breaking news
australia
-
విదేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళి
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో జనరంజక పాలన అందించిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రవాసాంధ్రులు కొనియాడారు. సెప్టెంబర్ 2న ఆయన వర్ధంతి సందర్భంగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్లోని సాండ్రింగ్హామ్ కమ్యూనిటీ సెంటర్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు.సంక్షేమాభివృద్ధిలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ ఎద్దుల, సుమంత్ డేగపూడి, కృష్ణారెడ్డి, విజయ్ అల్లా, రాజారెడ్డి, బాలశౌర్య, గీతారెడ్డి, రమేష్ పానాటి, సంకీర్త్ రెడ్డి, రఘునాథ్రెడ్డి, సుస్మిత, రేఖ, గౌతమి, సింధు, ప్రియాంక, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంఆ్రస్టేలియాలో రక్తదాన శిబిరం డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆడిలైడ్ నగరంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాయకులు వంశీ బొంతు, రామ్మోహన్రెడ్డి మునగల తదితరులతో పాటు వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మెల్బోర్న్ నగరంలో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి తదితరులు పాల్గొన్నారు. -
NRI News: వైఎస్సార్.. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం
సాక్షి, మెల్బోర్న్: దివంగత మహానేత, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్ధంతి నేపథ్యంతో ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం.. వైఎస్సార్ అని ఈ సందర్బంగా సభకు హాజరైన వాళ్లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా నాయకులు నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి, విష్ణు రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. -
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. చరిత్ర సృష్టించిన యువ బౌలర్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ కూపర్ కన్నోలీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతడు.. ఆసీస్ తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. కన్నోలీ కేవలం 22 ఏళ్ల 2 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో కన్నోలీ మాజీ ఫాస్ట్ బౌలర్ క్రెయిగ్ మెక్డెర్మాట్, ప్రస్తుత స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్లను వెనక్కు నెట్టాడు.మెక్డెర్మాట్ 22 ఏళ్ల 204 రోజుల వయసులో (1987) వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించగా.. స్టార్క్ 22 ఏళ్ల 211 రోజుల వయసులో (2012) ఈ ఘనత సాధించాడు. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనలతో కన్నోలీ మరో రికార్డు కూడా సాధించాడు. మైఖేల్ క్లార్క్ తర్వాత ఆసీస్ తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా రికార్డుల్లోకెక్కాడు. మైఖేల్ క్లార్క్ 2004లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 35 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. కన్నోలీ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో ఆసీస్ సౌతాఫ్రికాను 276 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 432 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో కన్నోలీతో పాటు (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) సత్తా చాటడంతో సౌతాఫ్రికా 155 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. -
కుప్పకూలిన సౌతాఫ్రికా.. చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా జట్టు తమ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించింది. ఇవాళ (ఆగస్ట్ 24) సౌతాఫ్రికాతో జరిగిన నామమాత్రపు వన్డేలో 276 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా ఆసీస్కు అతి భారీ విజయం నెదర్లాండ్స్పై (2023 వన్డే వరల్డ్కప్లో 309 పరుగుల తేడాతో) దక్కింది.యాదృచ్చికంగా ఈ మ్యాచ్లో ఆసీస్ చేసిన స్కోర్ కూడా వారి వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ స్కోర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. వన్డేల్లో ఆసీస్ తమ అతి భారీ స్కోర్ను కూడా సౌతాఫ్రికాపైనే చేసింది. 2006లో జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఆ జట్టుకు పరుగుల పరంగా వన్డేల్లో ఇదే అతి భారీ పరాజయంగా నిలిచింది. దీనికి ముందు 2023 వరల్డ్కప్లో భారత్ చేతిలో ఎదురైన 243 పరుగుల పరాజయం వారికి వన్డేల్లో అతి భారీ పరాజయంగా ఉండింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 432 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 24.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూపర్ కన్నోలీ (5/22) అద్బుత ప్రదర్శనతో చెలరేగి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. కూపర్ కన్నోలీ (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) ధాటికి 155 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. -
ప్రభావం చూపని బౌలర్లు.. టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం
బ్రిస్బేన్ వేదికగా భారత ఏ మహిళల జట్టుతో జరిగిన ఏకైక అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు సమాంతంరంగా నిలిచినా, రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించి, గెలుపు సొంతం చేసుకుంది.భారత్ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 305 పరుగులు చేసింది. 6 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 286 పరుగులకు ఆలౌటై, ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో బ్యాటర్లంతా తలో చేయడంతో ఆసీస్ 85.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రేచల్ ట్రెనామన్ (64), మ్యాడీ డ్రేక్ (68), అనిక లియారాయ్డ్ (72) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ తహిల విల్సన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేసింది. నికోల్ ఫాల్టుమ్ (16 నాటౌట్), ఎల్లా హేవర్డ్ (4) ఆసీస్కు విన్నింగ్స్ రన్స్ అందించారు.281 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ రాధా యాదవ్ 8 మంది బౌలర్లు మార్చిమార్చి ప్రయోగించినా ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. సైమా ఠాకోర్ 2, జోషిత, తనుశ్రీ తలో వికెట్ తీశారు.అంతకుముందు యామీ ఎడ్గర్ (19-6-57-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో, ప్రెస్ట్విడ్జ్ (13.4-2-47-3) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులకే పరిమితమైంది. రాఘ్వి బిస్త్ (86) రెండో ఇన్నింగ్స్లోనూ భారత్ను ఆదుకుంది. షఫాలీ వర్మ (52) అర్ద సెంచరీతో రాణించింది. తేజల్ (39), తనుశ్రీ (25), టైటాస్ సాధు (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.శతక్కొట్టిన జింజర్లోయర్ ఆర్డర్ బ్యాటర్ సియన్నా జింజర్ (103) సెంచరీతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో భారత్ స్కోర్కు ధీటుగా బదులిచ్చింది. జింజర్కు నికోల్ ఫాల్టుమ్ (54), తహిల విల్సన్ (49) సహకరించారు. భారత బౌలర్లలో సైమా ఠాకోర్ 3, రాధా యాదవ్, మిన్నూ మణి తలో 2 వికెట్లు పడగొట్టారు.ఆదుకున్న రాఘ్వితొలి ఇన్నింగ్స్లో రాఘ్వి బిస్త్ (93), జోషిత (51) ఆదుకోవడంతో భారత్ 299 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో బ్రౌన్, ప్రెస్ట్విడ్జ్ తలో 3 వికెట్లు తీశారుకాగా, భారత ఏ మహిళల జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ సిరీస్లో తొలుత టీ20 సిరీస్ జరగగా.. ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం భారత్ వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ఏకైక అనధికారిక టెస్ట్ మ్యాచ్లో గెలిచి ఆసీస్ సిరీస్ను చేజిక్కించుకుంది. -
మెరిసిన రాఘ్వి, షఫాలీ
బ్రిస్బేన్: తొలి ఇన్నింగ్స్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన రాఘ్వి బిస్త్ (119 బంతుల్లో 86; 13 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్లోనూ రాణించడంతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రాధా యాదవ్ సారథ్యంలోని భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రాఘ్వి బిస్త్, షఫాలీ వర్మ (58 బంతుల్లో 52; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకాలు సాధించగా... తేజల్ హస్నబిస్ (52 బంతుల్లో 39; 7 ఫోర్లు) రాణించింది. ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో అమీ ఎడ్గర్ 4 వికెట్లు పడగొట్టగా... జార్జియా 2 వికెట్లు తీసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 158/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టు... చివరకు 76.2 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. సియానా జింజర్ (138 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కగా... నికోల్ ఫాల్టుమ్ (91 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకుంది. భారత మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో సైమా ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా... రాధా యాదవ్, మిన్ను మణి చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులు చేసింది. ప్రస్తుతం చేతిలో రెండు వికెట్లు ఉన్న భారత జట్టు... ఓవరాల్గా 254 పరుగుల ఆధిక్యంలో ఉంది. జోషిత (9 బ్యాటింగ్), టిటాస్ సాధు (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఆమె బొమ్మలు గీస్తే డబ్బే డబ్బు.. ఒక్కోటి రూ. 40లక్షలకు పైమాటే..
ఖాళీ కాగితాలు కనిపిస్తే చిన్నపిల్లల వాటిపై బొమ్మలు గీస్తూ ఉంటారు. పెద్దలు వాటిని చూసి మురిసి΄ోతూ ఉంటారు. ఇదంతా చిన్నారులకు ఆనందం, పెద్దలకు మురిపెం. అయితే చిన్నారి గీసిన చిత్రాలకు రూ.కోట్లలో ధర పలికితే? అది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలిటా ఆండ్రీ (Aelita Andre). రెండేళ్లకే చిత్రలేఖనం మొదలుపెట్టిన ఈ అమ్మాయి గీసిన చిత్రాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. ఎలిటా ఆండ్రీ 2007లో జన్మించింది. ఆమెది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్. రెండేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. అందరు చిన్నారులు వేసేలాంటి చిత్రాలు కాకుండా కొత్త రకమైన చిత్రకళను సాధన చేసింది. అబ్స్స్ట్రాక్ట్ ఆర్ట్ (నైరూప్య కళ) ద్వారా తాను అనుకున్న భావాలను చిత్రాలుగా గీసేది. అందుకోసం తను ఎంచుకునే థీమ్స్, తీసుకునే రంగులు విభిన్నంగా ఉండేవి. దీంతో అతి చిన్నవయసులో అబ్స్స్ట్రాక్ట్ ఆర్ట్లో కృషి చేస్తున్న కళాకారిణిగా తన గురించి అందరికీ తెలిసింది. మెల్లగా తన చిత్రాలు అందరికీ పరిచయమయ్యాయి. ఎలిటా గీసే ఒక్కో చిత్రం సుమారు 50,000 యూఎస్ డాలర్ల (దాదాపు రూ.43 లక్షల) వరకు అమ్ముడవుతాయి. సెయింట్ పీటర్స్బర్గ్లోని రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం, మయామిలోని ఆర్ట్ బాసెల్తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అనేక మ్యూజియంలలో ఎలిటా తన చిత్రాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఎలిటాకు 18 ఏళ్లు. చిత్రకళను మరింత సాధన చేస్తూ, తన సొంత వెబ్సైట్ ద్వారా చిత్రాలను అమ్ముతోంది. చిత్రకారిణిగా మరింత పేరు తెచ్చుకోవడమే తన ధ్యేయం అని వివరిస్తోంది. View this post on Instagram A post shared by Aelita Andre (@aelitaandre) -
విజృంభించిన ఎంగిడి.. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన సౌతాఫ్రికా
వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా భారీ షాకిచ్చింది. ఆసీస్ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఐదో ద్వైపాక్షిక సిరీస్ విజయం. దీనికి ముందు 2016 (5-0), 2018 (2-1), 2019 (3-0), 2023 (3-2)లో కూడా సౌతాఫ్రికా ఆసీస్ను మట్టి కరిపించింది. ఆస్ట్రేలియాకు వరుసగా ఇది మూడో వన్డే సిరీస్ పరాజయం. సౌతాఫ్రికాకు ముందు ఆస్ట్రేలియా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి చిన్న జట్ల చేతుల్లో కూడా సిరీస్ కోల్పోయింది.మెక్కే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 22) జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాపై 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. లుంగి ఎంగిడి (8.4-1-42-5) ధాటికి 37.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. ఎంగిడికి బర్గర్ (6-0-23-2), ముత్తుసామి (8-0-30-2), ముల్దర్ (5-0-31-1) కూడా జత కలవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మధ్యలో జోష్ ఇంగ్లిస్ (87) ఆసీస్ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఒక్కరి నుంచి కూడా సహకారం లభించలేదు. ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్తో అడ్డుతగలడంతో ఆసీస్ పతనం కాస్త లేట్ అయ్యింది. ఆ జట్టు తరఫున ఇంగ్లిస్తో పాటు కెమరూన్ గ్రీన్ (35) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. హెడ్ (6), మార్ష్ (18), లబూషేన్ (1), క్యారీ (13), హార్డీ (10), బార్ట్లెట్ (8), ఎల్లిస్ (3), జంపా (3) దారుణంగా నిరాశపరిచారు. ఈ సిరీస్లో తొలి వన్డేలో కూడా ఆసీస్ ఇలాగే ఘోర పరాజయాన్ని చవి చూసింది. మిగిలిన నామమాత్రపు వన్డేలో అయిన ఆసీస్ రాణిస్తుందేమో చూడాలి. ఈ మ్యాచ్ ఆగస్ట్ 24న ఇదే వేదికగా జరునుంది. కాగా, ఈ వన్డే సిరీస్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
ఆల్ టైమ్ రికార్డు సమం చేసిన కెమరూన్ గ్రీన్
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ ఓ ఆల్టైమ్ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఓ వన్డేలో అత్యధిక ఔట్ ఫీల్డ్ క్యాచ్లు పట్టుకున్న ఆటగాడిగా మార్క్ టేలర్ (1992), మైఖేల్ క్లార్క్ (2004), ఆండ్రూ సైమండ్స్ (2006), గ్లెన్ మ్యాక్స్వెల్ (2015), మిచెల్ మార్ష్ (2016), గ్లెన్ మ్యాక్స్వెల్ (2017), లబూషేన్ (2024) సరసన చేరాడు. వీరంతా ఓ వన్డేలో తలో నాలుగు ఔట్ ఫీల్డ్ క్యాచ్లు పట్టారు.ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో గ్రీన్ ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, వియాన్ ముల్దర్, నండ్రే బర్గర్ క్యాచ్లు పట్టాడు. గ్రీన్తో పాటు మిగతా ఆసీస్ ఆటగాళ్లు కూడా మైదానంలో పాదరసంలా కదలి సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఆ జట్టు 31 ఓవర్లలో 163 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ట్రవిస్ హెడ్ (6), మిచెల్ మార్ష్ (18), లబూషేన్ (1), గ్రీన్ (35), క్యారీ (13) ఔట్ కాగా.. జోస్ ఇంగ్లిస్ (78), ఆరోన్ హార్డీ (6) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్ 2, ఎంగిడి, ముల్దర్, ముత్తుసామి తలో వికెట్ తీశారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో పర్యాటక సౌతాఫ్రికా తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
అల్బనీస్ బలహీనమైన నాయకుడు
జెరూసలేం: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతోనీ అల్బనీస్ ఇజ్రాయెల్కు ద్రోహం చేశారని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఆ్రస్టేలియాలోని యూదు సమాజాన్ని ఆ దేశం వదిలేసిందన్నారు. బలహీనమైన రాజకీయ నాయకుడిగా ఆయనను చరిత్ర గుర్తుంచుకుంటుందని విమర్శించారు. ఆ్రస్టేలియన్ యూదు సంఘం (ఏజేఏ) నిర్వహించిన కార్యక్రమానికి హాజరవ్వాలన్సిన ఇజ్రాయెల్ నేత సిమ్చా రోత్మన్ వీసాను ఆస్ట్రేలియా రద్దు చేసింది.విభజన రాజకీయాలు చేస్తున్నవారిపై తమ ప్రభుత్వం కఠినమైన వైఖరి తీసుకుంటుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి టోనీ బర్క్ ప్రకటించారు. ‘మీరు ద్వేషం, విభజన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆస్ట్రేలియాకు వస్తున్నట్లయితే.. మీరు ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు’అని బర్క్ స్పష్టం చేశారు. దీంతో రోత్మన్ సమావేశంలో వర్చువల్గా పాల్గొని, ప్రసంగిస్తారని ఏజేఏ తెలిపింది. యూదు సమాజం టోనీ బర్క్కు, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్కు తలవంచదని ప్రకటించింది. ఈ పరిణామాల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తీసుకోనుఅయితే.. నెతన్యాహు వ్యాఖ్యలపై బర్క్ బుధవారం స్పందించారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ఆ్రస్టేలియా ప్రకటించినందుకే ఆయనకు ఆగ్రహం వస్తోందన్నారు. ఇక.. బలమైన నాయకుడంటే.. ఇతర దేశాలపై దాడులు చేసేవారు, ఇతర దేశాల్లో ప్రజలను ఆకలితో చంపేవారు కాదని, దాడులు, హత్యలతో ఒక దేశాధ్యక్షుడి బలాన్ని అంచనా వేయలేమని ఎద్దేవా చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలపై ప్రధాని అల్బనీస్ సైతం స్పందించారు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోనన్నారు. తాను ఇతర దేశాల నాయకులను గౌరవంగా చూస్తానని, దౌత్యపరంగా వారితో సంభాíÙస్తానని హుందాగా చెప్పుకొచ్చారు. అయితే ఇజ్రాయెల్ మితవాద నేతల వీసాలను ఆ్రస్టేలియా రద్దు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో పార్లమెంటును విడిచిపెట్టిన నాయకురాలు, ఇజ్రాయెల్ మాజీ న్యాయ మంత్రి అయెలెట్ షేక్డ్కు కూడా వీసా నిరాకరించారు. నెతన్యాహుతో ఘర్షణ పడేవారే అసలైన నాయకుడు నెతన్యాహు వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ విమర్శించారు. అంతేకాదు.. ఆయన వ్యాఖ్యలను ఆ్రస్టేలియా నాయకునికి బహుమతిగా అభివరి్ణంచారు. ‘రాజకీయంగా అత్యంత విషపూరిత నాయకుడైన నెతన్యాహుతో ఘర్షణ పడేవారే ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రపంచంలో అసలైన నాయకుడు. ఆ్రస్టేలియా ప్రధానమంత్రికి ఈ బహుమతిని ఇచ్చారు’అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.పాలస్తీనాకు మద్దతు ఇవ్వడంతో.. పాలస్తీనా దేశాన్ని యూఎన్లో ఉన్న 193 సభ్య దేశాల్లో 147 దేశాలు గుర్తించాయి. యూకే, ఫ్రాన్స్, కెనడాలు కూడా ఆ దేశాల జాబితాలో చేరాయి. ఆ తర్వాత ఆ్రస్టేలియా సైతం పాలస్తీనాకు మద్దతు ఇచి్చంది. ఆ సమయంలో ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ ‘అమాయక ప్రజలపై యుద్ధ చూపుతున్న ప్రభావాన్ని నెతన్యాహు పట్టించుకోవడం లేదు. సహాయ పంపిణీ కేంద్రాల చుట్టూ ప్రజలు ఆహారం, నీటి కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు’అన్నారు. అప్పటినుంచి ఆయా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ప్రతిస్పందనగా, నెతన్యాహు మూడు దేశాల నాయకులపై దాడిని ప్రారంభించారు. కెయిర్ స్టార్మర్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మార్క్ కారీ్నలు.. సామూహిక హంతకులు, రేపిస్టులు, శిశువుల హంతకులు, కిడ్నాపర్ల పక్షాన నిలుస్తున్నారని ఆరోపించారు. -
తొలి వన్డేలో ఆసీస్పై విజయం.. సౌతాఫ్రికా ఆటగాడిపై ఫిర్యాదు
తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి జోష్లో ఉన్న సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అరంగేట్రం స్పిన్నర్ ప్రేనేలన్ సుబ్రాయెన్ (Prenelan Subrayen) బౌలింగ్ యాక్షన్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుబ్రాయెన్ బౌలింగ్ శైలిపై మ్యాచ్ అఫీషియల్స్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కుడి చేతి వాటం రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన సుబ్రాయెన్ బౌలింగ్ శైలి కాస్త భిన్నంగా ఉంది. అతడి యాక్షన్ ఐసీసీ నియమాలకు విరుద్దమేమో అని మ్యాచ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుబ్రాయెన్ ఐసీసీ పర్యవేక్షణలో ఓ పరీక్షను (బౌలింగ్ శైలి) ఎదుర్కోవాల్సి ఉంది.సుబ్రాయెన్ ఆసీస్తో జరిగిన మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. తన కోటా 10 ఓవర్లలో 46 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆసీస్ను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయెన్ (1/46) తోడయ్యారు.ఆసీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్ హెడ్ (27), బెన్ డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. గత నెలలోనే టెస్ట్ అరంగేట్రం31 ఏళ్ల సుబ్రాయెన్ గత నెలలోనే టెస్ట్ అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు (ఒకే ఇన్నింగ్స్లో) తీసి పర్వాలేదనిపించాడు. సుబ్రాయెన్ లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. లేట్గా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సుబ్రాయెన్ రెండో మ్యాచ్తోనే వివాదంలో చిక్కుకున్నాడు. బౌలింగ్ శైలిపై ఐసీసీ క్లీన్ చిట్ ఇస్తేనే అతడు ఆసీస్తో రెండో వన్డే ఆడగలడు. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
ఆసీస్ ప్లేయర్కు అక్షింతలు
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు ఐసీసీ అక్షింతలు వేసింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే సందర్భంగా అభ్యంతరకర భాష వాడినందుకు ఓ డీమెరిట్ పాయింట్ అతని ఖాతాలో చేర్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఇది లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. సాధారణంగా ఇలాంటి తప్పిదాలకు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లతో పాటు 50 శాతం వరకు మ్యాచ్ ఫీజ్లో కోత విధిస్తారు. అయితే గడిచిన 24 నెలల్లో జంపాకు ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం ఓ డీమెరిట్ పాయింట్తో సరిపెట్టారు.ఏం జరిగిందంటే..?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 37వ ఓవర్ సందర్భంగా జంపా అభ్యంతరకర భాష వాడాడు. మిస్ ఫీల్డ్తో పాటు ఓవర్ త్రో చేయడంతో జంపా సహనం కోల్పోయి ఇలా ప్రవర్తించాడు. జంపా వాడిన భాష స్టంప్ మైక్ల్లో రికార్డైంది. దీని ఆధారంగా జంపాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ శిక్షను స్వీకరించడంతో జంపాను తదుపరి విచారణ నుంచి మినహాయించారు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయన్ (1/46) తోడయ్యారు.ఆసీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్ హెడ్ (27), బెన్ డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో ఆడమ్ జంపా (10-0-58-1) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
కొనసాగుతున్న టిమ్ డేవిడ్ విధ్వంసకాండ.. పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్న ఆసీస్ స్టార్
ఇటీవలికాలంలో ఆస్ట్రేలియా టీ20 ఆటగాడు టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. పట్టపగ్గాల్లేకుండా సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట వెస్టిండీస్పై 37 బంతుల్లో శతక్కొట్టిన ఈ మెరుపు వీరుడు.. ఆతర్వాత సౌతాఫ్రికాపై వరుస అర్ద సెంచరీలతో (52 బంతుల్లో 83, 24 బంతుల్లో 50) విరుచుకుపడ్డాడు.టిమ్ ఇదే విధ్వంసాన్ని ప్రైవేట్ టీ20 లీగ్ల్లోనూ కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు వచ్చిన టిమ్.. తొలి మ్యాచ్లోనే మెరుపు ప్రదర్శన చేశాడు. ఈ లీగ్లో సెయింట్ లూసియా కింగ్స్కు ఆడుతున్న అతను.. ఇవాళ (ఆగస్ట్ 20) సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో జరిగిన మ్యాచ్లో 23 బంతుల్లో 5 సిక్సర్లు, బౌండరీ సాయంతో 4 పరుగులు చేశాడు.టిమ్ విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్లో లూసియా కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (200/8) చేసింది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్లో టిమ్కు ముందు జాన్సన్ ఛార్లెస్ (28 బంతుల్లో 52), రోస్టన్ ఛేజ్ (38 బంతుల్లో 61) మెరుపు అర్ద శతకాలు బాదారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పేట్రియాట్స్ను నేవియన్ బిదైసీ (50), జేసన్ హోల్డర్ (29 బంతుల్లో 63; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) గెలిపించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ధాటిగా ఆడినా పేట్రియాట్స్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హోల్డర్ ఊహకందని షాట్లతో విరుచుకుపడినా పేట్రయాట్స్ను గెలిపించలేకపోయాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్ వృధా అయ్యింది. పేట్రియాట్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులే చేయగలిగింది. మెరుపు అర్ద శతకంతో పాటు రెండు వికెట్లు తీసిన లూసియా కింగ్స్ ఆటగాడు రోస్టన్ ఛేజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
వన్డే క్రికెట్లో సరికొత్త సంచలనం.. రికార్డు స్కోర్లతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా బ్యాటర్
వన్డే క్రికెట్కు సరికొత్త స్టార్ పరిచమయ్యాడు. అతడి పేరు మాథ్యూ బ్రీట్జ్కే (26). సౌతాఫ్రికాకు చెందిన ఈ కుడి చేతి వాటం వికెట్కీపర్ బ్యాటర్.. తన తొలి మూడు మ్యాచ్ల్లో అదిరిపోయే ప్రదర్శనలు చేసి ఆల్టైమ్ రికార్డు సెట్ చేశాడు. అరంగేట్రం వన్డేలో న్యూజిలాండ్పై భారీ సెంచరీ (148 బంతుల్లో 150) చేసిన బ్రీట్జ్కే.. ఆతర్వాత వరుసగా రెండు వన్డేల్లో (పాకిస్తాన్, తాజాగా ఆస్ట్రేలియాపై) హాఫ్ సెంచరీలు (83, 57) బాదాడు. తద్వారా వన్డే క్రికెట్లో తొలి మూడు మ్యాచ్ల తర్వాత అత్యధిక స్కోర్ (290 పరుగులు) చేసిన బ్యాటర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ నిక్ నైట్ పేరిట ఉండేది. నైట్ తన తొలి మూడు వన్డేల్లో 264 పరుగులు చేశాడు. ఈ విభాగంలో నైట్ తర్వాత స్థానంలో సౌతాఫ్రికాకే చెందిన టెంబా బవుమా (259) ఉన్నాడు.తొలి మూడు వన్డేల్లో 50కి పైగా స్కోర్లు చేయడంతో బ్రీట్జ్కే మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. నవ్జోత్ సింగ్ సిద్దూ, మ్యాక్స్ ఓడౌడ్ తర్వాత చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు.బ్రీట్జ్కే ఇవాళ (ఆగస్ట్ 19) ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 56 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బ్రీట్జ్కేతో పాటు మార్క్రమ్ (82), బవుమా (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. రికెల్టన్ (33), ముల్దర్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఓ రనౌట్ కూడా చేశాడు.అనంతరం 297 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కేశవ్ మహారాజ్ (10-1-33-5) ధాటికి 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హెడ్ (27), డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఐదేయగా.. నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి తలో 2, సుబ్రాయన్ ఓ వికెట్ తీశారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
అలీసా అదరహో
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా గడ్డపై ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల ‘ఎ’ జట్టు చివరి మ్యాచ్లో పరాజయం పాలైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడి 2–1తో సిరీస్ ఖాతాలో వేసుకుంది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (85 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్స్లు) విజృంభించడంతో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు అలవోకగా విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత ‘ఎ’ జట్టు 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (59 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... వికెట్ కీపర్ యస్తిక భాటియా (54 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. నందిని కశ్యప్ (53 బంతుల్లో 28; 2 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (32 బంతుల్లో 18; 2 ఫోర్లు), తనూశ్రీ సర్కార్ (22 బంతుల్లో 17), కెప్టెన్ రాధా యదవ్ (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తేజల్ హసబ్నిస్ (1) విఫలమైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో తహిలా మెక్గ్రాత్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. సియానా జింజర్ 50 పరుగులిచ్చి 2 వికెట్లు, ఎల్లా హేవార్డ్ 43 పరుగులిచ్చి 2 వికెట్లు, అనిక లెరాయిడ్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 27.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 222 పరుగులు చేసింది. హీలీ అజేయ శతకంతో చెలరేగగా... తహీలా విల్సన్ (51 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఇక్కడే ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్ జరగనుంది.దంచికొట్టిన హీలీ..గాయం నుంచి కోలుకొని వచ్చిన అలీసా హీలీ... భారత ‘ఎ’ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్లను సంపూర్ణంగా వినియోగించుకుంది. మొదట టి20 సిరీస్తో లయ అందుకున్న హీలీ... వన్డే సిరీస్లో అదరగొట్టింది. గత మ్యాచ్లో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న అలీసా... ఈ మ్యాచ్లో అజేయ శతకంతో అదరగొట్టింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హీలీ ఇచ్చిన క్యాచ్ను భారత ఫీల్డర్లు నేలపాలు చేయగా... దాన్ని వినియోగించుకున్న ఆస్ట్రేలియా సీనియర్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బౌండరీలతో చెలరేగింది. రెండో ఓవర్లో ఫోర్తో మోత ప్రారంభించిన హీలీ... భారీ సిక్స్తో లక్ష్యఛేదనను పూర్తి చేసేంతవరకు అదే జోరు కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ బౌలర్ షబ్నమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ... మిన్ను మణి, తనూజ కన్వర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టింది. మరో ఎండ్ నుంచి తహిలా విల్సన్ కూడా ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. షబ్నమ్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. తొలి వికెట్కు 137 పరుగులు జోడించిన అనంతరం తహిలా వెనుదిరగగా... హీలీ మాత్రం అదే జోష్ కనబర్చింది. మిన్ను మణి వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 4, 4, 6 కొట్టి 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఎండ్ నుంచి రాచెల్ (21 నాటౌట్) సహకారం లభించడంతో హీలీ జట్టును విజయతీరాలకు చేర్చింది -
చరిత్ర సృష్టించిన మ్యాక్స్వెల్
విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ తన దేశం తరఫున టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో మరో విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. ఈ ఇద్దరు టీ20ల్లో చెరో 12 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. వార్నర్ 110 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించగా.. మ్యాక్స్వెల్ 124 మ్యాచ్లో వార్నర్ రికార్డును సమం చేశాడు.నిన్న (ఆగస్ట్ 16) సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో మెరుపు అర్ద శతకం బాది, తన జట్టును గెలిపించిన మ్యాక్సీ.. తన టీ20 కెరీర్లో 12వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓడిపోవాల్సిన ఈ మ్యాచ్లో మ్యాక్సీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. మ్యాక్సీ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ మ్యాచ్తో పాటు సిరీస్ను కూడా కైవసం చేసుకుంది.తీవ్ర ఒత్తిడిలో మ్యాక్సీ ఆడిన ఈ ఇన్నింగ్స్ అతడి టీ20 కెరీర్లో అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు. 173 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో బరిలోకి దిగిన మ్యాక్సీ కళ్లు మూసి తెరిచేలోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన జట్టును సేఫ్ జోన్లో ఉంచాడు. అంతేకాకుండా చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసమైన తరుణంలో ఊహించని షాట్ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.ఈ ఇన్నింగ్స్లో 36 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఆసీస్, రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా గెలుపొందాయి.బ్రెవిస్ విధ్వంసంఅంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదిన డెవాల్డ్ బ్రెవిస్ ఈ మ్యాచ్లోనూ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో 6 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రెవిస్ విధ్వంసానికి డస్సెన్ (38 నాటౌట్) మెరుపులు కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. -
గ్లెన్ మ్యాక్స్వెల్పై భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహం
ఆసీస్ విధ్వంసక బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తీరు భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ వెటరన్ మెరుపు వీరుడు ఐపీఎల్ మినహా అన్ని చోట్లా సత్తా చాటడమే ఇందుకు కారణం. తాజాగా మ్యాక్సీ తన జాతీయ జట్టుకు ఆడుతూ (సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టీ20) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోవాల్సిన మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో ఆసీస్ సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. తీవ్ర ఒత్తిడిలో ఆడిన ఈ ఇన్నింగ్స్ మ్యాక్స్వెల్ టీ20 కెరీర్లో అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు.173 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో బరిలోకి దిగిన మ్యాక్సీ కళ్లు మూసి తెరిచేలోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన జట్టును సేఫ్ జోన్లో ఉంచాడు. అంతేకాకుండా చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసమైన తరుణంలో ఊహించని షాట్ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్లో 36 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ ఇన్నింగ్స్ తర్వాత మ్యాక్సీపై అందరూ ప్రశంసలు కురిపిస్తుండగా.. భారత అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. మ్యాక్స్వెల్ ఐపీఎల్లో ఆడడు కానీ, మిగతా చోట్లంతా సత్తా చాటుతాడంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి భారత క్రికెట్ అభిమానుల్లో బాధకు అర్దముంది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఇతగాడికి ఐపీఎల్ అవకాశాలిస్తే.. దారుణంగా నిరుత్సాహపరిచాడు. గత రెండు మూడు సీజన్లుగా పరిస్థితి ఇదే. గత సీజన్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండింది. 5 మ్యాచ్ల్లో కేవలం 48 పరుగులే చేసి మధ్యలో స్వదేశానికి చెక్కేశాడు. పంజాబ్ కింగ్స్ అతనిపై భారీ అంచనాలు పెట్టుకొని, మంచి మొత్తానికి కొనుగోలు చేసింది. వారి ఆశలపై మ్యాక్స్వెల్ నీళ్లు చల్లాడు.ఈ వైఫల్యాలు చూసి మ్యాక్స్వెల్ ఫామ్ కోల్పోయుంటాడనుకోవడానికి వీళ్లేదు. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో అతను అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. 12 మ్యాచ్ల్లో 175 స్ట్రయిక్రేట్తో 252 పరుగులు చేశాడు. తన జాతీయ జట్టుకు ఆడేప్పుడు మ్యాక్స్వెల్ మరింత అంకితభావంతో ఆడి చెలరేగుతాడు. ఈ ఏడాది టీ20ల్లో ప్రదర్శనలే ఇందుకు ఉదాహరణ. ఈ యేడు అతను ఆసీస్ తరఫున 8 టీ20 ఇన్నింగ్స్లు ఆడి 174.2 స్ట్రయిక్రేట్తో 169 పరుగులు చేశాడు.మ్యాక్స్వెల్ తన సొంత దేశం తరఫున ఎలా ఆడినా.. భారత అభిమానులకు పోయేదేమీ లేదు. అయితే దేశం తరఫున ఆడేప్పుడు చూపే అంకితభావాన్ని ఐపీఎల్ల్లోనూ కనబర్చాలని వారు ఆశిస్తున్నారు. ఏ ఫ్రాంచైజీ అయినా ఆటగాళ్లను భారీ అంచనాలు పెట్టుకునే కొనుగోలు చేస్తుంది. అలాంటప్పుడు ఆటగాళ్లు తమపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి.అయితే మ్యాక్సీ మాత్రం అలా చేస్తున్నట్లు కనిపిండం లేదు. ఏదో హాలిడే ఎంజాయ్ చేసేందుకు భారత్కు వస్తున్నాడా అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకుంది కూడా ఇక్కడే కాబట్టి, అత్తగారింటికి చుట్టపు చూపుకు వచ్చినట్లు వచ్చిపోతున్నాడు. ఐపీఎల్ ఆరంభంలో మ్యాక్సీలో కనిపించిన కమిట్మెంట్ ఇటీవలకాలంలో కనిపించడం లేదు. పంజాబ్కు ముందు ఆర్సీబీ తరఫున తరఫున కూడా వైఫల్యాల పరంపర కొనసాగించాడు. ఇది చూస్తే, చాలా మంది ఆసీస్ ఆటగాళ్ల లాగే మ్యాక్స్వెల్కు కూడా ఐపీఎల్ అంటే గిట్టదేమో అని అనిపిస్తుంది. -
ప్రాచీన కాలంలో బుల్లి తిమింగలం
వెల్లింగ్టన్: సముద్రాల్లో తిరుగాడే తిమింగలం పరిమాణం ఎంత ఉంటుందో మనకు తెలుసు. భారీ ఆకారంతో టన్నుల కొద్దీ బరువుండే తిమింగలాలు ఉన్నాయి. కానీ, ప్రాచీన కాలంలో బుల్లి తిమింగలాలు ఉండేవని పరిశోధకులు గుర్తించారు. 2.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి తిమింగలం శిలాజం ఆస్ట్రేలియా సముద్ర తీరంలో లభించింది. దీనికి జంజూసిటస్ డులార్డి అని పేరు పెట్టారు. ఇది చాలా అరుదైన తిమింగలం అని చెబుతున్నారు. తిమింగలాల పరిణామ క్రమాన్ని తెలుసుకోవడానికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఎంత చిన్నది అంటే సింగిల్ బెడ్కు సరిగ్గా సరిపోతుంది. దాని కండ్లు టెన్నిస్ బంతుల సైజ్లో ఉన్నాయి. పదునైన దంతాలు కనిపిస్తున్నాయి. అంటే ఇవి ఆహారం కోసం సముద్రంలో ఇతర జీవులను వేటాడేవని తెలుస్తోంది. దీని ముఖం కార్టూన్ క్యారెక్టర్ ముఖాన్ని పోలి ఉంది. బుల్లి తిమింగలాలు ఎలా అంతరించిపోయాయన్నది తెలుసుకోవడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. -
చివరి ఓవర్లో ఛేదించి...
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్ కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు... వన్డే సిరీస్లో సత్తా చాటింది. మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన రెండో వన్డేలో భారత ‘ఎ’ జట్టు 2 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (87 బంతుల్లో 91; 8 ఫోర్లు, 3 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కిమ్ గార్త్ (41 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో మిన్ను మణి 46 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా ... సైమా ఠాకూర్ 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. టిటాస్ సాధు, రాధా యాదవ్, ప్రేమ రావత్, తనూజ కన్వర్లకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత మహిళల ‘ఎ’ జట్టు 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రాధ యాదవ్ (78 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (71 బంతుల్లో 66; 9 ఫోర్లు), తనూజ కన్వర్ (57 బంతుల్లో 50; 3 ఫోర్లు) హాఫ్సెంచరీలతో కదంతొక్కారు. షఫాలీ వర్మ (4), ధారా గుజ్జర్ (0), తేజల్ హసబ్నిస్ (19), రాఘ్వీ బిస్త్ (14) విఫలమయ్యారు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఆరంభంలో యస్తిక ఇన్నింగ్స్ను నడిపించింది. ఆ తర్వాత ఆ బాధ్యతను రాధ యాదవ్ సక్రమంగా నిర్వర్తించగా... ఆఖర్లో తనూజ అదరగొట్టింది. అర్ధశతకం అనంతరం రాధా యాదవ్ అవుట్ కావడంతో భారత జట్టు 193/7తో నిలిచింది. ఇక ఛేదన కష్టమే అనుకుంటున్న తరుణంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ తనూజ కన్వర్ చక్కటి ఆటతీరుతో చెలరేగింది. ప్రేమ రావత్ (33 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్కు 68 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించింది. చివరి ఓవర్ తొలి బంతికి తనూజ అవుట్ కావడంతో ఉత్కంఠ నెలకొన్నా... ప్రేమ రావత్ విజయానికి కావాల్సిన 5 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగానే జట్టును గెలిపించింది. ఇదే వేదికపై బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత ‘ఎ’ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం ఇక్కడే జరగనుంది. -
సిరీస్ డిసైడర్కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లో, నిర్ణయాత్మక మూడో టీ20కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. కంకషన్ (తలకు బలమైన దెబ్బ) కారణంగా విధ్వంసకర బ్యాటర్ మిచెల్ ఓవెన్ తదుపరి సిరీస్ మొత్తానికి (ఓ టీ20, మూడు వన్డేలు) దూరమయ్యాడు.రెండో టీ20 సందర్భంగా ఓవెన్కు గాయమైంది. బౌలర్ సంధించిన బంతి అతడి హెల్మెట్ గ్రిల్పై బలంగా తాకింది. వెంటనే జరిపిన కంకషన్ పరీక్షల్లో గాయం తాలుకా లక్షణాలు కనిపించనప్పటికీ.. నెమ్మదిగా దాని ప్రభావం బయటపడింది. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు ఓవెన్ తీవ్ర అసౌకర్యానికి లోనయ్యాడు. డాక్టర్లను సంప్రదించగా.. మ్యాచ్ సందర్భంగా తగిలిన గాయం ఎఫెక్ట్ అని తేల్చారు. 12 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.ఈ మధ్యలో ఆసీస్ సౌతాఫ్రికాతో చివరి టీ20, ఆతర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేస్తుంది. వాస్తవానికి ఈ సిరీస్తో ఓవెన్ వన్డే అరంగేట్రం చేయాల్సి ఉండింది. అయితే ఈ గాయం ఓవెన్ వన్డే ఎంట్రీని పోస్ట్ పోన్ చేసింది.23 ఏళ్ల ఓవెన్ పొట్టి క్రికెట్లో నయా సంచలనంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత బిగ్బాష్ లీగ్ ఫైనల్లో విధ్వంసకర శతకం బాది వార్తల్లోకెక్కిన ఓవెన్.. ఆతర్వాత ఐపీఎల్, జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఓవెన్ అందులో విఫలమయ్యాడు.ఓవెన్ అంతర్జాతీయ అరంగేట్రం మాత్రం ఘనంగా జరిగింది. విండీస్తో మ్యాచ్లో అతను 27 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. మీడియం పేస్ బౌలర్ కూడా అయిన ఓవెన్ ఆ మ్యాచ్లో ఓ వికెట్ కూడా తీశాడు.తద్వారా అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో హాఫ్ సెంచరీతో పాటు వికెట్ తీసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.కాగా, సౌతాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వేధిస్తుంది. ఓవెన్తో పాటు మరో ఇద్దరు కూడా ఈ సిరీస్కు దూరమయ్యారు. టీ20, వన్డే జట్లకు ఎంపికైన మ్యాట్ షార్ట్ విండీస్ సిరీస్ సందర్భంగా తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక జట్టు నుంచి వైదొలిగాడు. వన్డే జట్టులో ఉన్న లాన్స్ మోరిస్ వెన్ను సమస్య కారణంగా జట్టుకు దూరమయ్యాడు. షార్ట్, మోరిస్ స్థానాల్లో ఆరోన్ హార్డీ, మాథ్యూ కుహ్నేమన్ వన్డే జట్టులోకి వచ్చారు. వీరిద్దరు ఇదివరకే టీ20 జట్టులో ఉన్నారు. మరోవైపు జ్వరం కారణంగా రెండో టీ20కి దూరమైన వికెట్కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ మూడో టీ20కి సిద్దమయ్యాడు. మూడో టీ20 ఆగస్ట్ 16న జరుగనుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ ఆసీస్, రెండో మ్యాచ్ సౌతాఫ్రికా గెలిచాయి. టీ20 సిరీస్ తర్వాత ఆగస్ట్ 19, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం సౌతాఫ్రికా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
గెలిపించిన రాధ, యస్తిక
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల ‘ఎ’ జట్టు తొలి విజయం అందుకుంది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 47.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. దూకుడుగా ఆడిన అనిక లియరాయిడ్ (90 బంతుల్లో 92 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, రాచెల్ ట్రెనమన్ (62 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో కెపె్టన్ రాధ యాదవ్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... టిటాస్ సాధు, మిన్ను మణి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసి గెలిచింది. వికెట్ కీపర్ యస్తిక భాటియా (70 బంతుల్లో 59; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 36; 5 ఫోర్లు), ధారా గుజ్జర్ (53 బంతుల్లో 31; 2 ఫోర్లు), రాఘ్వీ బిష్త్ (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. లూసీ హామిల్టన్, హేవార్డ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్ రేపు జరుగుతుంది. -
పాలస్తీనాకు ఆస్ట్రేలియా గుర్తింపు.. అయితే ఈ షరతులు వర్తింపు..
కాన్బెర్రా: త్వరతో జరగబోయే యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఇతర పాశ్చాత్య దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తుందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. దీంతో పాలస్తీనా దేశాన్ని గుర్తించే దేశాల జాబితాలో ఆస్ట్రేలియా ఫ్రాన్స్, యూకే, కెనడాలున్నాయి.ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సోమవారం ఒక ప్రకటనలో సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల ఇదే అభిప్రాయాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, కెనడాలు వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆయా దేశాలకు మద్దతు పలికింది. అయితే ఆస్ట్రేలియా గుర్తింపు అనేది పాలస్తీనా అథారిటీ నుండి అందుకున్న నిర్దిష్ట హామీలపై ఆధారపడి ఉంటుందని అల్బనీస్ స్పష్టం చేశారు. వీటిలో హమాస్ను పాలస్తీనా ప్రభుత్వం నుండి తొలగించడం, గాజాను సైనికీకరణ నుంచి విముక్తి చేయడం, స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించడం మొదలైనవి ఉన్నాయి.గాజాలో మానవతా సంక్షోభంపై ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. ఆస్ట్రేలియా అధికారులు గాజాలో కొనసాగుతున్న ఆకలి మంటలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల గాజాలో పెద్ద ఎత్తున సైనిక దాడికి ప్రణాళికలు వేయడాన్ని ఆస్ట్రేలియా ఖండించింది. మధ్యప్రాచ్యంలో హింసాయుత ఘటనలను విచ్ఛిన్నం చేయడానికి, గాజాలో సంఘర్షణలు, ఆకలిని అంతం చేయడానికి పాలస్తీనా దేశపు గుర్తింపు అనేది పరిష్కారం మార్గం అవుతుందని ప్రధాని అల్బనీస్ అన్నారు. -
దిగ్గజ బౌలర్ను అధిగమించిన రబాడ
సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ తమ దేశానికే చెందిన దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ను ఓ విషయంలో అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో (ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ల్లో) ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డొనాల్డ్ను వెనక్కు నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకాడు.ఈ జాబితాలో షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్న్ సౌతాఫ్రికాపై 69 మ్యాచ్ల్లో 190 వికెట్లు తీశాడు. వార్న్ తర్వాత టాప్-5 స్థానాల్లో డేల్ స్టెయిన్ (ఆసీస్పై 49 మ్యాచ్ల్లో 127 వికెట్లు), గ్లెన్ మెక్గ్రాత్ (సౌతాఫ్రికాపై 58 మ్యాచ్ల్లో 115 వికెట్లు), రబాడ (38 మ్యాచ్ల్లో 99 వికెట్లు), డొనాల్డ్ (44 మ్యాచ్ల్లో 98 వికెట్లు) ఉన్నారు.రబాడ ఈ ఘనతను ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సాధించాడు. ఈ మ్యాచ్లో అతను 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రబాడతో పాటు క్వేనా మపాకా (4-0-20-4) కూడా రాణించడంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది.టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్కు ఈ స్కోర్ అందించాడు. గ్రీన్ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్వుడ్ (4-0-27-3), డ్వార్షుయిస్ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్వెల్ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో ఓపెనర్ రికెల్టన్ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. ఈ గెలుపుతో ఆసీస్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో రెండో టీ20 ఆగస్ట్ 12న జరుగనుంది. -
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిన్న (ఆగస్ట్ 10) జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవరల్లో 178 పరుగులకు ఆలౌటైంది. పొట్టి క్రికెట్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి (26 టీ20ల్లో).ఈ మ్యాచ్లో మరిన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో వరుసగా 9 టీ20 మ్యాచ్ల్లో గెలుపొందింది. గతంలో ఆసీస్ వరుసగా ఇన్ని టీ20 మ్యాచ్ల్లో ఎప్పుడూ గెలవలేదు. ఈ సిరీస్కు ముందు ఆసీస్ వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై 5-0 తేడాతో ఓడించింది.ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు 13 సిక్సర్లు బాదారు. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా (ఓ మ్యాచ్లో) బాదిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023లో డర్బన్లో జరిగిన టీ20లోనూ ఇన్నే సిక్సర్లు నమోదయ్యాయి.ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా యువ పేసర్ క్వేనా మపాకా ఓ ఆల్టైమ్ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మపాకా టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో నాలుగు వికెట్ల ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (19 ఏళ్ల 318 రోజులు) రికార్డు సాధించాడు. అలాగే పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సౌతాఫ్రికా బౌలర్గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మపాకా (4-0-20-4), రబాడ (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది. వాస్తవానికి ఆసీస్ ఈ స్కోర్ కూడా సాధించలేకపోయేది. 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్కు ఈ స్కోర్ అందించాడు. గ్రీన్ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. వీరు మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో అంతా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ 13, ట్రవిస్ హెడ్ 2, జోస్ ఇంగ్లిస్ 0, మిచెల్ ఓవెన్ 2, మ్యాక్స్వెల్ 1, డ్వార్షుయిస్ 17, ఎల్లిస్ 12, జంపా ఒక్క పరుగు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో మపాకా, రబాడతో పాటు ఎంగిడి, లిండే, ముత్తాసామి వికెట్లు తీశారు (తలో వికెట్).అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్వుడ్ (4-0-27-3), డ్వార్షుయిస్ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్వెల్ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో ఓపెనర్ రికెల్టన్ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (27 బంతుల్లో 37) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లలో మార్క్రమ్ 12, ప్రిటోరియస్ 14, బ్రెవిస్ 2, లిండే 0, బాష్ 2, ముత్తుసామి 0, రబాడ 10, మపాకా 3 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ సిరీస్లో రెండో టీ20 ఆగస్ట్ 12న జరుగనుంది. -
మళ్లీ ఓడిన భారత మహిళల ‘ఎ’ జట్టు
మెక్కే: భారత ‘ఎ’ మహిళల జట్టు వరుసగా మూడో మ్యాచ్లోనూ ఓడింది. ఇదివరకే అనధికారిక టి20 సిరీస్ను చేజార్చుకున్న అమ్మాయిల జట్టు ఆఖరి పోరులో గెలుపు తీరానికి చేరువై చివరకు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో అనధికారిక టి20 సిరీస్లో ఆ్రస్టేలియా ‘ఎ’ 3–0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. స్పిన్ ద్వయం రాధా యాదవ్ (3/31), ప్రేమ రావత్ (3/24)ల మాయాజాలానికి ఆసీస్ ఇన్నింగ్స్ తడబడింది. మేడ్లైన్ (32 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), అలీసా హీలీ (21 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్), అనిక (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అయితే వరుస విరామాల్లో రాధ, ప్రేమలిద్దరు వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ జోరుకు అడ్డుకట్ట పడింది. తర్వాత ఛేదించదగిన లక్ష్యమే అయినా... టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్ల నిర్లక్ష్యంతో భారత్ ‘ఎ’ అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులే చేశారు. ఓపెనర్ వృంద (4), ఉమా ఛెత్రి (3) నిరాశపరిచారు. షఫాలీ వర్మ (25 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే బాధ్యతగా ఆడింది. రాఘ్వి బిస్త్ (25 బంతుల్లో 25; 2 ఫోర్లు), మిన్ను మణి (29 బంతుల్లో 30; 4 ఫోర్లు)ల పోరాటంతో గెలుపు దారిలో పడిన భారత్ను 19వ ఓవర్ దెబ్బ కొట్టింది. 12 బంతుల్లో 18 పరుగుల సమీకరణం టి20ల్లో ఏమాత్రం కష్టం కాదు. కానీ 19వ ఓవర్ వేసిన సియానా జింజర్ (4/16) తొలి బంతికి సజన (3), ఐదో బంతికి రాధ (9)ను అవుట్ చేయడంతో భారత్ విజయానికి దూరమైంది. ఆఖరి ఓవర్లో ప్రేమ రావత్ (8 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా... ఇంకా 4 పరుగుల దూరంలోనే ఉండిపోయింది. మూడు అనధికారిక వన్డేల సిరీస్ బ్రిస్బేన్లో 13న జరిగే తొలి మ్యాచ్తో మొదలవుతుంది. -
భారీ రికార్డుపై కన్నేసిన మ్యాక్స్వెల్
ఆసీస్ వెటరన్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 10) ప్రారంభమయ్యే 3 మ్యాచ్లో టీ20 సిరీస్లో మరో 4 వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన డబుల్ను (2500 పరుగులు, 50 వికెట్లు) సాధిస్తాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్, పాక్ మాజీ మొహమ్మద్ హఫీజ్, మలేసియా ఆల్రౌండర్ విరన్దీప్ సింగ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో షకీబ్ అత్యధికంగా 129 మ్యాచ్ల్లో 2551 పరుగులు చేసి, 149 వికెట్లు తీయగా.. హఫీజ్ 119 మ్యాచ్ల్లో 2514 పరుగులు చేసి, 61 వికెట్లు తీశాడు. విరన్దీప్ 102 మ్యాచ్ల్లో 3013 పరుగులు చేసి, 97 వికెట్లు తీశాడు.మ్యాక్స్వెల్ విషయానికొస్తే.. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇప్పటిదాకా 121 మ్యాచ్లు ఆడి 2754 పరుగులు చేసి, 46 వికెట్లు తీశాడు.కాగా, సౌతాఫ్రికాతో తొలి టీ20 ఇవాళ మధ్యాహ్నం 2:45 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్ డార్విన్లో (ఆస్ట్రేలియా) జరుగనుంది. రెండో టీ20 ఆగస్ట్ 12న ఇదే డార్విన్లో జరుగనుండగా.. మూడో టీ20 ఆగస్ట్ 16న కెయిన్స్ వేదికగా జరుగనుంది. టీ20 సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ మ్యాచ్లు ఆగస్ట్ 19, 22, 24 తేదీల్లో కెయిన్స్ (తొలి వన్డే), మెక్కే (మిగతా రెండు) వేదికలుగా జరుగనున్నాయి. -
దక్షిణాఫ్రికా X ఆ్రస్టేలియా
డార్విన్ (ఆ్రస్టేలియా): వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ కోసం ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుండగా... దానికి ముందు సన్నాహకంగా ఈ రెండు జట్ల మధ్య నేటి నుంచి మూడు మ్యాచ్ల టి20 సిరీస్ జరగనుంది. 2023 తర్వాత ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య అంతర్జాతీయ టి20 మ్యాచ్ జరగలేదు. గతేడాది టీమిండియా చాంపియన్గా నిలిచిన వరల్డ్కప్లో ఆ్రస్టేలియా ఆకట్టుకోలేకపోగా... దక్షిణాఫ్రికా ఫైనల్లో ఓడింది. ఇరు జట్ల మధ్య ఇటీవల ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగగా... అందులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత జింబాబ్వేలో పర్యటించిన సఫారీ జట్టు... ముక్కోణపు టి20 సిరీస్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు ఆ్రస్టేలియా జట్టు వెస్టిండీస్ గడ్డపై 5–0తో టి20 సిరీస్ గెలుచుకుంది. ఆ సిరీస్కు అందుబాటులో లేని ట్రావిస్ హెడ్ తిరిగి ఆసీస్ జట్టులో చేరనుండగా... ఎయిడెన్ మార్క్రమ్, కగిసో రబాడ దక్షిణాఫ్రికా జట్టులో పునరాగమనం చేస్తున్నారు. ఆసీస్ ప్రధాన పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్కు కూడా దూరంగా ఉండనుండగా... జోష్ హాజల్వుడ్ పేస్ భారాన్ని మోయనున్నాడు. 2008 తర్వాత డారి్వన్లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించనుండటం ఇదే తొలిసారి కాగా... మిచెల్ మార్ష్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల విండీస్తో సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మార్ష్.. హెడ్తో కలిసి వచ్చే ఏడాది వరల్డ్కప్లో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు శనివారమే ప్రకటించాడు. ‘హెడ్తో కలిసి ఓపెనింగ్ చేస్తా. చాన్నాళ్లుగా మేం కలిసి ఆడుతున్నాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. టి20 వరల్డ్కప్లోనూ ఇదే కొనసాగుతుంది’అని మార్ష్ అన్నాడు. ఇన్గ్లిస్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ ఓవెన్తో ఆసీస్ బలంగా ఉంది. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్పై దక్షిణాఫ్రికా భారీ ఆశలు పెట్టుకుంది. మార్క్రమ్, రికెల్టన్, డసెన్, బ్రేవిస్, స్టబ్స్, లిండె, బాష్తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలంగా ఉంది. రబాడ, బర్గర్, ఎంగిడి బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. -
మేటి జట్టుతో ఆడినపుడే...
బెంగళూరు: ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుతో తలపడితే లోపాలు సవరించుకొని మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుందని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 29 నుంచి రాజ్గిర్ వేదికగా పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ప్రారంభం కానుండగా... అంతకుముందు భారత జట్టు ఆ్రస్టేలియాలో పర్యటిస్తోంది. ఈ టూర్లో భాగంగా పెర్త్లోని హాకీ స్టేడియంలో ఆతిథ్య ఆ్రస్టేలియాతో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడనుంది. దీని కోసం శుక్రవారం బెంగళూరు నుంచి జట్టు ఆ్రస్టేలియాకు పయనమైంది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... ‘ఆ్రస్టేలియా వంటి బలమైన ప్రత్యర్థితో వారి సొంతగడ్డపై మ్యాచ్లు ఆడటం సవాలుతో కూడుకున్నది. ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఇలాంటి క్లిష్టమైన సిరీస్ ఆడనుండటం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మేమంతా ఇలాంటి సన్నద్ధతే కోరుకున్నాం. ఆసియా కప్ కోసం జట్టును సిద్ధం చేసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. బలమైన ప్రత్యర్థితో తలపడినప్పుడే మన లోపాలు బయటపడతాయి. వాటిని ఎలా అధిగమించాలో మార్గాలు వెతికి మరింత మెరుగైన ప్రదర్శన చేయవచ్చు. జట్టు మొత్తం సమష్టిగా రాణించాలని భావిస్తున్నాం. ఈ సన్నద్ధత ఆసియా కప్లో తప్పక ఉపయోగపడుతుంది’ అని అన్నాడు. ఆగస్టు 15, 16, 19, 21న పెర్త్లో భారత్, ఆ్రస్టేలియా మధ్య హాకీ మ్యాచ్లు జరగనున్నాయి. ప్రదర్శన ఆధారంగా ఆసియాకప్ తుది జట్టు కూర్పు ఉండనుంది. మెరుగైన ఆటతీరు కనబర్చిన ప్లేయర్లనే ఆసియాకప్నకు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుత జట్టులో అటు అనుభవజ్ఞు, ఇటు యువకులు ఉండటంతో... ఆ్రస్టేలియాపై వారి ఆటతీరును అంచనా వేసిన తర్వాతే ఆసియాకప్నకు జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీలో సత్తా చాటిన జట్టు వరల్డ్కప్నకు నేరుగా అర్హత సాధించనుంది. -
ఆస్ట్రేలియా జట్టులో ఇద్దరు భారత మూలాలున్న క్రికెటర్లు
స్వదేశంలో భారత అండర్-19 జట్టుతో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా అండర్-19 జట్టును నిన్న (ఆగస్ట్ 7) ప్రకటించారు. ఈ జట్టులో ఇద్దరు భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూసౌత్ వేల్స్కు ప్రాతినిథ్యం వహించే యశ్ దేశ్ముఖ్, విక్టోరియాకు ఆడే ఆర్యన్ శర్మ ఈ జట్టుకు ఎంపికయ్యారు. వీరిలో దేశ్ముఖ్ స్పిన్నర్ కాగా.. ఆర్యన్ శర్మ వికెట్ కీపర్ బ్యాటర్. ఆర్యన్ శర్మ విక్టోరియా తరఫున 31 మ్యాచ్ల్లో సత్తా చాటి జట్టులోకి రాగా.. దేశ్ముఖ్ 2024/25 అండర్-17 నేషనల్ ఛాంపియన్స్ లీగ్లో చెలరేగి జట్టులో ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఆసీస్ అండర్-19 జట్టు ఆయుశ్ మాత్రే నేతృత్వంలోని భారత్ అండర్-19 జట్టుతో తలపడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో తొలుత మూడు 50 ఓవర్ల మ్యాచ్లు, ఆతర్వాత రెండు 4 రోజుల మ్యాచ్లు జరుగనున్నాయి.భారత అండర్-19 జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు..సైమన్ బడ్జ్, అలెక్స్ టర్నర్, స్టీవ్ హోగన్, విల్ మలాజ్చుక్, యశ్ దేశ్ముఖ్, టామ్ హోగన్, ఆర్యన్ శర్మ, జాన్ జేమ్స్, హేడెన్ స్కిల్లర్, చార్లెస్ లచ్మండ్, బెన్ గార్డన్, విల్ బైరోమ్, కేసీ బార్టన్, అలెక్స్ లీ యంగ్, జేడన్ డ్రేపర్రిజర్వ్ ఆటగాళ్లు: జెడ్ హోల్లిక్, టామ్ పాడింగ్టన్, జూలియన్ ఓస్బోర్న్షెడ్యూల్..సెప్టెంబర్ 21- తొలి వన్డే (బ్రిస్బేన్)సెప్టెంబర్ 24- రెండో వన్డే (బ్రిస్బేన్)సెప్టెంబర్ 26- మూడో వన్డే (బ్రిస్బేన్)సెప్టెంబర్ 20- అక్టోబర్ 3 వరకు- తొలి టెస్ట్ (బ్రిస్బేన్)అక్టోబర్ 7-10- రెండో టెస్ట్ (మెక్కే)ఈ సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు..ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్కీపర్), ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, డి దీపేష్, కిషన్ కుమార్, అన్మోలన్జీత్, ఖిలన్ పటేల్, ఉద్దవ్ మోహన్, అమన్ చౌహాన్ -
భారత పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్ల ప్రకటన.. హైలైట్గా నిలిచిన కొన్స్టాస్ ఎంపిక
ఆస్ట్రేలియా-ఏ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 16 నుంచి మొదలు కానుంది.ఈ పర్యటన కోసం రెండు వేర్వేరు ఆస్ట్రేలియా జట్లను (రెండు ఫార్మాట్ల కోసం) ఇవాళ (ఆగస్ట్ 7) ప్రకటించారు. టెస్ట్ జట్టులో సామ్ కొన్స్టాస్ ఎంపిక హైలైట్గా నిలిచింది. అతని టాలెంట్కు భారత్లోని స్పిన్ ఫ్రెండ్లీ పిచ్పై కఠినమైన సవాళ్లు ఎదురు కానున్నాయి.భారత్తో జరిగిన తన డెబ్యూ సిరీస్లో (బీజీటీ 2024-25) బుమ్రాతో గొడవపడి వార్తల్లోకెక్కిన కొన్స్టాస్.. ఆతర్వాత లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. ఆసీస్ మీడియా కొన్స్టాస్కు భారీ హైప్ ఇస్తుంటుంది. మరో రికీ పాంటింగ్తో పోలుస్తుంది.కొన్స్టాస్కు 2027 బీజీటీ కోసం సిద్దం చేసేందుకు ఆసీస్ సెలెక్టర్లు భారత్-ఏతో సిరీస్కు ఎంపిక చేశారు. ఈ జట్టులో కొన్స్టాస్తో పాటు ఆసీస్ టెస్ట్ ప్లేయర్లు కూపర్ కొన్నోలీ, టాడ్ మర్ఫీ, నాథన్ మెక్స్వీకి చోటు దక్కింది. వన్డే జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. 26 ఏళ్ల ఆరోన్ హార్డీనే జట్టులో అతి పెద్ద వయస్కుడు. ఈ జట్టులో విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్కు కూడా చోటు లభించింది.షెడ్యూల్..సెప్టెంబర్ 16 నుండి 19- తొలి టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 23 నుంచి 26- రెండో టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 30- తొలి వన్డే (కాన్పూర్)ఆక్టోబర్ 3- రెండో వన్డే (కాన్పూర్)అక్టోబర్ 5- మూడో వన్డే (కాన్పూర్)భారత్-ఏతో నాలుగో రోజుల మ్యాచ్ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు: జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, జాక్ ఎడ్వర్డ్స్, ఆరోన్ హార్డీ, కాంప్బెల్ కెల్లావే, సామ్ కొన్స్టాస్, నాథన్ మెక్స్వీనీ, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, ఫెర్గస్ ఓ'నీల్, ఓలివర్ పీక్, జోష్ ఫిలిప్, కోరీ రోచిసియోలి, లియామ్ స్కాట్భారత్-ఏతో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు: కూపర్ కొన్నోలీ, హ్యారీ డిక్సన్, జాక్ ఎడ్వర్డ్స్, సామ్ ఎలియట్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, మెకెంజీ హార్వే, టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘ, లియామ్ స్కాట్, లాచీ షా, టామ్ స్ట్రాకర్, విల్ సదర్లాండ్, కల్లమ్ విడ్లర్ -
షఫాలీ, రాధా యాదవ్పై దృష్టి
మకాయ్ (క్వీన్స్లాండ్): అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత యువ ప్లేయర్లు ఆ్రస్టేలియాలో పర్యటిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా భారత మహిళ ‘ఎ’ జట్టు... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో మూడు టి20లు, మూడు వన్డేలు, ఓ నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. టి20 సిరీస్లో భాగంగా గురువారం మకాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇందులో భారత ‘ఎ’ జట్టుకు రాధా యాదవ్ సారథిగా వ్యవహరిస్తుండగా... చాన్నాళ్ల తర్వాత భారత టి20 జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ అనుభవం ఉన్న పలువురు ప్లేయర్లతో పాటు కొత్త వాళ్లకు ఇందులో అవకాశం కల్పించారు. మిన్ను మణి, సజన, ఉమా ఛెత్రి, రాఘ్వి బిస్త్, తనూజ కన్వర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన షబ్నమ్ షకీల్, సైమా ఠాకూర్, టిటాస్ సాధు భారత ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. మరోవైపు గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమైన ఆ్రస్టేలియా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ ఆసీస్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుకు నికోల్ ఫాల్టుమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా... తహిలా విల్సన్, కిమ్ గార్త్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో ఆడనున్నారు. ఈ పర్యటనలోని మూడు ఫార్మాట్లకూ భారత ‘ఎ’ జట్టుకు రాధ యాదవ్ కెపె్టన్గా వ్యవహరించనుంది. -
టిమ్ డేవిడ్కు షాక్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్కు భారీ షాక్ తగిలింది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన ఓ టీ20 (5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్, జులై 28) సందర్భంగా అతను అంపైర్తో దురుసుగా ప్రవర్తించాడు. ఇందుకు గానూ ఐసీసీ ఆగ్రహించి, అతని మ్యాచ్ ఫీజ్లో 10 శాతం కోత విధించింది.ఆ మ్యాచ్లో డేవిడ్ అంపైర్ నిర్ణయం (వైడ్ బాల్ విషయంలో) పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఐసీసీ రూల్స్కు విరుద్దంగా ప్రవర్తించాడు. అంపైర్ అతను వైడ్గా భావించిన బంతిని ఫెయిర్ బాల్గా ప్రకటించడంతో డేవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చేతులను చాచి చూపిస్తూ వైడ్గా ప్రకటించాలని అంపైర్ను ఆదేశించాడు. ఈ సందర్భంగా డేవిడ్ ప్రవర్తన దురుసుగా ఉందని ఐసీసీ భావించింది. డేవిడ్ క్రీడా స్పూర్తిని మరచి ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కింద అతనికి జరిమానా విధించింది. అలాగే ఓ డీమెరిట్ పాయింట్ను కూడా కేటాయించింది.డేవిడ్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో అతనిని తదుపరి విచారణ నుంచి మినహాయించారు. ఆ మ్యాచ్లో డేవిడ్ 30 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్ల సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.ఆ సిరీస్లో డేవిడ్ చరిత్ర సృష్టించాడు. మూడో టీ20లో 37 బంతుల్లో శతక్కొట్టి ఆసీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. డేవిడ్ ఇటీవల ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతూ కూడా సత్తా చాటాడు. పలు మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. -
చాహల్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. వామ్మో క్రికెట్ టీమ్నే కొనేశారా?
ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ చాహల్తో సన్నిహితంగా కనిపించడమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్వశ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. దీంతో చాహల్తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరు లండన్లో జంటగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్లు వీక్షించడమే కాదు.. ఏకంగా క్రికెట్ టీమ్నే సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన సీఎల్టీ10 లీగ్లో ఆక్షన్లో తళుక్కున మెరిసిన మహ్వశ్..ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ను కొనుగోలు చేసింది. తన టీమ్కు కెప్టెన్గా షాన్ మార్ష్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆర్జే మహ్వశ్ టీమ్ కెప్టెన్..షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ను కూడా మీ టీమ్లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
భారత్కు క్లిష్టమైన ‘డ్రా’
సిడ్నీ: ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో మార్చి 1 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో ఆసియా ఘనాపాటి జపాన్ సహా మాజీ చాంపియన్లు చైనీస్ తైపీ, వియత్నాం జట్లున్న గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టుకు చోటు దక్కింది. దీనికి సంబంధించిన ‘డ్రా’ వేడుక సిడ్నీ టౌన్ హాల్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. భారత స్టార్ మిడ్ఫీల్డర్ సంగీత బస్ఫొరె ప్రత్యేక ఆహ్వానితులుగా ‘డ్రా’ ఈవెంట్లో పాల్గొంది. మొత్తం 12 ఆసియా జట్లను మూడు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో జట్టులో నాలుగేసి టీమ్లు తలపడతాయి. గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టు తమ తొలి మ్యాచ్లో మార్చి 4న వియత్నాంతో... రెండో మ్యాచ్లో మార్చి 7న ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్తో... మూడో మ్యాచ్లో మార్చి 10న చైనీస్ తైపీతో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో జపాన్ 7వ స్థానంలో, వియత్నాం 37వ స్థానంలో, చైనీస్ తైపీ 42వ స్థానంలో, భారత్ 70వ స్థానంలో ఉన్నాయి. సెమీస్ చేరితే ప్రపంచకప్ టోర్నీకి... ఆసియా కప్ గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఆ్రస్టేలియా, దక్షిణ కొరియా, ఇరాన్, ఫిలిప్పీన్స్... గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ జట్లున్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. అలాగే ఈ మూడు గ్రూప్ల్లో మెరుగైన మూడో స్థానం పొందిన రెండు జట్లు కూడా నాకౌట్కు క్వాలిఫై అవుతాయి. ఈ 8 జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్స్ విజేతలు అంటే సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు 2027లో బ్రెజిల్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతాయి. క్వార్టర్స్లో ఓడిన జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉంటుంది. ఆసియా నుంచి మరో రెండు జట్లకు ప్రపంచకప్ బెర్త్లు లభిస్తాయి. -
ఆసీస్ బౌలర్ చెత్త ప్రదర్శన.. ఓవర్లో ఏకంగా 18 బంతులు..!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్తో ఇవాళ (జులై 29) జరిగిన మ్యాచ్లో ఓ ఓవర్లో ఏకంగా 18 బంతులు వేశాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ ఓ ఓవర్లో ఇన్ని బంతులు వేయలేదు. గతంలో ఈ రికార్డు విండీస్ లోకల్ ప్లేయర్ రోషన్ ప్రైమస్ పేరిట ఉండేది. ప్రైమస్ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఓ మ్యాచ్లో ఓవర్లో 13 బంతులు వేశాడు. తాజాగా ప్రైమస్ రికార్డును హేస్టింగ్స్ బద్దలు కొట్టాడు.పాకిస్తాన్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన హేస్టింగ్స్ 12 వైడ్లు, ఓ నో బాల్ వేశాడు. ఈ ఓవర్లో కేవలం ఐదు బంతులు మాత్రమే వేసిన అతను మొత్తంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఆసీస్ 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇది జరిగింది. హేస్టింగ్స్ గల్లీ బౌలర్ల కంటే అధ్వానంగా బౌలింగ్ చేసి అందరికీ విసుగు తెప్పించాడు. 39 ఏళ్ల హేస్టింగ్స్ ఆసీస్ తరఫున ఓ టెస్ట్, 29 వన్డేలు, 9 టీ20లు ఆడి ఉండటం కొసమెరుపు. ఇతగాడు ఐపీఎల్లోనూ 3 మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాడిని నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించింది కాదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ చేసింది. సయీద్ అజ్మల్ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూల్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్ను గెలుపు తీరాలు దాటించారు.కాగా, ఈ టోర్నీలో పాక్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్తో ఆడాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
ఆరేసిన అజ్మల్.. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో పాకిస్తాన్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్లో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆ జట్టు.. ఇవాళ (జులై 29) ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి టేబుల్ టాపర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది.స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 74 పరుగులకే కుప్పకూలింది. అజ్మల్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. షాన్ మార్ష్ 7, క్రిస్ లిన్ 6, డి ఆర్చీ షార్ట్ 2, డేనియల్ క్రిస్టియన్ 0, బెన్ కటింగ్ 5, నాథన్ కౌల్టర్ నైల్ 0, పీటర్ సిడిల్ 5, స్టీవ్ ఓకీఫ్ 1, బ్రెట్ లీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.పాక్ బౌలర్లలో అజ్మల్తో పాటు ఇమాద్ వసీం (3-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-8-1), సోహైల్ ఖాన్ (2-0-23-1) కూడా వికెట్లు తీశారు.అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్ను గెలుపు తీరాలు దాటించారు. ఆసీస్ కెప్టెన్ ఐదుగురు బౌలర్లను ప్రయోగించినా ఒక్క పాక్ వికెట్ను కూడా తీయలేకపోయారు.కాగా, ఈ టోర్నీలో పాక్తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్తో ఆడాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
విజృంభించిన పాక్ బౌలర్.. 74 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో పాకిస్తాన్ లెజెండ్స్ టీమ్ అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్లో 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించి, ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న పాక్.. ఇవాళ (జులై 29) ఆస్ట్రేలియా లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో మరోసారి సత్తా చాటింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది.ఆ జట్టు స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 74 పరుగులకే కుప్పకూలింది. అజ్మల్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. షాన్ మార్ష్ 7, క్రిస్ లిన్ 6, డి ఆర్చీ షార్ట్ 2, డేనియల్ క్రిస్టియన్ 0, బెన్ కటింగ్ 5, నాథన్ కౌల్టర్ నైల్ 0, పీటర్ సిడిల్ 5, స్టీవ్ ఓకీఫ్ 1, బ్రెట్ లీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.పాక్ బౌలర్లలో అజ్మల్తో (3.5-0-16-6) పాటు ఇమాద్ వసీం (3-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-8-1), సోహైల్ ఖాన్ (2-0-23-1) కూడా వికెట్లు తీశారు.కాగా, ఈ టోర్నీలో పాక్తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్తో ఆడాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
సెంచరీ కొట్టిన ఆడమ్ జంపా.. నాలుగో ఆస్ట్రేలియన్ ప్లేయర్గా రికార్డు
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. 33 ఏళ్ల జంపా పొట్టి ఫార్మాట్లో ఆసీస్ తరఫున 100 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆసీస్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. జంపాకు ముందు గ్లెన్ మ్యాక్స్వెల్ (121), డేవిడ్ వార్నర్ (110), ఆరోన్ ఫించ్ (103) మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇవాళ (జులై 29) వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20 జంపా కెరీర్లో 100వ మ్యాచ్. ఈ మ్యాచ్లో జంపా ఓ మోస్తరుగా (3-0-20-1) రాణించి ఆసీస్ విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్ల సిరీస్ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. డ్వార్షుయిస్ (4-0-41-3), నాథన్ ఇల్లిస్ (3.4-0-32-2), ఆరోన్ హార్డీ (4-0-39-1), సీన్ అబాట్ (4-0-30-1), మ్యాక్స్వెల్ (1-0-6-1), జంపా (3-0-20-1) ధాటికి 19.4 ఓవరల్లో 170 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్లో షిమ్రోన్ హెట్మైర్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. రూథర్ఫోర్డ్ (35) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కెమరూన్ గ్రీన్ (32), టిమ్ డేవిడ్ (30), మిచెల్ ఓవెన్ (37), ఆరోన్ హార్డీ (28 నాటౌట్) తలో చేయి వేయడంతో 17 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (7 వికెట్లు కోల్పోయి). విండీస్ బౌలర్లలో అకీల్ హోసేన్ 3, జేసన్ హోల్డర్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు తీశారు.కాగా, ఈ సిరీస్కు ముందు విండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కూడా ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా భారత్ తర్వాత ఓ పర్యటనలో వరుసగా 8 మ్యాచ్లు (3 టెస్ట్లు, 5 టీ20లు) గెలిచిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. భారత్ 2017 శ్రీలంక పర్యటనలో వరుసగా 9 మ్యాచ్ల్లో గెలిచింది. విండీస్తో టీ20 సిరీస్ను వైట్ వాష్ చేయడంతో ఆసీస్ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో టెస్ట్ హోదా కలిగిన జట్టును క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. -
39 బంతుల్లో శతక్కొట్టిన ఏబీడి.. ఆసీస్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో (WCL) సౌతాఫ్రికా లెజెండ్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇవాళ (జులై 27) ఆస్ట్రేలియా లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సౌతాఫ్రికాతో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా కూడా సెమీస్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన 3 మ్యాచ్ల్లో రెండు ఓడి ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. పాకిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్ను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి భారత్ ఇంగ్లండ్తో తలపడుతుంది.డివిలియర్స్ మహొగ్రరూపంఆసీస్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అతి భారీ స్కోర్ చేసింది. ఏబీడి కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేశాడు.ఏబీడీతో పాటు మరో ఓపెనర్ జేజే స్మట్స్ కూడా సునామీ ఇన్నింగ్స్తో (53 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. ఆరోన్ ఫాంగిసో (3.4-0-13-4), ఇమ్రాన్ తాహిర్ (4-0-27-3) చెలరేగడంతో 16.4 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో బెన్ కటింగ్ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కటింగ్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.అంతకుముందు 41 బంతుల్లో..!WCL 2025లో ఏబీడీ తొలి మ్యాచ్ నుంచే అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. భారత్తో జరిగిన తొలి మ్యాచ్లో 30 బంతుల్లో అజేయమైన 63 పరుగులు చేసిన అతను.. మూడు రోజుల కిందట ఇంగ్లండ్పై 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆ మ్యాచ్లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ అజేయమైన 116 పరుగులు చేశాడు. -
మరో భారత సంతతి వ్యక్తిపై అమానుషం : చేయి తెగి వేలాడింది, కానీ
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని భారతసంతతికి చెందిన వ్యక్తిపై దుండగులు దాడి చేశాడు. సౌరభ్ ఆనంద్ (33) మందులు కొనుగోలు చేసి ఫార్మసీ నుండి ఇంటికి వెళుతుండగా, ఐదుగురు యువకులు కత్తితో దారుణంగా దాడి చేశారు. దీంతో అతనుతీవ్రంగా గాయపడ్డాడు.మెల్బోర్న్లో ఈ నెల(జూలై) 19న ఘటన చోటు చేసుకుంది. దీంతో భారతీయులపై వరుస జాత్యహంకార దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది.జూలై 19న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆల్టోనా మెడోస్లోని సెంట్రల్ స్క్వేర్ షాపింగ్ సెంటర్లోని మందుల దుకాణంలో సౌరభ్ మందులు తీసుకున్నాడు. తన స్నేహితుడితో కాల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఐదుగురు యువకులు అతన్ని చుట్టుముట్టి, చితకబాదారు. మరొకరు అతని తలపై నేలపై పడే వరకు కొట్టారు. మూడవ యువకుడు ఒక కత్తితో గొంతుకు పట్టుకుని దాడిచేయబోతే వెంటనే తన చేతిని రక్షణ కోసం పైకి లేపాడు. దీంతో అతని ఎడమ చేయి దాదాపు వేరుపడి పోయింది. ఒక చిన్న నూలుపోగు లాంటి నరం సాయంతా వేలాడుతూ ఉండింది. అతని భుజంపై, వీపుపై కూడా పొడిచారు. దీంతో వెన్నెముక విరిగింది ఇతర ఎముకలు కూడా విరిగిపోయాయి. తనను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, కత్తి నా మణికట్టుపై వేటు పడింది. రెండో కత్తిపోటు మరో చేతితి గుండా పోయింది. మూడవ దాడి ఎముక గుండా పోయిందనీ, నొప్పి మాత్రమే గుర్తుంది, నా చేయి దాదాపు వేరుపడిన స్థితిలో ఉంది అంటూ బాధితుడు ఆస్ట్రేలియన్ మీడియాతో తెలిపాడు. చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదనతీవ్రగాయాలతో రక్తపు మడుగులతో పడి వున్న సౌరభ్ షాపింగ్ సెంటర్ బయటకొచ్చి సహాయాన్ని అర్థించాడు. దీంతో అతడిని సమీపంలోని రాయల్ మెల్బోర్న్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మొదట అతని చేతిని తీసివేయాల్సి వస్తుందని భావించారు. కానీ అదృష్టవశాత్తూ చేతిని తిరిగి అటాచ్ చేయగలిగారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఐదుగురు యువకులలో నలుగురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. కాగా గత వారం ఆస్ట్రేలియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. కారు పార్కింగ్ వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు చరణ్ప్రీత్ సింగ్ అనే భారతీయుడిపై దారుణంగా దాడి చేసి, జాతిపరంగా దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. -
ఆస్ట్రేలియా పర్యటనకు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. డబ్ల్యూటీసీ హీరోల ఎంట్రీ
ఆగస్ట్లో ఆస్ట్రేలియాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జులై 24) ప్రకటించారు. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్ హీరోలు బవుమా, మార్క్రమ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత బవుమా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. మార్క్రమ్ మరికొందరు సీనియర్లతో పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ మధ్యలో సౌతాఫ్రికా జింబాబ్వేతో 2 టెస్ట్లు, ప్రస్తుతం ముక్కోణపు సిరీస్ (జింబాబ్వే, న్యూజిలాండ్) ఆడుతుంది.ఇటీవలే టెస్ట్ అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ ప్రెనెలన్ సుబ్రాయెన్ సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల జట్టులో తొలిసారి స్థానం సంపాదించాడు. అలాగే హార్డ్ హిట్టర్ లుహాన్ డ్రి ప్రిటోరియస్ కూడా తొలిసారి వన్డే జట్టులో చోటు సాధించాడు. జింబాబ్వే సిరీస్తో టెస్ట్ అరంగేట్రం చేసిన విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టీ20, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నాడు.సీనియర్లు మార్క్రమ్, ర్యాన్ రికెట్లన్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. ఆసీస్తో సిరీస్ ఆగస్ట్ 10న మొదలుకానుంది. 10, 12, 16 తేదీల్లో టీ20లు.. 19, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి.ఆస్ట్రేలియా సిరీస్కు దక్షిణాఫ్రికా టీ20 జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లుహాన్ డ్రి ప్రిటోరియస్, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రెనెలన్ సుబ్రాయెన్, రస్సీ వాన్డర్ డస్సెన్ఆస్ట్రేలియా సిరీస్కు దక్షిణాఫ్రికా వన్డే జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, ఎయిడెన్ మార్క్రమ్, సెనురన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లుహాన్ డ్రి ప్రిటోరియస్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రెనెలన్ సుబ్రాయెన్ -
Australia: హిందూ ఆలయ గోడలపై జాత్యహంకార వ్యాఖ్యలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోగల ఒక హిందూ దేవాలయం గోడలపై ద్వేషపూరిత జాత్యహంకార రాతలు కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆస్ట్రేలియా హిందూ కౌన్సిల్ అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ఆలయం శాంతి, భక్తి, ఐక్యతకు నిలయమని ఆయన పునరుద్ధాటించారు.ఆస్ట్రేలియాలోని వాధర్స్ట్ డ్రైవ్లో గల స్వామినారాయణ ఆలయం గోడపై దుండగులు ఎర్రటి పెయింట్ చల్లి, జాత్యహంకార దుర్భాషపూరిత వ్యాఖ్యలు రాశారు. స్థానిక దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయానికి సమీపంలోని రెండు ఆసియా రెస్టారెంట్లలో కూడా ఇదే సందేశం కనిపించింది. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై స్పందిస్తూ, స్వామి నారాయణ ఆలయం రోజువారీ ప్రార్థనలు, సామూహిక భోజనాలు, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తుందని భగవత్ తెలిపారు.అయినప్పటికీ ఇటువంటి ఘటనలు ఎదురవడం శోచనీయమన్నారు. హిందువులు ఇతర వర్గాలవారిపై ప్రేమను చూపించాలని, ద్వేషంపై ప్రేమ విజయం సాధిస్తుందని భగవత్ అన్నారు. ఆలయంలో జరిగిన ఘటన తీవ్రంగా కలత పెట్టే అంశమని, భయాన్ని వ్యాప్తి చేయడానికే విద్రోహులు ఇటువంటి చర్యకు పాల్పడ్దారని భగవత్ పేర్కొన్నారు. -
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి
-
ఓ పక్క స్టార్క్ మహోగ్రం.. మరో పక్క బోలాండ్ విశ్వరూపం
వెస్టిండీస్తో జరిగిన జమైకా టెస్ట్లో ఆసీస్ పేసర్లు చెలరేగిపోయారు. ఓ పక్క మిచెల్ స్టార్క్ మహోగ్రరూపం (7.3-4-9-6), మరో పక్క స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ ప్రదర్శన ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 27 పరుగులకే కుప్పకూలి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఫలితంగా 176 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పాటు 3 మ్యాచ్ల సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయింది.ఈ మ్యాచ్లో 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. స్టార్క్తో పాటు స్కాట్ బోలాండ్ అటాక్ చేయడంతో కేవలం 14.3 ఓవర్లలోనే తమ పోరాటాన్ని ముగించింది. స్టార్క్ 15 బంతుల వ్యవధిలో (W 0 0 0 W W 0 0 0 0 0 0 W 2 W) 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. బోలాండ్ తనవంతుగా హ్యాట్రిక్ వికెట్లతో విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బోలాండ్ వరుసగా 1, 2, 3 బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్ను పెవిలియన్కు పంపాడు. తద్వారా టెస్ట్ల్లో ఆసీస్ తరఫున 10వ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా, డే అండ్ నైట్ టెస్ట్ల్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్లో 2 ఓవర్లు వేసిన బోలాండ్ కేవలం 2 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.టెస్ట్ల్లో ఆస్ట్రేలియా తరఫున హ్యాట్రిక్ తీసిన బౌలర్లు..ఫ్రెడ్రిక్ స్పోఫోర్త్హగ్ ట్రంబల్జిమ్మీ మాథ్యూస్లిండ్సే క్లైన్మెర్వ్ హ్యూస్డేమియన్ ఫ్లెమింగ్షేన్ వార్న్గ్లెన్ మెక్గ్రాత్పీటర్ సిడిల్స్కాట్ బోలాండ్చరిత్ర సృష్టించిన బోలాండ్జమైకా టెస్ట్లో స్కాట్ బోలాండ్ (Scott Boland) సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1915 తర్వాత టెస్టు క్రికెట్లో కనీసం 2000 డెలివరీలు సంధించిన బౌలర్లలో అత్యుత్తమ సగటు కలిగిన ఆటగాడిగా నిలిచాడు. బోలాండ్ తన నాలుగేళ్ల కెరీర్లో 14 టెస్ట్ల్లో 16.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. ఈ ఆల్టైమ్ రికార్డు ఇంగ్లండ్కు ఆడిన సిడ్నీ బార్న్స్ పేరిట ఉంది. బార్న్స్ 1901- 1914 మధ్యలో ఇంగ్లండ్ తరఫున16.43 సగటుతో వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మిచెల్ స్టార్క్ విలయతాండవం ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. జాన్ క్యాంప్బెల్, కెవియోన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్, జేడన్ సీల్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. విండీస్ ఇన్నింగ్స్లో కేవలం జస్టిన్ గ్రీవ్స్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. స్టార్క్తో పాటు స్కాట్ బోలాండ్ (2-1-2-3), హాజిల్వుడ్ (5-3-10-1) కూడా విజృంభించడంతో విండీస్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది.అంతకుముందు ఆసీస్ కూడా రెండో ఇన్నింగ్స్లో 121 పరుగులకే కుప్పకూలింది. అల్జరీ జోసఫ్ (12-2-27-5), షమార్ జోసఫ్ (13-4-34-4), జస్టిన్ గ్రీవ్స్ (4-0-19-1) చెలరేగారు. ఆసీస్ ఇన్నింగ్స్లో కెమరూన్ గ్రీన్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లోనూ 143 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్ బౌలర్లంతా మూకుమ్మడిగా చెలరేగారు. బోలాండ్ 3, హాజిల్వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్స్టర్ చెరో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో జాన్ క్యాంప్బెల్ (36) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షమార్ 4, సీల్స్, గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీశారు. -
AUS Vs WI: రసవత్తరంగా సాగుతున్న విండీస్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్
జమైకా వేదికగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 181 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కెమరూన్ గ్రీన్ (42), పాట్ కమిన్స్ (5) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, షమార్ జోసఫ్ 2, జస్టిన్ గ్రీవ్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా 14, సామ్ కొన్స్టాస్ 0, స్టీవ్ స్మిత్ 5, ట్రవిస్ హెడ్ 16, బ్యూ వెబ్స్టర్ 13, అలెక్స్ క్యారీ 0 పరుగులకు ఔటయ్యారు.అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో 143 పరుగులకే కుప్పకూలింది. 36 పరుగులు చేసిన జాన్ క్యాంప్బెల్ విండీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో షాయ్ హోప్ (23), జస్టిన్ గ్రీవ్స్ (18), రోస్టన్ ఛేజ్ (18), బ్రాండన్ కింగ్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 3, హాజిల్వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్స్టర్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఖ్వాజా (23), హెడ్ (20), క్యారీ (21), కమిన్స్ (24) 20ల్లో ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 4, గ్రీవ్స్, జేడన్ సీల్స్ తలో 3 వికెట్లు తీశారు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్లు గెలిచి ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. -
నిప్పులు చెరిగినపేసర్లు.. స్వల్ప స్కోర్కే ఆలౌటైన ఆస్ట్రేలియా
జమైకా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు తొలి రోజు పైచేయి సాధించింది. ఆ జట్టు పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ఆటగాళ్లను బెంబేలెత్తించారు. ఫలితంగా ఆసీస్ 225 పరుగులకే ఆలౌటైంది. షమార్ జోసఫ్ 4, జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆదిలో సజావుగానే సాగింది. 28 పరుగులకే తొలి వికెట్ (కొన్స్టాస్ (17), 68 పరుగులకే రెండో వికెట్ (ఖ్వాజా (23)) కోల్పోయినా.. గ్రీన్ (46), స్మిత్ (48) ఆసీస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే గ్రీన్ ఔటైన తర్వాత ఆసీస్ 68 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు, టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. హెడ్ (20) ప్రతిఘటించే ప్రయత్నం చేసినా సబ్స్టిట్యూట్ ఆటగాడు ఆండర్సన్ ఫిలిప్ కళ్లు చెదిరే క్యాచ్తో అతన్ని పెవిలియన్ బాట పట్టించాడు. వెబ్స్టర్ 1, అలెక్స్ క్యారీ 21, కమిన్స్ 24, స్టార్క్ 0, బోలాండ్ 5 (నాటౌట్), హాజిల్వుడ్ 4 పరుగులు చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ కెవియన్ ఆండర్సన్ను (3) మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (8), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (3) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 209 పరుగులు వెనకుపడి ఉంది.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో గెలుచుకుంది. తొలి రెండు టెస్ట్ల్లో ఆసీస్ అద్భుత విజయాలు సాధించింది. నామమాత్రంగా సాగుతున్న చివరి మ్యాచ్లో తొలి రోజు విండీస్ పైచేయి సాధించడం విశేషం. -
హోరాహోరీగా సాగుతున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్
వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య గ్రెనెడా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ హెరాహోరీగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక ఆసీస్ 254 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలెక్స్ క్యారీ (26), పాట్ కమిన్స్ (4) క్రీజ్లో ఉన్నారు. మూడో రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ (71), కెమరూన్ గ్రీన్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. ట్రవిస్ హెడ్ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఆసీస్ ఇన్నింగ్స్లో సామ్ కొన్స్టాస్ 0, ఉస్మాన్ ఖ్వాజా 2, నాథన్ లియోన్ 8, బ్యూ వెబ్స్టర్ 2 పరుగులకు ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్, జేడన్ సీల్స్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (75) అర్ద సెంచరీతో రాణించడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్ బ్యాటర్లలో జాన్ క్యాంప్బెల్ (40), అల్జరీ జోసఫ్ (27), షమార్ జోసఫ్ (29), షాయ్ హెప్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్న క్రెయిగ్ బ్రాత్వైట్ 0, కీసీ కార్టీ 6, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 16, జస్టిన్ గ్రీవ్స్ 1, ఆండర్సన్ ఫిలిప్ 10 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 3, హాజిల్వుడ్, కమిన్స్ చెరో 2, స్టార్క్, వెబ్స్టర్, హెడ్ ఒక్కో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. వెబ్స్టర్ (60), క్యారీ (63) అర్ద సెంచరీలతో రాణించారు. కొన్స్టాస్ 25, ఖ్వాజా 16, గ్రీన్ 26, స్టీవ్ స్మిత్ 3, హెడ్ 29, కమిన్స్ 17, స్టార్క్ 6, లియోన్ 11, హాజిల్వుడ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, సీల్స్ 2, షమార్ జోసఫ్, ఫిలిప్, గ్రీవ్స్ తలో వికెట్ తీశారు.కాగా, ఆస్ట్రేలియా జట్టు 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ ఇది. తొలి టెస్ట్లో ఆసీస్ 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి
ఆస్ట్రేలియాలో అన్ని ప్రధాన నగరాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైయస్సార్ ఒక మరణం లేని మహనీయుడని తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. తమలో చాలామంది వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామని తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బ్రిస్ బేన్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ తెలుగు ప్రజలకు అందించిన సేవలు ఎన్నటికీ మరచిపోమని అలాగే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వైఎస్ జగన్ బాటను విడవబోమని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమాలలో పాల్గొన్న వారికి జూమ్ కాల్ ద్వారా వైఎస్సార్సీపీ నాయకులు, ఆలూరు సాంబశివారెడ్డి , సోషల్ మీడియా ఇన్ఛార్జి యశ్వంత్, చల్లా మధుసూదన్ రెడ్డి, అబ్బయ్య చౌదరి, అరే శ్యామల, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కారుమూరి వెంకట్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, బియ్యపు మధుసూదన్ రెడ్డి, అభినందనలు తెలియజేశారు. -
AUS Vs WI: ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
గ్రెనడా వేదికగా వెస్టిండీస్తో రెండో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గురువారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాలని కంగారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా టీమ్మెనెజ్మెంట్ తమ ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించింది.చేతివేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి గ్రెనడా టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. స్మిత్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్పై వేటు పడింది. తొలి టెస్టులో అవకాశం లభించినప్పటికి ఇంగ్లిష్ ఉపయోగించుకోలేకపోయాడు.అదేవిధంగా బార్బడోస్ టెస్టు రెండు ఇన్నింగ్స్లలో విఫలమైన సామ్ కాన్స్టాస్, ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్లకు ఆసీస్ టీమ్మెనెజ్మెంట్ మరో అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా తమ బౌలింగ్ లైనప్లో ఎటువంటి మార్పులు చేయలేదు. స్టార్క్, హాజిల్వుడ్, కమ్మిన్స్ ఆసీస్ ఫ్రంట్లైన్ పేసర్లగా ఉన్నారు.వీరితో పాటు నాలుగో పేసర్గా ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్ బంతిని పంచుకోనున్నాడు. ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్లో నాథన్ లియాన్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఉన్నాడు. తొలి టెస్టులో 159 పరుగుల తేడాతో విండీస్ను కమ్మిన్స్ సేన చిత్తు చేసింది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో ఆసీస్ బోణీ కొట్టింది.విండీస్తో రెండో టెస్టుకు ఆసీస్ తుది జట్టుఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ క్యారీ, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజిల్వుడ్చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా -
వామ్మో పాము.. విమానంలో కలకలం
ఆస్ట్రేలియాలోని విమానంలో ఓ పాము కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యంగా టేకాఫ్ అయింది. మెల్బోర్న్ ఎయిర్పోర్టు నుంచి బ్రిస్బేన్కు వెళ్లే విమానంలోకి పాము దూరింది.విమానంలో ప్రయాణికుల లగేజ్ భద్రపరిచే ప్రాంతంలోకి పాము వెళ్తుండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు స్నేక్ క్యాచర్ను రంగంలోకి దించారు. సుమారు అరగంట పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. అనంతరం విమానానికి తనిఖీలు నిర్వహించి టేకాఫ్ చేశారు.మొదట పాము విషపూరితమైనదిగా అనుమానించారు.. కానీ పట్టుకున్న తర్వాత అది విషపూరితం కాదని.. అది పసిరిక పాముగా గుర్తించినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. అధికారుల నుంచి సమాచారం అందగానే అరగంటలో తాను ఎయిర్పోర్టుకు చేరుకున్నానని, సెక్యూరిటీ తనిఖీల వద్ద బాగా ఆలస్యం జరిగినట్లు స్నేక్ క్యాచర్ పెల్లీ వెల్లడించాడు. -
తొలి టెస్ట్లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం.. విండీస్ హెడ్ కోచ్కు భారీ షాక్
వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి ఐసీసీ భారీ షాకిచ్చింది. అంపైర్ నిర్ణయాలను విమర్శించినందుకు గానూ డిమెరిట్ పాయింట్తో పాటు జరిమానా విధించింది. అంపైర్ నిర్ణయాలను విమర్శించడం లేదా వ్యతిరేకించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీంతో ఐసీసీ సామీపై చర్యలు తీసుకుంది.అసలేం జరిగిందంటే.. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జూన్ 25 నుంచి 27 మధ్య తేదీల్లో బార్బడోస్ వేదికగా విండీస్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రెండో రోజు థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్స్టాక్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఇందులో నాలుగు నిర్ణయాలు విండీస్కు వ్యతిరేకంగా వచ్చాయి. దీనిపై విలేకరుల సమావేశంలో విండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్స్టాక్ తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ తమ నుంచి చేజారిందని చెప్పుకొచ్చాడు. హోల్డ్స్టాక్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. నిర్ణయాలు తీసుకోవడంలో హోల్డ్స్టాక్ స్థిరత్వాన్ని ప్రశ్నించాడు. గతంలో కూడా హోల్డ్స్టాక్ ఇలాగే చేశాడని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో అంపైర్ తీరును బహిరంగంగా విమర్శించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.7 ఉల్లంఘన కిందికి వస్తుంది.ఇందుకు గానూ సామీకి ఓ డిమెరిట్ పాయింట్తో పాటు మ్యాచ్ ఫీజ్లో 15 శాతం జరిమానా విధించారు. సామీ తన తప్పును ఒప్పుకోవడంతో అతనిని తదుపరి విచారణకు పిలువలేదు. సామీపై చర్యలు తీసుకున్న విషయాన్ని మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ వెల్లడించాడు.విండీస్ తొలి ఇన్నింగ్స్లో హోల్డ్స్టాక్ అప్పటికే క్రీజ్లో కుదురుకున్న షాయ్ హోప్, రోస్టన్ ఛేజ్ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. టీవీ రీప్లేలు ఈ ఇద్దరు నాటౌట్ అని చూపించినా హోల్డ్స్టాక్ ఔట్గా ప్రకటించాడు. హోప్, ఛేజ్ ఔట్ కావడం ఈ మ్యాచ్లో విండీస్పై భారీ ప్రభావం చూపించింది. తొలి ఇన్నింగ్స్లో ఈ ఇద్దరు రాణించినందుకు విండీస్కు స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.అయితే ఈ ఆధిక్యాన్ని విండీస్ వెంటనే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో కుదురుగా ఆడిన ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ చేసి విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఛేదనలో పూర్తిగా చేతులెత్తేసిన విండీస్ 141 పరుగులకే ఆలౌటై 159 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇరు జట్లతో పేసర్లు చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. -
అది ఆసీస్కు రిటర్న్ గిఫ్ట్
న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం... జూన్ 29న భారత జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007లోనూ టి20 వరల్డ్ కప్ విజయంలో భాగంగా ఉన్న రోహిత్ నాయకుడిగా సాధించిన తొలి టి20 టోర్నీ ఇది. ఈ టోర్నమెంట్లో ఎప్పటిలాగే పాకిస్తాన్తో మ్యాచ్తో పాటు సెమీస్కు ముందు ఆ్రస్టేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ నేపథ్యంలో ‘జియో–హాట్స్టార్’ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ నాటి మ్యాచ్లకు సంబంధించి పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఆ్రస్టేలియాతో పోరులో భారత్ 24 పరుగులతో విజయం సాధించింది. 41 బంతుల్లోనే 92 పరుగులు చేసిన రోహిత్ శర్మ... స్టార్క్ వేసిన ఒక ఓవర్లో 4 సిక్స్లు, ఫోర్తో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. అంతకుముందు ఏడు నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియా తీవ్ర నిరాశకు లోనైంది. ఆ ఓటమి తమ మనసుల్లోనే ఉండటంతో ఆసీస్పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగామని రోహిత్ చెప్పాడు. ‘మేం ఈ మ్యాచ్ గెలిస్తే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందన్న మాట చాలు మాలో స్ఫూర్తి నింపడానికి. నవంబర్ 19న మాతో పాటు మన దేశ అభిమానులందరికీ ఆనందం దూరం చేశారనే విషయం మనసులో మెదులుతూనే ఉంది. కాబట్టి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావించాం. అయితే అది అంత సులువు కాదని, మైదానంలోనే చూపించాలని భావించాం. అందుకే ఒక్కసారి బ్యాటింగ్కు దిగగానే నేను ఏం చేయగలనో అది చేశాను. స్టార్క్తో గతంలో చాలాసార్లు తలపడ్డా. ఈసారి అతడు నన్ను అవుట్ చేయడానికి కాకుండా పరుగులు ఇవ్వకుండా ఆపేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నట్లు అర్థమైంది. అక్కడే నేను సగం గెలిచాను. ఆపై విరుచుకుపడ్డాను. సెంచరీలు సాధించడం గొప్పే. కానీ మ్యాచ్ పరిస్థితి, దికను బట్టి చూస్తే ఈ ఇన్నింగ్స్ సెంచరీకంటే ఎంతో విలువైంది. నాకు సంబంధించి ఇది నా అత్యుత్తమ ప్రదర్శన’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. అంతకుముందు పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా 140 చేస్తే గెలుస్తామని భావించామని... 119 పరుగులు చేసిన తర్వాత కూడా 2–3 వికెట్లు తీస్తే పాక్ను ఓడించగలమని నమ్మకం ఉందని చెప్పాడు. నిజానికి మ్యాచ్ ఫలితంకంటే దానికి ముందు ఉండే హడావిడే ఎప్పుడూ ప్రత్యేకమని అతను అన్నాడు. ‘బయట మాకు ముప్పు ఉందని చెబుతూ మ్యాచ్కు రెండు రోజుల ముందు నుంచి కూడా హోటల్ బయటకు మమ్మల్ని వెళ్లనీయలేదు. మీడియా, అభిమానులతో నిండిపోయిన హోటల్ కనీసం నడవడానికి కూడా వీలు లేని విధంగా మారిపోయింది. అప్పుడు ఇది సాధారణ మ్యాచ్ కాదని మాకు అర్థమైంది. గ్రౌండ్కు వెళ్లిన తర్వాత కూడా ఇరు దేశాల అభిమానుల జోష్ను చూస్తే ఆశ్చర్యం వేసింది. పాకిస్తాన్పై నేను ఎన్నో మ్యాచ్లు ఆడాను. కానీ ఆటకు ముందు కనిపించే వాతావరణం ప్రత్యేకతే వేరు. దానికి ఏదీ సాటి రాదు’ అని రోహిత్ శర్మ వివరించాడు. -
భారత్ ఆడే సిడ్నీ మ్యాచ్ టికెట్లు ‘సోల్డ్ అవుట్’
మెల్బోర్న్: టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో సంప్రదాయ టెస్టు ఫార్మాట్ ఆడుతోంది. ఇది ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ కావడంతో ఇంగ్లండ్ పర్యటన ముగిసేందుకే చాలా సమయం పడుతోంది. ఆగస్టు 4 వరకు అఖరి టెస్టు జరుగుతుంది. అనంతరం బంగ్లాదేశ్ పర్యటన ఉంది. ఆ తర్వాతే ఆ్రస్టేలియాలో భారత్ పర్యటిస్తుంది. అక్టోబర్–నవంబర్లలో జరిగే ఈ పరిమిత ఓవర్ల సిరీస్లకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయినా సరే భారత్ క్రికెట్ క్రేజ్ను ఆస్ట్రేలియా కూడా సొమ్ము చేసుకుంది. మూడు వన్డేలు, ఐదు టి20ల కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) టికెట్ల విక్రయం చేపట్టగా ఏకంగా 90 వేల పైచిలుకు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయినట్లు స్వయంగా సీఏ వర్గాలే వెల్లడించాయి. సిడ్నీలో జరిగే మూడో వన్డే, కాన్బెర్రాలో జరిగే తొలి టి20 టికెట్లయితే ఒక్కటి కూడా మిగలకుండా ‘సోల్డ్ అవుట్’ కావడం విశేషం. ‘భారత్, ఆసీస్ల మధ్య జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా ‘కంగారూ’ దేశంలో స్థిరపడిన భారత సంతతి ప్రేక్షకులు వేలంవెర్రిగా ఎగబడ్డారు’ అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (మూడో వన్డే వేదిక), మనుక ఓవల్ (కాన్బెర్రా–తొలి టి20 వేదిక)లలో జరిగే మ్యాచ్ టికెట్లకు అనూహ్య డిమాండ్ నెలకొనడంతో నాలుగు నెలల ముందే టికెట్లన్నీ అయిపోయాయని సీఏ పేర్కొంది. భారత సంతతి అభిమానులు కొందరు వందలు, వేల సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
నిప్పులు చెరిగిన విండీస్ పేసర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన ఆస్ట్రేలియా
3 టెస్ట్లు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా నిన్న (జూన్ 25) తొలి టెస్ట్ మొదలైంది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు పేసర్ల హవా కొనసాగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను విండీస్ పేసర్లు జేడన్ సీల్స్ (15.5-1-60-5), షమార్ జోసఫ్ (16-3-46-4) వణికించారు. ఈ ఇద్దరి ధాటికి ఆస్ట్రేలియా 180 పరుగులకే కుప్పకూలింది. గడిచిన 30 ఏళ్లలో వెస్టిండీస్పై తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోర్. సీల్స్, షమార్తో పాటు జస్టిన్ గ్రీవ్స్ కూడా ఓ వికెట్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పరిసమాప్తమైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ (59) టాప్ స్కోరర్గా నిలువగా.. ఉస్మాన్ ఖ్వాజా 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు కాక కెప్టెన్ కమిన్స్ (28), వెబ్స్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సామ్ కొన్స్టాస్ 3, కెమారూన్ గ్రీన్ 3, జోస్ ఇంగ్లిస్ 5, అలెక్స్ క్యారీ 8, మిచెల్ స్టార్క్ 0, హాజిల్వుడ్ 4 పరుగులకు ఔటయ్యారు. నాథన్ లియోన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ కూడా ఆసీస్ తరహాలోనే త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్లు స్టార్క్ (7-1-35-2), హాజిల్వుడ్ (7-1-13-1), కమిన్స్ (6-2-8-1) ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 123 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ 4, జాన్ క్యాంప్బెల్ 7, కీసీ కార్టీ 20, జోమెల్ వార్రికన్ 0 పరుగులకు ఔట్ కాగా.. బ్రాండన్ కింగ్ (23), రోస్టన్ ఛేజ్ (1) క్రీజ్లో ఉన్నారు. బ్రాత్వైట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రోస్టన్ ఛేజ్ విండీస్ టెస్ట్ జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్గా ఇదే అతనికి తొలి మ్యాచ్.దిగ్గజాలు సరసన సీల్స్ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్ రైట్ ఆర్మ్ సీమర్ జేడన్ సీల్స్ దిగ్గజాల సరసన చేరాడు. బార్బడోస్ మైదానంలో (కెన్నింగ్స్టన్ ఓవల్) ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నాలుగో విండీస్ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. సీల్స్కు ముందు కోట్నీ వాల్ష్ (5-39), మాల్కమ్ మార్షల్ (5-42), డెనిస్ అట్కిన్సన్ (5-56) మాత్రమే బార్బడోస్లో ఆసీస్పై ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. మైఖేల్ హోల్డింగ్ లాంటి దిగ్గజానికి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. -
లబుషేన్కు ఉద్వాసన
బ్రిడ్జ్టౌన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆ్రస్టేలియా ప్లేయర్ మార్నస్ లబుషేన్ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ నెల 25 నుంచి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... తొలి టెస్టు కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) శుక్రవారం జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ గాయంతో ఇబ్బంది పడుతుండటంతో తొలి టెస్టుకు అతడిని ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇన్గ్లిస్, టీనేజ్ ఓపెనర్ సామ్ కొన్స్టాస్కు అవకాశం దక్కింది. ఇటీవల లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఆస్ట్రేలియా పరాజయం పాలవడంతో... సెలెక్టర్లు జట్టులో మార్పులు చేశారు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ స్మిత్ కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. రెండో టెస్టు వరకు అతడు జట్టులో చేరొచ్చు. లబుషేన్, స్మిత్ స్థానాలను కొన్స్టాస్, ఇన్గ్లిస్ భర్తీ చేస్తారు. టీమిండియాతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో కొన్స్టాస్ అరంగేట్ర పోరులోనే హాఫ్సెంచరీతో ఆకట్టుకుంటే... శ్రీలంక పిచ్లపై టెస్టు అరంగేట్రం చేసిన ఇన్గ్లిస్ తొలి మ్యాచ్లో సెంచరీతో కదంతొక్కాడు. లబుషేన్ జట్టులో కీలక ఆటగాడే అయినా ... అతడి ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేకపోవడంతోనే జట్టు నుంచి తప్పించాం. అతడు తిరిగి సత్తా చాటుతాడనే నమ్మకముంది’అని చీఫ్ సెలెక్టర్ బెయిలీ అన్నాడు. -
వరుస వైఫల్యాలు.. స్టార్ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. జూన్ 25 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబూషేన్పై వేటు వేసింది. లబూషేన్ గత కొంతకాలంగా పేలవ ఫామ్లో ఉన్నాడు. ఈ కారణంగా అతనికి తొలి టెస్ట్ తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని సెలెక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ఓ ప్రకటనలో తెలిపారు. లబూషేన్ తమ జట్టులో కీలక సభ్యుడని చెబుతూనే అతని రెండేళ్ల గణాంకాలను ప్రస్తావించాడు. 2023లో 34.91 సగటున పరుగులు చేసిన లబూషేన్.. గతేడాది (2024) తన సగటును (30.93) మరింత దిగజార్చుకున్నాడని అన్నాడు. ఈ ఏడాది సైతం లబూషేన్ ఫామ్ను దొరకబుచ్చుకోలేకపోయాడని తెలిపాడు (4 టెస్ట్ల్లో 16 సగటు). చివరి రెండు ఇన్నింగ్స్ల్లో (డబ్ల్యూటీసీ ఫైనల్) ఓపెనర్గా అవకాశమిచ్చినా దారుణంగా విఫలమయ్యాడని (17,22) అన్నాడు. తొలి టెస్ట్ జట్టు నుంచి తప్పించినా లబూషేన్ టాలెంట్ను గౌరవిస్తూ మున్ముందు పరిశీలిస్తామని తెలిపాడు.మరోవైపు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్కు కూడా తొలి టెస్ట్ తుది జట్టులో అవకాశం ఇవ్వలేమని బెయిలీ చెప్పాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా స్మిత్ గాయపడ్డ (చేతి వేలి) విషయాన్ని ధృవీకరించాడు. స్మిత్ సర్జరీని తప్పించుకున్నప్పటికీ.. ఎనిమిది వారాలు చేతికి కట్టుతో ఉండాలని డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు. బ్యాటింగ్కు ఇబ్బంది లేకపోతే రెండో టెస్ట్లో (జూన్ 3) స్మిత్ను ఆడించే అవకాశాలున్నాయని అన్నాడు. లబూషేన్, స్మిత్ స్థానాల్లో సామ్ కొన్స్టాస్, జోస్ ఇంగ్లిస్లను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్స్టాస్ గతేడాది భారత్తో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో ఆకట్టుకున్నాడు. లబూషేన్ స్థానంలో తొలి టెస్ట్లో అతను ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. స్టీవ్ స్మిత్ స్థానాన్ని మిడిలార్డర్లో ఇంగ్లిస్ భర్తీ చేస్తాడు. ఇంగ్లిస్ ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో ఆడిన తన అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో ఇరగదీశాడు. ప్లేయింగ్ ఎలెవెన్లో మిగతా స్థానాలపై ఆసీస్ ఇంకా ప్రకటన చేయలేదు. జూన్ 25 నుంచి బార్బడోస్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్. ఆసీస్తో తొలి టెస్ట్కు విండీస్ జట్టు: కెవ్లాన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, క్రెయిగ్ బ్రాత్వైట్, మిఖైల్ లూయిస్, జాన్ క్యాంప్బెల్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ ఛేజ్, జోహన్ లేన్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వార్రికన్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్ -
చెవిరెడ్డి అరెస్ట్ దారుణం: ఆస్ట్రేలియా ఎన్నారైలు
తన జీవితంలో ఏనాడు మద్యం వాసన కూడా తెలియనటువంటి నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఆ కేసులో ఇరికించటం అత్యంత హేయమైన చర్య అని ఆస్ట్రేలియా ఎన్నారైలు ఖండించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని ఏదో ఒక కేసులో ఇరికించటం దారుణమన్నారు. ఈ పరిణామాలు అన్నిటికీ రిటర్న్ గిఫ్టులు కచ్చితంగా ఉంటాయని ఆస్ట్రేలియా ఎన్నారై సూర్యనారాయణ రెడ్డి అన్నారు -
గ్లెన్ మ్యాక్స్వెల్ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో ఊచకోత
ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. మేజర్ లీగ్ క్రికెట్-2025 ఎడిషన్లో వాషింగ్టన్ ఫ్రీడంకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను.. ఇవాళ (జూన్ 18) లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో) విరుచకుపడ్డాడు. ఈ మ్యాచ్లో మ్యాక్సీ రికార్డు స్థాయిలో 13 సిక్సర్లు బాదాడు. ALL THE 13 SIXES & 2 FOURS BY MAXWELL IN HIS 106*(49) KNOCK IN MLC 🤯 pic.twitter.com/ZjBVw4KKqh— Johns. (@CricCrazyJohns) June 18, 2025జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (68/4) బరిలోకి దిగిన మ్యాక్సీ తొలుత నిదానంగా ఆడాడు. తొలి 15 బంతుల్లో కేవలం 11 పరుగులే చేశాడు. ఆతర్వాత మ్యాక్సీకి పూనకం వచ్చింది. 34 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. మొత్తంగా మ్యాక్సీ ఈ ఇన్నింగ్స్లో 49 బంతులు ఎదుర్కొని 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు (వాషింగ్టన్ ఫ్రీడం) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో మ్యాక్సీది వన్మ్యాన్ షో నడిచింది. అతను మినహా మిచెల్ ఓవెన్ ఒక్కడే (11 బంతుల్లో 32) కాస్త పర్వాలేదనిపించాడు. ఒబస్ పియెనార్ను (15 బంతుల్లో 11 నాటౌట్) మరో ఎండ్లో పెట్టుకొని మ్యాక్సీ తన విధ్వంసకాండను కొనసాగించాడు. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 8, ఆండ్రియస్ గౌస్ 12, మార్క్ చాప్మన్ 17, జాక్ ఎడ్వర్డ్స్ 11 పరుగులు చేశాడు. నైట్రైడర్స్ బౌలర్లలో కోర్నె డ్రై, తన్వీర్ సంఘా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్ ఓ వికెట్ తీశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్రైడర్స్ ఘోర పతనం దిశగా సాగుతుంది. ఆ జట్టు తొలి ముగ్గురు బ్యాటర్లు (అలెక్స్ హేల్స్, సునీల్ నరైన్, ఉన్ముక్త్ చంద్) డకౌట్ అయ్యారు. ఆతర్వాత వచ్చిన రోవ్మన్ పావెల్ (4), మాథ్యూ ట్రంప్ (2) కూడా సింగిల్ డిజిట్ స్కోర్లకే టపా కట్టేశాడు. ఫలితంగా నైట్రైడర్స్ 10 ఓవర్ల తర్వాత 5 వికెట్లు నష్టపోయి 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. సైఫ్ బదార్ (32 నాటౌట్), జేసన్ హోల్డర్ (21 నాటౌట్) పోరాడుతున్నారు. వాషింగ్టన్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 2, మిచెల్ ఓవెన్, మార్క్ అడైర్, సౌరభ్ నేత్రావల్కర్ తలో వికెట్ తీశారు. -
9వ స్థానంలో బ్యాటింగ్కు దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన ఆసీస్ బౌలర్
ఆసీస్ యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ మేజర్ లీగ్ క్రికెట్లో ఓ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఎంఐ న్యూయార్క్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అతను.. ఓటమి అంచుల్లో ఉన్న తన జట్టును (శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్) నమ్మశక్యంకాని ఇన్నింగ్స్తో (25 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విజయతీరాలకు చేర్చాడు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్.. క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 63; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్లో మోనాంక్ పటేల్ (14 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 30; 4 సిక్సర్లు), సన్నీ పటేల్ (11 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు), మైఖేల్ బ్రేస్వెల్ (11 బంతుల్లో 17; 2 సిక్సర్లు) కూడా బ్యాట్లు ఝులిపించారు. కెప్టెన్ పూరన్ (7 బంతుల్లో 5) నిరాశపరిచాడు. యూనికార్న్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్, కార్మీ లె రాక్స్, హసన్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం బరిలోకి దిగిన యూనికార్న్స్.. నవీన్ ఉల్ హక్ (4-0-28-2), ట్రెంట్ బౌల్ట్ (4-0-39-1) రెచ్చిపోవడంతో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో టిమ్ సీఫర్ట్ (33), హసన్ ఖాన్ (43) యూనికార్న్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు కూడా జట్టు స్కోర్ 110 పరుగుల లోపే ఔట్ కావడంతో యూనికార్న్స్ మరోసారి కష్టాల్లో పడింది. ఈ దశలో యూనికార్న్స్ను లేవనెత్తే బాధ్యతను బార్ట్లెట్ తీసుకున్నాడు. బార్ట్లెట్ నమ్మశక్యంకాని రీతిలో షాట్లు ఆడుతూ ఓటమి కొరల్లో ఉన్న తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.బార్ట్లెట్కు కెప్టెన్ కోరె ఆండర్సన్ (9), హరీస్ రౌఫ్ (10 నాటౌట్) సహకరించారు. వీరిద్దరు కేవలం స్ట్రయిక్ రొటేట్ చేస్తూ బార్ట్లెట్కు అవకాశం ఇవ్వగా, మిగతా పనినంతా అతనే చూసుకున్నాడు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా సిక్సర్, రెండు ఫోర్లు బాదిన బార్ట్లెట్ మ్యాచ్ను యూనికార్న్స్వైపు మళ్లించాడు. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ సహా 6 పరుగులు చేసిన బార్ట్లెట్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం 19వ ఓవర్లో 11 పరుగులు పిండుకున్న బార్ట్లెట్.. చివరి ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది యూనికార్న్స్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో యూనికార్న్స్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. బార్ట్లెట్ నమ్మశక్యంకాని ఇన్నింగ్స్తో యూనికార్న్స్ను గెలిపించాడు. బార్ట్లెట్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్కు ఆడాడు. అయితే అతనికి బ్యాటర్గా పెద్ద అవకాశాలు రాలేదు. -
మోకాలితో గొంతు నొక్కిన ఉదంతంలో భారతీయుని విషాదాంతం
మెల్బోర్న్: భార్యాభర్తల నడుమ చిన్న వాగ్వాదంపై ఆ్రస్టేలియా పోలీసుల అతి స్పందన, మితిమీరిన జులుం, ఆటవికులను తలపించిన కర్కశత్వం చివరికి ఓ భారతీయుని ప్రాణాలు బలిగొన్నాయి. తలను నేలకేసి కొట్టడమే గాక మెడపై మోకాలితో తొక్కిపెట్టడంతో 42 ఏళ్ల గౌరవ్ కుందీ మెదడుకు తీవ్ర గాయమైంది. దాంతో కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో రెండు వారాలుగా మృత్యువుతో పోరాడి గురువారం తుదిశ్వాస విడిచాడు. ఐదేళ్ల క్రితం అమెరికాతో పాటు ప్రపంచమంతటినీ కుదిపేసిన ‘ఫ్లాయిడ్’ ఉదంతాన్ని తలపించిన ఈ క్రూరత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రోజు అసలేమైంది? గౌరవ్, అమృత్పాల్ కౌర్ దపంతులు అడిలైడ్లో నివసిస్తున్నారు. వారికిద్దరు పిల్లలు. జూన్ మొదటి వారంలో జరిగిన దారుణాన్ని భార్య మీడియాతో పంచుకున్నారు. ‘‘మేమిద్దరం మా ఇంటి సమీపంలో నడుస్తున్నాం. నా భర్త కాస్త తాగి ఉన్నారు. మా మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఆయన నన్ను దూరంగా నెట్టేయడాన్ని పెట్రోలింగ్ పోలీసులు చూశారు. వెంటనే ఒక పోలీసు మా దగ్గరికొచ్చాడు. వస్తూనే నా భర్తను పోలీస్ కారుకేసి విసురుగా కొట్టాడు. తర్వాత కిందపడేసి తలను నేలకు గట్టిగా అదిమిపెట్టాడు.నా భార్యను హింసించడం లేదు అంటూ ఆయన మొత్తుకుంటున్నా వినిపించుకోలేదు. మేం కేవలం గట్టిగా మాట్లాడుకున్నామని, వదిలేయండని నేనూ అరిచినా పట్టించుకోలేదు. మెడపై చాలాసేపు మోకాలితో అదిమిపట్టడంతో ఊపిరాడక గౌరవ్ చివరకు స్పృహ తప్పారు. అయినా అరెస్ట్ చేయబోగా బతిమాలి ఆస్పత్రిలో చేరి్పంచా.మెడ, మెదడు నరాలు బాగా దెబ్బతిని కోమాలోకి వెళ్లాడు, స్పృహలోకి రావడం కష్టమని వైద్యులు చెప్పారు’’ అంటూ వాపోయారు. 2020 మే నెలలో జార్జ్ ఫ్లాయిడ్ అనే 46 ఏళ్ల నల్ల జాతీయున్ని శ్వేతజాతి పోలీసు ఏకంగా తొమ్మిది నిమిషాల పాటు నేలకేసి అదిమిపట్టి ఊపిరాడకుండా చేయడం తెలిసిందే. దాంతో ఆయన నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ ఫ్లాయిడ్ చేసిన ఆర్తనాదాలు అమెరికావ్యాప్తంగా నల్లతీయుల సమరనాదంగా మారాయి.పోలీసుల భిన్న వాదన పోలీసులు మాత్రం తాము క్రూరంగా వ్యవహరించలేదని చెబుతున్నారు. అయినా ఈ ఉదంతాన్ని పోలీస్ కస్టడీ మరణంగా భావిస్తామని శుక్రవారం ప్రకటించారు. అయితే, అప్పట్లో ఘటన తర్వాత సౌత్ ఆ్రస్టేలియన్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ మోకాలితో మెడపై అదిమిపెట్టడంనిజమేనని అంగీకరించడం విశేషం. -
వరుసగా ఆరో పరాజయం
ఆంట్వర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) యూరోపియన్ అంచె ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. హార్దిక్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు యూరోపియన్ అంచెలో వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. ఆ్రస్టేలియా జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్కు ముందు నెదర్లాండ్స్తో రెండు మ్యాచ్ల్లో, అర్జెంటీనాతో రెండు మ్యాచ్ల్లో, ఆ్రస్టేలియాతో ఒక మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైంది. ఆ్రస్టేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో భారత జట్టు మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే ఖాతా తెరిచింది. సంజయ్ చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆధిక్యంలోకి వెళ్లామన్న ఆనందం భారత్కు మరుసటి నిమిషంలోనే ఆవిరైంది. రెండు నిమిషాల వ్యవధిలో ఆస్ట్రేలియా రెండు గోల్స్ చేసి భారత్కు షాక్ ఇచి్చంది. నాలుగో నిమిషంలో టిమ్ బ్రాండ్, ఐదో నిమిషంలో బ్లేక్ గోవర్స్ ఆస్ట్రేలియాకు ఒక్కో గోల్ అందించారు. రెండో క్వార్టర్లో భారత్ మూడో గోల్ సమర్పించుకుంది. 18వ నిమిషంలో కూపర్ బర్న్స్ గోల్తో ఆస్ట్రేలియా 3–1తో ముందంజ వేసింది. మూడో క్వార్టర్లో దిల్ప్రీత్ సింగ్ గోల్తో భారత్ ఈ ఆధిక్యాన్ని 2–3కు తగ్గించింది. అనంతరం భారత జట్టు స్కోరును సమం చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ్రస్టేలియా చివరి పది నిమిషాల్లో మూడు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా భారత గోల్కీపర్ కృషన్ బహదూర్ పాఠక్ నిర్వీర్యం చేశాడు. ఓవరాల్గా మ్యాచ్లో భారత జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్లు రాగా ఒక్క దానిని సద్వినియోగం చేసుకుంది. మరోవైపు ఆ్రస్టేలియాకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు రాగా ఆ జట్టు కూడా ఒక్క దానిని లక్ష్యానికి చేర్చింది. ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా భారత మాజీ కెప్టెన్, మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ కెరీర్లో 400 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న 2024–2025 ప్రొ లీగ్లో భారత జట్టు 14 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఐదు మ్యాచ్ల్లో గెలిచి, తొమ్మిది మ్యాచ్ల్లో ఓడింది. 15 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. భారత జట్టు తమ చివరి రెండు మ్యాచ్లను బెల్జియం జట్టుతో (జూన్ 21న, 22న) ఆడుతుంది. -
ఐపీఎల్లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! అక్కడ 11 సిక్స్లతో విధ్వంసం
మేజర్ లీగ్ క్రికెట్-2025 సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కాలిఫోర్నియా వేదికగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 32 పరుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో గెలుపొందింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది.శాన్ ఫ్రాన్సిస్కో స్టార్ పేసర్లు బార్ట్లెట్, హ్యారీస్ రౌఫ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి నైట్రైడర్స్ను దెబ్బ తీశారు. నైట్రైడర్స్ బ్యాటర్లలో ఉన్ముక్త్ చంద్(53), మాథ్యూ ట్రంప్(41) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.మెక్గుర్క్ తుపాన్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యునికార్న్స్ ఇన్నింగ్స్లో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన మెక్గర్క్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. మెక్గర్క్ కేవలం 38 బంతుల్లోనే 2 ఫోర్లు,11 సిక్స్లతో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(52)హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక లాస్ ఏంజిల్స్ బౌలర్లలో వాన్ షాల్క్విక్ మూడు వికెట్లు పడగొట్టగా.. అలీఖాన్ రెండు, రస్సెల్, నరైన్ తలా వికెట్ సాధించారు.ఐపీఎల్లో ఫెయిల్..కాగా జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఐపీఎల్-2025 సీజన్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 6 మ్యాచ్లు ఆడిన మెక్గర్క్.. 9.17 సగటుతో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్లకు అతడిని జట్టు నుంచి తప్పించారు.Jake Fraser-McGurk's 88 runs earned him the title of Stake Player of the Match today in Oakland. 🔥@stakenewsindia x @StakeIND pic.twitter.com/jP44Of6wrH— Cognizant Major League Cricket (@MLCricket) June 15, 2025 -
భారత్కు మళ్లీ పరాజయమే...
అంట్వర్ప్ (బెల్జియం): ప్రత్యర్థులు మారుతున్నా... భారత్ ఫలితాలే మారడం లేదు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ యూరోప్ అంచె పోటీల్లో భారత సీనియర్ పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసలో ఐదో ఓటమిని చవిచూసిన భారత్... మూడో ప్రత్యర్థి చేతిలోనూ చిత్తయ్యింది. నెదర్లాండ్స్, అర్జెంటీనాల చేతిల్లో కంగుతిన్న భారత్... తాజాగా ఆస్ట్రేలియా ధాటికి తలవంచింది. శనివారం ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 2–3 స్కోరు తేడాతో ఐరోపాలో అలవాటైన అపజయాన్ని మూటగట్టుకుంది. భారత్ తరఫున అభిషేక్ 8, 35వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. కంగారూ జట్టులో నాథన్ ఎఫ్రామస్ (42వ ని.), జోయెల్ రింటాల (56వ ని.), టామ్ క్రెయిగ్ (60వ ని.) తలా ఒక గోల్ చేశారు.నిజానికి ఈ ప్రొ లీగ్ హాకీలో మెరుగైన స్థానంతోనే నేరుగా వచ్చే ప్రపంచకప్కు అర్హత సాధించాలనుకున్న భారత్కు వరుస పరాభవ ఫలితాలు శరాఘాతమయ్యాయి. యూరోప్ లెగ్లో మొదట నెదర్లాండ్స్తో... తర్వాత అర్జెంటీనాతో ఆడిన రెండేసి చొప్పున ఆడిన మ్యాచ్ల్లో భారత్ ఓడింది. రెండు క్వార్టర్లు ఆధిక్యంలో ఉన్నా... ఆరంభంలో భారత్ దూకుడు కనబరిచింది. పది నిమిషాల్లోనే ప్రత్యర్థిపై ఆధిక్యత సాధించింది. ఆటగాళ్ల సమన్వయం, డిఫెండర్ల పట్టు... ఇలా ఇన్ని అనుకూలతలున్నప్పటికీ అన్నీ ఆరంభశూరత్వంగానే ఆవిరయ్యాయి. తొలి క్వార్టర్ 8వ నిమిషంలోనే అభిషేక్ గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో మరో గోల్ సాధించలేకపోయినప్పటికీ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో డిఫెండర్లు, స్ట్రయికర్లు సమష్టిగా శ్రమించారు. మూడో క్వార్టర్ మొదలైన ఐదు నిమిషాలకే అభిషేక్ మరో గోల్ భారత్ ఆధిక్యం కాస్తా 2–0కు పెరిగింది. ఇలా దాదాపు 41 నిమిషం దాకా కొనసాగిన భారత ఆధిపత్యానికి ఆ మరుసటి నిమిషంలోనే నాథన్ ఎఫ్రామస్ గండి కొట్టాడు. 2–1తో అప్పటికి మంచిస్థితిలోనే ఉంది. అయితే ఆఖరి క్వార్టర్ కూడా ముగిసే దశలో ఆసీస్కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లు భారత్ను నిండా ముంచేశాయి. 4 నిమిషాల వ్యవధిలో రింటాల (56వ ని.), క్రెయిగ్ (60వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంతో భారత్కు మరో పరాజయం తప్పలేదు. నేడు ఇదే వేదికపై భారత్... ఆసీస్తో రెండో మ్యాచ్ ఆడుతుంది. -
చోకర్స్ కాదు... విన్నర్స్
దాదాపు ఏడాది క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత్తో టి20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడింది. 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో చేతిలో 6 వికెట్లతో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. ఇక విజయం లాంఛనమే అనిపించగా...చివరకు 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డగౌట్లో కూర్చుకున్న కెప్టెన్ మార్క్రమ్ కన్నీళ్లపర్యంతమైన దృశ్యం దక్షిణాఫ్రికా అభిమానులకు కలచివేసింది. ఇప్పుడు సంవత్సరం తిరగక ముందే అతను సఫారీ ఫ్యాన్స్ దృష్టిలో హీరోగా మారిపోయాడు. ఆస్ట్రేలియా ‘బౌలింగ్ చతుష్టయం’ను ఎదుర్కొని దక్షిణాఫ్రికా 282 పరుగులు సాధించగలదా అనే సందేహాల మధ్య అతను అసాధారణ బ్యాటింగ్ను ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్లో ‘డకౌట్’ అయినా రెండో ఇన్నింగ్స్లో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా తన కెరీర్లో అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కెపె్టన్ తెంబా బవుమా విజయగాథ కూడా ఇలాంటిదే. 64 టెస్టుల కెరీర్లో కేవలం 4 సెంచరీలే సాధించిన అతను ప్రతీసారి తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నాడు. ‘బ్లాక్ ఆఫ్రికన్’ కాబట్టి టీమ్లో చోటు దక్కిందని, రిజర్వేషన్ కారణంగానే కొనసాగుతున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తూ వచ్చాయి. తాజా ఘనతతో బవుమా నాయకుడిగా ఆకాశమంత ఎత్తున నిలిచాడు. ఫైనల్కు ముందు తన కెపె్టన్సీలో ఆడిన 9 టెస్టుల్లో 8 మ్యాచ్లు గెలిపించి ఓటమి ఎరుగని అతను...ఇప్పుడు టీమ్ను వరల్డ్ చాంపియన్గా నిలిచి పొట్టివాడు అయినా గట్టివాడే అని నిరూపించాడు. మార్క్రమ్, బవుమా 147 పరుగుల భాగస్వామ్యం ఆ్రస్టేలియా ఆట కట్టించేలా చేసింది. డ్రగ్స్ వివాదం నుంచి బయటపడిన రబాడ 9 వికెట్లతో సఫారీ విజయానికి పునాది వేయగా, రెండో ఇన్నింగ్స్లో ఇన్గిడి తన విలువ చాటాడు. విమర్శలను అధిగమించి... దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించినా...ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎదురుగా బలమైన ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థి ఉండటంతో పాటు టీమ్లో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. టాప్–7 బ్యాటర్లతో పాటు ఆల్రౌండర్ యాన్సెన్ మొత్తం టెస్టు పరుగులు కలిపినా... ఒక్క స్టీవ్ స్మిత్ సాధించిన పరుగులకంటే తక్కువగా ఉన్నాయి! పైగా స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్, లయన్ కలిసి ఆసీస్కు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అలాంటి బౌలింగ్ను ఎదుర్కొని గెలవడం దాదాపు అసాధ్యమని అనిపించింది. అన్నింటికి మించి సఫారీ టీమ్ ఫైనల్కు చేరిన క్రమంపై విమర్శలు ఉన్నాయి. 2023–25 డబ్ల్యూటీసీ సైకిల్లో అగ్రశ్రేణి టీమ్లైన ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలను ఒక్క టెస్టులోనూ ఎదుర్కోని టీమ్... సొంతగడ్డపై భారత్ చేతిలో 55కు ఆలౌటై చిత్తుగా ఓడింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్లాంటి బలహీన ప్రత్యర్థులపై (వరుసగా 7 టెస్టులు) గెలిచి ఫైనల్ చేరిందని వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఫైనల్కు ముందు ‘అదంతా మా చేతుల్లో లేదు. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే దానిని ఎవరూ పట్టించుకోరు’ అంటూ స్పష్టంగా చెప్పిన బవుమా దానిని చేసి చూపించాడు. ఆ్రస్టేలియాను ఓడిస్తేనే వరల్డ్ చాంపియన్గా భావిస్తాం అనేవారికి సమాధానం ఇచ్చాడు. స్వదేశంలో టి20 లీగ్ కోసం ప్రధాన ఆటగాళ్లతో కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును న్యూజిలాండ్ పంపగా 0–2తో టీమ్ చిత్తయింది. అయినా సరే చివరకు డబ్ల్యూటీసీ ఫైనల్కు జట్టు అర్హత సాధించడం విశేషం. ఆనందం దక్కింది... అంతర్జాతీయ క్రికెట్లోకి 1991లో దక్షిణాఫ్రికా పునరాగమనం చేసింది. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ సెమీస్లో వర్షం నిబంధనతో ఓడిన జట్టు, 1996లో అన్ని లీగ్లు గెలిచి క్వార్టర్స్లో అనూహ్యంగా ఓడింది. 1998తో క్రానే, కలిస్, రోడ్స్, బౌచర్లతో కూడిన జట్టు తొలి చాంపియన్స్ ట్రోఫీని గెలిచి ఆనందం పంచింది. అయితే ఆ తర్వాతే జట్టు రాత పూర్తిగా మారిపోయింది. గత ఏడాది టి20 వరల్డ్ కప్కు ముందు వరకు ఒక్క ఐసీసీ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయింది. 1999 సెమీస్లో ‘టై’తో గుండె పగలగా, సొంతగడ్డపై 2003లో మళ్లీ వర్షంతో లెక్క తప్పడంతో సెమీస్ కూడా చేరలేకపోయింది. ఆ తర్వాత మూడు సార్లు సెమీస్ వరకు చేరడంలో సఫలమైంది. స్వదేశంలో 2007 టి20 వరల్డ్ కప్లో సెమీస్ చేరని జట్టు తర్వాత రెండు సార్లు సెమీస్లోనే ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో ఐదు సార్లు సెమీస్కే పరిమితమైంది. వేర్వేరు కారణాలతో వచ్చిన ఈ ఓటములతో టీమ్లో నైరాశ్యం నెలకొంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బోర్డులో రాజకీయాలు, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో జట్టు ఆటపై కూడా ప్రభావం పడింది. వరుస ఓటములతో టీమ్ వెనుకబడిపోవడంతో ఇతర టీమ్ల దృష్టిలో అది ద్వితీయ శ్రేణి జట్టుగా మారిపోయింది. అయితే తాజా విజయం సఫారీ టీమ్లో కొత్త ఉత్సాహం తీసుకు రానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో ఈ విజయం వారిలో జోష్ నింపడం ఖాయం. -
సూపర్ ‘సఫారీ’
దక్షిణాఫ్రికా సుదీర్ఘ స్వప్నం నెరవేరింది...ఐసీసీ ట్రోఫీ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాడిన టీమ్ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకుంది...1998లో ఐసీసీ నాకౌట్ కప్ సాధించిన తర్వాత 7 వన్డే వరల్డ్ కప్లు, 9 టి20 వరల్డ్ కప్లు, 9 చాంపియన్స్ ట్రోఫీలు, 2 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లు జరగ్గా... ఒక్క సారి కూడా టైటిల్ అందుకునే అవకాశమే రాలేదు... అద్భుతంగా ఆడుతూ వచ్చి అసలు సమయంలో చేతులెత్తేసిన సందర్భాలు కొన్నయితే, అవసరమైన చోట అదృష్టం మొహం చాటేసిన సందర్భాలు మరికొన్ని... ఇప్పుడు ఆ ‘చోకర్స్’ ముద్రను వెనక్కి తోస్తూ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్తో సఫారీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ్రస్టేలియాను చిత్తు చేసి బవుమా సేన సగర్వంగా సత్తా చాటింది. ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఈ సారి మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో తలవంచి నిరాశగా వెనుదిరిగింది.లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో దక్షిణాఫ్రికా చాంపియన్గా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 213/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎయిడెన్ మార్క్రమ్ (207 బంతుల్లో 136; 14 ఫోర్లు) దాదాపు చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్ (2021), ఆ్రస్టేలియా (2023) తర్వాత డబ్ల్యూటీసీ గెలుచుకున్న మూడో టీమ్గా దక్షిణాఫ్రికా నిలిచింది. విజేత దక్షిణాఫ్రికాకు రూ. 30.76 కోట్లు ప్రైజ్మనీ దక్కింది.27.4 ఓవర్లలో 69 పరుగులు... ఆట ఆరంభంలోనే తెంబా బవుమా (134 బంతుల్లో 66; 5 ఫోర్లు)ను కమిన్స్ అవుట్ చేయగా, కొద్ది సేపటికే స్టబ్స్ (8)ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా మరో 41 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో వైపు మార్క్రమ్ మూడో రోజు తరహాలోనే పట్టుదలగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అతనికి బెడింగ్హామ్ (21 నాటౌట్) అండగా నిలిచాడు. ఎట్టకేలకు కొత్త బంతిని తీసుకున్న వెంటనే తొలి ఓవర్లోనే మార్క్రమ్ను హాజల్వుడ్ వెనక్కి పంపించినా...అప్పటికే ఆలస్యమైపోయింది. విజయానికి మరో 5 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, స్టార్క్ వేసిన బంతిని వెరీన్ కవర్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో సఫారీ శిబిరంలో వేడుక మొదలైంది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్ 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) హెడ్ (బి) హాజల్వుడ్ 136; రికెల్టన్ (సి) క్యారీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (సి) క్యారీ (బి) కమిన్స్ 66; స్టబ్స్ (బి) స్టార్క్ 8; బెడింగ్హామ్ (నాటౌట్) 21; వెరీన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 14; మొత్తం (83.4 ఓవర్లలో 5 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–9, 2–70, 3–217, 4–241, 5–276. బౌలింగ్: స్టార్క్ 14.4–1–66–3, హాజల్వుడ్ 19–2–58–1, కమిన్స్ 17–0–59–1, లయన్ 26–4–66–0, వెబ్స్టర్ 5–0–13–0, హెడ్ 2–0–8–0. -
SA Vs AUS Photos: 27 ఏళ్ల నిరీక్షణకు తెర.. డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా (ఫొటోలు)
-
భారత్ X ఆస్ట్రేలియా
లండన్: మహిళల హాకీ ప్రొ లీగ్ యూరోపియన్ అంచె పోటీల కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. లోటుపాట్లను సవరించుకొని ఆస్ట్రేలియాను ‘ఢీ’కొట్టేందుకు రెడీ అయ్యింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో 9 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న భారత మహిళల జట్టు పట్టికలో ఎగబాకేందుకు యూరోప్ అంచెను సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మహిళల టీమ్ నేడు, రేపు వరుస మ్యాచ్ల్లో ఆసీస్తో తలపడుతుంది. ప్రస్తుత జట్టు యువ క్రీడాకారిణిలతో పాటు అనుభవజు్ఞల కలబోతతో సమతూకంగా ఉంది. యూరోప్ పర్యటనతో రాటుదేలాక సెపె్టంబర్లో జరిగే ఆసియా చాంపియన్షిప్ టైటిల్తో నేరుగా వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్కు అర్హత సాధించాలని మహిళల జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. గట్టి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు దీటుగానే సిద్ధమయ్యామని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు. ‘ప్రతి విభాగం కూడా పటిష్టమయ్యేందుకు సమష్టిగా శ్రమించాం. అయితే రెండు విభాగాల్లో మరింత దృష్టి సారించాల్సి వచ్చింది. ఫలితాన్ని తారుమారు చేసే గోల్ కీపింగ్, డ్రాగ్ ఫ్లికింగ్ విభాగాలు అంత్యంత కీలకం’ అని కోచ్ అన్నారు. ఇందులో భాగంగానే డ్రాగ్ఫ్లికర్లు దీపిక, మనీషాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. యూరోప్ టూర్కు ముందే డ్రాగ్ ఫ్లిక్లో నిపుణుడైన నెదర్లాండ్స్ కోచ్ టూన్ సీప్మన్తో పది రోజుల పాటు ఇద్దరు శిక్షణ తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన డ్రాగ్ ఫ్లికర్లలో చాలా మంది సీప్మన్ శిష్యులే అని ఈ సందర్భంగా హరేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ఇలా ప్రతి విభాగంలోనూ క్రీడాకారిణిలను దీటుగా తయారు చేస్తున్నామని చెప్పారు. భారత్ అంచె పోటీల్లో ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్ను 2–2తో భారత్ నిలువరించేందుకు ప్రత్యేక కోచింగ్లే దోహదం చేశాయన్నారు. భువనేశ్వర్లో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ షూటౌట్లో గెలిచి బోనస్ పాయింట్ సాధించింది. పెర్త్ (ఆ్రస్టేలియా)లో ‘ఎ’ జట్టుతో ఆడిన ఫ్రెండ్లీ మ్యాచ్ల అనుభవం కూడా భారత అమ్మాయిలకు కలిసివస్తుందని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు. ఆసీస్ సీనియర్ జట్టు బలాబలాలేంటో తమకు తెలుసని పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలతోనే బరిలోకి దిగుతామని చెప్పారు. కంగారూ టీమ్తో వరుస మ్యాచ్లు ముగిసిన వెంటనే ఇక్కడే 17, 18 తేదీల్లో పటిష్టమైన అర్జెంటీనాను ఎదర్కొంటుంది. అనంతరం బెల్జియంకు పయనమవుతుంది. అంట్వర్ప్లో 21, 22 తేదీలో జరిగే మ్యాచ్ల్లో మేటి జట్టయిన బెల్జియంతో ఢీకొంటుంది. చివరగా బెర్లిన్లో ఈ నెల 28, 29 తేదీల్లో చైనాతో జరిగే పోటీలతో యూరోప్ అంచె ప్రొ లీగ్ ముగుస్తుంది. -
విజయం దిశగా దక్షిణాఫ్రికా
ఐసీసీ టోర్నీల్లో తమ రాత మార్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో మూడో రోజు అసాధారణ ఆటతో టైటిల్కు చేరువైంది. 282 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎక్కడా తడబడని సఫారీ టీమ్ గెలుపుపై గురి పెట్టింది. పేలవ ప్రదర్శనతో ఆసీస్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయగా... మార్క్రమ్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు కండరాల నొప్పితో బాధపడుతూ కూడా బ్యాటింగ్ కొనసాగించిన కెపె్టన్ తెంబా బవుమా అండగా నిలిచాడు. చేతిలో 8 వికెట్లతో శనివారం మరో 69 పరుగులు సాధిస్తే 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ దక్షిణాఫ్రికా ఖాతాలో చేరుతుంది. లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో విజేతగా నిలిచే దిశగా దక్షిణాఫ్రికా అడుగులు వేస్తోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో సఫారీ టీమ్ డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాపై మూడో రోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. మార్క్రమ్ (159 బంతుల్లో 102 బ్యాటింగ్; 11 ఫోర్లు) శతకం బాదగా... కెప్టెన్ తెంబా బవుమా (121 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్కు ఇప్పటికే అభేద్యంగా 143 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (136 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి వికెట్కు 59 పరుగులు... మూడో రోజు ఆట ఆరంభంలోనే లయన్ (2)ను రబాడ అవుట్ చేయడంతో ఆసీస్ 9వ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే స్టార్క్ పట్టుదలగా పోరాడాడు. అతనికి హాజల్వుడ్ (53 బంతుల్లో 17; 2 ఫోర్లు) అండగా నిలవడంతో ఆలౌట్ చేసేందుకు సఫారీ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టార్క్ 131 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆసీస్ స్కోరు కూడా 200 దాటింది. ఎట్టకేలకు మార్క్రమ్ బౌలింగ్లో హాజల్వుడ్ వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. స్టార్క్, హాజల్వుడ్ 22.3 ఓవర్ల పాటు ఆడి చివరి వికెట్కు 59 పరుగులు జోడించడం విశేషం. శతక భాగస్వామ్యం... తొలి ఇన్నింగ్స్కు భిన్నంగా దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. 10 ఓవర్లలోనే 47 పరుగులు చేసిన జట్టు రికెల్టన్ (6) కోల్పోయింది. మార్క్రమ్, ముల్డర్ (27; 5 ఫోర్లు) ఓవర్కు 4 పరుగుల రన్రేట్తో ధాటిని కొనసాగించారు. లబుషేన్ చక్కటి క్యాచ్తో ముల్డర్ వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ్రస్టేలియా ఆనందం ఇక్కడికే పరిమితమైంది. మార్క్రమ్, బవుమా కలిసి సమర్థంగా ఇన్నింగ్స్ను నడిపించారు.ఈ క్రమంలో 69 బంతుల్లోనే మార్క్రమ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తీవ్రంగా ఎండ కాయడంతో పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా మారిపోయింది. దాంతో ఆసీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికి బవుమా 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగియడానికి కొద్దిసేపు ముందు మార్క్రమ్ 156 బంతుల్లో సెంచరీతో సగర్వంగా నిలిచాడు. బవుమా క్యాచ్ పట్టి ఉంటే... భారీ భాగస్వామ్యానికి ముందు ఒకే ఒక్క సారి ఆసీస్కు మరింత పట్టు బిగించే అవకాశం వచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బవుమాకు లైఫ్ లభించింది. స్టార్క్ ఓవర్లో బవుమా ఆడిన షాట్కు బంతి మొదటి స్లిప్లోకి దూసుకెళ్ళగా క్యాచ్ అందుకోవడంలో స్మిత్ విఫలమయ్యాడు. అయితే నిజానికి అది అంత సులువైన క్యాచ్ కాదు. ఈ టెస్టులో చాలా బంతులు బ్యాట్కు తగిలాక స్లిప్ కార్డాన్కు కాస్త ముందే పడుతుండటంతో స్మిత్ సాహసం చేస్తూ సాధారణంగా నిలబడే చోటుకంటే కాస్త ముందు వచ్చి నిలబడ్డాడు. ముందు జాగ్రత్తగా హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. ఊహించినట్లుగానే బంతి చాలా వేగంగా దూసుకొచి్చంది. మరీ దగ్గర కావడం వల్ల స్పందించే సమయం కూడా లేకపోయింది. దాంతో స్మిత్ కుడి చేతి వేలికి బంతి బలంగా తగిలి కింద పడిపోయింది. నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే మైదానం వీడాడు. అనంతరం స్కానింగ్లో వేలు విరిగినట్లు తేలింది! స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (బ్యాటింగ్) 102; రికెల్టన్ (సి) కేరీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (బ్యాటింగ్) 65; ఎక్స్ట్రాలు 13; మొత్తం (56 ఓవర్లలో 2 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–9, 2–70. బౌలింగ్: స్టార్క్ 9–0–53–2, హాజల్వుడ్ 13–0–43–0, కమిన్స్ 10–0–36–0, లయన్ 18–3–51–0, వెబ్స్టర్ 4–0–11–0, హెడ్ 2–0–8–0. -
WTC Final 2025: కమిన్స్ ట్రిపుల్ సెంచరీ
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ రసవత్తరంగా సాగుతుంది. తొలి రెండు రోజుల్లోనే ఇరు జట్లకు చెందిన 28 వికెట్లు కూలడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు మారింది. ప్రస్తుతానికి ఆసీస్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తున్నా, నిలబెట్టుకుంటుందన్న గ్యారెంటీ లేదు.రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ (16), నాథన్ లియోన్ (1) క్రీజ్లో ఉన్నారు. 43/4 వద్ద రెండో రోజు తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన సౌతాఫ్రికా మరో 95 పరుగులు మాత్రమే జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. బెడింగ్హమ్ 45, బవుమా 36 పరుగులు చేసి సౌతాఫ్రికాను మూడంకెల స్కోర్ దాటించారు. వీరు కాక సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో వెర్రిన్ (13), రికెల్టన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మార్క్రమ్ (0), ముల్దర్ (6), స్టబ్స్ (2),జన్సెన్ (0), మహారాజ్ (7), రబాడ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కమిన్స్ 6 వికెట్లతో చెలరేగిపోయి ప్రొటీస్ పతనాన్ని శాశించాడు. సౌతాఫ్రికాను స్వల్ప స్కోర్కు కట్టడి చేయడంలో స్టార్క్ (2/41), హాజిల్వుడ్ (1/27) కూడా తలో చేయి వేశారు. 74 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా సఫారీ బౌలర్ల ధాటికి వణికింది. ఆ జట్టును అలెక్స్ క్యారీ (43) అదుకున్నాడు. స్టార్క్ ఆసీస్ను 300 పరుగుల టార్గెట్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో క్యారీ, స్టార్క్ కాకుండా లబూషేన్ (22), స్టీవ్ స్మిత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా 6, గ్రీన్ 0, హెడ్ 9, వెబ్స్టర్ 9, కమిన్స్ 6 పరుగులకు ఔటయ్యారు. సఫారీ బౌలర్లలో రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్కు చుక్కలు చూపించారు. జన్సెన్, ముల్దర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకోవడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.మిగతా ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ (23), లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. గ్రీన్ (4), కమిన్స్ (1), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ లియోన్ డకౌట్లయ్యారు.కమిన్స్ ట్రిపుల్ సెంచరీతొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టిన ఆసీస్ సారధి కమిన్స్.. ఈ ప్రదర్శన అనంతరం పలు రికార్డులు సాధించాడు. ఈ ప్రదర్శనతో కమిన్స్ టెస్ట్ల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ మైలురాయిని తాకిని 40వ బౌలర్గా.. ఎనిమిదో ఆసీస్ బౌలర్గా.. ఓవరాల్గా 30వ పేసర్గా.. ఆరో ఆసీస్ పేసర్గా పలు ఘనతలు సాధించాడు.ఈ ప్రదర్శనతో కమిన్స్ సాధించిన మరిన్ని రికార్డులు ఇవే..అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ ఫైనల్లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్గా కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో కమ్మిన్స్ 78 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బుమ్రాను కమ్మిన్స్ అధిగమించాడు.లార్డ్స్ మైదానంలో ఒక టెస్టు ఇన్నింగ్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్గా కమ్మిన్స్ (28 పరుగులకు 6 వికెట్లు) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. 1982లో భారత్పై 101 పరుగులిచ్చి విల్లీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శతో విల్లీస్ ఆల్టైమ్ రికార్డును కమ్మిన్స్ బ్రేక్ చేశాడు. -
రెండో రోజూ 14 వికెట్లు
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రెండో రోజు ముగిసేసరికే ఉత్కంఠభరిత స్థితికి చేరింది. గురువారం కూడా పేసర్ల జోరు కొనసాగడంతో తొలి రోజులాగే మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. ముందుగా కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా తడబడి ఆధిక్యం కోల్పోగా... ఆ తర్వాత రబాడ, ఇన్గిడి దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు కూడాచేతులెత్తేశారు. అయితే ఇప్పటికే ఆధిక్యం 200 దాటిన ఆ్రస్టేలియాదే కాస్త పైచేయిగా కనిపిస్తుండగా... చివరి రోజు సఫారీ టీమ్ ముందు ఎంతటి లక్ష్యం ఉంటుందనేది ఆసక్తికరం. లండన్: ఆ్రస్టేలియా డబ్ల్యూటీసీ ట్రోఫీని నిలబెట్టుకుంటుందా... దక్షిణాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంటుందా అనేది శుక్రవారమే తేలే అవకాశం ఉంది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఫైనల్లో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (50 బంతుల్లో 43; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 218 పరుగులకు చేరింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 43/4తో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 57.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ్రస్టేలియాకు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. బెడింగ్హామ్ (45; 6 ఫోర్లు), బవుమా (36; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కమిన్స్ (6/28) ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. 12 పరుగులకు 5 వికెట్లు... రెండో రోజు బవుమా, బెడింగ్హామ్ భాగస్వామ్యంతో జట్టు పరిస్థితి మెరుగ్గా కనిపించింది. లబుషిషేన్ అద్భుత క్యాచ్కు బవుమా వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. బవుమా, బెడింగ్హామ్ ఐదో వికెట్కు 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత బెడింగ్హామ్ కొద్దిసేపు పోరాడాడు. అయితే లంచ్ తర్వాత కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా ఒక్కసారిగా కుప్పకూలింది. 126/5తో ఉన్న జట్టు 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో వెరీన్ (13), యాన్సెన్ (0)లను అవుట్ చేసిన కమిన్స్... బెడింగ్హామ్నూ పెవిలియన్కు పంపించి ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేసుకున్నాడు. కేశవ్ మహరాజ్ (7) రనౌట్ కాగా, రబాడ (1) వికెట్తో సఫారీల ఇన్నింగ్స్ ముగిసింది. టపటపా... తొలి ఇన్నింగ్స్కంటే మెరుగైన ప్రదర్శనతో ప్రత్యర్థికి సవాల్ విసరాల్సిన ఆ్రస్టేలియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్లో మరింత పేలవంగా సాగింది. ఓపెనర్లు లబుషేన్ (22), ఖ్వాజా (6) తొలి 10 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడారు. దాంతో ఆసీస్కు సరైన ఆరంభం లభించినట్లు అనిపించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా జట్టు పతనం మొదలైంది.ఒకే ఓవర్లో ఖ్వాజా, గ్రీన్ (0) లను రబాడ పెవిలియన్ పంపించగా, యాన్సెన్ చక్కటి బంతితో లబుషేన్ను అవుట్ చేశాడు. స్మిత్ (13) ఇన్గిడి బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా... ‘రివ్యూ’ లో దక్షిణాఫ్రికా ఫలితం సాధించింది. వెబ్స్టర్ (9), హెడ్ (9), కమిన్స్ (6) కేవలం 7 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. కేరీ, స్టార్క్ (16 బ్యాటింగ్) 8వ వికెట్ కు 61 పరుగులు జోడించి జట్టు ను ఆదుకున్నారు. దాంతో ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 200 దాటింది.‘హ్యాండిల్డ్ ద బాల్’ వివాదం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వెబ్స్టర్ వేసిన 49వ ఓవర్లో బెడింగ్హామ్ బ్యాట్ను తాకిన బంతి అతని కాలి ప్యాడ్ ఫ్లాప్లోకి వెళ్లింది. అది కింద పడే లోపు క్యాచ్ అందుకునేందుకు ఆసీస్ కీపర్ కేరీ ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో బెడింగ్హామ్ తన చేత్తో బంతిని తీసి కింద విసిరేశాడు. దీనిపై స్మిత్, ఖ్వాజా ‘హ్యాండిల్డ్ ద బాల్’ గురించి అప్పీల్ చేశారు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు గాఫ్నీ, ఇల్లింగ్వర్త్ చర్చించి అప్పటికే ‘డెడ్బాల్’ అయిందని ప్రకటిస్తూ నాటౌట్గా తేల్చారు. అయితే రీప్లేలు చూస్తే బంతి ప్యాడ్లో ఇరుక్కుపోకుండా ఇంకా ‘రోలింగ్’లోనే ఉండటం కనిపించింది. అది స్పష్టంగా అవుట్ అని, మూడో అంపైర్ను సంప్రదించకుండా ఫీల్డ్ అంపైర్లు వేగంగా నిర్ణయం వెలువరించారని దీనిపై తీవ్ర చర్చ సాగింది. 300 టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ వికెట్ల సంఖ్య. ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆ్రస్టేలియా బౌలర్గా నిలిచిన కమిన్స్ 68 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరాడు. స్కోరు వివరాలుఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి) కమిన్స్ 6; బవుమా (సి) లబుషేన్ (బి) కమిన్స్ 36; స్టబ్స్ (బి) హాజల్వుడ్ 2; బెడింగ్హామ్ (సి) కేరీ (బి) కమిన్స్ 45; వెరీన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 13; యాన్సెన్ (సి అండ్ బి) కమిన్స్ 0; మహరాజ్ (రనౌట్) 7; రబాడ (సి) వెబ్స్టర్ (బి) కమిన్స్ 1; ఇన్గిడి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (57.1 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30, 5–94, 6–126, 7–126, 8–135, 9–138, 10–138. బౌలింగ్: స్టార్క్ 13–3–41–2, హాజల్వుడ్ 15–5–27–1, కమిన్స్ 18.1–6–28–6, లయన్ 8–3–12–0, వెబ్స్టర్ 3–0–20–0. ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 22; ఖ్వాజా (సి) వెరీన్ (బి) రబాడ 6; గ్రీన్ (సి) ముల్డర్ (బి) రబాడ 0; స్మిత్ (ఎల్బీ) (బి) ఇన్గిడి 13; హెడ్ (బి) ముల్డర్ 9; వెబ్స్టర్ (ఎల్బీ) (బి) ఇన్గిడి 9; కేరీ (ఎల్బీ) (బి) రబాడ 43; కమిన్స్ (బి) ఇన్గిడి 6; స్టార్క్ (బ్యాటింగ్) 16; లయన్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 19; మొత్తం (40 ఓవర్లలో 8 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–28, 2–28, 3–44, 4–48, 5–64, 6–66, 7–73, 8–134. బౌలింగ్: రబాడ 11–0–44–3, యాన్సెన్ 12–3–31–1, ముల్డర్ 6–0–14–1, ఇన్గిడి 9–0–35–3, మహరాజ్ 2–0–10–0. -
WTC Final 2025: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా
2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లార్డ్స్ వేదికగా నిన్న (జూన్ 11) ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్కు చేరిన సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం పోరాడుతున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రొటీస్ ఫాస్ట్ బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో ఘోరంగా పతనమైంది. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్ తొలి రోజు విరామం కాగానే ముగిసింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో స్మిత్, వెబ్స్టర్, క్యారీ కాక లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్తో ఆసీస్ పతనాన్ని మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు. ఖ్వాజాను రబాడ, లబూషేన్ను జన్సెన్ ఔట్ చేశారు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. ఇతని వికెట్ కూడా రబాడకే దక్కింది. స్టీవ్ స్మిత్ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్ను (0) జన్సెన్ ఔట్ చేశారు. వెబ్స్టర్, కమిన్స్ (1), స్టార్క్ (1) వికెట్లు రబాడ ఖాతాలోనే వెళ్లాయి.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ బ్యాటర్గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ను (2) హాజిల్వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ (8) భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. చెత్త రికార్డుఇదిలా ఉంటే, తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆలౌటైన ఆస్ట్రేలియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ చరిత్రలో అత్యల్ప తొలి ఇన్నింగ్స్ స్కోర్ నమోదు చేసిన జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. తొలి డబ్ల్యూటీసీ (2019-2021) ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటివరకు భారత్ పేరిట ఉండిన ఈ చెత్త రికార్డును ఆసీస్ తమ ఖాతాలోకి వేసుకుంది. -
‘ఫిఫా’ ప్రపంచకప్కు బ్రెజిల్ క్వాలిఫై
సావో పాలో: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్నకు బ్రెజిల్, ఈక్వెడార్, ఆ్రస్టేలియా జట్లు అర్హత సాధించాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో భాగంగా బ్రెజిల్ జట్టు మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్లో 1–0 గోల్ తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. తద్వారా ‘ఫిఫా’ వరల్డ్కప్ బెర్తు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) చాంపియన్గా నిలిచిన బ్రెజిల్ 2022 ప్రపంచకప్లో క్వార్టర్ఫైనల్లో ఓడింది. మరోవైపు పెరూతో జరిగిన మ్యాచ్ను ‘డ్రా’ చేసుకోవడం ద్వారా ఈక్వెడార్ ముందంజ వేసింది. ఇప్పటికే వరల్డ్కప్నకు అర్హత సాధించిన డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, కొలంబియాతో మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 2026లో మూడు దేశాలు ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్లో 48 జట్లు పాల్గొననున్నాయి. దక్షిణ అమెరికా అర్హత టోర్నీలో అర్జెంటీనా 35 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా... ఈక్వెడార్, బ్రెజిల్ చెరో 25 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ అమెరికా నుంచి వరల్డ్కప్నకు ఆరు జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. బొలీవియాతో మ్యాచ్లో 0–2తో పరాజయం పాలైన చిలీ జట్టు... వరుసగా మూడోసారి విశ్వ సమరానికి దూరమైంది. మరోవైపు ఆ్రస్టేలియా వరుసగా ఆరో సారి ఫిఫా ప్రపంచకప్ బెర్తు దక్కించుకుంది. 2–1 గోల్స్ తేడాతో సౌదీ అరేబియాపై గెలవడం ద్వారా ఆసీస్ ముందంజ వేసింది. -
మొదటి రోజు పేసర్ల హవా
సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వ విజేతను తేల్చే అసలు సిసలు సమరం రసవత్తరంగా ప్రారంభమైంది. లార్డ్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో పేసర్ల జోరు సాగుతోంది. పచ్చిక పిచ్పై పేసర్ రబాడ విజృంభించినా... ఆసీస్ బ్యాటర్లు కాస్త సంయమనం చూపడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత కంగారూ పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా టాపార్డర్ తడబడింది. రెండో రోజు తొలి సెషన్లో కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ను సఫారీ జట్టు ఎదుర్కోవడంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. లండన్: బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల సహకారం తోడవడంతో... ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ను ఆ్రస్టేలియా మెరుగ్గా ఆరంభించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తమ పదునైన పేస్తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పెద్దగా మెరిపించలేకపోయింది. లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్స్టర్ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. చేతిలో 6 వికెట్లు ఉన్న సఫారీ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 169 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ తెంబా బవుమా (3 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడింగ్హామ్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2... హాజల్వుడ్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. బౌలర్ల హవా సాగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజే 14 వికెట్లు నేలకూలగా... అందులో సింహభాగం (12 వికెట్లు) పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి. రబాడ పేస్ దాడి.. ఐసీసీ టెస్టు గదను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. 20 బంతులాడినా ఖాతా తెరవలేకపోయిన ఉస్మాన్ ఖ్వాజా (0)ను రబాడ పెవిలియన్ బాట పట్టించాడు. అదే ఓవర్లో కామెరూన్ గ్రీన్ (4) కూడా అవుటయ్యాడు. మార్క్రమ్ స్లిప్స్లో చక్కటి క్యాచ్తో గ్రీన్ను సాగనంపగా... క్రీజులో నిలిచేందుకు మొండిగా ప్రయత్నించిన లబుషేన్ (56 బంతుల్లో 17)ను యాన్సెన్ బుట్టలో వేసుకున్నాడు. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో మంచి రికార్డు ఉన్న ట్రావిస్ హెడ్ (11) కీపర్ వెరీన్ పట్టిన ఒంటి చేతి క్యాచ్తో పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆసీస్ 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్ తన అనుభవాన్ని చూపించాడు. పేసర్లను కాచుకుంటూ... చెత్త బంతుల్లో పరుగులు రాబట్టాడు. దీంతో ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మార్క్రమ్ బౌలింగ్లో అనవసర షాట్కు అతడు అవుట్ కాగా... కేశవ్ మహరాజ్ బంతిని రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అలెక్స్ కేరీ (23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్లో ధాటిగా ఆడిన వెబ్స్టర్ను కూడా రబాడ వెనక్కి పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్ వేగంగా ముగిసింది. 20 పరుగులకే జట్టు తమ చివరి 5 వికెట్లు కోల్పోయింది. బెంబేలెత్తించిన పేస్ త్రయం... దక్షిణాఫ్రికా పేసర్లు విజృంభించిన పిచ్పై ఆసీస్ పేస్ త్రయం మరింత రెచ్చిపోతుందని ఊహించినట్లే జరిగింది. బంతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్... సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. స్టార్క్ తొలి ఓవర్ చివరి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న మార్క్రమ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా... కాసేపటికి రికెల్టన్ (16) కూడా అతడిని అనుసరించాడు. ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్లు వదిలేసి అవకాశం ఇచ్చినా... దక్షిణాఫ్రికా బ్యాటర్లు వాటిని వినియోగించుకోలేకపోయారు. క్రీజులో అడుగు పెట్టిన తొలి బంతికే సింగిల్ తీసిన ముల్డర్ (44 బంతుల్లో 6) మరో పరుగు చేసేందుకు 39 బంతుల వరకు ఎదురు చూశాడంటే... కంగారూల బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా 31వ బంతికి ఖాతా తెరవగా... స్టబ్స్ (2) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 4 దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కగిసో రబాడ నాలుగో స్థానానికి (332 వికెట్లు) చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో అతను అలెన్ డొనాల్డ్ (330)ను అధిగమించగా...టాప్–3లో వరుసగా డేల్ స్టెయిన్ (439, షాన్ పొలాక్ (421), మఖయా ఎన్తిని (390) ఉన్నారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) బెడింగ్హామ్ (బి) రబాడ 0; లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 17; గ్రీన్ (సి) మార్క్రమ్ (బి) రబాడ 4; స్మిత్ (సి) యాన్సెన్ (బి) మార్క్రమ్ 66; హెడ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 11; వెబ్స్టర్ (సి) బెడింగ్హామ్ (బి) రబాడ 72; కేరీ (బి) కేశవ్ 23; కమిన్స్ (బి) రబాడ 1; స్టార్క్ (బి) రబాడ 1; లయన్ (బి) యాన్సెన్ 0; హాజల్వుడ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 17; మొత్తం (56.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–12, 2–16, 3–46, 4–67, 5–146, 6–192, 7–199, 8–210, 9–211, 10–212. బౌలింగ్: రబాడ 15.4–5–51–5; యాన్సెన్ 14–5–49–3; ఇన్గిడి 8–0–45–0; ముల్డర్ 11–3–36–0; కేశవ్ మహరాజ్ 6–0–19–1; మార్క్రమ్ 2–0–5–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి)కమిన్స్ 6; బవుమా (నాటౌట్) 3; స్టబ్స్ (బి) హాజల్వుడ్ 2; బెడింగ్హామ్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 8; మొత్తం (22 ఓవర్లలో 4 వికెట్లకు) 43. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30. బౌలింగ్: స్టార్క్ 7–3–10–2; హాజల్వుడ్ 7–3–10–1; కమిన్స్ 7–3–14–1; లయన్ 1–0–1–0. -
డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆస్ట్రేలియా జట్టులో అనూహ్య మార్పు
లార్డ్స్ వేదికగా జూన్ 11న ప్రారంభమయ్యే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తమ ప్లేయింగ్ ఎలెవెన్ను ప్రకటించాయి. ఇరు జట్లలో ఊహించిన ఆటగాళ్లే తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఆస్ట్రేలియా మాత్రం తమ బ్యాటింగ్ ఆర్డర్లో ఓ అనూహ్య మార్పు చేసింది. మిడిలార్డర్లో కీలకమైన మార్నస్ లబూషేన్ను ఆసీస్ మేనేజ్మెంట్ ఓపెనర్గా ప్రమోట్ చేసింది. డేవిడ్ వార్నర్ రిటైరయ్యాక ఆసీస్ ఓపెనర్ సమస్యను ఎదుర్కొంటుంది. కొన్ని మ్యాచ్ల్లో స్టీవ్ స్మిత్ను ప్రయోగించినా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఉస్మాన్ ఖ్వాజాకు జోడీగా లబూషేన్తో ప్రయోగానికి పూనుకుంది. కీలక డబ్ల్యూటీసీ ఫైనల్ కావడంతో ఓపెనర్గా లబూషేన్ ఏ మేరకు రాణిస్తాడో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు సౌతాఫ్రికా కూడా బ్యాటింగ్ లైనప్లో ఓ మార్పు చేసింది. బౌలింగ్ ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ను వన్డౌన్కు ప్రమోట్ చేసింది. సౌతాఫ్రికా తుది జట్టులో ఏకంగా నలుగురు వికెట్కీపర్ బ్యాటర్లు (రికెల్టన్, స్టబ్స్, వెర్రిన్, బెడింగ్హమ్) ఉండటం విశేషం. అయితే మ్యాచ్లో మాత్రం వెర్రిన్ వికెట్కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సౌతాఫ్రికా మేనేజ్మెంట్ ప్రకటించింది.మ్యాచ్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మరోవైపు 27 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ సాధించలేకపోయిన సౌతాఫ్రికా ఈ సువర్ణావకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదని మహా పట్టుదలగా ఉంది.డబ్ల్యూటీసీలో ఇది మూడో ఫైనల్ కాగా...తొలి రెండు ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ఫైనల్ చేరి ఓడిన భారత్ ఈసారి తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.తుది జట్లు..దక్షిణాఫ్రికా: ఎయిడెన్ మార్క్రమ్, 2. ర్యాన్ రికెల్టన్, 3. వియాన్ ముల్డర్, 4. టెంబా బవుమా (కెప్టెన్), 5. ట్రిస్టన్ స్టబ్స్, 6. డేవిడ్ బెడింగ్హమ్, 7. కైల్ వెర్రిన్ (వికెట్కీపర్), 8. మార్కో జన్సెన్, 9. కేశవ్ మహారాజ్, 10. కగిసో రబాడ, 11. లుంగి ఎంగిడిఆస్ట్రేలియా: 1. ఉస్మాన్ ఖవాజా, 2. మార్నస్ లబూషేన్, 3. కెమరూన్ గ్రీన్, 4. స్టీవ్ స్మిత్, 5. ట్రావిస్ హెడ్, 6. బ్యూ వెబ్స్టర్, 7. అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), 8. పాట్ కమిన్స్ (కెప్టెన్), 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్ లియోన్, 11. జోష్ హాజిల్వుడ్ -
రెండు జట్లకు తుది ‘టెస్టు’
టెస్టు క్రికెట్లో అతి పెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. సాంప్రదాయ ఫార్మాట్లో విశ్వ విజేతను తేల్చే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరుకు నేడు తెర లేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా తమ టైటిల్ను నిలబెట్టుకోవాలని భావిస్తుండగా... గత 27 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీని సాధించలేకపోయిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లోనైనా గెలిచి రికార్డును మార్చాలని పట్టుదలగా ఉంది. వరుసగా మూడోసారి ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆతిథ్యం ఇస్తుండగా సౌతాంప్టన్, ఓవల్ తర్వాత ఈసారి వేదిక ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానానికి మారింది. లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023–25 టైటిల్ వేటలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా హోరాహోరీ సమరానికి ‘సై’ అంటున్నాయి. లార్డ్స్ మైదానంలో నేటి నుంచి జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు తలపడతాయి. 2023–25 మధ్య కాలంలో 9 జట్లు 27 సిరీస్లలో కలిపి మొత్తం 69 మ్యాచ్లలో తలపడిన అనంతరం తుది సమరానికి ఆసీస్, సఫారీ టీమ్ అర్హత సాధించాయి. ఇది మూడో డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా...తొలి రెండు ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ఫైనల్ చేరి ఓడిన భారత్ ఈసారి తుది పోరుకు అర్హత పొందలేకపోయింది. ఆసీస్ అదే జోరుతో... ఐసీసీ ఫైనల్ మ్యాచ్లు అనగానే ఆస్ట్రేలియా ఆట ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుతుందని గతంలో చాలాసార్లు రుజువైంది. ఆఖరి సమరంలో ప్రత్యర్థిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి మ్యాచ్ను తమ సొంతం చేసుకోవడంలో ఆ జట్టుకు తిరుగులేదు. మూడు ఫార్మాట్లలో కలిపి 13 ఐసీసీ ఫైనల్స్ ఆడిన కంగారూలు 10 టైటిల్స్ సాధించడం వారి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. 2023లో భారత్పై ఫైనల్ ఆడిన తుది జట్టులోంచి 9 మంది మళ్లీ ఇక్కడా బరిలోకి దిగడం ఖాయమైంది. వార్నర్ రిటైర్ కాగా, ఆల్రౌండర్ వెబ్స్టర్కు చోటు దక్కింది. గాయంతో నాటి మ్యాచ్కు దూరమైన హాజల్వుడ్ ఇప్పుడు బోలండ్ స్థానంలో ఆడతాడు. ఖ్వాజాకు జోడీగా లబుõÙన్ ఓపెనింగ్ చేయనుండగా, గ్రీన్ మూడో స్థానంలో ఆడతాడు. ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడైన స్టీవ్ స్మిత్, గత డబ్ల్యూటీసీ ఫైనల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెడ్ బ్యాటింగ్లో ప్రధాన బలం కాగా, కీపర్ అలెక్స్ కేరీ కూడా చెలరేగిపోగలడు. కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్, లయన్లతో టీమ్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. రాత మారేనా... దక్షిణాఫ్రికా వరుసగా గత 7 టెస్టుల్లో విజయాలు సాధించి ముందుగా ఫైనల్కు అర్హత సాధించినా సరే టీమ్పై విమర్శలు వచ్చాయి. టెస్టుల్లో అగ్రగామి అయిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లాంటి టీమ్లతో లీగ్ దశలో ఒక్కసారి కూడా తలపడకుండానే జట్టు ఫైనల్ చేరింది. అయితే ఏ దారిలో వచ్చినా ఇప్పుడు తుది పోరులో విజేతగా నిలిచి సత్తా చాటాలని సఫారీలు భావిస్తున్నారు. అయితే జట్టులో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. మార్క్రమ్, కెపె్టన్ తెంబా బవుమాలకు మాత్రమే ప్రస్తుత ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది. రికెల్టన్, ముల్డర్, స్టబ్స్, బెడింగ్హామ్ ఇంకా టెస్టు కెరీర్ ఆరంభ దశలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సఫారీ టాప్–7 బ్యాటర్లందరి టెస్టు పరుగులు కలిపినా (9,873)... ఒక్క స్మిత్ (10,271) పరుగులకంటే తక్కువే ఉన్నాయి! అయితే వైవిధ్యమైన బౌలింగ్ తో ఆసీస్ను కట్టడి చేయగలమని నమ్ముతోంది. ఇంగ్లండ్లో వాతావరణం అనుకూలిస్తే తన స్వింగ్తో రబాడ ప్రమాదకరమైన బౌలర్ కాగా, యాన్సెన్ లెఫ్టార్మ్ పేస్ కూడా ఇటీవల పదునెక్కింది. ఇక స్పిన్ కోసం మరోసారి దక్షిణాఫ్రికా మహరాజ్నే నమ్ముకుంది.పిచ్, వాతావరణంసాధారణ బ్యాటింగ్ పిచ్. ప్రస్తుతం ఉపఖండం తరహాలోనే వాతావరణం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వర్షంతో అంతరాయం కలగవచ్చు. అయితే ఐదు రోజులలో నిర్ణీత ఓవర్లు పూర్తి కాకుండా ఫలితం రాకపోతే ‘రిజర్వ్ డే’ ఆరో రోజుకు మ్యాచ్ సాగుతుంది. భారత్, కివీస్ మధ్య 2021 ఫైనల్లో ఇదే జరిగింది.తుది జట్లు (అంచనా)ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, లబుషేన్, గ్రీన్, స్మిత్, హెడ్, వెబ్స్టర్, కేరీ, స్టార్క్, లయన్, హాజల్వుడ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), మార్క్రమ్, రికెల్టన్, ముల్డర్, స్టబ్స్, బెడింగ్హామ్, వెరీన్, యాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, ఇన్గిడి. -
వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి -
కాలుష్య కణాలగుట్టువిప్పిన గణితవేత్త
పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడుతూ భూతాపోన్నతికి కారణమవుతున్న పొగ, కాలుష్యకారక కణాల గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికే ఒక అవగాహన ఉంది. వీటి కారణంగా ఏ స్థాయిలో కాలుష్యం సంభవిస్తోందో, వాతావరణ మార్పులో వీటి ప్రభావ స్థాయిలను పర్యావరణ వేత్తలు ఇప్పటికే అంచనావేయగల్గుతున్నారు. అయినాసరే ఆకస్మిక వర్షాలు, వరదలు వంటి వాటిని ఇప్పటికీ సరిగా అంచనావేయలేని పరిస్థితి. వీటికి కారణంగా గోళాకృతిలో లేని ఇతర రకాల కణాలు కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారుగానీ వీటి పరిమాణాన్ని, ప్రభావాన్ని గణించే విధానాన్ని అభివృద్దిచేయలేకపోయారు. గత 15 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని మాక్వరైటన్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్రవేత్త, అసోసియేట్ ప్రొఫెసర్ స్టార్ట్ హాకిన్స్ పరిష్కారం కనుగొన్నారు. దీంతో మరింత ఖచి్చతత్వంతో వాతావరణ అంచనా సుసాధ్యంకానుంది. 2008లో వాతావరణ భౌతికశాస్త్రవేత్త మైఖేల్ బాక్స్ చేసిన ఒక ప్రసంగాన్ని హాకిన్స్ విన్నారు. వాతావరణమార్పులకు కారణమవుతున్న అన్ని ఆకృతుల కాలుష్యకణాలను లెక్కించకుండా మనం చేసే వాతావరణ అంచనాలు భవిష్యత్తులో అంత నిరుపయోగంగా మారే ప్రమాదంఉంది’’అని మైఖేల్ బాక్స్ చేసిన ప్రసంగం హాకిన్స్ను ఆలోచనల్లో పడేసింది. ఈ గజిబిజి ఆకృతుల కణాలను లెక్కగట్టే విధానాన్ని అభివృద్ధిచేసి ఈ పొల్యూషన్ పొడుపు ప్రశ్నకు సమాధానం వెతకాలని నిశ్చయించుకుని ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఆ పనిలో సఫలీకృతులయ్యారు. ఏమిటీ కణాలు? వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే ధూళి కణాలు గోళాకృతిలో ఉంటాయి. కానీ రాజస్థాన్లోని థార్ఎడారిసహా పలు గనుల తవ్వవం వంటి చోట్ల శిలలు క్రమంగా ఒరుసుకుపోయి, కోతకు గురై అత్యంత సూక్ష్మ శిలా కణాలు ఉద్భవించి గాల్లో కలుస్తున్నాయి. జీవఇంథనాలు మండించినపుపడు వెలువడే కొన్ని రకాల నుసి సైతం భిన్నాకృతిలో ఉంటోంది. ఢిల్లీలో చలికాలంలో నిర్మాణ పనుల వేళ గాల్లో కలిసే పరిశ్రమల వ్యర్థ్యాల నుంచి సైతం వేర్వేరు ఆకృతుల్లో ధూళి కణాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రస్తుతమున్న వాతావరణ సిద్ధాంతాలతో గణించడం కష్టం. ఈ కణాలు గాల్లో అధికమై సూర్యరశ్మి భూమిపై పడకుండా అడ్డుకుని భూమిని చల్లబరచవచ్చు లేదంటే భూమి నుంచి వేడి బయటకు పోకుండా అడ్డుకుని భూతాపోన్నతికి కారణం కావచ్చు. ఈ రెండు దృగి్వషియాలను సైతం గోళాకృతియేతర కణాల కోణంలో లెక్కించాల్సి ఉంది. ప్రసరణ దిశలో ఏదైనా వస్తువు అడ్డుగా ఉంటే కాంతి దిశను మార్చుకుంటుంది. ఈ సిద్ధాంతాన్ని ఈ అసాధారణ ఆకృతి కణాలకు అన్వయిస్తూ కంప్యూటేషన్ మెథడ్ను హాకిన్స్ రూపొందించారు. ఇప్పుడీ గణిత సూత్రాలు భవిష్యత్తులో వైద్య ఇమేజింగ్ సాంకేతికతల ఆధునీకరణకూ ఉపయోగపడనున్నాయి. అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ వంటి సాంకేతికతలు తరంగాలు మన శరీరంలో ఎలా ప్రయాణిస్తాయనే సూత్రాలపైనే ఆధారపడి పనిచేస్తాయి. కొత్త గణిత సూత్రాలతో అత్యాధునిక అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ తీయొచ్చు. పలు రకాల కోటింగ్లలోనూ విరివిగా వాడొచ్చు. ఈ సూత్రాలను కాంతి విక్షేపణకు సంబంధించిన ప్రతి రంగంలోనూ ఉపయోగించవచ్చు. వడగాల్పులు, రుతుపవన అంచనాలు, కాలుష్య ప్రభావాలు వంటిలోనూ ఈ సూత్రాలను వాడొచ్చు. దీంతో వాతావరణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయొచ్చు. ఈ పరిశోధనా వివరాలు ‘క్వాంటేటివ్ స్పెక్ట్రోస్కోపీ, రేడియేటివ్ ట్రాన్స్ఫర్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరీ పిడుగు.. ఎనిమిదేళ్లకే పత్రిక ఎడిటర్గా రికార్డ్!
పిల్లలూ! రోజూ పొద్దున్నే న్యూస్పేపర్ చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే రకరకాల వార్తలు ఏరి, కూర్చి మనకు అందించేందుకు న్యూస్పేపర్ సంస్థలో అనేకమంది పనిచేస్తుంటారు. వారందరికీ బాస్గా వ్యవహరించేది ఎడిటర్. ఆ పత్రిక బయటకు రావడంలో ఆయనదే కీలకపాత్ర. ఎడిటర్గా స్థానం పొందాలంటే ఎంతో అనుభవం కావాలి. అయితే ఓ పాప మ్యాగజైన్ ఎడిటర్గా మారి రికార్డు సృష్టించింది.ఆస్ట్రేలియాకు చెందిన రోక్సాన్ డౌన్స్...ఎనిమిదేళ్లకే ’ఇట్ గర్ల్ మ్యాగజన్’ (It Girl Magazine) అనే మ్యాగ్జైన్ కి ఎడిటర్గా మారింది. ఆ వయసున్న చిన్నారులు తోటి పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటారు. అయితే రోక్సాన్ మాత్రం ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉంది. తన వయసున్న ఆడపిల్లలు చదువుకునే మ్యాగ్జైన్ రూపొందించాలని భావించింది. దానికి తనే ఎడిటర్గా మారింది. మ్యాగ్జైన్లో ఏం రాయాలో, ఎలాంటి అంశాలను చేర్చాలో తెలుసుకునేందుకు రోక్సాన్ చాలా పరిశోధనలు చేసింది. రోజంతా తన వయస్సు గల వారితో తిరుగుతూ వారి ఇష్టాలు, ఇబ్బందులు, వారు ఆసక్తులు గమనించి, వాటి గురించి తన మ్యాగ్జైన్లో వ్యాసాలు రాయడం మొదలుపెట్టింది.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంమ్యాగ్జైన్ కోసం ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ని రోక్సాన్ ఇంటర్వ్యూ చేసింది. అది ప్రఖ్యాతి పొందడంతో ఆ తర్వాత అనేకమంది రచయితలు, టిక్టాక్ స్టార్లు, గాయకులు, నటులను ఇంటర్వ్యూలు చేసే స్థితికి చేరుకుంది. ఆ ఇంటర్వ్యూలను వీడియో రూపంలో యూట్యూబ్లో చూడొచ్చు. ఓ వైపు మ్యాగ్జైన్ పనులు చేస్తూనే, పాఠశాలకు వెళ్లి చదువుకుంటోంది రోక్సాన్. బద్దకంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని, జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆకాంక్ష అందరిలోనూ ఉండాలని తను చెపుతోంది.ఇదీ చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్ -
ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి పిలుపు
వచ్చే నెలలో వెస్టిండీస్లో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జూన్ 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు. గత సీజన్ బిగ్బాష్ లీగ్ ఫైనల్లో 39 బంతుల్లోనే శతక్కొట్టిన విధ్వంసకర బ్యాటర్ మిచెల్ ఓవెన్ తొలిసారి జాతీయ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓవెన్తో పాటు బౌలర్ మ్యాట్ కుహ్నేమన్కు కూడా తొలిసారి ఆసీస్ టీ20 జట్టు నుంచి పిలుపు అందింది. ఈ జట్టులో మరో విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్కు చోటు దక్కలేదు. పేలవ ఫామ్ కారణంగా మెక్గుర్క్పై వేటు పడినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2025 ఫైనలిస్ట్ పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యులైన మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్లెట్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. తాజాగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాక్స్వెల్కు ఈ జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ 2025 ఛాంపియన్ జట్టులో (ఆర్సీబీ) సభ్యుడైన టిమ్ డేవిడ్ కూడా ఈ జట్టులో చోటు సంపాదించాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు కెమరూన్ గ్రీన్, కూపర్ కన్నోలీ టీ20 జట్టులోకి పునరాగమనం చేశారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీని ఛాంపియన్గా నిలబెట్టడంతో కీలకంగా వ్యవహరించిన జోష్ హాజిల్వుడ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ ఆటగాళ్లు పాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, మిచెల్ స్టార్క్కు విశ్రాంతినిచ్చారు.విండీస్తో టీ20 సిరీస్ జులై 19న మొదలు కానుంది. 19, 22, 24, 25, 27 తేదీల్లో ఐదు టీ20లు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్లు జమైకాలో జరుగనుండగా.. ఆఖరి మూడింటికి సెయింట్ కిట్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్కు ముందు ఆసీస్ విండీస్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా ఆడనుంది. జూన్ 25, జులై 3, జులై 12 తేదీల్లో ఈ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. టెస్ట్, టీ20 సిరీస్ల కోసం ఆసీస్ వెస్టిండీస్లో పర్యటించనుంది. ఆసీస్ టెస్ట్ జట్టును ఇదివరకే ప్రకటించారు. విండీస్తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, కూపర్ కన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాట్ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్వెల్, మిచ్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపావిండీస్తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, కెమరూన్ గ్రీన్, సామ్ కొన్స్టాస్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్, మ్యాట్ కుహ్నేమన్, మిచెల్ స్టార్క్ -
భారత్లో ఆస్ట్రేలియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ విడుదల చేసింది. ఈ పర్యటనలో ఆసీస్ మహిళా టీమ్ భారత మహిళల క్రికెట్ జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో చెన్నై వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్లు ప్రారంభమవుతాయి.ఆస్ట్రేలియా-ఏ, సౌతాఫ్రికా-ఏ జట్లు కూడా..!ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుండగానే ఆ దేశ పురుషుల ఏ టీమ్ కూడా భారత్లో పర్యటించనుంది. సెప్టెంబర్ 16- అక్టోబర్ 5 మధ్య తేదీల్లో ఆసీస్-ఏ టీమ్ భారత ఏ జట్టుతో రెండు అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది. టెస్ట్ మ్యాచ్లకు లక్నో ఆతిథ్యమివ్వనుండగా.. వన్డేలు కాన్పూర్లో జరుగనున్నాయి.భారత్లో ఆస్ట్రేలియా-ఏ మెన్స్ టీమ్ షెడ్యూల్..తొలి టెస్ట్: సెప్టెంబర్ 16-19 (లక్నో)రెండో టెస్ట్: సెప్టెంబర్ 23-26 (లక్నో)తొలి వన్డే: సెప్టెంబర్ 30 (కాన్పూర్)రెండో వన్డే: అక్టోబర్ 3 (కాన్పూర్)మూడో వన్డే: అక్టోబర్ 5 (కాన్పూర్)ఆస్ట్రేలియా ఏ పురుషుల టీమ్ భారత్లో పర్యటిస్తుండగానే సౌతాఫ్రికా ఏ పురుషుల ఏ టీమ్ కూడా భారత్లో పర్యటిస్తుంది. ఆస్ట్రేలియా ఏ టీమ్ లాగే ఈ జట్టు కూడా భారత్ ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది. టెస్ట్ మ్యాచ్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్లో జరుగనుండగా.. వన్డేలు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి.భారత్లో సౌతాఫ్రికా-ఏ మెన్స్ టీమ్ షెడ్యూల్..తొలి టెస్ట్: అక్టోబర్ 30-నవంబర్ 2 (బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్)రెండో టెస్ట్: నవంబర్ 6-9 (బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్)తొలి వన్డే: నవంబర్ 13 (చిన్నస్వామి స్టేడియం)రెండో వన్డే: నవంబర్ 16 (చిన్నస్వామి స్టేడియం)మూడో వన్డే: నవంబర్ 19 (చిన్నస్వామి స్టేడియం) -
తప్ప తాగి.. నాతో అనుచితంగా ప్రవర్తించారు
ఆయనో సీనియర్ పార్లమెంటేరియన్. చట్ట సభకు సంబంధించిన ఓ కార్యక్రమం జరుగుతోంది. ఆ ఈవెంట్లో పీకల దాకా తాగారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న యువ సభ్యురాలితో అనుచితంగా ప్రవర్తించారు. ఇది ఫిర్యాదు దాకా వెళ్లింది. సీనియర్ సభ్యుడొకరు తనను బాగా ఇబ్బంది పెట్టారని ఆస్ట్రేలియా స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమన్(Fatima Payman) ఆరోపణలకు దిగారు. ఈ మేరకు పార్లమెంటరీ వర్క్ప్లేస్ సపోర్ట్ సిస్టమ్(PWSS)లో ఆమె ఫిర్యాదు కూడా చేశారు. ‘‘పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన బాగా తాగారు. నన్ను కూడా తాగి.. టేబుల్ ఎక్కడి డ్యాన్స్ చేయమంటూ బలవంతం చేయబోయారు. అయితే అందుకు నేను ఒప్పుకోలేదు. .. నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి అంటూ కటువుగానే ఆయనకు సమాధానం ఇచ్చా’’ ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సదరు సీనియర్ సెనేటర్ పేరును ఆమె మీడియాకు ప్రస్తావించలేదు. అయితే ఆ వ్యాఖ్యలు మతపరంగా తన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు లైంగిక వేధింపుల కిందకు వస్తుందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన పీడబ్ల్యూఎస్ విచారణ జరుపుతామని ఆమెకు హామీ ఇచ్చింది.అఫ్గన్ సంతతికి చెందిన ఫాతిమా(30).. 2022లో లేబర్ పార్టీ(Labour Party) తరఫున వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి ఎన్నికయ్యారు. ఆ టైంలో అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. 2024లో పాలస్తీనా తీర్మానం సమయంలో ఆమె పార్టీ వైఖరికి విరుద్ధంగా ఓటేశారు. ఈ పరిణామంతో ఆమె లేబర్ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: ఇదేం చెండాలం?.. నడిరోడ్డు మీద డర్టీ పిక్చర్ -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు శుభవార్త.. సెంచరీల మోత మోగిస్తున్న యువ ఆల్రౌండర్
వచ్చే నెలలో (జూన్ 11) సౌతాఫ్రికాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా ఎనిమిది నెలలు క్రికెట్కు దూరంగా ఉన్న ఆ జట్టు యువ ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్తో గ్రీన్ రెండు సెంచరీలు (112, 128) చేశాడు. ఈ టోర్నీలో గ్లోసెస్టర్షైర్కు ఆడుతున్న గ్రీన్ కెంట్ జట్టుపైనే రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో గ్రీన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రత్యర్థి సౌతాఫ్రికాకు గట్టి వార్నింగ్ మెసేజ్ పంపాడు. గ్రీన్ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కొద్ది రోజుల కింద ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ప్రాక్టీస్ నిమిత్తం గ్రీన్ కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్నాడు. అతనితో పాటు డబ్ల్యూటీసీ జట్టు సహచర సభ్యుడు మార్నస్ లబూషేన్ కూడా కౌంటీల్లో ఆడుతున్నాడు. అయితే గ్రీన్ తరహాలో లబూషేన్కు సత్ఫలితాలు రాలేదు. లబూషేన్ ఆడిన రెండు ఇన్నింగ్స్ల్లో 0, 4 పరుగులకు ఔటయ్యాడు. మిడిలార్డర్ బ్యాటర్ అయిన లబూషేన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓపెనర్గా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్రీన్తో పాటు మరో ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్కు తుది జట్టులో ఆవకాశం కల్పించాలంటే లబూషేన్ ఓపెనర్గా ప్రమోట్ కాక తప్పదు. లబూషేన్.. వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజాతో ఇన్నింగ్స్ ప్రారంభిస్తే.. గ్రీన్, వెబ్స్టర్ ఇద్దరికీ తుది జట్టులో ఛాన్స్ దొరుకుతుంది.ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన వెంటనే సౌతాఫ్రికా కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బవుమా సారధిగా వ్యవహరించనుండగా.. ఏకంగా ఆరుగురు పేసర్లు (కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జన్సెన్, వియన్ ముల్దర్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్) ఎంపికయ్యారు.డబ్ల్యూటీసీ ఫైనల్-2025కి ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్.ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్. -
కళ్లు చెదిరే కాంతుల వేడుక..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాల అందాలను చూడటం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఎగబడుతుంటారు. పారమాట నది ఒడ్డునున్న సిడ్నీ అందాలు చూడటానికి సుమనోహరంగా ఉంటాయి. అయితే, సిడ్నీ అందాలను మరింత ప్రత్యేకంగా చూడాలంటే, వివిడ్ సిడ్నీ ఫెస్టివల్కి వెళ్లాల్సిందే! ఈ వేడుకలు మే 23 నుంచి ప్రారంభమై జూన్ 14 వరకు దాదాపు మూడు వారాల పాటు కొనసాగుతాయి. ఇక్కడ కనిపించే ప్రతి కట్టడం, చీకటిపడితే విద్యుత్ వెలుగులతో మిరుమిట్లు గొలుపుతాయి. సిడ్నీ ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ వంటి ప్రదేశాలు అద్భుతమైన కాంతి ప్రదర్శనలతో కళ్లుచెదిరే కళాఖండాలుగా మారుతాయి. అంతేకాదు, నగరమంతా ఏర్పాటు చేసే విద్యుద్దీపాలంకరణ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ఈ వేడుక కేవలం కాంతులకే పరిమితం కాదు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శనలుంటాయి. వినూత్న ఆలోచనలు పంచుకునే చర్చలు, చవులూరించే ఆహార వేదికలు కూడా ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్నిసార్లు ప్రత్యేకంగా నీటిపై విజువల్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. హార్బర్లో ప్రయాణించే పడవలు కూడా లైట్లతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకకు స్థానికులతో పాటు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో సిడ్నీకి విచ్చేస్తుంటారు. ఈ వేడుకకు 2023లో రికార్డు స్థాయిలో 32.8 లక్షలమంది హాజరయ్యారు. దాంతో ఈ ఏడాది కూడా అదే స్థాయి అంచనాలున్నాయి. (చదవండి: డ్రాగన్స్ సృష్టించిన అద్భుతం!) -
బంగ్లాదేశ్ కోచ్గా అరివీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్
బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా షాన్ టైట్ నియమితుడయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ 42 ఏళ్ల మాజీ ఫాస్ట్ బౌలర్ 2027 నవంబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. టైట్ తన కోచింగ్ ప్రయాణంలో పాకిస్తాన్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు సేవలందించాడు. టైట్.. 2007లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆసీస్ తరఫున మూడు ఫార్మాట్లలో 59 మ్యాచ్లు ఆడిన టైట్.. 95 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా షాన్ టైట్ నియామకంతో ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన ఆండ్రీ ఆడమ్స్ వైదొలిగాడు. ఆడమ్స్ గతేడాది మార్చిలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఆడమ్స్ ఆథ్వర్యంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పేలవ ప్రదర్శనలు చేసింది. ఈ కారణంగా అతనిపై వేటు పడింది.క్రికెట్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ బాల్షాన్ టైట్ పేరిట క్రికెట్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డు నమోదై ఉంది. 2010లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అతను 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని వేసిన రికార్డు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2023 వన్డే వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అక్తర్ 161.3 కిమీ వేగంతో బంతిని సంధించాడు. టైట్తో పాటు మరో ఆసీస్ పేసర్ బ్రెట్ లీ కూడా 161.1కిమీ వేగంతో బంతిని సంధించాడు. 2005లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో లీ ఈ వేగాన్ని అందుకున్నాడు. క్రికెట్ చరిత్రలో నాలుగో వేగవంతమైన డెలివరీ రికార్డు కూడా ఆసీస్కే చెందిన జెఫ్ థాంప్సన్ పేరిట ఉంది. థామ్సన్ 1975-76 సిరీస్లో విండీస్తో జరిగిన ఓ మ్యాచ్లో 160.6కిమీ వేగంతో బంతిని వేశాడు. క్రికెట్ చరిత్రలో ఐదో వేగవంతమైన బంతి రికార్డు కూడా ఆసీస్ పేసర్ పేరిటే ఉంది. 2015లో న్యూజిలాండ్తో జరిగిన ఓ మ్యాచ్లో స్టార్క్ 160.4కిమీ వేగంతో బంతిని సంధించాడు.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ జట్టు మే 17 నుంచి యూఏఈలో పర్యటించనుంది. ఈ పర్యటనలో బంగ్లా టీమ్ యూఏఈతో రెండు టీ20లు (మే 17, 19) ఆడనుంది. అనంతరం మే 25 నుంచి బంగ్లా జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఇరు జట్లు ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే భారత్తో యుద్దం తర్వాత పాక్లో జరగాల్సిన ఈ సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. -
ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ ఘన విజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ మరోసారి విజయం దక్కించుకుంది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియాలో గత 21 ఏళ్లలో వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధానిగా ఆయన రికార్డుకెక్కారు. అల్బనీస్ మరో మూడేళ్లపాటు ప్రధానిగా కొనసాగబోతున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో మొత్తం 150 సీట్లు ఉండగా, శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ కడపటి వార్తలు అందేసరికి 83 సీట్లు గెలుచుకుంది. స్పష్టమైన మెజార్టీ సాధించింది. ప్రతిపక్ష లిబరల్ నేషనల్ పార్టీ 14 స్థానాలకే పరిమితమైంది. లిబరల్ పార్టీ 13, నేషనల్ పార్టీ 8 సీట్లు గెలుచుకున్నాయి. అలాగే ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. కాటర్ పార్టీకి ఒక స్థానం, సెంట్రల్ అలయెన్స్కు ఒక స్థానం దక్కింది. మరికొన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రతిపక్ష లిబరల్ నేషనల్ పార్టీ అగ్రనేత పీటర్ క్రెయిగ్ డటన్ తమ ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ప్రచారంలో తాము సరిగ్గా పని చేయలేకపోయామని అన్నారు. ఓటమికి బాధ్యతను తానే స్వీకరిస్తున్నానని చెప్పారు. ప్రధాని అల్బనీస్కు ఫోన్చేసి, అభినందనలు తెలియజేశానని పేర్కొన్నారు. లేబర్ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని, దాన్ని తాము గుర్తిస్తున్నామని వెల్లడించారు. బ్రిస్బేన్ నియోజకవర్గంలో పీటర్ క్రెయిగ్ డటన్ ఓడిపోవడం గమనార్హం. ఇక్కడ ఆయనపై లేబర్ పార్టీ అభ్యర్థి అలీ ఫ్రాన్స్ విజయం సాధించారు. ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణం, అధిక ధరలు, ఇంధనం విధానం, ఇళ్ల కొరత, వడ్డీ రేట్లలో పెరుగుదల వంటి అంశాలే ప్రతిపాదికగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తాను ప్రధానమంత్రి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దారిలో నడవనున్నట్లు పీటర్ క్రెయిగ్ డటన్ సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఖర్చులకు కళ్లెం వేస్తానని, ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తానని ప్రకటించారు. ఆయన విధానాల పట్ల ప్రజలు విముఖత చూపినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఆంథోనీ అల్బనీస్ మరోసారి నెగ్గే అవకాశం ఉందని ముందే అంచనాలు వెలువడ్డాయి. ఆంథోనీ నార్మన్ అల్బనీస్ 1963 మార్చి 2న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. 1996లో తొలిసారిగా ఎంపీగా గెలిచారు. 2019 నుంచి లేబర్ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. 2019 నుంచి 2022 దాకా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2022లో ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో మూడేళ్లు పదవిలో కొనసాగబోతున్నారు. ‘‘ఆస్ట్రేలియా విలువలకు ప్రజలు మరోసారి పట్టంకట్టారు. వాటికి అనుగుణంగానే నూతన ప్రభుత్వ పాలన సాగుతుంది. అంతేతప్ప ఎవరినీ అనుసరించబోం. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ వీలైనంత త్వరలో అమలు చేసి చూపిస్తా’’ – విజయోత్సవ ప్రసంగంలో అల్బనీస్ మోదీ అభినందనలు అల్బనీస్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానంటూ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అల్బనీస్ నాయకత్వ సామర్థ్యం పట్ల ఆస్ట్రేలియా ప్రజల తిరుగులేని విశ్వాసానికి ఈ విజయమే తార్కాణమని పేర్కొన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యాన్ని భారత్–ఆస్ట్రేలియా బలంగా కోరుకుంటున్నాయని మోదీ స్పష్టంచేశారు. -
విదేశీ విద్య రూటు మారుతోంది!
సాక్షి, అమరావతి: విదేశీ విద్యను ఎంపిక చేసుకోవడంలో భారతీయ విద్యార్థుల రూటు మారుతోంది. కెరీర్ పురోగతి ఉన్న దేశాల యూనివర్సిటీల్లోనే చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు మెరుపర్చుకోవడం, అధిక ఆదాయాన్ని ఆర్జించడం వంటి ప్రాథమిక లక్ష్యాలను బేరీజు వేసుకుని విదేశాల్లో విద్యపై నిర్ణయం తీసుకుంటున్నారు. భారతీయ విద్యార్థులు కేరీర్ కేంద్రీకృత విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఇటీవల అంతర్జాతీయ కన్సల్టెన్సీ ‘ఐడీపీ ఎడ్యుకేషన్’ చేసిన అధ్యయనంలో తేలింది. విద్య కోసం విదేశీ గమ్యస్థానాలను ఎంచుకోవడంలో విద్యార్థుల ప్రాధాన్యతలు ఇలా (శాతం).. కెరీర్ పురోగతి 77 ఉద్యోగ నియామకాలు 70 వర్సిటీల ద్వారా కొలువులు 69 స్కాలర్షిప్ల లభ్యత 55పార్ట్టైమ్ ఉద్యోగ అవకాశాలు 54పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అక్కడే ఉద్యోగం (ప్రస్తుతం చదువుతున్నవారు) 45పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన చోటే ఉద్యోగం (చదువుకు ప్రణాళిక వేస్తున్నవారు) 43ఉద్యోగాలు వచ్చే వర్సిటీల్లోనే చదువు..» 70 శాతం మంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్య గమ్యస్థానాన్ని ఎంచుకోనే సమయంలో ఉద్యోగ నియామకాలను కీలకమైన అంశంగా పరిగణిస్తున్నట్టు ‘ఐడీపీ ఎడ్యుకేషన్’ వెల్లడించింది. » కెరీర్ అవకాశాలు పెంచుకోవడానికి అటువంటి అవకాశాలు కల్పించే సంస్థలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా విదేశీ సంస్థలు ప్రతిభ గల భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి వివిధ ప్రోగ్రామ్లను ఆఫర్ చేస్తున్నాయి. » విశ్వవిద్యాలయాల ఎంపికలోనూ విద్యేతర అంశాలకు భారతీయ విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. చదువు ముగిసిన తర్వాత ఎంత మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారనే లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఇలాంటి దృక్పథంలో ప్రపంచ సగటు (60శాతం) కంటే భారత్లో తొమ్మిది శాతం (69%) ఎక్కువగా ఉంది. » గతంలో భారతీయుల ఇష్టమైన విదేశీ విద్య గమ్యస్థానంగా ఉన్న అమెరికాను అధిగమించి ఆ్రస్టేలియా అత్యంత ఆదరణ పొందిన ఎంపికగా నిలిచింది. ఆస్ట్రేలియాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతోపాటు చదువు పూర్తయిన తర్వాత పని హక్కు కల్పించడం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే అక్కడికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత యూకే రెండో స్థానంలో నిలిచింది. -
నిర్బంధ ఓటింగ్కు వందేళ్లు
ఆ్రస్టేలియా పార్లమెంటుకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోని 1.8 కోట్ల మంది అర్హులైన ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఆ దేశంలో ఓటేయడం కేవలం నచ్చిన అభ్యరి్థని ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు.. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన చట్టపరమైన బాధ్యత. ఎందుకంటే ఆ్రస్టేలియాలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని చట్టముంది. దాంతో అనేక దేశాలు ప్రజలను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి నానా కష్టాలు పడుతుంటే ఆస్ట్రేలియా మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఓటింగ్ నమోదయ్యే దేశాల్లో ఒకటిగా ఉంది. 2022 ఎన్నికల్లో ఏకంగా 90 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు! బ్రిటన్లో 2024 ఎన్నికల్లో కేవలం 60 శాతం పోలింగ్ నమోదయ్యింది. అమెరికాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో 64 శాతం నమోదైంది. చట్ట సవరణ ఆ్రస్టేలియాలో 1924లో ఎన్నికల చట్టాన్ని సవరించి ఫెడరల్ ఎన్నికల్లో ఓటేయడాన్ని తప్పనిసరి చేశారు. దానిప్రకారం ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయకపోతే 20 డాలర్లు, రాష్ట్ర ఎన్నికల్లో ఓటేయకపోతే 79 డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం బాగానే పనిచేసింది. 1922 ఎన్నికల్లో 60 శాతం కూడా లేని ఓటింగ్ చట్టం తర్వాత 1925 ఎన్నికల్లో ఏకంగా 91 శాతం దాటేసింది. నిర్బంధ ఓటింగ్ వల్ల గెలిచినవారు మరింత బాధ్యతాయుతంగా ఉంటారనే వాదన కూడా ఉంది.నిర్బంధ ఓటు అట్టడుగు వర్గాలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించడానికి కూడా సహాయపడుతుందని, ఇది మరింత సమసమాజ ప్రజా విధానాలను రూపొందిస్తుందని నిపుణుల విశ్లేషణ. నిర్బంధ ఓటింగ్ విధానంలో మధ్యతరగతి పౌరులు, వారి ఆందోళనలు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కనిపించే పోలరైజేషన్ రాజకీయాలను నిరోధించి భిన్నమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందనే అభిప్రాయం ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు వేయలేకపోతే ఏంటి పరిస్థితి? సరైన కారణం ఉంటే మినహాయింపు ఉంటుంది.ఆ్రస్టేలియన్లు ఏమంటున్నారు?నిర్బంధ ఓటింగ్ గురించి ఆస్ట్రేలియాలో ఎలాంటి వివాదం లేదు. ఈ చట్టానికి ప్రజల గట్టి మద్దతుంది. దీనికి 70 శాతం ఆమోదం ఉందని 1967 నుంచి జరిగిన పలు జాతీయ సర్వేలు తేల్చాయి. అయితే నిర్బంధ ఓటింగ్ను రద్దు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్, ఆందోళనలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఓటేయాలో వద్దో ఎంచుకునే హక్కు పౌరులకు ఉండాలన్నది వారి వాదన. వాళ్లకు ప్రజాదరణ అంతంతే. నిర్బంధ ఓటింగ్ ద్వారా యువకులు మనమందరం ఎలాగైనా ఓటు వేయాలి అనే అవగాహనకు వస్తున్నారు. రాజకీయ ప్రక్రియలో పాల్గొనడంతోపాటు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. నిర్బంధ ఓటు లేకపోయినా స్వచ్ఛందంగా ఓటేసే వాళ్లమేనని 2022లో 77 శాతం మంది ఆ్రస్టేలియన్లు చెప్పడం విశేషం!వేతనంతో కూడిన సెలవుఓటింగ్కు అడ్డంకులు తొలగించడానికి, ప్రజలంతా ఓటింగ్లో పాల్గొనేలా చూడటానికి అధికారులు పలు విధానాలను అమలు చేశారు. ఆస్ట్రేలియాలో శనివారాల్లోనే ఎన్నికలు జరుగుతాయి. వీకెండ్ కావడంతో ఎక్కువ మంది స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. యాజమాన్యాలు ఎన్నికల రోజున కార్మి కులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తాయి.పోలింగ్ బూత్ల దగ్గర బార్బెక్యూలపై కాల్చిన డెమోక్రసీ సాసేజ్లు అదనపు ప్రోత్సాహం. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల దగ్గర నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసే ఈ స్నాక్స్ ఆ్రస్టేలియా ఎన్నికలకు చిహ్నాలుగా మారాయి. ఇవి స్థానిక పాఠశాలలు, కమ్యూనిటీలకు అతి పెద్ద నిధుల సేకరణ కార్యక్రమాలుగా మారా యి. మొత్తంగా ఎన్నికల రోజు ఆ్రస్టేలియాలో పండుగ వాతావరణం ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
వెర్రి వెయ్యి రకాలు, పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి వంటి సామెతలు తామరతంపరగా గుర్తుకొస్తాయి ఈ మహిళను చూస్తే. ఇదేం పిచ్చి ఈమెకు అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అరే అందంగానే ఉంది కదా..మళ్లీ ఇదేం ఆలోచన అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు ఆమె చేసిన ఘనకార్యం చూసి. డబ్బులు ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయేమో కాబోలు అంటున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే.. పిల్లిలా కనిపించాలనే అనే పబ్లిసిటీ స్టంట్కి శ్రీకారం చుట్టింది ఆస్ట్రేలియాలోని గోల్కోస్ట్కు చెందిన జోలీన్ డాసన్(29). సాధ్యాసాధ్యాలు గురించి ఆలోచించకుండా కాస్మెటిక్ సర్జరీకి రెడీ అయిపోయింది. ఆ సర్జరీ ఆమెకు చుక్కలు చూపించింది. ఆ ప్రచార స్టంట్ తెచ్చిన తంట అంత ఇంత కాదు..!. ఏకంగా ఆరు లక్షలు పైనే ఖర్చు చేసి మరీ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది డాసిన్. ఏదైనా తేడా కొడుతుందేమోనని అనుమానపడింది. ఆ అనుమానమే నిజమై పడరాని కష్టాలు తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆ సర్జరీ వికటించి దుష్ప్రభావాలు చూపించడం ప్రారంభించింది. పిల్లిలా కనిపించేందుకు చెంపలను తొలగించే సర్జరీ ఆమెకు తీవ్రమైన నొప్పిని, బాధని కలిగించింది. అంతలా బాధ భరించిన సర్జరీ సక్సెస్ అవ్వకపోగా..శరీరం దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. అలానే ఆమె ఆకృతి పిల్లిలా మారలేదు కదా..కింది ముఖం రూపురేఖలు దారుణంగా మారిపోయాయి. అయ్యిందేదో అయ్యిందేలా అని ఆ రూపాన్నే కొనసాగిద్దామని చికిత్సలు తీసుకున్నా..యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఊహించని దుష్ప్రభావాలకు తలెత్తాయి. దీంతో ఆమె పిల్లి ఆకృతి కోసం అమర్చిన ఫిల్లర్లు, ఇంప్లాంట్లను తొలగించుకుంది. కనీసం ఇప్పుడైనా.. తన పరిస్థితి మెరుగ్గా ఉంటుందేమోనని ఆశిస్తున్నా..అని బాధగా చెప్పుకొచ్చింది. తన చేయాలనుకున్న స్టంట్ ఎంత మతిలేని పని అని ఇప్పుడిప్పుడే తెలుస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతేగాదు తనలా ఎవరూ ఇలాంటి చెత్త ప్రయోగాల జోలికి అస్సలు వెళ్లొద్దని సూచిస్తోంది కూడా. పెద్దలు చెబుతుంటారే..సవరం అయ్యాక గానీ వివరం రాదంటే ఇదేనేమో..!. లోతు పాతులు..కష్టనష్టాలు బేరీజు వేసుకుని ఏ స్టంట్కైనా లేదా ఏ పనికైనా.. పూనుకోవాలి లేదంటే అంతే సంగతులు..(చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!) -
భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 2–3 గోల్స్ తేడాతో పరాజయం చవిచూసింది. భారత్ తరఫున జ్యోతి సింగ్ (13వ నిమిషంలో), సునెలితా టొప్పో (59వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు ఇవీ స్టాన్స్బై (17వ నిమిషంలో), డేలీ డాల్కెన్స్ (48వ నిమిషంలో), జేమీ లీ సుర్హా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. తొలి క్వార్టర్ చివర్లో లభించిన పెనాల్టీ కార్నర్ను జ్యోతి సింగ్ గోల్గా మలచడంతో భారత్ ఖాతా తెరిచింది. నాలుగు నిమిషాల తర్వాత ఆసీస్ స్కోరును సమం చేసింది. ఒకదశలో మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగుస్తుందనిపించింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో ఆసీస్ రెండు గోల్స్ చేసింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా భారత్ రెండో గోల్ చేసినా పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది. -
కూర్పుపై కసరత్తు
పెర్త్: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ్రస్టేలియా పర్యటనలో కూర్పుపై కసరత్తులు చేయనున్నట్లు భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ వెల్లడించాడు. ఈ టూర్లో భాగంగా భారత అమ్మాయిల జట్టు ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో రెండు మ్యాచ్లు... ప్రధాన జట్టుతో 3 మ్యాచ్లు ఆడనుంది. పెర్త్ వేదికగా శనివారం ఆ్రస్టేలియా ‘ఎ’తో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు తలపడుతోంది. మే 1, 3, 4న వరసగా ఆస్ట్రేలియా సీనియర్ జట్టుతో టీమిండియా మ్యాచ్లు ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్లు జరగగా... అందులో ఆసీస్ 10 మ్యాచ్ల్లో గెలవగా... భారత్ మూడు విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో హరేంద్ర మాట్లాడుతూ... ఇటీవల బెంగళూరులో నిర్వహించిన జాతీయ శిబిరం ప్లేయర్లకు ఉపయోగపడనుందని అన్నాడు. ‘ఈ పర్యటన మా ఆటతీరును పరీక్షించుకునేందుకు తోడ్పడుతుంది. ఇంకా ఏ రంగాల్లో మెరుగు పడాలో అర్థం చేసుకునేందుకు ఆ్రస్టేలియా కంటే మెరుగైన ప్రత్యర్థి ఉండరు. కూర్పును పరీక్షించడంతో బెంచ్ బలాన్ని మరింత పెంపొందించుకుంటాం. ఆ్రస్టేలియాలాంటి జట్టును వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్. ఇది మున్ముందు టోర్నీలకు తోడ్పడుతుంది’ అని హరేంద్ర అన్నాడు. ఇటీవల ప్రొ లీగ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నెదర్లాండ్స్పై విజయం సాధించి మన అమ్మాయిల జట్టు మంచి టచ్లో ఉంది. ఈ పర్యటన కోసం సలీమా సారథ్యంలో 26 మందితో జట్టును ప్రకటించారు. అందులో సీనియర్ గోల్ కీపర్ సవిత, నవ్నీత్ కౌర్, డ్రాగ్ఫ్లికర్ దీపిక ఉన్నారు. ఈ సిరీస్ కోసం ఐదుగురు కొత్త అమ్మాయిలు జ్యోతి సింగ్, సుజాత, అజ్మీన, పూజ యాదవ్, మహిమ టెటెకు అవకాశమిచ్చారు. ‘బలమైన ప్రత్యర్థితో పోరుకు సిద్ధంగా ఉన్నాం. మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. జట్టు కూర్పు పరీక్షించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రొ లీగ్లో యూరప్ అంచె పోటీలు, మహిళల ఆసియా కప్నకు ముందు ప్లేయర్లకు ఇది మంచి అనుభవం అవుతుంది’ అని కెపె్టన్ సలీమా వెల్లడించింది. -
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
విద్యార్థి వీసాల ముసుగులో అక్రమ వలసల నిరోధానికి ఆస్ట్రేలియా చేపట్టిన చర్యలు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆస్ట్రేలియాలోని అనేక యూనివర్సిటీలు భారత విద్యార్థుల నమోదును నిషేధించాయి. ముఖ్యంగా హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్కు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంపై కఠిన నిబంధనలు, పరిమితులు విధించాయి. ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వీసాలు పొందుతూ వలస విధానాలకు తూట్లు పొడుస్తున్నారని వర్సిటీలు గుర్తించాయి. నియంత్రణ లేని ఏజెంట్లు, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు, కొందరు ఆపరేటర్లు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని సమాచారం. ఫలితంగా విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం మొత్తం భారతదేశ విద్యార్థులపై పడే ప్రమాదం నెలకొంది. – సాక్షి, అమరావతిప్రతి నాలుగు దరఖాస్తుల్లో ఒకటి నకిలీ..భారత్ నుంచి వచ్చే ప్రతి నాలుగు విద్యార్థి వీసా దరఖాస్తుల్లో ఒకటి నకిలీదిగా ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ధ్రువీకరించింది. భారత్ నుంచి వచ్చే మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 24.3 శాతం మోసపూరితమైనవని చెబుతోంది. అంతర్జాతీయ వర్సిటీలకు అతిపెద్ద విద్యార్థి వనరుగా భారత్ ఉంది. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా వర్సిటీల తాజా నిషేధంతో చట్టబద్ధమైన దరఖాస్తుదారుల భవితవ్యం గందరగోళంలో పడుతోంది. ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించకుంటే ద్వైపాక్షిక విద్యా సంబంధాలు ప్రభావితమవుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ విద్యార్థుల వీసాలకు సంబంధించి కఠినమైన నిబంధనలను అమలు చేసిన తర్వాత ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వర్సిటీల నిర్ణయం శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు.వలసలను తగ్గించేందుకు..గత ఏడాది రికార్డు స్థాయిలో వలసలను నియంత్రించే యత్నంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం వర్సిటీలను హెచ్చరించింది. విద్యార్థి వీసా మంజూరుకు పొదుపు డిపాజిట్ మొత్తాన్నీ పెంచింది. గత ఏడాది మే 10 నుంచి విద్యార్థి వీసా మంజూరుకు కనీసం రూ.16.30 లక్షలు (29,710 ఆస్ట్రేలియన్ డాలర్ల) బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్టు ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. అంతకుముందు 2023 అక్టోబర్లో పొదుపు మొత్తాన్ని రూ.11.46 లక్షల నుంచి రూ.13.35 లక్షలు (21,041 ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 24,505 ఆస్ట్రేలియన్ డాలర్లకు)కు పెంచింది. -
PSL 2025: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ టీ20ల్లో అత్యంత అరుదైన 13000 పరుగుల క్లబ్లో చేరాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో కరాచీ కింగ్స్కు ఆడుతున్న వార్నర్.. పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్లో ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ (47 బంతుల్లో 60; 8 ఫోర్లు) చేసిన వార్నర్.. పొట్టి క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన ఆరో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన మూడో ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. వార్నర్ 403 ఇన్నింగ్స్ల్లో 13000 పరుగులు పూర్తి చేశాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ కేవలం 381 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. గేల్ తర్వాత విరాట్ కోహ్లి (386 ఇన్నింగ్స్ల్లో) అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించాడు.టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 14562అలెక్స్ హేల్స్- 13610షోయబ్ మాలిక్- 13571కీరన్ పోలార్డ్- 13537విరాట్ కోహ్లి- 13208డేవిడ్ వార్నర్- 13019టీ20ల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 381 ఇన్నింగ్స్లువిరాట్ కోహ్లి- 386డేవిడ్ వార్నర్- 403అలెక్స్ హేల్స్- 474షోయబ్ మాలిక్- 487కీరన్ పోలార్డ్- 594కరాచీ కింగ్స్, పెషావర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ రాణించడంతో పెషావర్ జల్మీపై కరాచీ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (46) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో మహ్మద్ హరీస్ (28), అల్జరీ జోసఫ్ (24 నాటౌట్), తలాత్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. సైమ్ అయూబ్ 4, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ 7, మిచెల్ ఓవెన్ 5, అబ్దుల్ సమద్ 2, లూక్ వుడ్ 2 పరుగులకు ఔటయ్యారు. కరాచీ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో 3 వికెట్లు తీయగా.. ఆమెర్ జమాల్, మీర్ హమ్జా చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ కూడా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కరాచీ గెలుపుకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60) గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (23 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేసి కరాచీని విజయతీరాలకు చేర్చాడు. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ 3, అలీ రజా 2, అల్జరీ జోసఫ్, ఆరిఫ్ యాకూబ్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్పోల్ (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను గుండెపోటుతో మరణించారని తెలుస్తుంది. కీత్కు 60వ దశకంలో మంచి బ్యాటర్గా పేరుంది. లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్లు, 6 వన్డేలు ఆడి 7 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు చేశాడు.1966లో ఇంగ్లండ్పై మిడిలార్డర్ బ్యాటర్గా కెరీర్ ప్రారంభించిన కీత్.. 1969లో ఓపెనర్గా మారాడు. ఆ సమయంలో అతను బిల్ లారీతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను ప్రారంభించేవాడు. కీత్కు ఇంగ్లండ్పై మంచి ట్రాక్ రికార్డు ఉంది. 1972 యాషెస్ సిరీస్లో అతను 53.88 సగటున 3 సెంచరీల సాయంతో 485 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. కీత్ తన కెరీర్ బెస్ట్ స్కోర్ 207 పరుగులను కూడా ఇంగ్లండ్పైనే చేశాడు. కీత్ 1973లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. కీత్ మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బెయిర్డ్ సంతాపం వ్యక్తం చేశారు. దేశవాలీ క్రికెట్లో విక్టోరియాకు ప్రాతినిథ్యం వహించిన కీత్.. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 10100 పరుగులు చేసి 148 వికెట్లు పడగొట్టాడు. కీత్ రిటైర్మెంట్ (1974) తర్వాత టీవీ మరియు రేడియో వ్యాఖ్యాతగా కూడా పని చేశారు. కీత్ చాలామంది ఆసీస్ ప్లేయర్లకు మెంటార్గా కూడా పని చేశాడు. కీత్.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొట్టమొదటి వన్డేలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్లో అతను 3 వికెట్లు తీశాడు. -
ఆస్ట్రేలియాలో చిల్ అవుతోన్న సచిన్ కూతురు సారా టెండూల్కర్ (ఫోటోలు)
-
ఐవీఎఫ్ సెంటర్ నిర్వాకం: మరొకరి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
‘‘మానవ తప్పిదాలు సహజమే’’, ‘‘అసలు తప్పే చేయనోడు మనిషే కాదు’’ ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బానే ఉంటాయి కానీ, తేడా వస్తే.. రిజల్ట్స్ భయంకరంగా ఉన్నాయి. దిమ్మదిరిగి బొమ్మ కనుపడుద్ది..తూచ్..నేనొప్పుకోను అంటే కుదరదు.. అస్సలేమీ అర్థం కాలేదు కదా... ఆ మాటల వెనుక మర్మం తెలియాలంటే ఈ కథనం గురించి తెలుసుకోవాలి.మారుతున్న జీవన పరిస్థితులు, జన్యుపరమైన కారణాల రీత్యా అనేక మంది సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. సహజంగా గర్భం ధరించడం కష్టమైన వారు కృత్రిమ పద్దతుల ద్వారా బిడ్డల్ని కనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. దీంతో వీధికో ఐవీఎఫ్ సెంటర్ (IVF) పుట్టుకోస్తోంది. ఇవి కొందరికి వరాలిచ్చే కేంద్రాలుగా మారుతుండగా, మరికొందరికి మాత్రం పీడకలగా మారుతున్నాయి.ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన మోనాష్ ఐవీఎఫ్ సెంటర్లో ఈ వివాదం నెలకొంది. ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ప్రయత్నించిందో ఆస్ట్రేలియన్ మహిళ. మరో వైపు ఇదే ఆశతో బ్రిస్బేన కేంద్రానికి వచ్చిందో జంట. అయితే ఆ జంటకు చెందిన పిండాన్న ఆయా మహిళల గర్భంలోకి ప్రవేశ పెట్టారు. అనుకున్నట్టు ఆస్ట్రేలియన్ మహిళ గర్భం నిలిచింది. అంతులేని ఆనందంతో, నవమాసాలు మోసి కోటి ఆశలతో బిడ్డకు జన్మనిచ్చింది. తీరా అది తన బిడ్డకాదని తెలిసి ఒక్కసారిగా షాక్ అయింది. ఐవీఎఫ్ కేంద్రం చేసిన పొరబాటు కారణంగా మహిళ తానొక అపరిచితుడి బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుసుకుంది. ఇది చట్టపరమైన, నైతిక ఆందోళన లేవనెత్తింది.చదవండి: సింగపూర్ ‘ట్రీ టాప్వాక్’ తరహాలో వాక్వే, క్యూ కడుతున్న పర్యాటకులు తప్పయిదంటూ వివరణ, నష్ట పరిహారంఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరిగిన ఈ తప్పును. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తించారు. అయితే జరిగిన తప్పును అంగీకరించి ఐవీఎఫ్ సెంటర్ మోనాష్ బాధితులు అందరికీ క్షమాపణ చెప్పింది. అలాగే వారికి పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించింది. దాదాసే భారత కరెన్సీ ప్రకారం రూ.480 కోట్లు నష్ట పరిహారం చెల్లించింది.ఇపుడా బిడ్డ ఎవరికి చెందుతుంది?నిజమైన జన్యు తల్లిదండ్రులు ముందు కొచ్చిదీని గురించి చర్చించాలనుకుంటున్నారా, లేదా అనేది ప్రశ్న అంటోంది మోనాష్ సంస్థ. ఇది అన్ని చోట్ల భయంకరమైన, విచారకరమైన పరిస్థితి అని మోనాష్ ఐవీఎఫ్ నిపుణుడు పేర్కొన్నారు. ఇది పాల్గొన్న జంటల జీవితాన్నిమార్చివేసేది అయినప్పటికీ, తదుపరిసారి ఎక్కువగా బాధపడేది ఈ తప్పుకు కారణమైన శాస్త్రవేత్త" అన్నారు. ఆస్ట్రేలియాలోని చట్టం ఎలా నిర్ణయిస్తుందో తెలియదు, మానవులు తప్పులు చేస్తారని అంగీకరించడం తప్ప ఇంతకు మించి చేసేదేమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్మనీ ఎంతో?అయితే తల్లైన జంట, బయోలాజికల్ తల్లిదండ్రులు ఎవరు, బిడ్డను ప్రస్తుతం ఎవరికి అప్పగించారు? ఈ శిశువు ఎవరికి చెందుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ చట్టం ప్రకారం, జన్మనిచ్చిన తల్లి , ఆమె భాగస్వామి చట్టపరమైన తల్లిదండ్రులుగా గుర్తించ బడతారని, జీవసంబంధమైన తల్లిదండ్రులను కస్టడీ హక్కులు లేకుండా చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేసు IVF పరిశ్రమపై భద్రత, పర్యవేక్షణకు పిలుపునిచ్చింది. దీంతోపాటు సహాయక పునరుత్పత్తి సాంకేతికతలలో మెరుగైన రక్షణల అవసరాన్ని హైలైట్ చేసింది. -
మెల్బోర్న్లోని భారత కాన్సులేట్పై దాడి
మెల్బోర్న్: ఆస్ట్లేలియాలో మెల్బోర్న్లో ఉన్న భారత కాన్సులేట్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గతంలోనూ పలుమార్లు కార్యాలయం గోడల నిండా అభ్యంతర చిత్రాలు, వ్యాఖ్యలు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఘటనపై కాన్బెర్రాలోని భారత హై కమిషన్ కార్యాలయం అధికారులకు సమాచారం అందించింది. దేశంలోని భారత దౌత్య, కాన్సులేట్ కార్యాలయాలకు, అధికారులకు రక్షణ కలి్పస్తామని ఆ్రస్టేలియా ప్రభుత్వం హామీ ఇచి్చందని హై కమిషన్ వెల్లడించింది. కార్యాలయం గేటు వద్ద గోడపై అర్ధరాత్రి దాటాక అభ్యంతరకర చిత్రాలు గీసినట్లు తెలుస్తోందని, దీనిపై దర్యాప్తు చేపట్టామని విక్టోరియా పోలీసులు శుక్రవారం తెలిపారు. -
డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆస్ట్రేలియా ప్రతినిధులతో దిల్ రాజు భేటీ!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, టీఎస్ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాత హర్షిత్ రెడ్డి ఆస్ట్రేలియా ప్రతినిధులను కలిశారు. హైదరాబాద్లోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఆదేశ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కొన్నోలీ, వైస్ కాన్సుల్ హ్యారియెట్ వైట్, స్టెఫీ చెరియన్ను కలిశారు.ఈ సమావేశంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య సృజనాత్మక సహకారంపై వారితో చర్చించారు. ఆస్ట్రేలియాలో టాలీవుడ్ చిత్ర షూటింగ్స్, సాంస్కృతిక పరమైన మార్పిడిపై చర్చలు జరిపారు. అలాగే ఆస్ట్రేలియాలో తెలుగు సినిమా పరిధిని విస్తరించడంపై ప్రతినిధులతో దిల్ రాజు మాట్లాడారు. చర్చల తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సహకారం విషయంలో పూర్తి సానూకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి సంబంధించిన ఫోటోలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది.ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. జపాన్లోనూ తెలుగు సినిమాలంటే థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ మూవీ దేవరను జపాన్లోనూ విడుదల చేశారు. మరోవైపు టాలీవుడ్ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీ కూడా ఇచ్చారు. నితిన్ హీరోగా నటించిన రాబిన్హుడ్ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ.. దిల్ రాజు ఆస్ట్రేలియా ప్రతినిధులను కలవడం మరింత ఆసక్తిగా మారింది. Our producer and TSFDC Chairman, Mr. Dil Raju, along with producer @HR_3555, recently met with a high-level delegation from the Australian Consulate General in Hyderabad—Deputy Consul General Steven Connolly, Vice Consul Harriet White, and Ms. Steffi Cherian—to explore creative… pic.twitter.com/flig5N29Aj— Sri Venkateswara Creations (@SVC_official) April 11, 2025 -
ఏపీ మరో బిహార్లా..
సాక్షి, టాస్క్ఫోర్స్: మీరు విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులా.. అయితే, ఖచ్చితంగా మీ భూములకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీ భూములు భద్రంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోండి. ఎందుకంటే.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ఆర్ఐలకు చెందిన రూ.కోట్లు విలువైన స్థలాలను యథేచ్ఛగా కబ్జాచేసే ముఠాల ఆగడాలు శృతిమించుతున్నాయి. ప్రత్యేకించి పోలీసులతో కుమ్మక్కయి మరీ ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈ విషయంలో ఒక ఎన్ఆర్ఐ పడుతున్న ఆవేదన ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది. ఏపీ మరో బిహార్లా మారిందంటూ తిరుపతికి చెందిన ఎన్ఆర్ఐ బొర్రా రాజేంద్రప్రసాద్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. అందులో ఆయన ఏమన్నారంటే..ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో తిరుచానూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 298/4లో 120 అంకణాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేస్తే ప్రైవేట్ వ్యక్తులు కొందరు దానిని కబ్జాచేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. నిజానికి.. కిందటేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి జనసేన ఎన్ఆర్ఐ విభాగం తరఫున ఆస్ట్రేలియాలో చురుగ్గా పనిచేశాను. మా నాన్న బొర్రా వెంకటరమణ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైరయ్యారు. ఆయన కూడా జనసేన నుంచి తిరుపతికి పోటీచేసిన ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి నుంచి పోటీచేసిన పులివర్తి నానిల గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు. కూటమి ప్రభుత్వం కోసం కష్టపడినందుకు ఇదేనా మాకు దక్కుతున్న న్యాయం? మా నాన్న నాలుగుసార్లు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో, తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదుచేస్తే పట్టించుకోలేదు. ఏపీ మరో బిహార్లా తయారైంది. నాలాంటి ఎన్ఆర్ఐలు చాలామంది బాధితులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు ఎన్నడూ జరగలేదు. నిజానికి.. ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలను జగన్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. ఈ సమస్యను ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందనలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం కోసం కష్టపడ్డా.. కానీ ఇప్పుడు సిగ్గేస్తోంది. ఇదిలా ఉంటే.. తిరుచానూరు పరిసరాల్లో ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలను ఎంచుకుని కబ్జా రాయుళ్లు వాటిల్లోకి వాలిపోతున్నారని.. వీరికి పోలీసుల సహకారం ఉండటంతో ఎన్ఆర్ఐలు ఏమీ చేయలేకపోతున్నారని బొర్రా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. చివరికి.. తమ స్థలం విషయంలో పోలీసులు ప్రత్యర్థులతో సెటిల్ చేసుకోవాలని పరోక్షంగా చెబుతున్నారని మండిపడ్డారు. -
తూచ్.. నేనేం పడిపోలేదు
పబ్లిక్ ఈవెంట్లకు హాజరైనప్పుడు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మనస్ఫూర్తిగా మనుషుల్లోకి వెళ్లడం కంటే.. పబ్లిసిటీ కోసం ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇచ్చేవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆనక.. శానిటైజర్లతో చేతులు తుడుచుకుంటూ కనిపించిన దాఖలాలు మన తెలుగు రాజకీయాల్లోనే చూశాం. ఆ సంగతి పక్కన పెడితే, పాపం.. ఫొటోషూట్ హడావిడిలో ఏకంగా ప్రధాని స్థాయి వ్యక్తికే ఇక్కడ చేదు అనుభవం ఎదురైంది.కాన్బెర్రా: గురువారం న్యూ సౌత్వేల్స్ జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొన్నారు. ప్రసంగం పూర్తయ్యాక.. వేదికపై ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఆపై ఒక్కసారిగా పక్కకు వెళ్లి పడిపోయారు. వెంటనే లేచి తాను క్షేమంగా ఉన్నానని నవ్వుతూ సంకేతమిచ్చారు. ఆపై ఓ రేడియో ఇంటర్వ్యూకి హాజరైన ఆయన ఆ ఘటనపై స్పందించారు. నేనేం పడిపోలేదు. ఓ అడుగు వెనక్కి పడిందంతే. ఒక కాలు కిందకు వంగిపోయింది.. అంటూ నవ్వుతూ చెప్పారు. ఇదిలా ఉంటే మే 3వ తేదీన ఆస్ట్రేలియా ఎన్నికలు జరగనున్నాయి.అధికార లేబర్ పార్టీకి, పీటర్ డుట్టాన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ లిబరల్ నేషనల్ పార్టీకి విజయావకాశాలు సమానంగా కనిపిస్తున్నాయి.Anthony Albanese has fallen off the stage while speaking at a mining union conference… pic.twitter.com/Z716MlW629— Roman Mackinnon (@RomanMackinnon6) April 3, 2025 -
బుమ్రాతో గొడవ పడ్డ ఆటగాడికి జాక్పాట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాతో గొడవ పడ్డ ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్స్టాస్కు జాక్పాట్ తగిలింది. 2025-26 సంవత్సరానికి గానూ క్రికెట్ ఆస్ట్రేలియా కొన్స్టాస్కు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. కొన్స్టాస్తో పాటు వివాదాస్పద బౌలింగ్ శైలి కలిగిన మాథ్యూ కుహ్నేమన్, ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్ కూడా కొత్తగా క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు. ఈ ముగ్గురి చేరికతో క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల సంఖ్య 23కు చేరింది. కొన్స్టాస్, కుహ్నేమన్, వెబ్స్టర్ ఇటీవల ఆస్ట్రేలియా తరఫున అద్భుత ప్రదర్శనలు చేశారు. ఈ కారణంగా వారు క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ పొందారు. కొన్స్టాస్, వెబ్స్టర్ భారత్తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటగా.. కుహ్నేమన్ ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్లో చెలరేగిపోయాడు. ఆ సిరీస్లో కుహ్నేమన్ 2 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆసీస్ శ్రీలంకను వారి సొంతగడ్డపైఏ 2-0 తేడాతో ఓడించింది. కొన్స్టాస్ విషయానికొస్తే.. ఇతగాడు తన టెస్ట్ కెరీర్ను ఘనంగా ప్రారంభించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్లోనే బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ను ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత కొన్స్టాస్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయనప్పటికీ.. బుమ్రాతో మాటల యుద్దం కారణంగా బాగా పాపులర్ అయ్యాడు.వెబ్స్టర్ విషయానికొస్తే.. ఇతగాడు కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనే అరంగేట్రం చేశాడు. వెబ్స్టర్ కూడా తన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో అతను బంతితో కూడా రాణించాడు. మిచెల్ మార్ష్, కెమారూన్ గ్రీన్ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వెబ్స్టర్ తన తొలి మ్యాచ్లోనే సత్తా చాటి క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ పట్టాడు.2025-26 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆసీస్ ఆటగాళ్లు..పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, నాథన్ లియాన్, అలెక్స్ కారీ, సామ్ కొన్స్టాస్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, జై రిచర్డ్సన్, స్కాట్ బోలాండ్, లాన్స్ మోరిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్నస్ లబూషేన్, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, బ్యూ వెబ్స్టర్, కామెరూన్ గ్రీన్, జేవియర్ బార్ట్లెట్ -
ఆస్ట్రేలియాలో మే 3న ఎన్నికలు
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో మే 3న సార్వత్రిక ఎన్నికలు జరగను న్నాయి. ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ (62) శుక్రవారం ఉదయం గవర్నర్ జనరల్ శామ్ మోస్టిన్ను కలిసి ఎన్నికలకు అనుమతి కోరారు. అనంతరం మీడియా ముందు ఆ మేరకు ప్రకటన చేశారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించేందుకు కృషిని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యర్థి పీటర్ డట్టన్ (54)ను ఎన్నుకుంటే దేశం వెనక్కు పోతుందన్నారు. ‘‘ప్రపంచం కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాపై విమర్శలు గుప్పిస్తోంది. అనిశ్చిత సమయాల్లో మనం ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాలన్నది మన చేతుల్లో లేదు. కానీ వాటికి ఎలా స్పందించాలన్నది మన చేతుల్లోనే ఉంది. మా ప్రభుత్వం ఎన్నో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంది. ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారికి అందమైన భవిష్యత్తు అందించేందుకు కృషిని కొనసాగిస్తాం’’ అన్నారు. దశాబ్దం పాటు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని ఓడించి ఆల్బనీస్కు చెందిన సెంట్రల్ లెఫ్ట్ లేబర్ పార్టీ 2022 మేలో అధికారం చేపట్టింది. అప్పటికి ఎనిమిదేళ్లలో ఏకంగా ఆరుసార్లు ప్రధానులు మారారు! సుదీర్ఘ రాజకీయ అస్థిరత తర్వాత ఎక్కువ కాలం ప్రధానిగా చేసిన నేతగా ఆల్బనీస్ నిలిచారు. కానీ ఆయన పాలనపై కూడా కొంతకాలంగా జనం పెదవి విరుస్తున్నారు.సమస్యలతో సావాసంఆస్ట్రేలియా పార్లమెంటులో 150 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 76 సీట్లు అవసరం. వామపక్ష భావజాలమున్న లేబర్ పార్టీ, మితవాద లిబరల్ నేషనల్ పార్టీలదే ఆస్ట్రేలియా రాజకీయాల్లో చాలాకాలంగా ఆధిపత్యం. ప్రధాన అభ్యర్థులుగా ఆల్బనీస్, లిబరల్ పార్టీ సారథి డట్టన్ బరిలో ఉన్నారు. వారితో పాటు పలువురు స్వతంత్రులు కూడా పోటీ చేస్తున్నారు. వ్యయం, ఆర్థిక అవ్యవస్థ, చైనా ఆధిపత్యం ఎన్నికల్లో ప్రధానాంశాలు కానున్నాయి. చౌక గృహాల కొరత, అధిక వడ్డీ రేట్లతో ప్రజలు సతమతం అవుతున్నారు. ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. అద్దె, విద్యుత్ బిల్లులపై పన్ను కోతలు, సబ్సిడీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. రికార్డు స్థాయి వలసలు, నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. -
కంగారూ దేశంలో సమంత.. ఫుల్ చిల్ అవుతూ (ఫొటోలు)
-
2032 తర్వాత ‘గాబా’ కనుమరుగు
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాలోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం ‘గాబా’ కనుమరుగు కానుంది. సుదీర్ఘకాలంగా ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన బ్రిస్బేన్లోని ‘గాబా’ మైదానాన్ని 2032 ఒలింపిక్స్ తర్వాత కూల్చివేయనున్నారు. 2028 ఒలింపిక్స్కు లాస్ ఏంజెలిస్ ఆతిథ్యమిస్తుండగా... మరో నాలుగేళ్ల తర్వాత బ్రిస్బేన్ వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. దాని కోసం ఆ్రస్టేలియా ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా... క్వీన్స్లాండ్ ప్రభుత్వం వేదికలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒలింపిక్స్ కోసం విక్టోరియా పార్క్లో 63 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో కూడిన నూతన అధునాతన స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులోనే ఒలింపిక్స్ ఆరంభ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. విశ్వక్రీడలు ముగిసిన అనంతరం ‘గాబా’ మైదానాన్ని పూర్తిగా పడగొట్టి ఒలింపిక్స్ కోసం నిర్మించిన కొత్త స్టేడియంలోనే క్రికెట్ మ్యాచ్లు జరపనున్నారు. ఒకవేళ 2032 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మెడల్ ఈవెంట్గా కొనసాగితే క్రికెట్ ఈవెంట్ స్వర్ణ పతక పోరుకు మాత్రం పాత ‘గాబా’ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. ‘గాబా స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నో మరపురాని మ్యాచ్లు జరిగాయి. ఆటగాళ్లకు, అభిమానులకు ఈ మైదానంతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ మైదానాన్ని కూల్చివేయనున్నారు. దీని స్థానంలో క్వీన్స్ల్యాండ్లో మరో కొత్త స్టేడియం సిద్ధమవుతుంది. అందులో ఐసీసీ ఈవెంట్లు, యాషెస్ సిరీస్, ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లు యధావిధిగా జరుగుతాయి’ అని క్వీన్స్ల్యాండ్ క్రికెట్ సీఈవో టెర్రీ స్వెన్సన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. » 1931 నుంచి టెస్టు మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్న ‘గాబా’ స్టేడియంలో ఇప్పటి వరకు 67 పురుషుల టెస్టు మ్యాచ్లు, 2 మహిళల టెస్టులు జరిగాయి. »పేస్కు పెట్టింది పేరైన ‘గాబా’ పిచ్పై ఆ్రస్టేలియా జట్టు 1988 నుంచి 2021 వరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడలేదు. 2020–21 పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. »2032 ఒలింపిక్స్ ప్రణాళికల్లో భాగంగా ‘గాబా’ మైదానాన్ని ఆధునీకికరించాలని తొలుత భావించారు. అయితే అధిక వ్యయం కారణంతో ఆ ప్రణాళికను పక్కన పెట్టి పార్క్ల్యాండ్ ఇన్నర్ సిటీలో కొత్త స్టేడియం నిర్మాణం చేపడుతున్నారు. »ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న సమయంలో ‘గాబా’ మైదానాన్ని మరింత మెరుగు పరచాలని భావించినా... ఇప్పటికి నాలుగేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. »విశ్వక్రీడలకు మరో ఏడేళ్ల సమయమే ఉండటంతో కొత్త స్టేడియం నిర్మాణానికే మొగ్గుచూపారు. »ఇటీవల ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైన క్రిస్టీ కొవెంట్రీ ప్రణాళికల విషయంలో పక్కాగా ఉండటంతో... ఆ్రస్టేలియా ప్రభుత్వం వేదికల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. -
క్యాంటీన్లో గిన్నెలు కడిగాడు : ఇపుడు బిజినెస్ టైకూన్లా కోట్లు
జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి, సాధించాలేగానీ సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందలా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాల్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేగానీ నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్లో క్యాంటీన్లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పని చేయడం వరకు. సంజిత్ కష్ట సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాపవుట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఫిదా అవుతారు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా (Sanjith Konda) మెల్బోర్న్లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని బుండూరా క్యాంపస్లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు ఇదో అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కిక్ ఏముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లలో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ వారానికి రూ. 33 వేలు సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకు నాంది పలికింది.2019లొ సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి రూ. 1.1 లక్షల స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈవెంట్స్ ఉత్సవాలను నిర్వహించాడు. ఐదో సెమిస్టర్లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియన్లు టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటినుంచీ టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్నే బిజినెస్గా మల్చుకున్నాడు. దీనికి మెల్బోర్న్లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్తో చర్చించాడు. ఆరో సెమిస్టర్లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. 'డ్రాపౌట్ చాయ్వాలా' గా సంజిత్ జర్నీ మొదలైంది. ప్రీతం అకు, అరుణ్ పి. సింగ్ అనే ఇద్దరు కళాశాల సీనియర్లను నియమించుకున్నాడు. అలా సంజిత్తో సహా కేవలం ఐదుగురు వ్యక్తులతో మరియు ఐదు రకాల చాయ్లతో ప్రారంభమైంది. మొదటి మూడు నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తరువాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక్క ఏడాదిలోనే సంవత్సరంలోనే, చాయ్ ట్రక్తో సహా మరో రెండు ప్రదేశాల్లో తన షాపును ఓపెన్ చేశాడు. రకరకాల ప్లేవర్లను పరిచయం చేస్తూ ‘డ్రాపవుట్ చాయ్వాలా’ బాగా పాపులర్ అయ్యాడు. 40 మంది కార్మికులతో రూ. 5.57 కోట్లు టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్పుచినో లాంటివాటితోపాటు, టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా , వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్ను కూడా అందిస్తుంది.సంజిత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్, అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజిత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయ పడటం, తల్లి పాస్బుక్ను అప్డేట్కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధన బిల్లు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్తో సంజిత్ తల్లి చాలా సంతోషంగా ఉంది. View this post on Instagram A post shared by Dropout Chaiwala (@dropout_chaiwala)మూడేళ్ల సంబరం : డ్రాపౌట్ చాయ్వాలా ఇటీవల ముచ్చటగా మూడేళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం ,సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజిత్.మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమే ఒక బ్రాండ్కు మించి ఎదిగిన కుటుంబం మనది అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. -
బ్యాటింగ్ చేస్తూ కుప్పకూలిన పాకిస్తానీ క్రికెటర్.. తీవ్ర విషాదం
ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది. పాకిస్తాన్కు చెందిన క్లబ్ లెవల్ క్రికెటర్ జునైల్ జఫార్ ఖాన్ (Junail Zafar Khan) దుర్మరణం పాలయ్యాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో మైదానంలో కుప్పకూలిన అతడు.. అక్కడే ప్రాణాలు విడిచాడు. ఎండ వేడిమి తట్టుకోలేకే జఫార్ ఖాన్ మరణించినట్లు తెలుస్తోంది.ఆలస్యంగా వెలుగులోకికాగా నలభై ఏళ్ల జఫార్ ఖాన్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే వయసు పైబడుతున్నా లెక్కచేయక క్లబ్ స్థాయిలో మ్యాచ్లు ఆడుతున్నాడు. ఓల్డ్ కాంకొర్డియన్స్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్య వహిస్తున్న అతడు.. గత శనివారం ప్రిన్స్ అల్ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్తో మ్యాచ్లో పాల్గొన్నాడు.నలభై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన జఫార్ ఖాన్.. ఏడు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. పదహారు పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఉన్న వేళ అతడు కిందపడిపోయాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ డే లైట్ టైమ్ ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు మైదానంలో కుప్పకూలిపోయాడు. తీవ్ర విషాదంలో మునిగిపోయాంఈ విషాదకర ఘటనపై ఓల్డ్ కాంకొర్డియన్స్ క్రికెట్ క్లబ్ స్పందించింది. ‘‘మా క్లబ్కు చెందిన విలువైన ఆటగాడు అకస్మాత్తుగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఘటనతో మేము తీవ్ర విషాదంలో మునిగిపోయాం. మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే మా క్లబ్ సభ్యుడు మృతి చెందడం మమ్మల్ని కలచివేస్తోంది.అతడికి చికిత్స అందించేందుకు వైద్య బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతడి కుటుంబానికి, సహచర ఆటగాళ్లు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి ’’ అని సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.అడిలైడ్లో ఉద్యోగం?కాగా 2013లో వరకు పాకిస్తాన్లోనే ఉన్న జఫార్ ఖాన్.. ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునే క్రమంలో ఆస్ట్రేలియాకు మకాం మార్చినట్లు సమాచారం. అడిలైడ్లో ఉద్యోగం చేస్తున్న అతడు క్లబ్ క్రికెట్ కూడా ఆడుతూ.. దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. కాగా దక్షిణ ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి.గరిష్టంగా 40కి పైగా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ప్రజలంతగా అప్రమత్తంగా ఉండాలని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అడిలైడ్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత మించినట్లయితే..మ్యాచ్లు రద్దు చేస్తామని పేర్కొంది.చదవండి: వెంటిలేటర్పై పాక్ క్రికెట్ -
కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!
కృత్రిమంగా గుండెని తయారు చేయడం అనేది వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. పైగా దాన్ని ఒక మనిషికి అమర్చి సమర్థవంతంగా పనిచేసేలా చూడటం మరో అద్భుతం. అయితే అది ఏ కొన్ని గంటలో కాదు ఏకంగా వంద రోజులకు పైగా ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలిపింది. దాత దొరికేంత వరకు ఊపిరిని అందించింది. గుండె వైఫల్యంతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. వైద్య చరిత్రలోనే ఈ కేసు ఓ అద్భుతమని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ కృత్రిమ గుండెని ఎవరికీ అమర్చారు. దాని విశేషాలేంటో చూద్దామా..!.టైటానియంతో తయారు చేసిన కృత్రిమ గుండెతో వందరోజులకు పైగా జీవించిన తొలి వ్యక్తిగా ఆస్ట్రేలియన్ న్యూ సౌత్ వేల్స్ చరిత్ర సృష్టించాడు. ఈ 40 ఏళ్య వ్యక్తికి గత నవంబర్లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆస్పత్రిలో టైటానియంతో తయారు చేసిన బివాకర్ అనే పరికరాన్ని అమర్చారు. ఆయన తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతుండటంతో విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ పాల్ జాన్జ్ నేతృత్వంలో దాదాపు ఆరుగంటలు శ్రమించి ఈ కృత్రిమ గుండె ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేశారు. ఈ ఆధునాత వైద్యాన్ని అందించిన తొలి వైద్య బృందం తామే కావడం గర్వంగా ఉందన్నారు వైద్యుడు జాన్జ్. అంతేగాదు ఇలా ప్రపంచంలో కృత్రిమ టైటానియం గుండెని పొందిన ఆరవ వ్యక్తి అతడేనని చెప్పారు. అతను ఈ గుండెతో పెద్దగా ఎలాంటి సమస్యలు లేకుండా వందరోజులకు పైగా బతికి బట్టగట్ట గలిగాడన్నారు. అతడికి ఈ నెల ప్రారంభంలో ఒక దాత గుండెని అమర్చినట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె ఇంప్లాంట్ ప్రక్రియని "అద్భుతమైన క్లినికల్ విజయం"గా ప్రకటించారు ఆస్ట్రేలియన్ వైద్య బృందం.ఏంటీ టైటానియం బివాకర్..క్వీన్స్ల్యాండ్లో జన్మించిన డాక్టర్ డేనియల్ టిమ్స్ ఈ గుండె మార్పిడి బివాకర్ పరికరాన్ని కనుగొన్నారు. దాత గుండె మార్పిడి అందుబాటులోకి వచ్చే వరకు రోగులను సజీవంగా ఉంచడానికి ఇది వారధిలాగా పనిచేస్తుంది. ఇది నిరంతర పంపుగా పనిచేస్తుంది. దీనిలో అయస్కాంతంగా సస్పెండ్ చేసిన రోటర్ శరీమంతా సాధారణ పల్స్లో రక్తం ప్రసరించేలా చేస్తుంది. ఇలా సస్పెండ్ చేసి ఉన్న అయస్కాంతం చర్మం వెలుపల ఉన్న త్రాడు మాదిరి పరికరంతో బయట పోర్టబుల్ కంట్రోలర్కు కలుపుతుంది. పగటిపూట బ్యాటరీలతో పనిచేస్తుంది. రాత్రిపూట మెయిన్స్లో ప్లగ్ చేసి ఉంటుంది. ఇక్కడ టైటానియంని ఉపయోగించడానికి ఇది తుప్పు నిరోధకత కలిగినది, అలాగే బలమైన జీవన వ్యవస్థకు అనూకూలమైనది కావడమే. ప్రస్తుతం ఈ పరికరాన్ని తాత్కాలిక ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు..భవిష్యత్తులో ఇది ఇతర అనారోగ్య పరిస్థితుల కారణంగా గుండె మార్పిడికి అర్హత లేనివారికి ఉపయోగపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ఆ దిశగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె పనితీరు కాల వ్యవధి దాత గుండె కంటే చాలా తక్కువ అనేది గమనించదగ్గ విషయం.(చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
మోర్గాన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. ఇంగ్లండ్ ఖాతాలో మరో ఓటమి
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ను (2025) ఇంగ్లండ్ మాస్టర్స్ ఒక్క విజయం కూడా లేకుండానే ముగించింది. నిన్న (మార్చి 12) ఆస్ట్రేలియా మాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు.ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విధ్వంసకర హాఫ్ సెంచరీ.. బౌలింగ్లో టిమ్ బ్రేస్నన్ ఐదు వికెట్ల ఘనత వృధా అయ్యాయి.ఇయాన్ మోర్గాన్ 64, టిమ్ ఆంబ్రోస్ 69 (నాటౌట్), ఫిల్ మస్టర్డ్ 17, డారెన్ మ్యాడీ 29, బ్రేస్నన్ 18 (నాటౌట్) పరుగులు చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్టిసన్, మెక్గెయిన్, స్టీవ్ ఓకీటీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. నాథన్ రియర్డాన్ (83), డేనియల్ క్రిస్టియన్ (61) విధ్వంసకర అర్ద శతకాలు బాది ఆసీస్ను గెలిపించారు. విజయానికి ముందు ఆసీస్ కొద్దిగా తడబడింది. 19 ఓవర్లో బ్రేస్నన్ చెలరేగిపోయి కేవలం ఐదు పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే అప్పటికే ఆసీస్ గెలుపు ఖరారైపోయింది. చివరి ఓవర్ రెండో బంతిని వైడ్గా వేసిన సైడ్బాటమ్ ఆసీస్కు విన్నింగ్ రన్ను ఇచ్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో షాన్ మార్ష్ 20, బెన్ కట్టింగ్ 12, పీటర్ నెవిల్ 28, కెప్టెన్ షేన్ వాట్సన్ 1 (నాటౌట్) పరుగు చేశారు. ఆఖర్లో పాట్టిసన్, హిల్ఫెన్హాస్ డకౌట్లయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రేస్నెన్ 5, ర్యాంకిన్, పనేసర్ తలో వికెట్ తీశారు.ఈ ఓటమితో ఇంగ్లండ్ ఒక్క విజయం కూడా లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ 5 మ్యాచ్లు ఆడగా ఐదింట ఓడింది. మరోవైపు ఆసీస్ 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో సెమీఫైనల్కు క్వాలిఫై అయ్యింది. మొత్తం 6 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో శ్రీలంక, భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సెమీస్కు క్వాలిఫై కాగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. తొలి దశ మ్యాచ్ల అనంతరం శ్రీలంక టాప్లో ఉండగా.. భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (మార్చి 13) జరుగబోయే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ను ఢీకొంటుంది. రేపటి రెండో సెమీస్లో శ్రీలంక, వెస్టిండీస్ తలపడతాయి. రెండు సెమీఫైనల్లో విజేతలు మార్చి 16న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నేరానికి గాను భారతీయ ప్రముఖుడు ఒకరికి న్యాయస్థానం 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల వరకు ఎలాంటి పెరోల్కు అవకాశం లేదని శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో, ఘటన చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. బాలేశ్ ధన్ఖడ్(43) మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో ఐదుగురు కొరియా మహిళలను ఆకర్షించి ప్రణాళిక ప్రకారం వారిని సిడ్నీలోని తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారికి డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ ఇచ్చి మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైందని డౌనింగ్ సెంటర్ డిస్ట్రిక్ట్ కోర్టు పేర్కొంది. తీర్పు వెలువడిన సమయంలో ధన్ఖడ్ కోర్టులోనే ఉన్నాడు. భవిష్యత్ లైంగిక సంతృప్తి కోసం అతను తన నేరాలను రికార్డు చేసి, వీడియోల రూపంలో భద్రపర్చు కోవడాన్ని జడ్జి మైకేల్ కింగ్ ప్రస్తావించారు.ఇక, బాధితులంతా 21–27 ఏళ్ల మధ్య వయ స్కులైన కొరియా మహిళలు. ఒక్కొక్కరికి వారి తెలివితేటలు, అందాన్ని బట్టి వేరుగా మార్కులు కూడా వేసేవాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళలతో జరిపిన చర్చలను సైతం రికార్డు చేశాడు. వారికి ఉద్యోగం అవసరం ఎంతుందనే దాన్ని బట్టి కుట్రను అమలు చేసేవాడు. చివరికి ఐదో బాధితురాలు 2018 అక్టోబర్లో ఫిర్యాదు చేయడంతో ఇతడి నేరాలకు పుల్స్టాప్ పడింది.పోలీసులు సిడ్నీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లోని ఇతడి కార్యాలయంపై దాడి చేసి డ్రగ్స్తోపాటు టేబుల్ క్లాక్ మాదిరిగా ఉన్న వీడియో రికార్డర్ను స్వాధీనం చేసు కున్నారు. అందులోనే అత్యాచారాల క్రమ మంతా నిక్షిప్తమై ఉండటం గమనార్హం. విచారణ జరిపిన కోర్టు ధన్ఖడ్ 39 నేరాలకు పాల్పడినట్లు గుర్తించింది. ఇందులో లైంగిక దాడికి సంబంధించిన నేరాలు 13 వరకు ఉన్నాయి. కోర్టు విధించిన జైలు శిక్షలో పెరోల్కు వీలులేని 30 ఏళ్ల కాలం 2053తో ముగియనుంది. మొత్తం 40 ఏళ్ల జైలు శిక్ష పూర్తయ్యే సరికి ధన్ఖడ్కు 83 ఏళ్లొస్తాయి.విద్యార్థిగా వెళ్లి...2006లో చదువుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ధన్ఖడ్ భారతీయ ఆస్ట్రేలియన్లలో పేరున్న నాయకుడి స్థాయికి ఎదిగారు. భారతీయ జనతా పార్టీ అనే గ్రూపును నెలకొల్పారు. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధిగా 2018లో అరెస్టయ్యే వరకు వ్యవహరించారు. ఏబీసీ, బ్రిటిష్ అమెరికన్ టొబాకో, టొయోటా, సిడ్నీ ట్రెయిన్స్ కంపెనీలకు డేటా విజువలైజేషన్ కన్సల్టెంట్గా సేవలందించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రముఖుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.Indian community leader Balesh Dhankhar sentenced to 40 years in Australia for sexually assaulting five Korean women. Dhankhar lured victims with fake job ads, drugged and raped them and kept kept horrific spreadsheet detailing his crimes. Non-parole period set at 30 years.… pic.twitter.com/NcA4TUU3cq— Benefit News (@BenefitNews24) March 8, 2025 -
IML 2025: వాట్సన్ విధ్వంసకర సెంచరీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఆసీస్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్-2025లో ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టు తమ దూకుడును కొనసాగిస్తోంది. వడోదరగా వేదికగా సౌతాఫ్రికా మాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో 137 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 260 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆసీస్ కెప్టెన్ షేన్ వాట్సన్ మరోసారి సెంచరీతో చెలరేగాడు. సౌతాఫ్రికా బౌలర్లను వాట్సన్ ఊచకోత కోశాడు. వాట్సన్ కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్స్లతో 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో వాట్సన్కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం.అంతకుముందు వెస్టిండీస్, భారత్పై వాట్సన్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో షేన్తో పాటు కల్లమ్ ఫెర్గూసన్(43 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 85), బెన్ డంక్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34) అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ప్రోటీస్ బౌలర్లలో పీటర్సన్ ఓ వికెట్ పడగొట్టాడు.నిప్పులు చెరిగిన ఆసీస్ బౌలర్లు..అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 17 ఓవర్లలో కేవలం 123 పరుగులకే ఆలౌటైంది. కంగారుల బౌలర్ల దాటికి ప్రోటీస్ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కుప్పకూలింది. హషీమ్ ఆమ్లా(30) టాప్ స్కోరర్గా నిలవగా.. రిచర్డ్ లివి(22), పీటర్సన్ పర్వాలేదన్పించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఆసీస్ బౌలర్లలో బెన్ లాఫ్లీన్ మూడు వికెట్లు పడగొట్టగా.. దొహర్టీ, మెక్గైన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు కౌల్టర్ నైల్, నాథన్ రియర్డన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక శనివారం జరగనున్న మ్యాచ్లో వెస్టిండీస్, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంటుంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు సత్తా చాటిన ఆసీస్ ఓపెనర్
డబ్ల్యూటీసీ-2025 ఫైనల్కు ముందు ఆసీస్ వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టస్మానియాతో జరిగిన మ్యాచ్లో (క్లీన్స్ల్యాండ్) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో ఖ్వాజా 221 బంతుల్లో 12 బౌండరీలు, సిక్సర్ సాయంతో 127 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఖ్వాజాకు ఇది 43వ శతకం. ఖ్వాజా సెంచరీతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్ల్యాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఖ్వాజాకు జతగా లాచ్లాన్ హెర్నీ (74) అర్ద సెంచరీతో రాణించాడు. ఆట ముగిసే సమయానికి మైఖేల్ నెసర్ (10), జాక్ విల్డర్ముత్ (4) క్రీజ్లో ఉన్నారు. క్లీన్స్ల్యాండ్ ఇన్నింగ్స్లో మ్యాట్ రెన్షా 20, జాక్ క్లేటన్ 19, బెన్ మెక్డెర్మాట్ 24, జిమ్మీ పియర్సన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. టస్మానియా బౌలర్లలో బ్యూ వెబ్స్టర్ 3 వికెట్లు పడగొట్టగా.. గేబ్ బెల్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఫైనల్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఖ్వాజా సూపర్ సెంచరీ సాధించడంతో టస్మానియాపై క్లీన్స్ల్యాండ్ పైచేయి సాధించింది.కాగా, ఈ మ్యాచ్లో సెంచరీ సాధించకముందు ఖ్వాజా శ్రీలంక పర్యటనలో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో ఖ్వాజా 352 బంతుల్లో 232 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ఖ్వాజా లేటు వయసులో ఆస్ట్రేలియా తరఫున డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక పర్యటనకు ముందు స్వదేశంలో భారత్తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖ్వాజా దారుణంగా విఫలమయ్యాడు. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ఖ్వాజా కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా 9 ఇన్నింగ్స్ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. సౌతాఫ్రికాతో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఖ్వాజా ఫామ్లో కొనసాగడం ఆసీస్కు శుభసూచకం. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11-15 మధ్యలో లార్డ్స్ వేదికగా జరుగనుంది.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వన్డే జట్టు ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్లో నిష్క్రమించింది. తొలి సెమీఫైనల్లో స్టీవ్ స్మిత్ సేన టీమిండియా చేతిలో భంగపడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారత్ 48.1 ఓవర్లలోనే ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్కు చేరింది. విరాట్ కోహ్లి (84) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపుతో కీలకపాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్), హార్దిక్ పాండ్యా (28) భారత్ గెలుపులో తలో చేయి వేశారు. మార్చి 9న జరుగబోయే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. -
వాట్సన్, డంక్ విధ్వంసకర శతకాలు.. టీమిండియాపై ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025లో భాగంగా ఇవాళ (మార్చి 5) ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ తలపడుతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (52 బంతుల్లో 110 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు), వన్డౌన్ బ్యాటర్ బెన్ డంక్ (53 బంతుల్లో 132 నాటౌట్; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో విరుచకుపడ్డారు. ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 269 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. వాట్సన్, డంక్ ప్రతి ఒక్క భారత బౌలర్ను ఎడాపెడా వాయించారు. వీరిద్దరి దెబ్బకు ప్రతి భారత బౌలర్ 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. వినయ్ కుమార్ 4 ఓవర్లలో 73,అభిమన్యు మిథున్ 4 ఓవర్లలో 46, పవన్ నేగి 3 ఓవర్లలో 34 (ఒక వికెట్), రాహుల్ శర్మ 4 ఓవర్లలో 42, ఇర్ఫాన్ పఠాన్ 2 ఓవర్లలో 31, గుర్కీరత్ సింగ్ మాన్ ఒక ఓవర్లో 15, స్టువర్ట్ బిన్నీ 2 ఓవర్లలో 28 పరుగులు సమర్పించుకున్నారు. ఆసీస్ ఇన్నింగ్స్లో షాన్ మార్ష్ 22 పరుగులకు ఔటయ్యాడు. వాట్సన్కు ఈ టోర్నీలో ఇది రెండో సెంచరీ. ఈ సీజన్లో వెస్టిండీస్ మాస్టర్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో కూడా వాట్సన్ శతక్కొట్టాడు. ఆ మ్యాచ్లో కూడా వాట్సన్ 52 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు.కాగా, ఈ టోర్నీలో భారత మాస్టర్స్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శనలు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్లో భారత్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించింది. ఆసీస్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో ఉండగా.. ఆడిన 3 మ్యాచ్ల్లో ఓడిన ఇంగ్లండ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ ఏడాదే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్లో 6 దేశాలకు (భారత్, శ్రీలంక. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్) చెందిన దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత్కు సచిన్, శ్రీలంకకు సంగక్కర, వెస్టిండీస్కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తున్నారు.భారత మాస్టర్స్ జట్టులో సచిన్తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
IND Vs AUS: ఆస్టేలియాను కొట్టేశారు... ఫైనల్లో భారత్
కంగారేమీ లేదు... అంతా మన నియంత్రణలోనే సాగింది... ఆస్ట్రేలియాతో ఐసీసీ నాకౌట్ మ్యాచ్ అనగానే పెరిగే ఉత్కంఠ, ఒత్తిడి అన్నింటినీ టీమిండియా అధిగమించేసింది... ఎప్పటిలాగే టాస్ ఓడిపోవడం మినహా 11 బంతుల ముందే మ్యాచ్ ముగించే వరకు భారత్ అన్ని విధాలుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందు పదునైన బౌలింగ్తో... ఆపై చక్కటి బ్యాటింగ్తో ఆస్ట్రేలియాను పడగొట్టి చాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి సమరానికి అర్హత సాధించింది.265 పరుగుల లక్ష్యం... చాంపియన్స్ ట్రోఫీ గత రెండు మ్యాచ్లలో భారత్ ఛేదించిన స్కోర్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. బ్యాటింగ్ సాగుతున్నకొద్దీ పిచ్ నెమ్మదిస్తోంది. అయితేనేమి... కోహ్లి తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో క్లాస్ ఆటతీరుతో అలవోకగా పరుగులు రాబడుతూ జట్టును నడిపించాడు. ఆరంభంలో రోహిత్, ఆపై అయ్యర్, రాహుల్, పాండ్యా... ఇలా అంతా అండగా నిలవడంతో గెలుపు భారత్ దరిచేరింది. ఆసీస్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన భారత్ తుది పోరులో పాకిస్తాన్ చేతిలో ఓడింది. ఆ తర్వాత మూడు ఐసీసీ వన్డే టోర్నీల్లోనూ కనీసం సెమీస్ లేదా ఫైనల్కు చేరి తమ స్థాయిని చూపించింది. మధ్యలో గెలిచిన టి20 వరల్డ్ కప్ దీనికి అదనం. ఇప్పుడు మరో టైటిల్ వేటలో టీమిండియా ప్రత్యర్థి ఎవరో నేడు తేలనుంది. ఇదే జోరు కొనసాగిస్తే 2013 తరహాలోనే అజేయ ప్రదర్శనతో మళ్లీ మనం చాంపియన్స్ కావడం ఖాయం! దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్ చేరింది. గత టోర్నీ రన్నరప్ అయిన టీమిండియా ఈసారి అజేయ ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (57 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. షమీ 3 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (98 బంతుల్లో 84; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 45; 3 ఫోర్లు), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం దుబాయ్లోనే జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. రాణించిన స్మిత్... హెడ్ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ‘సున్నా’ వద్ద ఇచి్చన రిటర్న్ క్యాచ్ను షమీ అందుకోలేకపోవడంతో అతను బతికిపోగా, మరో ఎండ్లో కూపర్ కనోలీ (9 బంతుల్లో 0) విఫలమయ్యాడు. పాండ్యా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన హెడ్, షమీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ కుల్దీప్ను బౌలింగ్కు దింపింది. మరో మూడు ఓవర్ల తర్వాత భారత్ అసలు ఫలితం సాధించింది.వరుణ్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి హెడ్ లాంగాఫ్లో గిల్కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. మరోవైపు స్మిత్ సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించాడు. అతనికి కొద్దిసేపు లబుషేన్ (36 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 68 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే తక్కువ వ్యవధిలో లబుషేన్, ఇన్గ్లిస్ (12 బంతుల్లో 11)లను అవుట్ చేసి జడేజా దెబ్బ కొట్టాడు. ఈ దశలో స్మిత్, కేరీ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. వీరిద్దరు కలిసి స్కోరును 200 వరకు తీసుకొచ్చారు. ఈ భాగస్వామ్యం బలపడుతున్న దశలో షమీ ఆటను మలుపు తిప్పాడు. అతని బౌలింగ్లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన స్మిత్ బౌల్డయ్యాడు. మ్యాక్స్వెల్ (5 బంతుల్లో 7; 1 సిక్స్) విఫలం కాగా, ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కేరీ దూకుడుతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో ఆరంభంలోనే శుబ్మన్ గిల్ (11 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరగ్గా... క్రీజ్లో ఉన్నంత సేపు రోహిత్ శర్మ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అయితే ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కోహ్లి, అయ్యర్ భాగస్వామ్యంతో జట్టు సురక్షిత స్థితికి చేరింది. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టీమ్ను విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో 53 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి కాగా, అయ్యర్ దానిని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్కు 18.3 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (30 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్లతో కోహ్లి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 51 వద్ద మ్యాక్స్వెల్ క్యాచ్ వదిలేయడం కూడా కోహ్లికి కలిసొచ్చింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న అతను టోర్నీలో మరో శతకం అందుకునేలా కనిపించాడు. అయితే విజయానికి 40 పరుగుల దూరంలో భారీ షాట్కు ప్రయత్నించి విరాట్ అవుటయ్యాడు. ఈ స్థితిలో హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్ ఛేదనను సులువు చేసింది. 20 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే జంపా ఓవర్లో పాండ్యా రెండు వరుస సిక్సర్లు బాదగా... అతను అవుటైన తర్వాత మ్యాక్స్వెల్ బౌలింగ్లో భారీ సిక్స్తో రాహుల్ మ్యాచ్ను ముగించాడు. 1 చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 7 ఐసీసీ వన్డే టోర్నీలలో కోహ్లికి లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (10), రోహిత్ శర్మ (8) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 14 ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా 14 సార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా (13)ను భారత్ వెనక్కి నెట్టింది. 746 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి (746 పరుగులు) రెండో స్థానానికి చేరాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ (791 పరుగులు), మూడో స్థానంలో జయవర్ధనే (742) ఉన్నారు. గిల్కు అంపైర్ వార్నింగ్ హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా అతను బంతిని గాల్లోకి విసిరేశాడు. నిజానికి క్యాచ్ పట్టడంలో అతను ఎక్కడా తడబడలేదు. అయితే ఎంతసేపు అనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి. ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్వర్త్ ప్రత్యేకంగా గిల్కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్కు విచక్షణాధికారం ఉంటుంది.స్మిత్ అదృష్టం అక్షర్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్ల మీదుగా స్టంప్స్ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్. రోహిత్కు లైఫ్కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగుల ఇన్నింగ్స్లో కూడా రెండుసార్లు అదృష్టం కలిసొచి్చంది. 13 పరుగుల వద్ద బ్యాక్వర్డ్ పాయింట్లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్ను కనోలీ వదిలేయగా... 14 వద్ద కాస్త కష్టసాధ్యమైన క్యాచ్ను లబుషేన్ అందుకోలేకపోయాడు. పాకిస్తాన్పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే. ఇలాంటి పిచ్పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. అదే నా ఇన్నింగ్స్లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్థికి అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను. –విరాట్ కోహ్లి ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఇవాళ మా బ్యాటింగ్ అన్ని రకాలుగా బాగుంది. పిచ్ కూడా మెరుగ్గా అనిపించింది. అయితే పిచ్పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం.దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం. కోహ్లి ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. ఫైనల్కు ముందు ఆటగాళ్లంతా ఫామ్లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 4 ఐసీసీ ఈవెంట్లు... వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లలో భారత్ను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. 336 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న భారతీయ ఫీల్డర్గా కోహ్లి ఘనత వహించాడు. 334 క్యాచ్లతో రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న రెండో ఫీల్డర్గానూ కోహ్లి (161 క్యాచ్లు) నిలిచాడు. శ్రీలంక ప్లేయర్ మహేళ జయవర్ధనే (218 క్యాచ్లు) తొలి స్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) గిల్ (బి) వరుణ్ 39; కనోలీ (సి) రాహుల్ (బి) షమీ 0; స్మిత్ (బి) షమీ 73; లబుషేన్ (ఎల్బీ) (బి) జడేజా 29; ఇన్గ్లిస్ (సి) కోహ్లి (బి) జడేజా 11; కేరీ (రనౌట్) 61; మ్యాక్స్వెల్ (బి) అక్షర్ 7; డ్వార్షూయిస్ (సి) అయ్యర్ (బి) వరుణ్ 19; జంపా (బి) పాండ్యా 7; ఎలిస్ (సి) కోహ్లి (బి) షమీ 10; తన్విర్ సంఘా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 264. వికెట్ల పతనం: 1–4, 2–54, 3–110, 4–144, 5–198, 6–205, 7–239, 8–249, 9–262, 10–264. బౌలింగ్: షమీ 10–0–48–3, హార్దిక్ పాండ్యా 5.3–0–40–1, కుల్దీప్ యాదవ్ 8–0–44–0, వరుణ్ చక్రవర్తి 10–0–49–2, అక్షర్ పటేల్ 8–1–43–1, రవీంద్ర జడేజా 8–1–40–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) కనోలీ 28; గిల్ (బి) డ్వార్షూయిస్ 8; కోహ్లి (సి) డ్వార్షూయిస్ (బి) జంపా 84; అయ్యర్ (బి) జంపా 45; అక్షర్ (బి) ఎలిస్ 27; రాహుల్ (నాటౌట్) 42; పాండ్యా (సి) మ్యాక్స్వెల్ (బి) ఎలిస్ 28; జడేజా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (48.1 ఓవర్లలో 6 వికెట్లకు) 267. వికెట్ల పతనం: 1–30, 2–43, 3–134, 4–178, 5–225, 6–259. బౌలింగ్: డ్వార్షూయిస్ 7–0–39–1, ఎలిస్ 10–0–49–2, కనోలీ 8–0–37–1, జంపా 10–0–60–2, సంఘా 6–0–41–0, మ్యాక్స్వెల్ 6.1–0–35–0, హెడ్ 1–0–6–0. -
దుబాయ్ లో జరిగే మ్యాచ్లో తలపడనున్న భారత్-ఆస్ట్రేలియా
-
కొడితే కొట్టాలిరా ఆసీస్ను...
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు ఏకపక్షంగా మారిపోయాయి... వేర్వేరు కారణాలతో యాషెస్ సమరాలు గత కొన్నేళ్లుగా కళ తప్పాయి... అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడు అన్నింటికంటే ఆసక్తికర పోరు అంటే భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగేదే. ఫార్మాట్ ఏదైనా హోరాహోరీ పోరాటాలు, అత్యుత్తమ స్థాయిలో వ్యక్తిగత ప్రదర్శనలు వెరసి ఇరు జట్ల మధ్య మ్యాచ్లను ఆకర్షణీయంగా మార్చేశాయి. ఇప్పుడు అభిమానులు ఎదురు చూసినట్లుగా మరోసారి రెండు అగ్రశ్రేణి టీమ్ల మధ్య నాకౌట్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఐసీసీ టోర్నీల్లో ప్రత్యేకంగా నాకౌట్ మ్యాచ్లలో భారత్, ఆసీస్ మధ్య మ్యాచ్ ఉండే తీవ్రతే వేరు... వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఇరు జట్లు మళ్లీ ఇప్పుడే తలపడబోతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్కు, వరల్డ్ కప్ ఫైనల్కు మధ్య స్థాయి అంతరం ఎంతో ఉన్నా... ఆసీస్ను ఓడించి ఇంటికి పంపిస్తే వచ్చే మజాయే వేరు. ఈ టోర్నీలో లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్లలో గెలిచి టీమిండియా అజేయంగా నిలవగా, అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకున్నా... ఇంగ్లండ్పై ఛేదన ఆసీస్ పట్టుదలను చూపించింది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశ తర్వాత ఇప్పుడు అత్యంత కీలక మ్యాచ్కు రంగం సిద్ధమైంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్లు భారత్, ఆ్రస్టేలియా తలపడనున్నాయి. వనరులు, ఫామ్ను బట్టి చూస్తే రోహిత్ బృందానిదే అన్ని రకాలుగా పైచేయిగా కనిపిస్తుండగా, చెప్పుకోదగ్గ బౌలింగ్ లేని ఆసీస్ పూర్తిగా తమ బ్యాటింగ్నే నమ్ముకుంది. భారత్ స్పిన్ చతుష్టయాన్ని కంగారులు ఎలా ఎదుర్కొంటారనేదే ఆసక్తికరం. అదే జట్టుతో... న్యూజిలాండ్తో చివరి లీగ్కు ముందు పేసర్ హర్షిత్ రాణాకు విశ్రాంతినిస్తూ జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంచుకుంది. తనకు లభించిన ఈ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న అతను ఐదు వికెట్లతో తన విలువను ప్రదర్శించాడు. ఆసీస్ టాప్–7 ఆటగాళ్లలో మ్యాక్స్వెల్, స్మిత్లకు మాత్రమే వరుణ్ను ఎదుర్కొన్న అనుభవం ఉంది. స్టీవ్ స్మిత్ కూడా 2021 తర్వాతి అతని బౌలింగ్లో ఆడలేదు. ఆ తర్వాతే వరుణ్ తన బౌలింగ్ను మెరుగుదిద్దుకొని మరింతగా రాటుదేలాడు. కాబట్టి అతడిని పక్కన పెట్టి మళ్లీ రెండో పేసర్ను ఆడించే అవకాశం లేదు. మిగతా ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా ఎంతో ప్రభావం చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడి పిచ్పై మన నలుగురు స్పిన్నర్లు మంత్రం బాగా పని చేస్తున్నట్లే. షమీకి తోడుగా హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగలిగితే చాలు. బ్యాటింగ్లో టాప్–3 గత మ్యాచ్లో విఫలమైనా... ఈ కీలక పోరులో చెలరేగిపోగల సత్తా వారికి ఉంది. శ్రేయస్ అయ్యర్ తన ఫామ్ను కొనసాగిస్తుండగా, కేఎల్ రాహుల్ కూడా రాణించాడు. అయితే రాహుల్ తన కీపింగ్లో మరింత చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అక్షర్ బ్యాటింగ్లో అంచనాలకు మించి రాణిస్తుండటం సానుకూలాంశం. పాండ్యా దూకుడైన బ్యాటింగ్ చివర్లో భారత్కు భారీ స్కోరు అందించగలదు. ఓవరాల్గా చూస్తే టీమిండియా దాదాపు ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటర్లు రాణిస్తేనే... ముగ్గురు ప్రధాన పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్ దూరం కావడంతో టోర్నీకి ముందే ఆ్రస్టేలియా విజయావకాశాలు తగ్గిపోయాయి. అయితే ఇంగ్లండ్పై 352 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించడంతో ఆ జట్టు స్థాయి ఏమిటో కనిపించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ రద్దు కాగా, అఫ్గానిస్తాన్పై కూడా మ్యాచ్ ఆగే సమయానికి ఆసీస్ విజయం వైపు వెళుతోంది. బ్యాటింగ్లో ట్రవిస్ హెడ్, ఇన్గ్లిస్లు దూకుడుగా ఆడగల సమర్థులు కాగా... లబుషేన్, స్మిత్ ఇన్నింగ్స్ను నడిపించగలరు. మన టీమ్పై హెడ్ ఆట ఏమిటో కొత్తగా చెపాల్సిన అవసరం లేదు. చివర్లో కేరీ, మ్యాక్స్వెల్ వేగంగా పరుగులు రాబట్టగలరు. షార్ట్ గాయంతో దూరం కావడంతో అతని స్థానంలో వచ్చిన ఆల్రౌండర్ కూపర్ కనోలీ బరిలోకి దిగుతాడు. బ్యాటింగ్తో పాటు అతని లెఫ్టార్మ్ స్పిన్ కూడా కీలకం కానుంది. రెగ్యులర్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఒక్కడే కాగా, మ్యాక్స్వెల్పై అదనపు భారం ఉంది. పిచ్ను బట్టి చూస్తే ముగ్గురు పేసర్లుతో ఆసీస్ ఆడుతుందా అనేది సందేహమే. డ్వార్షూయిస్ స్థానంలో మరో స్పిన్నర్ తన్వీర్ సంఘాను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. స్పిన్, అనుభవం లేని పేస్తో భారత్ను నిలువరించడం అంత సులువు కాదు కాబట్టి అనుభవజ్ఞులైన బ్యాటర్లపై జట్టు ఆధారపడుతోంది. పిచ్, వాతావరణం టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ల తరహాలోనే ఇప్పుడూ నెమ్మదైన పిచ్ సిద్ధంగా ఉంది. స్పిన్నర్లు సహజంగానే ప్రభావం చూపిస్తారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెపె్టన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, వరుణ్. ఆ్రస్టేలియా: స్మిత్ (కెప్టెన్), హెడ్, ఇన్గ్లిస్, లబుõÙన్, కనోలీ, కేరీ, మ్యాక్స్వెల్, ఎలిస్, స్పెన్సర్, జంపా, డ్వార్షుయిస్/సంఘా. -
అధిక వేడి వల్ల... ముందస్తు ముదిమి!
