NRI News: వైఎస్సార్‌.. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం | NRIs Tributes Paid To YSR 16th Death Anniversary Australia Melbourne | Sakshi
Sakshi News home page

NRI News: వైఎస్సార్‌.. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం

Aug 30 2025 3:54 PM | Updated on Aug 30 2025 3:54 PM

NRIs Tributes Paid To YSR 16th Death Anniversary Australia Melbourne

సాక్షి, మెల్బోర్న్‌: దివంగత మహానేత, మాజీ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి నేపథ్యంతో  ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లో వైఎస్సార్‌సీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. 

సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం.. వైఎస్సార్‌ అని ఈ సందర్బంగా సభకు హాజరైన వాళ్లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా నాయకులు నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి, విష్ణు రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement