రెండు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్‌.. ఐసీసీ ఆగ్ర‌హం | ICC Rates Melbourne Pitch Unsatisfactory After Ashes Test, MCG Draws ICC Criticism | Sakshi
Sakshi News home page

Ashes 2025-26: రెండు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్‌.. ఐసీసీ ఆగ్ర‌హం

Dec 30 2025 7:36 AM | Updated on Dec 30 2025 9:11 AM

ICC rates Melbourne pitch unsatisfactory after Ashes Test

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మెల్‌బోర్న్‌ పిచ్‌పై అసంతృప్తి వెలిబుచ్చింది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ప్రతిష్టాత్మక ‘యాషెస్‌’ సిరీస్‌లో నాలుగో టెస్టుకు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికైంది. కేవ‌లం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ పిచ్‌ పేలవమని ప్రకటించింది. మ్యాచ్‌ రిఫరీ జెఫ్‌ క్రో ‘ఏకపక్షంగా బౌలర్లకు మాత్రమే సహకరించిన వికెట్‌’ అని ఐసీసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఐసీసీ ఎంసీజీ అసంతృప్తిపరిచిన వేదిక అని... ఒక డిమెరిట్‌ పాయింట్‌ విధించింది.

ఏదైనా వేదికకు 6 డిమెరిట్‌ పాయింట్లు జమ అయితే ఆ స్టేడియాన్ని 12 నెలల పాటు నిషేధిస్తారు. 26న మొదలైన ఈ ‘బాక్సింగ్‌ డే’ టెస్టు అత్యంత నిరుత్సాహకరంగా మరునాడే ముగిసింది. ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్‌లో మొదటి రోజే ఇరు జట్లు ఆలౌటయ్యాయి. 20 వికెట్లు నేలకూలాయి. తర్వాతి రోజు 16 వికెట్లు పడ్డాయి. ఆ్రస్టేలియాలో ‘బాక్సింగ్‌ డే’ టెస్టుకున్న ప్రత్యేకతే వేరు.

ఏకంగా 90 వేలకు పైగానే ప్రేక్షకులు పోటెత్తిన ఈ మ్యాచ్‌ అనూహ్యంగా రెండే రోజుల్లో ముగియడం క్రికెట్‌ అభిమానుల్ని సైతం నిరాశపరిచింది. ఈ టెస్టుకు ముందే యాషెస్‌ను గెలుచుకున్న ఆతిథ్య ఆ్రస్టేలియా... ప్రస్తుతం 3–1తో ఇంగ్లండ్‌పై పైచేయిని కొనసాగిస్తోంది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు వచ్చే నెల 4 నుంచి సిడ్నీలో జరుగుతుంది.
చదవండి: క్లీన్‌స్వీప్‌పై భారత్‌ గురి... నేడు శ్రీలంకతో ఐదో టి20 మ్యాచ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement