-
Australia : యాత్ర 2 కార్ ర్యాలీ.. YSRCP సిద్ధం
‘‘యాత్ర 2” సినిమా విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో “టీమ్ మెల్బోర్న్ - వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా’’ ఆధ్వర్యంలో కార్ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని కీలక ఘటనలను, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి, YSRCP అధ్యక్షడు వైఎస్ జగన్ రాజకీయ ప్రారంభ దశలోని ముఖ్యమైన అంశాలను ఆధారంగా సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. ఈ ర్యాలీని మెల్బోర్న్ టీమ్ సభ్యులు కృష్ణారెడ్డి, భరత్, రామాంజి, నాగార్జున, మణిదీప్, సతీష్లు చక్కగా సమన్వయం చేశారు. సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించడంతో పాటు, వైఎస్సార్సీపీ పోరాటానికి తిరుగులేని మద్దతునిస్తూ “జై జగన్”, “జోహార్ వైఎస్ఆర్”, “ఎన్నికల సమరానికి మేము సిద్ధం” నినాదాలతో.. వేదిక వద్ద వాతావరణం మారుమోగింది. ఉత్సాహభరితమైన ర్యాలీ తరువాత, వైఎస్సార్సీపీ మద్దతుదారులు "యాత్ర 2" చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. 2024లో జరగబోయే ఏపీ 175 అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే లోక్సభ 25 స్థానాల ఎన్నికలకు YSRCP సిద్ధంగా ఉందని, సీఎం జగన్ నినాదం వైనాట్ 175ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్క ప్రవాసాంధ్రుడు కృషి చేస్తారని తెలిపారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనలు, విద్యా, వైద్య, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతీ ఒక్క ఎన్నారై స్టార్ క్యాంపెయినర్గా మారి ప్రచారం చేస్తారని తెలిపారు. -
వైఎస్సార్సీపీకి మద్దతుగా మెల్బోర్న్లో భారీ కార్ ర్యాలీ
-
ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్ బర్త్డే వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియా కన్వీనర్ చింతల చెరువు సూర్య నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు.వైఎస్ఆర్పీ నాయకులు వెంకట్ మేడపటి,కరణం ధర్మశ్రీ ఈ సందర్భంగా జూమ్ కాల్లో మాట్లాడి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను మరోసారి గుర్తు చేసుకుంటూ.. జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను మళ్లీ గెలిపించి అబివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
పాక్తో రెండో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! యువ ఆటగాడు రిలీజ్
పాకిస్తాన్తో బాక్సింగ్ డే టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేసర్ లాన్స్ మోరిస్ను రెండో టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. మోరిస్ బిగ్బాష్ లీగ్లో పాల్గోనున్నాడు. ఇదొక్కటి మినహా తమ జట్టులో ఆసీస్ ఎటువంటి మార్పు చేయలేదు. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్లో ఇప్పటికే ఆసీస్ 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్ను ఏకంగా 360 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 450 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. ఆసీస్ బౌలర్ల దాటికి 89 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ -
ప్లీజ్.. నా భర్త మృతదేహాన్ని భారత్కు పంపించండి
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో రోడ్డు ప్రమాదానికి గురై భారతదేశానికి చెందిన ఖుష్దీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. తన భర్త మృతదేహాన్ని భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకు దగ్గరికి చేర్చడానికి అతని భార్య జప్నీత్ కౌర్ హార్థిక ఇబ్బందులు పడుతున్నారు. తన భర్త మృతదేహాన్ని భారత్కు తీసుకువెళ్లడానికి సాయం అందించాలని కోరుతోంది. వివరాళ్లోకి వెళ్లితే.. 26 ఏళ్ల ఖుష్దీప్.. మెల్బోర్న్లో ట్రక్ డ్రైవర్. సోమవారం రాత్రి ఖుష్దీప్ ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే తన భార్త మృతదేహాన్ని స్వదేశంలో ఉన్న అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్తప్తి చేశారు. అదే విధంగా ఈ విషయం తెలుసుకున్న ఓ భారతీ విద్యార్థి GoFundMe ద్వారా నిధులను సేకరిస్తున్నాడు. ఆమె చదువు నిమిత్తం గత ఏడాది ఆస్ట్రేలియా వచ్చి భర్తతో కలిసి ఉంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement