ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన | Nepal Creates History with T20 Series Win Over West Indies, First Ever Series Victory Against Full Member Team | Sakshi
Sakshi News home page

ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన

Sep 30 2025 9:12 AM | Updated on Sep 30 2025 10:39 AM

Nepal Beat West Indies by 90 Runs in 2nd T20I

ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నేపాల్‌ (Nepal) రెండు సార్లు టీ20 ఛాంపియన్లైన వెస్టిండీస్‌పై (West Indies) ద్వైపాక్షిక సిరీస్‌ (West Indies vs Nepal) గెలిచింది. ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుపై నేపాల్‌ సిరీస్‌ గెలవడం ఇదే తొలిసారి. 

షార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్‌ 29) రెండో టీ20లో నేపాల్‌ 90 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 

అంతకుముందు తొలి టీ20లోనూ నేపాల్‌ వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో విండీస్‌ను మట్టికరిపించింది.

రెండో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌.. ఓపెనర్‌ ఆసిఫ్‌ షేక్‌ (68 నాటౌట్‌), సందీప్‌ జోరా (63) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో అకీల్‌ హొసేన్‌, కైల్‌ మేయర్స్‌ తలో 2, జెడియా బ్లేడ్స్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మొహమ్మద్‌ ఆదిల్‌ ఆలం (4-0-24-3), కుషాల్‌ భుర్టెల్‌ (2.1-1-16-3), దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (3-0-4-1), లలిత్‌ రాజబంశీ (3-0-13-1) చెలరేగడంతో 17.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 90 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.  

పరుగుల పరంగా ఓ ఐసీసీ అసోసియేట్‌ జట్టుకు (నేపాల్‌) ఫుల్‌ మెంబర్‌ జట్టుపై (వెస్టిండీస్‌) ఇదే అత్యంత భారీ విజయం. వెస్టిండీస్‌ చేసిన 83 పరుగుల స్కోర్‌, ఓ అసోసియేట్‌ జట్టుపై ఓ ఫుల్‌ మెంబర్‌ జట్టుకు రెండో అత్యల్పం. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఇవాళ (సెప్టెంబర్‌ 30) జరుగనుంది.

 చదవండి: ఐదు రోజుల్లో మరోసారి భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ సమరం

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement