు దేశాలు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్) నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. కాగా ఆసియా గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అటు పురుషుల.. ఇటు మహిళల క్రికెట్లో ఫైనల్ లేదా సెమీస్లోనే తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత్ తమ మ్యాచ్ను జపాన్తో ఆడనుంది. ఇక పురుషుల క్రికెట్లో మాత్రం టీమిండియా పాక్తో నేరుగా సెమీస్ లేదా ఫైనల్ పోరులో తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.పురుషుల క్రికెట్లో ఇలా..పురుషుల టోర్నీ విషయానికొస్తే టెస్టు సభ్యత్వం కలిగిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. క్వార్టర్స్లో మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుజట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ లీగ్ దశలో గ్రూప్-ఏ నుంచి అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉండగా; గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఓమన్ ఉన్నాయి. లీగ్ దశలో రెండు గ్రూప్ల్లో నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుకోనున్నాయి. క్వార్టర్స్లో గెలిచిన నాలుగు జట్లు సెమీస్లో తలపడనున్నాయి. సెమీస్లో గెలిచిన జట్లు స్వర్ణం కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, ఓడిన జట్లు కాంస్య పతక పోరు కోసం తలపడనున్నాయి. టెస్టు సభ్యత్వం కలిగినప్పటికీ అఫ్గానిస్తాన్ ప్రిలిమినరీ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.గ్రూప్-ఏ: అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఒమన్జపాన్తో హర్మన్ సేన అమీతుమీ..మహిళల విభాగంలోనూ ఇవే జట్లు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్మ్యాచ్లే నిర్వహించనున్నారు. క్వార్టర్ ఫైనల్లో భారత్తో జపాన్, థాయ్లాండ్తో పాకిస్తాన్, చైనాతో బంగ్లాదేవ్, శ్రీలంకతో మలేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్లో గెలిచిన జట్లు సెమీస్లో అడుగుపెట్టనున్నాయి. సెమీస్లో గెలిచిన జట్ల మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది.మహిళల క్రికెట్లో క్వార్టర్స్ షెడ్యూల్భారత్ vs జపాన్బంగ్లాదేశ్ vs చైనాశ్రీలంక vs మలేషియాపాకిస్తాన్ vs థాయిలాండ్సెమీ-ఫైనల్స్భారత్/జపాన్ vs బంగ్లాదేశ్/చైనాశ్రీలంక/మలేషియా vs పాకిస్తాన్/థాయిలాండ్2022లో డబుల్ స్వర్ణాలు..2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. ఆనాడు టీమిండియా పురుషుల కెప్టెన్గా రుతురాజ్ వ్యవహరించాడు. వర్షంతో ఫలితం రాకపోవడంతో అత్యధిక విజయాలు సాధించిన భారత్కు గోల్డ్ మెడల్ ఇవ్వగా, అఫ్గానిస్తాన్ వెండిని గెలుచుకుంది. ఇక హర్మన్ప్రీత్ సారథ్యంలోని మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ గేమ్స్లో పాకిస్తాన్ రెండు విభాగాల్లోనూ నాలుగో స్థానానికే పరిమితం కావడం గమనార్హం.Read: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
భారత్తో సిరీస్.. జింబాబ్వేకు భారీ ఎదురుదెబ్బ
స్వదేశంలో భారత్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు జింబాబ్వే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ మిల్టన్ షుంబా కుడి కాలి హామ్స్ట్రింగ్ గాయం కారణంగా మొత్తం సిరీస్కు దూరమయ్యాడు.మంగళవారం నిర్వహించిన స్కాన్లలో గాయం తీవ్రత బయటపడటంతో షుంబాను జట్టు నుంచి తప్పించినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన ఇన్నోసెంట్ కైయాను జట్టులోకి తీసుకుంది. కైయా ఇప్పటికే హరారేలో జట్టుతో చేరాడు.బంగ్లాదేశ్తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్తో షుంబా దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే భారత్తో సిరీస్కు ముందు గాయం అతని ఆశలకు గండికొట్టింది.కైయా విషయానికొస్తే.. ఇతను చివరిసారిగా 2024 జూలైలో భారత్పైనే, హరారే వేదికగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై మరోసారి అవకాశం దక్కింది.భారత్-జింబాబ్వే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ ఇవాళ (జూలై 23) హరారేలో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్లు జూలై 25, 26 తేదీల్లో ఇదే వేదికపై జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
భారత్తో టీ20 సిరీస్కు జట్టును ప్రకటించిన జింబాబ్వే
రేపటి నుంచి స్వదేశంలో భారత్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ వెస్లీ మధేవెరే, ఫాస్ట్ బౌలర్ న్యూమన్ న్యాంహురిని తిరిగి జట్టులోకి తీసుకోగా, వికెట్కీపర్-బ్యాటర్ తఫాడ్జ్వా సిగాకు తొలిసారి టీ20 జట్టులో చోటు కల్పించింది.సికందర్ రజా కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టు జులై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్తో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.ఆశించిన ప్రదర్శనలు లేకపోవడంతో మధేవెరేను ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్కు పక్కన పెట్టగా.. గాయం కారణంగా ఆ సిరీస్ను మిస్ అయిన న్యూమన్ న్యాంహురి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.న్యాంహురి స్థానంలో బంగ్లాదేశ్ సిరీస్లో అవకాశం పొందిన తనాకా చివాంగా ఈసారి కూడా జట్టులో స్థానం నిలబెట్టుకోగా.. క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తషింగా ముసెకివా ఈ సిరీస్కు ఎంపిక కాలేదు.జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనకా చివంగా, బెన్ కర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధవెరె, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరావా, న్యూమాన్ న్యాంహురి, మిల్టన్ షుంబా, తఫాడ్జ్వా సిగాకాగా, ఇటీవల బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో జింబాబ్వే అద్భుతాలు చేసింది. తొలుత ఏకైక టెస్ట్ మ్యాచ్ను, ఆతర్వాత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను (2-1) కైవసం చేసుకుంది. అయితే చివర్లో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను మాత్రం 1-2 తేడాతో కోల్పోయింది. రేపటి నుంచి భారత్తో జరుగబోయే సిరీస్లోనూ అదే జోరును కొనసాగించాలని సికందర్ రజా సేన లక్ష్యంగా పెట్టుకుంది. -
నేరాన్ని అంగీకరించిన వార్నర్.. ఆగస్టు 18న తుది తీర్పు!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ జైలుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తప్ప తాగి వాహనం నడిపినట్లు వార్నర్ తరఫు లాయర్ బుధవారం కోర్టు ఎదుట అంగీకరించాడు. దీంతో ఆగస్టు 18న వార్నర్కు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. విషయంలోకి వెళితే.. కొన్ని నెలల క్రితం ఈస్టర్ సండే రోజున వార్నర్ తన కారును వేగంగా నడుపుకుంటూ వచ్చాడు. అయితే దారిలో పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాండమ్ టెస్టింగ్ సైట్కు కొద్ది దూరంలోనే తన వాహనాన్ని ఆపాడు. వార్నర్పై అనుమానంతో పోలీసులు అతనికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, పరిమితికి మించి మద్యం సేవించినట్టు తేలింది. దీంతో వార్నర్ను అదుపులోకి తీసుకొని దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఈ కేసు విచారణ కోర్టుకు రాగా, వార్నర్ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయాడు. అయితే వార్నర్ తరఫు న్యాయవాది బాబీ హిల్ కోర్టుకు హాజరయ్యాడు. వార్నర్ ‘మిడ్ రేంజ్’లో డ్రింక్ చేశాడని కోర్టుకు వివరించాడు. అనంతరం వార్నర్ తన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు కూడా అతని తరఫు లాయర్ కోర్టకు తెలిపాడు. ‘చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి బాధ్యత వహించడం ముఖ్యం. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయినా సరే, ఈ ప్రమాదం ఎవరికైనా పొంచి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. లాయర్ వాదనలు విన్న కోర్టు ఆగస్టు 18న తీర్పు వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. వార్నర్ తన నేరాన్ని ఒప్పుకోవడంతో గరిష్టంగా 9 నెలల జైలు శిక్షతో పాటు 2200 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. లక్ష 48 వేలు) జరిమానా పడనుంది. అంతేకాదు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా లైసెన్స్ను హోల్డ్లో పెట్టి ఆరు నెలల పాటు డ్రైవింగ్ కూడా దూరంగా ఉండాలని తీర్పులో వెల్లడించే అవకాశముంది.Read: అర్జెంటీనా చీటింగ్.. కాక రేపుతున్న రొనాల్డో 'లైక్' వివాదం -
పదవి నుంచి తప్పుకున్న ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారికంగా ప్రకటించింది. అయితే షాహిదీ ఆటగాడిగా మాత్రం వన్డే జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.2021లో వన్డే జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన షాహిదీ ఆఫ్ఘనిస్తాన్కు ఎన్నో మరుపురాని విజయాలనందించాడు. అతడి నాయకత్వంలో ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో విశేష ప్రగతి సాధించింది. 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి అగ్ర జట్లపై చారిత్రాత్మక విజయాలు నమోదు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విశేషంగా రాణించింది. షాహిదీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, అతడు ఆటగాడిగా జట్టుకు సేవలు కొనసాగిస్తాడని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కొత్త వన్డే కెప్టెన్ను త్వరలోనే ప్రకటిస్తామని కూడా స్పష్టం చేసింది.ఇటీవల టెస్టు జట్టుకు రషీద్ ఖాన్ను కెప్టెన్గా నియమించిన ఆఫ్ఘనిస్తాన్ బోర్డు, ఇప్పుడు వన్డే జట్టుకు కూడా కొత్త నాయకుడిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. -
బెన్ స్టోక్స్ అదిరిపోయే రీఎంట్రీ.. సూపర్ శతకం
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ పోటీ క్రికెట్లోకి ఘనంగా తిరిగొచ్చాడు. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన మూడు వారాల తర్వాత వన్డే కప్ (ఇంగ్లండ్) బరిలోకి దిగిన స్టోక్స్.. డర్హమ్ తరఫున అజేయ శతకంతో అదరగొట్టాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత డర్హమ్ తరఫున లిస్ట్-ఏ మ్యాచ్ ఆడిన స్టోక్స్, డెర్బీషైర్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అజేయంగా 108 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.ఇన్నింగ్స్ మొత్తం తీవ్ర కండరాల నొప్పి (క్రాంప్స్)తో ఇబ్బంది పడినప్పటికీ, పోరాట పటిమను ప్రదర్శిస్తూ చివరి వరకు క్రీజ్లో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.అంతకుముందు బౌలింగ్లోనూ స్టోక్స్ తొమ్మిది ఓవర్లు వేసి వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. డెర్బీషైర్ 9 వికెట్లకు 256 పరుగులు చేసింది. మార్టిన్ ఆండర్సన్ (112) అద్భుత శతకం సాధించి జట్టుకు పోటీ స్కోరు అందించాడు.లక్ష్య ఛేదనలో డర్హమ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెన్ ఐచిసన్ రెండు వికెట్లు తీయడంతో ఆ జట్టు ఒత్తిడిలో పడింది. అయితే స్టోక్స్, విల్ రోడ్స్ (45)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం కొలిన్ అకర్మన్, ఒల్లీ రాబిన్సన్ కూడా విలువైన పరుగులు జోడించారు.అర్ధశతకం తర్వాత క్రాంప్స్తో మైదానంలోనే కుప్పకూలిన స్టోక్స్, నొప్పిని తట్టుకుని మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. చివరకు శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచి డర్హమ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. -
పరువు కాపాడిన హెట్మైర్, రూథర్ఫోర్డ్.. విండీస్దే చివరి వన్డే
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో వెస్టిండీస్ తన పరువును కాపాడుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్ను కివీస్కు అప్పగించిన వెస్టిండీస్ బుధవారం జరిగిన చివరి వన్డేలో మాత్రం 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 269 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన వెస్టిండీస్ 47.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ సీనియర్ బ్యాటర్ షిమ్రోన్ హెట్మైర్ (69 నాటౌట్) కడదాకా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించగా, షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ (61) అర్ధసెంచరీతో మెరిశాడు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 95 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. రూథర్ఫోర్డ్ ఔటయ్యాకా మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ హెట్మైర్ అజేయంగా నిలిచి విండీస్ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేడన్ లెన్నోక్స్ చెరో మూడు వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, మైకెల్ బ్రాస్వెల్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (69), నిక్ కెల్లీ (64), విల్ యంగ్ (56) అర్ధసెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో విటెల్ లాయిస్, అల్జారీ జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు. విండీస్ను గెలిపించిన హెట్మైర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోగా, సిరీస్లో 14 వికెట్లతో అదరగొట్టిన కివీస్ బౌలర్ జేడన్ లెనోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.చదవండి: అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా! -
అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా!
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐని ఒక అంశం తెగ కలవరపెడుతోంది. అదేంటంటే కండరాల గాయంతో బాధపడుతున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్కు సంబంధించి తుది జట్టును ఇంకా ప్రకటించనప్పటికీ అతడి గాయం తీవ్రత చాలా ఎక్కువగానే ఉండడంతో ఫిట్నెస్పై స్పష్టత రావడం లేదు. అందుకే శ్రీలంకతో టెస్టు సిరీస్కు జట్టు ప్రకటనను బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి మరో మూడు వారాలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ వారం చివర్లో లేదా వచ్చే సోమవారం నాటికి జట్టును ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. కండరాల గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 గాయంగా పరిగనణించే అవకాశాలున్నట్లు ఒక నివేదిక పేర్కొంటుంది. దీంతో సుందర్ గాయంపై పూర్తి నివేదిక వచ్చాకే జట్టును ప్రకటించాలనుకుంటున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా సుందర్ కండరాల గాయానికి గురవ్వడంతో ఆ మ్యాచ్లో బౌలింగ్కు కూడా దూరంగా ఉన్నాడు.ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. టెస్టు సిరీస్ కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు రెండో టెస్టు జరగనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తున్న ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. తొమ్మిది మ్యాచ్ల తర్వాత భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక 2017 తర్వాత శ్రీలంకలో భారత్ టెస్టు సిరీస్ ఆడడం ఇదే. 2017లో కోహ్లి కెప్టెన్సీలో లంకలో పర్యటించిన టీమిండియా 3-0 తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్రీలంక మాత్రం తాము ఆడిన చివరి టెస్టు సిరీస్ను వెస్టిండీస్కు 2-0తో కోల్పోయింది.చదవండి: ‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’ -
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ముంబై, సన్రైజర్స్ అరుదైన ఫీట్!
ఇంగ్లండ్ వేదికగా ప్రారంభమైన హండ్రెడ్ లీగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ ఫ్రాంచైజీలు శుభారంభం చేశాయి. ఏకకాలంలో ప్రారంభమైన హండ్రెడ్ మెన్స్, హండ్రెడ్ వుమెన్స్ టోర్నీల్లో విజయాలు అందుకున్నాయి. పురుషుల హండ్రెడ్ లీగ్లో సన్రైజర్స్ లీడ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోగా, అటు మహిళల విభాగంలో ముంబై ఇండియన్స్ లండన్పై సన్రైజర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. ఏకకాలంలో రెండు జట్లు ఒక దానిపై ఒకటి వేర్వేరుగా విజయాలు నమోదు చేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.దంచికొట్టిన పూరన్..పురుషుల హండ్రెడ్ లీగ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ 99 బంతుల్లో 143 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (27 బంతుల్లో 41), టామ్ అల్సోప్ (18 బంతుల్లో 31) దూకుడుగా ఆడారు. ముంబై బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 4 వికెట్లు తీయగా, సామ్ కరన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 84 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సామ్ కరన్ (39 బంతుల్లో 60 నాటౌట్), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 58 నాటౌట్) విధ్వంసం సృష్టించారు.రాణించిన దీప్తి శర్మమహిళల హండ్రెడ్ టోర్నీ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (33), డానీ వ్యాట్ (29) పర్వాలేదనిపించారు. ఆల్రౌండర్ దీప్తి శర్మ, డానియెల్లి గిబ్సన్లు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్రైజర్స్ 69 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఫోబె లిచ్ఫీల్డ్ (3), అనాబెల్ సదర్లాండ్ (30) విజయంలో కీలకపాత్ర పోషించారు. -
లంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి ఆ ఇద్దరు!
ఐపీఎల్ తర్వాత వరుసగా వన్డే, టీ20 సిరీస్లతో బిజీగా గడిపిన టీమిండియా వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో టెస్టు సిరీస్కు సంబంధించి భారత జట్టును ప్రకటించే అవకాశముంది. కాగా సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు టెస్టు జట్టులోకి తిరిగి రానున్నారు. వీరితో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, కుల్దీప్ యాదవ్ పేర్లు కూడా పరిగణలో ఉన్నాయి. గాయంతో ఇంగ్లండ్ సిరీస్ నుంచి వైదొలిగిన వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమాంగానే ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్న నితీశ్ కుమార్ రెడ్డి లేదా సారాన్ష్ జైన్లో ఒకరు ఈ సిరీస్కు ఎంపికయ్యే అవకాశముంది. ఇక బుమ్రా, జడేజాలు తమ చివరి టెస్టు మ్యాచ్ను 2025 నవంబర్లో సౌతాఫ్రికాతో ఆడారు.గిల్ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలకు టెస్టు సిరీస్లను కోల్పోయింది. ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టులో మాత్రం భారీ విజయం సాధించడం ఊరట కలిగించింది. అయితే సొంతగడ్డపై ఎదురైన పరాభవాలను మరిచిపోయేందుకు లంకతో టెస్టు సిరీస్లో రాణించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు శ్రీలంక-ఏ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగ2ఆ, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్లో ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. 🚨 GOOD NEWS FOR TEAM INDIA 🇮🇳Jasprit Bumrah & Ravindra Jadeja set to play in the Test series vs Sri Lanka. [Sahil Malhotra from TOI]Test squad will be announced this week. pic.twitter.com/kAJ3m0tBqj— Johns. (@CricCrazyJohns) July 21, 2026Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు -
కమిన్స్ రీఎంట్రీ.. యాషెస్ హీరోకు మొండిచేయి!
బంగ్లాదేశ్తో స్వదేశంలో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్ పాట్ కమిన్స్తో పాటు సీనియర్లు జోష్ హాజిల్వుడ్, స్పిన్నర్ నాథన్ లియోన్ రీఎంట్రీ ఇవ్వనుండగా, 2025-26 యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన మైకెల్ నెసర్ను తుది జట్టు నుంచి తప్పించారు. ఆగస్టు 13 నుంచి 17 వరకు డార్విన్ వేదికగా తొలి టెస్టు, మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి 26 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. 13 మందితో కూడిన జట్టులో ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు ఆల్రౌండర్లు, ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్ ఉన్నారు.ఇక గతేడాది యాషెస్ సిరీస్ సందర్భంగా తొలి టెస్టు అనంతరం వెన్నునొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు.ఇక కండరాల గాయంతో జోష్ హాజిల్వుడ్ కూడా యాషెస్ సిరీస్కు దూరంగా ఉన్నాడు. జట్టు స్పెషలిస్ట్ స్పిన్నర్గా నాథన్ లియోన్ మరోసారి జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కమిన్స్ గైర్హాజరీలోనూ గతేడాది సొంతగడ్డపై యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 4-1తో నెగ్గింది. ఈ సిరీస్లో మైకెల్ నెసర్ రాణించాడు. మూడు మ్యాచ్లు కలిపి 15 వికెట్లు తీయడమే గాక, చివరి రెండు టెస్టుల్లో బ్యాట్తోనూ రాణించాడు. అయితే కమిన్స్, హాజిల్వుడ్ జట్టులోకి రావడంతో నెసర్ను జట్టు తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2027 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా వచ్చే సీజన్ (2027-2029) సైకిల్లోనూ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. తర్వాతి 12 నెలల్లో ఆస్ట్రేలియా మొత్తం 21 టెస్టు మ్యాచ్లు ఆడనుంది.ఆస్ట్రేలియా జట్టు:పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్Read: దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్స్.. తస్మాత్ జాగ్రత్త! -
‘రోహిత్, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’
టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లిలను జట్టులో నుంచి తొలగించడం చాలా కష్టతరమని, బలవంతంగా పంపించాలని చూస్తే మాత్రం అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించాడు. ఇటీవలే రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వచ్చిన వేళ అశ్విన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.తన యూట్యూబ్ షో 'ఆష్ కి బాత్’లో అశ్విన్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడాలని అనుకుంటే వారిని జట్టు నుంచి తప్పించడం చాలా చాలా కష్టం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. వారి అద్భుతమైన కెరీర్ రికార్డులు. రోహిత్ ఇప్పటికే 12 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడిని సులభంగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. తన ఆటతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. Photo Credit: BCCI Twitterఇక రెండో కారణం ఏంటంటే.. అది రోహిత్, కోహ్లికి భారీ అభిమాన బలం ఉంది. వీరిద్దరు మ్యాచ్లు ఆడుతున్నారంటే.. వారిని చూసేందుకే లక్షలాది మంది అభిమానులు స్టేడియాలకు తరలివస్తారు. అలాంటి స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తే భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. వారిని తప్పించాలని చూస్తే అభిమానులు ఊరుకుంటారా? ఒకవేళ తొలగిస్తే మాత్రం స్టేడియం పైకప్పు లేచిపోవడం గ్యారంటీ' అంటూ తనదైన శైలిలో అశ్విన్ చమక్కులు పంచాడు.Photo Credit: BCCI Twitterఇంగ్లండ్తో వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేల్లో రోహిత్ విపలం కావడంతో మూడో వన్డే అతడికి చివరిది కానుందని, ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలంటూ బీసీసీఐ కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది. ఇక రోహిత్ కూడా తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్తో మూడోవన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 138 పరుగులు సాధించాడు. మరోవైపు కోహ్లి కూడా అర్ధసెంచరీతో రాణించి తమకు తిరుగులేదని చాటిచెప్పాడు. ఇక బౌలర్ల పరిస్థితి గురించి అశ్విన్ కాస్త భిన్నంగా స్పందించాడు. 'మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారు. కానీ స్టార్ బ్యాటర్ల జరిగినంత స్థాయిలో చర్చ జరగదు. భవిష్యత్తులో బౌలర్ల కోసం కూడా అభిమానులు అదే స్థాయిలో గళమెత్తితే వారిని కూడా జట్టు నుంచి తప్పించడం కష్టమవుతుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా' అని అశ్విన్ తెలిపాడు. Read: స్పెయిన్ నంబర్వన్.. ర్యాంకింగ్స్లో మొరాకో, నార్వే సంచలనం -
అనధికారిక టెస్టులో విధ్వంసకర సెంచరీ.. ఎవరీ కుషాగ్ర?
కొలంబో వేదికగా శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత అండర్-19 జట్టు తొలిరోజే పట్టు బిగించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు డకౌట్ అయిన వేళ వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కుషాగ్ర ఓఝా (103 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ యశ్బర్దన్ (78), మనాల్ చౌహన్ (55 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో భారీ స్కోరు దిశగా సాగుతోంది. లంక బౌలర్లలో గిమ్హన్ మెండిస్ రెండు వికెట్లు తీయగా, సెత్మికా ఒక వికెట్ పడగొట్టాడు.ఎవరీ కుషాగ్ర?సున్నా పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అజేయ సెంచరీతో నడిపించిను కుషాగ్ర ఒక్కసారిగా హీరో అయిపోయాడు. రాజస్తాన్కు చెందిన 16 ఏళ్ల కుషాగ్ర ఓఝా టాపార్డర్లో బ్యాటింగ్కు వస్తుంటాడు. హంబన్టోటా వేదికగా శ్రీలంకతో జరిగిన యూత్ వన్డే సిరీస్ ద్వారా అండర్-19లో అరంగేట్రం చేసిన కుషాగ్ర ఆడిన తొలి మ్యాచ్లోనే 92 పరుగుల ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. తాజాగా తన తొలి అండర్-19 అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడుతున్న కుషాగ్ర.. డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్లతో పాటు సంప్రదాయ ఫార్మాట్లోనూ అండర్-19 జట్టులో టాప్-4 బ్యాటింగ్లో కుషాగ్ర ఓఝా కీలక ఆటగాడిగా మారిపోయాడు.2023-24 సీజన్లో రాజస్తాన్ తరఫున విజయ్ మర్చంట్ ట్రోఫీ ద్వారా అండర్-19 క్రికెట్లో అరంగేట్రం చేసిన కుషాగ్ర 2025-26 దేశవాళీ టోర్నీలో అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీలో 565 పరుగులు సాధించి గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలోనే రెండు సెంచరీలు సహా నాలుగు హాఫ్సెంచరీలు సాధించాడు. 2026 అండర్-19 వరల్డ్కప్కు కూడా కుషాగ్ర పరిగణలో ఉన్నాడు.Read: బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం! -
వికెట్ తేడాతో సంచలన విజయం.. కివీస్దే వన్డే సిరీస్
వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ వికెట్ తేడాతో వెస్టిండీస్పై సంచలనం విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో అమిర్ జాంగో (51) అర్ధసెంచరీ సాధించగా, ఆఖర్లో గుదకేశ్ మోతీ (41) రాణించాడు. ఒక దశలో 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన విండీస్ను గుదకేశ్, అమిర్ జాంగో ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఏడో వికెట్కు 81 పరుగులు జోడించడంతో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ మూడు వికెట్లు తీయగా, మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్వెల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా తడబడింది. 88 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో మార్క్ చాప్మన్ (80), మైకెల్బ్రాస్వెల్ (32), మిచెల్సాంట్నర్ (34 నాటౌట్) విలువైన భాగస్వామ్యాలు నిర్మించారు. చాప్మన్, బ్రాస్వెల్ వెనుదిరిగినప్పటికీ కడదాకా నిలిచిన కెప్టెన్ సాంట్నర్ మరో 35 బంతులు మిగిలి ఉండగానే (44.5 ఓవర్లలో) జట్టును విజయతీరాలకు చేర్చాడు. విండీస్ బౌలర్లలో గుదకేశ్ మోతీ 5 వికెట్లతో సత్తా చాటగా, మాథ్యూ ఫోర్డ్ 2 వికెట్లు తీశాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మిచెల్ సాంట్నర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే రేపు జరగనుంది. -
దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్కు మరో అవమానం!
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోపీకి సంబంధించి వెస్ట్జోన్ జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ వెస్ట్జోన్కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, షామ్స్ ములానీ వైస్ కెప్టెన్గా, ఉర్విల్పటేల్, హార్విక్ దేశాయ్లను వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. ఇక రిజర్వ్ ప్లేయర్లుగా జయ్ గోహిల్, ఆర్యా దేశాయ్, అర్షిన్ కులకర్ణి, విజయ్ జైస్వాల్, రాజ్వర్దన్ హంగ్రేకర్లకు చోటు దక్కింది.అయితే భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టోర్నీలో ఆడతాడని అంతా భావించారు. కానీ సెలెక్టర్లు అతడిని దులీప్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోలేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ఉన్న కారణంగానే జైస్వాల్ను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. ఇక జైస్వాల్తో పాటు టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్లను కూడా పక్కనబెట్టారు. అయితే శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లోనే ఎక్కువగా ఆడుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా చాలా సేపు బ్యాటింగ్ చేయాల్సిన టెస్టు ఫార్మాట్కు దూరంగానే ఉంటున్నాడు. ఇక టీమిండియాలో చోటు కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రస్తుతం రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. దులీప్ ట్రోఫీని అందుకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పటికీ, అతడిని ఎంపిక చేయలేదు. దీంతో 2026-27 రంజీ సీజన్లో ముంబై తరఫున సూర్యకుమార్ ఆడాలని భావిస్తున్నాడు. ఇక మరో సీనియర్ అజింక్య రహానేను కూడా సెలెక్టర్లు పక్కనబెట్టారు. టీమిండియా ఫ్యూచర్ క్రికెట్ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వెస్ట్ జోన్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షమ్స్ ములానీ (వైస్ కెప్టెన్), హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), జయమీత్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్ధార్థ్ దేశాయ్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, అతిత్ షేత్, ముఖేష్ చౌదరి, తనుశ్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండేరిజర్వ్ ప్లేయర్లు: జే గోహిల్, ఆర్య దేశాయ్, అర్షిన్ కులకర్ణి, మహేష్ పిథియా, విశాల్ జైస్వాల్ మరియు రాజవర్ధన్ హంగర్గేకర్.చదవండి: మెస్సీ అలా.. లామినే ఇలా; చివరికి! -
రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్లు ఉన్న సమయంలో వీలైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. శనివారం లండన్లోని భారత హైకమిషన్ నిర్వహించిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో భాగంగా టీమిండియాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు.99 శాతం అదే ధోరణిలో: రాజీవ్ శుక్లారాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్లు ముందున్న కర్తవ్యం. అనవసర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.' అని చెప్పుకొచ్చారు.బయటి విషయాలు పట్టించుకోను: గిల్టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. చారిత్రక బంధం: గంభీర్ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. -
పరుగు తేడాతో విజయం.. లాస్ ఏంజిల్స్దే మేజర్ లీగ్ టైటిల్
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) లీగ్ 2026 విజేతగా లాస్ ఏంజిల్స్ నైట్రైడర్స్ నిలిచింది. వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో లాస్ ఏంజెల్స్ పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజెల్స్ 19.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఆండ్రీ ఫ్లెచర్ (47), కొలిన్ మున్రో (40) రాణించగా, మిడిలార్డర్లో మాథ్యూ ట్రోంప్ (39) పర్వాలేదనిపించారు. వాషింగ్టన్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ మూడు వికెట్లు తీయగా, మిచెల్ ఓవెన్, నికిల్ చౌదరీ, రచిన్ రవీంద్ర తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వాషింగ్టన్ ఫ్రీడమ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి విజయానికి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. టాపార్డర్ విఫలమైన వేళ మిడిలార్డర్లో ఓబస్ పియెన్నర్ (53) అర్ధసెంచరీ సాధించగా, ఆండ్రీ గౌస్ (40) రాణించినప్పటికీ ఆఖర్లో వికెట్లు చేజార్చుకొని ఒత్తిడికి లోనయ్యి పరాజయం చవిచూసింది. లాస్ ఏంజెల్స్ బౌలర్లలో సునీల్ నరైన్, జాసన్ హోల్డర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) టోర్నీలో అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే లాస్ ఏంజెల్స్ నైట్రైడర్స్ చాంపియన్గా నిలిచి ఔరా అనిపించింది. WHAT. A. FINISH.The final over of the MLC Grand Final, between Ricky Ponting & Steve Smith's Washington Freedom v the LA Knight Riders, came down to the very last ball.Talk about drama 😲 pic.twitter.com/ScX86OwNWQ— 7Cricket (@7Cricket) July 19, 2026చదవండి: పాక్తో టైటిల్ కంబాట్.. కళ్లన్నీ 40 ఏండ్ల సంగ్రామ్ పైనే! -
టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా
జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా శనివారం రాత్రి భారత్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ సిరీస్కు హెడ్కోచ్ గంభీర్కు విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో జట్టు మెంటార్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వీవీఎస్ లక్ష్మణ్ సహా తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇతర క్రికెటర్లు జింబాబ్వే టూర్కు వెళ్తున్న ఫొటోలను బీసీసీఐ పంచుకుంది. ఇంగ్లండ్ టూర్లో ఇవాళ చివరి వన్డే ఆడిన అనంతరం టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శివమ్ దూబేలు నేరుగా జింబాబ్వేకు పయనం కానున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీ20 కెప్టెన్గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగిన టీ20 సిరీస్ల్లో ఓటమిపాలైంది. తన కెప్టెన్సీలో శ్రేయస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో జింబాబ్వే సిరీస్ అతడికి కీలకం కానుంది. జింబాబ్వే టూర్లో టీమిండియానే ఫెవరెట్గా కనిపిస్తున్నప్పటికీ ఆతిథ్య జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో జూలై 23 నుంచి మొదలుకానుంది. తొలి టీ20 జూలై 23న హరారే వేదికగా సాయంత్రం 4.30 గంటలకు జరగనుంది. 2024 జూలైలో చివరగా జింబాబ్వేలో పర్యటించిన భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది.ఇక ఈ సిరీస్కు సంజూ శాంసన్ను పక్కకు తప్పించారు. రింకూ సింగ్, మయాంక్ యాదవ్లతో పాటు ప్రబ్సిమ్రన్లను జింబాబ్వే టూర్కు ఎంపిక చేసింది.జింబాబ్వే టూర్కు టీమిండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యాష్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రబ్సిమ్రన్, మయాంక్ యాదవ్.𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝙩𝙤 𝙕𝙞𝙢𝙗𝙖𝙗𝙬𝙚 🇿🇼#TeamIndia | #ZIMvIND pic.twitter.com/akRFqycwXC— BCCI (@BCCI) July 18, 2026చదవండి: రిటైర్మెంట్ ఊహాగానాలపై రోహిత్ తొలి స్పందన! -
రిటైర్మెంట్ ఊహాగానాలపై రోహిత్ తొలి స్పందన!
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలపై తొలిసారి స్పందించాడు. రోహిత్ రిటైర్మెంట్కు సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల్లో జట్టులో రోహిత్ శర్మ ఉంటాడని సైకియా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లార్డ్స్ వేదికగా రేపు జరగనున్న చివరి వన్డే కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్కు వచ్చారు. ఈ సమయంలో రోహిత్ శర్మ భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్తో సుదీర్ఘంగా చర్చించిన ఫొటోలు బయటికి వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో సితాన్షు కోటక్తో రోహిత్ మాట్లాడుతూ..'బయట జరుగుతున్న విషయాలతో మనకు సంబంధం లేదు. అవన్నీ పట్టించుకోవద్దు' అని పేర్కొనడం వినిపించింది. దీంతో అసలు టీమిండియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్కు సంబంధించి ఇంటర్నల్ చర్చలు కూడా జరగలేదని దీన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది.ఇక శుక్రవారం రోహిత్ వన్డే కెరీర్పై సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ కెరీర్కు సంబంధించి ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్లో రోహిత్ చివరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్ కీలక సభ్యుడు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం. లార్డ్స్ వన్డే అతడికి చివరి మ్యాచ్ కాదు’ అని సైకియా వెల్లడించాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్ వన్డే కెరీర్కు రిటైర్మెంట్ వార్తలకు ఫుల్స్టాప్ పడ్డట్లు అయింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ ఆడిన రెండు వన్డేలు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అంతకముందు అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 16, 48, 79 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలతో రోహిత్ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి. Rohit Sharma 🗣️ Dekho yeh sb yhha khada hai "bahar kya chal raha hai ussya hamara kya lena dena" 🔥ROHIT FOR 2027 WC 🙌🏻#RohitSharma #odiworldcup2027 pic.twitter.com/cR4p52AS3Q— THE LLORD (@BlueBloodcric) July 18, 2026చదవండి: సిరీస్ విజయంపై గురి.. లార్డ్స్లో టీమిండియాకు ఘన చరిత్ర!