మెల్బోర్న్: రోజంతా వేడిమి పరిస్థితుల్లో పనిచేశాక అలసిపోయిన భావన కలగడం సహజం. అలసిపోతే పర్లేదు గానీ దానివల్ల ఆయుష్షు కూడా వేగంగా క్షీణిస్తుందట! పర్యావరణ ఒత్తిళ్లకు తలొగ్గి మన శరీరంలో చాలా మార్పులే జరుగుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డీఎన్ఏలో మార్పులు జరగకపోయినా మారే ఉష్ణ పరిస్థితులకు తగ్గట్లు ఒంట్లో ఏ ప్రొటీన్ ఉత్పత్తి ఏ మేరకు పెరగాలో, ఏది ఎంతగా తగ్గాలో నిర్ణయాలు జరిగిపోతాయట. ఈ ఎపీజెనిటిక్స్ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ్రస్టేలియాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక ఉష్ణోగ్రతలు మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై మొనాష్ విశ్వవిద్యాలయంలోని రోంగ్బిన్ క్సూ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్లోని షుఆయ్ లీ సారథ్యంలోని అధ్యయన బృందం పరిశోధన చేసింది. అత్యధిక ఉష్ణోగ్రతలకు లోనైన వ్యక్తుల్లో వృద్దాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయని తేల్చారు. అంతేకాదు, దీర్ఘకాలం పాటు వేడిమి పరిస్థితుల ప్రభావానికి గురైతే వృద్ధుల ఆయుష్షు రెండేళ్లకు పైగా హరించుకు పోతుందని వెల్లడించారు! వాతావరణ మార్పుల ప్రభావం వాతావరణ మార్పుల వల్ల వేడి పెరిగేకొద్దీ మన శరీరం మరింత ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడే వృద్ధాప్యం త్వరగా రావడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా వడగాల్పులకు, వేడి వాతావరణానికి చిరునామాగా నిలిచే ఆ్రస్టేలియాలో కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు పరిపాటిగా మారుతున్నాయి. ఉష్ణోగ్రత ప్రభావ మార్పులు అక్కడ మనుషులపై స్పష్టంగా కనిపించాయని అధ్యయనం పేర్కొంది. జెనటిక్ స్థాయిల పరిస్థితేంటి? తీసుకునే ఆహారానికి తగ్గట్లు శరీరంలో మార్పులు జరుగుతాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపల వంటి తేలిగ్గా జీర్ణమయ్యే సహజసిద్ద ఆహారం తీసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు తగిన మోతాదులో అంది శరీరంలో సానుకూల మార్పులు జరుగుతాయి. అలాగాక బాగా వేయించిన, ప్యాక్ చేసిన, నూనెలు అతిగా వాడిన, పూర్తి ప్రాసెస్డ్ ఆహారం తీసుకుంటే పోషకాలందక ఒంట్లో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. దాంతో వయసు మీద పడకుండా ఆపే సహజసిద్ధ సామర్థ్యం తగ్గుతుంది. వేడిమి సందర్భాల్లోనూ ఒంట్లోని జన్యు కణాలు విరుద్ధ రీతిలో స్పందిస్తాయి. ఫలితంగా ఏ సందర్భంలో ఏ రకం ప్రొటీన్ను ఎంత మోతాదులో ఉత్పత్తి చేయాలనే డీఎన్ఏ సీక్వెన్స్ దెబ్బ తింటుంది. ఇది శరీర భౌతిక క్రియలపై ప్రతికూల ప్రభావం చూపి ఆరోగ్య స్థితిని పాడుచేసే ప్రమాదముంది. వేడిమి వృద్దాప్య రేటును నిర్దేశించే జన్యు కణాలను అసంబద్ధంగా క్రియాశీలం చేస్తుంది. అలా ముందుగానే వృద్ధాప్యంలోకి జారిపోతాం. పరిశోధనల్లోఏం తేలింది? 68 ఏళ్ల పైబడిన 3,700 మందిపై సదరన్ కాలిఫోరి్నయా వ ర్సిటీలో పరిశోధన చేశారు. తక్కువ వయ సు వారిలో పోలిస్తే పెద్దవాళ్ల మీదే అత్యధిక ఉష్ణోగ్రత పరిస్థితులు అధిక ప్రభావం చూ పాయి. వయసు పెరిగేకొద్దీ వేడిని నియంత్రించుకునే సామర్థ్యమూ సన్నగిల్లుతోంది. దాంతో అనారోగ్యం బారిన పడటం, చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. వృద్ధాప్య ఛాయలను నిర్ధారించే మూడు రకాలైన పీసీఫీనో ఏజ్, పీసీగ్రిమ్ ఏజ్, డ్యూన్డిన్ పేస్ జీవ గడియార పద్దతుల్లో వలంటీర్ల రక్త నమూనాలను పరిశీలించారు. 2010 నుంచి ఆరేళ్లపాటు వీళ్లంతా అధిక వేడి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటి పరిస్థితులను పోలి్చచూశారు. అమెరికాలో ప్రామాణికమైన 32 డిగ్రీ సెల్సియస్ వరకు సాధారణ, 32–39 డిగ్రీలను మధ్యస్థ, 39–51 డిగ్రీల దాకా అతి తీవ్ర వేడిమిగా పరిగణించి వ లంటీర్ల డేటాతో సరిచూశారు. పీసీఫినో ఏజ్ ప్రకారం సుదీర్ఘకాలం వేడికి గురైతే 2.48 ఏళ్లు ముందుగానే వృద్ధాప్యం వస్తుందని తేలింది. పీసీగ్రిమ్ ఏజ్ పద్దతిలో 1.09 ఏళ్లు, డ్యూన్డిన్ పేస్ పద్ధతిలో 0.05 ఏళ్లు ముందుగా వృద్ధాప్యం వస్తుందని వెల్లడైంది. వేడికి, వయసుకు లింకేమిటి? వయసు మీద పడటం సహజ ప్రక్రియ. వృద్ధాప్య ఛాయలు బయట పడటం ఒక్కో మనిషిలో ఒక్కోలా ఉంటుంది. ఒత్తిళ్లు, షాక్ వంటి అనూహ్య ఘటనలు ఎదురైనప్పుడు శరీరంలో పెనుమార్పులు సంభవిస్తాయి. చాన్నాళ్లపాటు సరిగా నిద్ర పోకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడం ఖాయం. అత్యధిక వేడిమి పరిస్థితులు మనిషిలోని సత్తువను లాగేస్తాయి. జీవక్రియలను పూర్తిస్థాయిలో చేసే సామర్థ్యాన్ని శరీరం క్రమంగా కోల్పోతుంది. వయసు మీదపడే రేటు పెరుగుతుంది. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు ముందే ముసురుకుంటాయి. -
Champions Trophy: వరుణ్ ‘మిస్టరీ’ దెబ్బ
చాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్లలో 229, 242 పరుగుల లక్ష్యాలను భారత్ అలవోకగా ఛేదించింది. ఈసారి మాత్రం ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. న్యూజిలాండ్ పదునైన బౌలింగ్ ముందు భారీ స్కోరు చేయడం కష్టంగా మారింది. టాప్–3 బ్యాటర్లు 30 పరుగులకే వెనుదిరగ్గా... చివరకు టీమిండియా 249 పరుగులకే పరిమితమైంది. ఈ స్కోరును నిలబెట్టుకోగలదా అనే సందేహాలు... అయితే మన స్పిన్నర్లు విన్నర్లుగా మారారు... భారత స్పిన్ను ఎదుర్కోవడంలో పూర్తిగా తడబడిన కివీస్ ఓటమిని ఆహ్వానించింది. చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడిన ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి ముందుండి నడిపించగా... కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజయంలో తలా ఓ చేయి వేశారు. ఇక భారత జట్టుకు అసలైన సవాల్ మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా రూపంలో ఎదురవుతోంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇరు జట్లు మళ్లీ ఇప్పుడే వన్డే మ్యాచ్లో తలపడనుండగా... బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ ఎదుర్కొంటుంది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ లీగ్ దశను అజేయంగా ముగించింది. సెమీఫైనల్ స్థానం ఖాయమైపోయిన తర్వాత ఆడిన చివరి లీగ్ మ్యాచ్లోనూ గెలిచిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్గా నిలిచి తమ స్థాయిని ప్రదర్శించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అక్షర్ పటేల్ (61 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అయ్యర్, అక్షర్ నాలుగో వికెట్కు 22.4 ఓవర్లలో 98 పరుగులు జోడించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ (5/42) ఐదు వికెట్లతో భారత్ను దెబ్బ తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (120 బంతుల్లో 81; 7 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (5/42) తన కెరీర్లో రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మంగళవారం ఇదే మైదానంలో జరిగే తొలి సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ బుధవారం లాహోర్లో జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్ ‘బి’ టాపర్ దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. కీలక భాగస్వామ్యం... హెన్రీ, జేమీసన్ స్వింగ్ బౌలింగ్తో కట్టడి చేయడంతో ఆరంభంలో పరుగులు చేయడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో 15 పరుగుల వ్యవధిలో గిల్ (7 బంతుల్లో 2), రోహిత్ (17 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), కోహ్లి (14 బంతుల్లో 11; 2 ఫోర్లు) వెనుదిరిగారు. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కోహ్లి బలంగా షాట్ కొట్టగా... గాల్లోకి ఎగురుతూ గ్లెన్ ఫిలిప్స్ అత్యద్భుతంగా క్యాచ్ అందుకున్న తీరు హైలైట్గా నిలిచింది. తన 300వ వన్డేలో తక్కువ స్కోరుకే అవుటై కోహ్లి నిరాశగా మైదానం వీడాడు. 30/3 వద్ద ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు అయ్యర్, అక్షర్ ప్రయత్నించారు. క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా ఆడటంతో ఒక దశలో వరుసగా 51 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే ఆ తర్వాత స్కోరు వేగం కాస్త పెరిగింది. రూర్కే ఓవర్లో 3 ఫోర్లు కొట్టి ధాటిని ప్రదర్శించిన అయ్యర్ 75 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ను అవుట్ చేసి రచిన్ ఈ జోడీని విడదీయగా... 10 పరుగుల వ్యవధిలో అయ్యర్, కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 23; 1 ఫోర్) పెవిలియన్ చేరారు. జడేజా (20 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అయితే చివర్లో పాండ్యా మెరుపు బ్యాటింగ్తో భారత్ 250 పరుగులకు చేరువగా రాగలిగింది. జేమీసన్ ఓవర్లో పాండ్యా వరుసగా 4, 4, 6 బాదాడు. భారత్ ఈ మ్యాచ్లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ హర్షిత్ రాణాకు విశ్రాంతినిస్తూ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది. విలియమ్సన్ మినహా... ఛేదనలో కివీస్కు సరైన ఆరంభం లభించలేదు. అక్షర్ చక్కటి క్యాచ్తో రచిన్ రవీంద్ర (12 బంతుల్లో 6)ను అవుట్ చేయడంతో భారత్కు తొలి వికెట్ లభించింది. ఆ తర్వాత కూడా న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. ఒకవైపు విలియమ్సన్ పట్టుదలగా నిలబడినా... మరో ఎండ్లో బ్యాటర్లంతా వరుస కట్టి పెవిలియన్ చేరారు. భారత స్పిన్నర్ల బంతులను అర్థం చేసుకోలేక వరుసగా నలుగురు బ్యాటర్లు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరడం విశేషం. మిచెల్ (35 బంతుల్లో 17; 1 ఫోర్), లాథమ్ (20 బంతుల్లో 14), ఫిలిప్స్ (8 బంతుల్లో 12; 1 సిక్స్), బ్రేస్వెల్ (3 బంతుల్లో 2) విఫలం కాగా... మరో ఎండ్లో 77 బంతుల్లో విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. 40 ఓవర్లలో కివీస్ స్కోరు 165/6. మరో 60 బంతుల్లో 85 పరుగులు చేయాలి. చేయాల్సిన రన్రేట్ పెరిగి పోతుండగా ఒత్తిడిలో భారీ షాట్కు ప్రయత్నించి విలియమ్సన్ అక్షర్ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్గా వెనుదిరిగాడు. అంతకుముందు వ్యక్తిగత స్కోర్లు 1, 32, 68 వద్ద రాహుల్ (రెండు), వరుణ్ క్యాచ్లు వదిలేయడంతో విలియమ్సన్ బతికిపోయాడు. మాజీ కెప్టెన్ అవుటవ్వడంతో కివీస్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. చివర్లో కెపె్టన్ మైకేల్ సాంట్నర్ (31 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్లు) పోరాడినా లాభం లేకపోయింది. 54 పరుగుల తేడాతో ఆ జట్టు చివరి 6 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) యంగ్ (బి) జేమీసన్ 15; గిల్ (ఎల్బీ) (బి) హెన్రీ 2; కోహ్లి (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 11; అయ్యర్ (సి) యంగ్ (బి) రూర్కే 79; అక్షర్ (సి) విలియమ్సన్ (బి) రచిన్ 42; రాహుల్ (సి) లాథమ్ (బి) సాంట్నర్ 23; పాండ్యా (సి) రచిన్ (బి) హెన్రీ 45; జడేజా (సి) విలియమ్సన్ (బి) హెన్రీ 16; షమీ (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 5; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 249. వికెట్ల పతనం: 1–15, 2–22, 3–30, 4–128, 5–172, 6–182, 7–223, 8–246, 9–249. బౌలింగ్: హెన్రీ 8–0–42–5, జేమీసన్ 8–0–31–1, రూర్కే 9–0–47–1, సాంట్నర్ 10–1–41–1, బ్రేస్వెల్ 9–0–56–0, రచిన్ 6–0–31–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (బి) వరుణ్ 22; రచిన్ (సి) అక్షర్ (బి) పాండ్యా 6; విలియమ్సన్ (స్టంప్డ్) రాహుల్ (బి) అక్షర్ 81; మిచెల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 17; లాథమ్ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్ (ఎల్బీ) (బి) వరుణ్ 12; బ్రేస్వెల్ (ఎల్బీ) (బి) వరుణ్ 2; సాంట్నర్ (బి) వరుణ్ 28; హెన్రీ (సి) కోహ్లి (బి) వరుణ్ 2; జేమీసన్ (నాటౌట్) 9; రూర్కే (బి) కుల్దీప్ 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 205. వికెట్ల పతనం: 1–17, 2–49, 3–93, 4–133, 5–151, 6–159, 7–169, 8–195, 9–196, 10–205. బౌలింగ్: షమీ 4–0–15–0, పాండ్యా 4–0–22–1, అక్షర్ 10–0–32–1, వరుణ్ 10–0–42–5, కుల్దీప్ 9.3–0–56–2, జడేజా 8–0–36–1. -
CT 2025: సెమీస్లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. నాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడబోతున్నాయో తేలిపోయింది. ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయంతో భారత్ గ్రూప్-ఏ టాపర్గా నిలిచింది. తద్వారా సెమీస్లో గ్రూప్-బిలో సెకెండ్ ప్లేస్లో నిలిచిన ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్దమైంది. భారత్, ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్లో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో తలపడ్డాయి. నాటి మ్యాచ్లో ఆసీస్ భారత్ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత భారత్కు ఆసీస్పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 4న దుబాయ్ వేదికగా జరుగనుంది.నేటి మ్యాచ్లో ఫలితంతో రెండో సెమీస్లో ఎవరెవరు తలపడబోతున్నారో కూడా తేలిపోయింది. భారత్ చేతిలో ఓటమితో న్యూజిలాండ్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా గ్రూప్-బి టాపర్ అయిన సౌతాఫ్రికాను రెండో సెమీస్లో ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా మార్చి 5న జరుగుతుంది. అనంతరం రెండు సెమీఫైనల్స్లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్లో ఆసీస్ను ఓడించి టీమిండియా ఫైనల్కు చేరితే దుబాయ్ వేదికగా అంతిమ సమరం జరుగుతుంది. ఒకవేళ సెమీస్లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓడితే లాహోర్ ఫైనల్ మ్యాచ్కు వేదికవుతుంది.హ్యాట్రిక్ విజయాలుభారత్ గ్రూప్-ఏలో హ్యాట్రిక్ విజయాలు సాధించి అజేయ జట్టుగా సెమీస్కు చేరింది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టికరిపించింది. చివరిగా ఇవాళ జరిగిన మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ సెమీస్కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆసీస్ ఇంగ్లండ్పై మాత్రమే గెలుపొందింది. 44 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసిన టీమిండియాగ్రూప్-ఏలో భాగంగా ఇవాళ జరిగిన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. -
Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ రద్దు.. సెమీస్కు ఆస్ట్రేలియా
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (ఫిబ్రవరి 28) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. మ్యాచ్ మధ్యలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫలితంగా ఆస్ట్రేలియా గ్రూప్-బి నుంచి సెమీస్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో ఫలితం తేలకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగి రేపటి మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ భారీ విజయం సాధిస్తే తప్ప, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరలేదు. ఈ మ్యాచ్ రద్దు కావడం సౌతాఫ్రికాకు పరోక్షంగా కలిసొచ్చింది. రేపటి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా మరీ దారుణంగా మాత్రం ఓడకూడదు. ఒకవేళ అలా జరిగి సౌతాఫ్రికా రన్రేట్ మైనస్లోకి పడిపోతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 4 పాయింట్లు (0.475), సౌతాఫ్రికా ఖాతాలో 3 పాయింట్లు (2.140), ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో 3 పాయింట్లు (-0.990) ఉన్నాయి. ఈ గ్రూప్లో ఉన్న మరో జట్టు ఇంగ్లండ్ ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరాలంటే ఇలా జరగాలి..!క్రిక్బజ్ లెక్కల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరాలంటే రేపటి మ్యాచ్లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే సౌతాఫ్రికాను కనీసం 207 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ సెకెండ్ బ్యాటింగ్ చేస్తే 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది (రెండు సందర్భాల్లో మొదటి ఇన్నింగ్స్ టోటల్ 300 పరుగులు అనుకుంటే).ఇలా జరగకపోతే మాత్రం రేపటి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్కు చేరుకుంటుంది. రేపటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైనా సౌతాఫ్రికానే సెమీస్కు చేరుకుంటుంది.కాగా, గ్రూప్-ఏ నుంచి ఇదివరకే సెమీస్ బెర్తలు ఖారారైన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ నుంచి మరో మ్యాచ్ జరగాల్సి ఉన్నా భారత్, న్యూజిలాండ్ సెమీస్కు చేరుకున్నాయి. ఈ గ్రూప్లో మిగిలిన మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మార్చి 2వ తేదీన జరుగుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (20) ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) క్రీజ్లో ఉన్నారు. షార్ట్ వికెట్ ఒమర్జాయ్కు దక్కింది. -
Champions Trophy 2025: ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు వరుణుడి ఆటంకం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy) గ్రూప్-బిలో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 28) జరుగుతున్న కీలకమైన మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia), ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డు (Rain Stopped The Play) తగిలాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ పూర్తై.. ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ పైచేయి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 12.5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలవాలంటే మరో 37.1 ఓవర్లలో 165 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. వర్షం ఎంతకీ తగ్గక ఈ మ్యాచ్ ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ప్రకటించాల్సి వస్తే ఆస్ట్రేలియానే విజేతగా నిలుస్తుంది. ఆసీస్ వర్షం ముప్పును ముందే పసిగట్టి ఛేదనను ధాటిగా ప్రారంభించింది. ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు రెండు సునాయాస క్యాచ్లు వదిలేయడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఈ రెండు క్యాచ్ల్లో ఒకటి ట్రవిస్ హెడ్ది ఉంది. లైఫ్ లభించిన అనంతరం హెడ్ చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తప్పక గెలవాలి. ఓడిపోయినా లేక ఫలితం రాకపోయినా ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిస్తే.. ఆ జట్టుతో పాటు సౌతాఫ్రికా సెమీస్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో ఫలితం రాకపోయినా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికానే సెమీస్కు చేరకుంటాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ పడగొట్టారు. -
Champions Trophy: ఆసీస్తో కీలక సమరం.. ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన రషీద్ ఖాన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ పడగొట్టారు.274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి ఓవర్ నుంచే ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఓ బౌండరీ బాదిన షార్ట్.. మూడో ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఒమర్జాయ్ వేసిన ఈ ఓవర్లో షార్ట్ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఫలితంగా ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మరో ఎండ్లో విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా ఫజల్ హక్ ఫారూకీ బౌలింగ్లో బౌండరీ బాది మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. వీరిద్దరు రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా 3 ఓవర్లలో 32 పరుగులు చేసింది.హెడ్ క్యాచ్ జారవిడిచిన రషీద్ ఖాన్ఫజల్ హక్ ఫారూకీ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి డేంజరెస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ను ఔట్ చేసే సువర్ణావకాశాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేజార్చుకుంది. హెడ్ మిడ్ ఆన్ దిశగా అందించిన క్యాచ్ను రషీద్ ఖాన్ జారవిడిచాడు. ఈ క్యాచ్ ఎంత మూల్యమైందో ఆఫ్ఘనిస్తాన్ కొద్ది సేపటిలోనే తెలిసింది. లైఫ్ లభించిన అనంతరం హెడ్ చెలరేగిపోయాడు. ఆతర్వాతి బంతికే సిక్సర్ బాదాడు. అదే ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టాడు. దీంతో 4 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 42కు చేరింది.సింపుల్ క్యాచ్ను జారవిడిచిన ఖరోటేఅనంతరం ఐదో ఓవర్ తొలి బంతికి ఆఫ్ఘనిస్తాన్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఖరోటే సింపుల్ క్యాచ్ను జారవిడిచాడు. ఈ సారి మాథ్యూ షార్ట్కు లైఫ్ లభించింది. ఒమర్జాయ్ బౌలింగ్ షార్ట్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. చేతిలోకి వచ్చిన క్యాచ్ను ఖరేటో వదిలేశాడు. దీంతో 7 బంతుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు రెండు క్యాచ్లు జారవిడిచినట్లైంది.ఆఫ్ఘనిస్తాన్ ఊపిరిపీల్చుకుందిఖరోటే క్యాచ్ వదిలేశాక రెండు బంతులకే షార్ట్ ఔటయ్యాడు. ఒమర్జాయ్ బౌలింగ్లో గుల్బదిన్ క్యాచ్ పట్టడంతో షార్ట్ మెరుపు ఇన్నింగ్స్కు (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, సిక్స్) తెరపడింది. దీంతో ఆఫ్ఘన్లు ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్కు ఔట్ చేసిన ఆనందం ఆఫ్ఘన్లకు ఎంతో సేపు మిగల్లేదు. స్టీవ్ స్మిత్ వచ్చీ రాగానే రెండు వరుసగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఆసీస్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.మూల్యం చెల్లించుకుంటున్న ఆఫ్లన్లుహెడ్ క్యాచ్ను జారవిడిచినందుకు ఆఫ్ఘన్లు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. లైఫ్ లభించాక హెడ్ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 3 బౌండరీలు.. తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించి ఆఫ్ఘన్లను పశ్చాత్తాపపడేలా చేశాడు. అనంతరం హెడ్ నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్లో రెండు పరుగులు తీసి కెరీర్లో 17వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లలోనే ఆస్ట్రేలియా వికెట్ నష్టపోయి 100 పరుగుల మార్కును తాకింది.ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్కు చేరే అవకాశం (మెరుగైన రన్రేట్ కలిగి ఉంటే) ఉంటుంది. -
Champions Trophy 2025: ఆసీస్తో కీలక సమరం.. విధ్వంసం సృష్టించిన ఒమర్జాయ్
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy-2025) ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) అంచనాలకు మించి రాణిస్తుంది. ఆఫ్ఘన్లకు ఇది అరంగేట్రం ఎడిషనే (ఛాంపియన్స్ ట్రోఫీలో) అయినా.. ఎంతో అనుభవజ్ఞుల్లా ఆడుతున్నారు. దాయాది పాకిస్తాన్ కంటే వెయ్యి రెట్లు బెటర్ అనిపిస్తున్నారు. ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్లో పటిష్టమైన ఇంగ్లండ్కు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఫిబ్రవరి 28) ఆస్ట్రేలియాతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్లో (సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి) తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (Sediqulla Atal) (95 బంతుల్లో 85), ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatulla Omarzai) (63 బంతుల్లో 67) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.తొలి ఓవర్లోనే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (0) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన ఆఫ్ఘనిస్తాన్ను గత మ్యాచ్ సెంచరీ హీరో ఇబ్రహీం జద్రాన్ (22), వన్డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్కు 67 పరుగులు జోడించారు. అనంతరం జద్రాన్ను అద్భుతమైన బంతితో ఆడమ్ జంపా బోల్తా కొట్టించాడు. తర్వాత బరిలోకి దిగిన రహ్మత్ షా (12) కొద్దిసేపు నిలకడగా ఆడాడు. బౌండరీ కొట్టి జోష్ మీదున్న షాను మ్యాక్స్వెల్ ఔట్ చేశాడు. అనంతరం అటల్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో (20) కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 68 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజ్లో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే సెదిఖుల్లా దురదృష్టవశాత్తు సెంచరీకి ముందు ఔటై ఆఫ్ఘనిస్తాన్ ఆశలు నీరుగార్చాడు. సెదీఖుల్లా క్రీజ్లో ఉన్నంత సేపు ఆస్ట్రేలియన్లకు చెమటలు పట్టించాడు.సెదిఖుల్లా ఔటైన కొద్ది సేపటికే హష్మతుల్లా షాహిది, మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4) కూడా ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ 199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్కే పరిమితం అయ్యేలా చేసింది. ఈ దశలో గత మ్యాచ్ హీరో అజ్మతుల్లా ఒమర్జాయ్ విజృంభించాడు. వరుస సిక్సర్లతో విరుచుకుపడి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ను 270 దాటించాడు. మధ్యలో రషీద్ ఖాన్ (19) కూడా తన స్టయిల్లో విరుచుకుపడ్డాడు. మొత్తానికి సెదీఖుల్లా, ఒమర్జాయ్ అదరగొట్టడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచింది. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్కు చేరే అవకాశం (మెరుగైన రన్రేట్ కలిగి ఉంటే) ఉంటుంది. -
CT 2025 Aus Vs Afg: వరుణుడు కరుణిస్తే...
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, అఫ్తానిస్తాన్ల మ్యాచ్ ఫలితం మొత్తం గ్రూప్ ‘బి’ సమీకరణాలనే మార్చేసింది. నాలుగు జట్లలో ఒక్క ఇంగ్లండ్ తప్ప దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్లు సెమీఫైనల్ రేసులో ఉన్నాయి. ఈ రోజు నాకౌట్ దశ బెర్త్ కోసం ఆసీస్, అఫ్గాన్లు కాచుకున్నట్లే ఆసక్తికరంగా మ్యాచ్ను ఆపేందుకు వర్షం కూడా కాచుకుంది. శుక్రవారం వానముప్పు ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకవేళ మ్యాచ్ను ముంచేసే వాన కురిస్తే మాత్రం అఫ్గానిస్తాన్ కథ ఇక్కడితోనే ముగుస్తుంది. 4 పాయింట్లతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో మిగిలున్న మ్యాచ్తో సంబంధం లేకుండా దక్షిణాఫ్రికా (ప్రస్తుతం 3 పాయింట్లు) సెమీస్కు అర్హత సాధిస్తాయి. తాజా పోరు విషయానికొస్తే ఆ్రస్టేలియాను ఓడించడం అఫ్గాన్కు అంత సులువైతే కాదు. కానీ ఇది క్రికెట్. స్థిరమైన ఫలితాలేవీ ఉండవు. మేటి జట్టా, గట్టి ప్రత్యర్థా... అనేవి, గత గణాంకాలు పనికిరావు. శుక్రవారం ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టే గెలుస్తుంది. అఫ్గాన్ ఈ టోర్నీలో సంచలనానికి సీక్వెల్ చూపిస్తే మాత్రం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితం, ఇతర ఏ సమీకరణంతో సంబంధం లేకుండా దర్జాగా సెమీస్ చేరుతుంది. ఆసీస్ మాత్రం దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం కోసం నిరీక్షించక తప్పదు. ఆ్రస్టేలియా కంటే దక్షిణాఫ్రికా రన్రేట్ మెరుగ్గా ఉండటంతో సఫారీ జట్టు ఓడిపోయినా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరు జట్లకు తెలిసిన పిచ్పై... లాహోర్పై ఇటు అఫ్గాన్కు, అటు ఆసీస్కు అవగాహన ఉంది. ఇరు జట్లు కూడా తమ బ్యాటింగ్ సత్తాతోనే తమ తమ మ్యాచ్ల్లో గెలిచాయి. కాబట్టి ఇక్కడి పిచ్ పరిస్థితుల్ని బాగా ఆకళింపు చేసుకున్నాయి. దీంతో సహజంగా టాస్ కీలకపాత్ర పోషించే అవకాశముంది. ఏ రకంగా చూసిన మాజీ చాంపియన్ ఆ్రస్టేలియా గట్టి ప్రత్యర్థి. కానీ అజేయమైన ప్రత్యర్థి కాదు. ఈ ‘చాంపియన్స్’ చరిత్రలో 2009 తర్వాత మొన్న ఇంగ్లండ్పై మాత్రమే గెలిచిన కంగారూ జట్టు మధ్యలో జరిగిన రెండు టోర్నీల్లో ఓటమి లేదంటే రద్దు ఫలితాలతో నిరాశపరిచింది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా బౌలింగ్ దళం చాలా బలహీనంగా ఉంది. పేస్ త్రయం కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ల లోటు కనిపిస్తోంది. బౌలింగ్ విషయంలో అఫ్గాన్ కాస్త మెరుగే అయినా... స్మిత్, లబుõÙన్, హెడ్, ఇన్గ్లిస్, మ్యాక్స్వెల్లాంటి బ్యాటింగ్ లైనప్ను ఢీకొంటుందా అనే సందేహం కూడా ఉంది. పిచ్, వాతావరణం లాహోర్ పూర్తిగా బ్యాటింగ్ పిచ్. ఆస్ట్రేలియా–ఇంగ్లండ్... అఫ్గాన్–ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగుసార్లు 300 పైచిలుకు స్కోరు సులువైంది. దీంతో మరో భారీస్కోరు ఆశించవచ్చు. ఇదే జరిగితే బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. కానీ భారీ వర్షసూచన కూడా ఉంది. 4 ఆ్రస్టేలియాతో అఫ్గానిస్తాన్ జట్టు ఇప్పటి వరకు 4 వన్డేలు ఆడింది. నాలుగింటిలోనూ ఆ్రస్టేలియానే గెలిచింది.తుది జట్లు ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్ ), షార్ట్, హెడ్, లబుషేన్, జోస్ ఇన్గ్లిస్, అలెక్స్ కేరీ, మ్యాక్స్వెల్, డ్వార్షుయిస్, నాథన్ ఎలిస్, ఆడమ్ జంపా, జాన్సన్. అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్ ), గుర్బాజ్, ఇబ్రహీమ్ జద్రాన్, సిద్ధిఖుల్లా, రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్. -
కీలక ఖనిజాలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: కీలక ఖనిజాల(మినరల్స్)తోకూడిన ఆస్తుల మైనింగ్కు ఆసక్తిగా ఉన్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతా రావు పేర్కొన్నారు. కాంగో, జాంబియా, టాంజానియా, ఆస్ట్రేలియా తదితర దేశాలలో అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాబిల్తో ఆస్ట్రేలియా ప్రభుత్వం కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో దేశీ కంపెనీల కోసం కాంగో, టాంజానియా తదితర కొన్ని దేశాలలో కీలక ఖనిజ ఆస్తులను వెలికి తీసేందుకు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ తదితరాలను అత్యంత ప్రాధాన్యతగల ముడిసరుకులుగా పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న శుద్ధ ఇంధన టెక్నాలజీలకు ఇవి బూస్ట్నివ్వగలని పేర్కొన్నారు. గాలి మరలు(విండ్ టర్బయిన్లు), ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి బ్యాటరీల తయారీ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్ తదితరాలలో వీటి వినియోగం విస్తరిస్తున్నట్లు వివరించారు. ఈ బాటలో కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ తదితర పీఎస్యూ దిగ్గజాలు కాబిల్తో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఆస్ట్రేలియాలో కీలక మినరల్ బ్లాకులను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. జాంబియా గ్రీన్ సిగ్నల్ కోబాల్ట్, కాపర్ అన్వేషణకు జాంబియా ప్రభుత్వం 9,000 చదరపు కిలోమీటర్ల క్షేత్రాల(గ్రీన్ఫీల్డ్)ను భారత్కు ఇచ్చేందుకు ఇటీవల అంగీకరించినట్లు రావు తెలియజేశారు. రెండు, మూడేళ్లలో ఖనిజాన్వేషణ చేపట్టనున్నట్లు, తద్వారా మైనింగ్ హక్కులను సైతం పొందనున్నట్లు పేర్కొన్నారు. దేశీ జియలాజికల్ సర్వే(జీఎస్ఐ).. భారీ డిమాండుగల లిథియం బ్లాకులను జమ్ము, కాశీ్మర్(జేఅండ్కే), చత్తీస్గఢ్లలో గుర్తించినట్లు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. వెరసి జేఅండ్కేలో లిథియం బ్లాకుల అన్వేషణకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు జీఎస్ఐ నిర్ణయించినట్లు తెలియజేశారు. ఏప్రిల్, మే నెలకల్లా వీటిపై స్పష్టత రానున్నట్లు వెల్లడించారు. -
ఒక్క బంతి పడకుండానే...
రావల్పిండి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో హోరాహోరీగా సాగాల్సిన మ్యాచ్పై వరుణుడు నీళ్లు చల్లాడు. దీంతో రావల్పిండిలో పసందైన క్రికెట్ విందును ఆస్వాదించాలని వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రెండు పటిష్ట జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనుకున్న సమరం సర్వత్రా ఆసక్తిని రేపింది. గెలిచిన జట్టు సెమీఫైనల్ వైపు నడిచేది. కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ ఒక్క బంతికైనా నోచుకోలేకపోయింది. తెరిపినివ్వని వానతో మైదానమంతా చిత్తడిగా మారడంతో బ్యాట్లు, బంతులతో కుస్తీ చేయాల్సిన ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. చివరకు చేసేదేమీ లేక ఫీల్డ్ అంప్లైర్లు క్రిస్ గఫాని (ఆస్ట్రేలియా), రిచర్డ్ కెటిల్బొరొ (ఇంగ్లండ్)లు అవుట్ఫీల్డ్ను పరిశీలించి మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. వెంటనే మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ల్లో శుభారంభం చేశాయి. ఫలితమివ్వని ఈ మ్యాచ్ వల్ల గ్రూప్లోని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్... అన్ని జట్లు ఇప్పుడు రేసులో నిలిచినట్లయ్యింది. ఎందుకంటే మూడేసి పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు మిగిలింది ఒక్కటే మ్యాచ్ కాగా... పాయింట్ల పట్టికలో ఖాతా తెరువని ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్లకు రెండేసి మ్యాచ్లున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో నేడుఇంగ్లండ్ X అఫ్గానిస్తాన్వేదిక: లాహోర్, మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
Maha Open 2025: జీవన్–విజయ్ జోడీకి టైటిల్
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట చాంపియన్గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో జీవన్–విజయ్ జంట 3–6, 6–3, 10–0తో రెండో సీడ్ బ్లేక్ బేల్డన్–మాథ్యూ క్రిస్టోఫర్ (ఆ్రస్టేలియా) ద్వయంపై విజయం సాధించింది. జీవన్–విజయ్ జోడీకి సంయుక్తంగా ఇదే తొలి టైటిల్ కాగా... విజయ్ సుందర్ పుణేలో మూడో సారి విజేతగా నిలిచాడు. తొలి సెట్లో పరాజయం పాలైన భారత జంట ఆ తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. 2 ఏస్లు సంధించిన జీవన్–విజయ్ జోడీ... 3 డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఈ విజయంతో రూ. 7 లక్షల నగదు బహుమతితో పాటు 100 ర్యాంకింగ్స్ పాయింట్లు భారత ప్లేయర్ల ఖాతాలో చేరాయి. దీంతో ఏటీపీ ర్యాంకింగ్స్లో జీవన్ 94వ స్థానానికి, విజయ్ 104వ ర్యాంక్కు చేరనున్నారు. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. అంచనాలు లేకుండా బరిలోకి దిగి..!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (Australia Cricket Team) చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే టోర్నీల్లో (ICC ODI Tourneys) అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 352 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఐసీసీ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్కు ముందు ఐసీసీ టోర్నీల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండింది. 2023 వరల్డ్కప్లో ఆ జట్టు శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.ఐసీసీ టోర్నీల్లో అత్యధిక లక్ష్య ఛేదనలు..ఆస్ట్రేలియా 352 వర్సెస్ ఇంగ్లండ్, లాహోర్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీపాకిస్తాన్ 345 వర్సెస్ శ్రీలంక, హైదరాబాద్, 2023 వన్డే వరల్డ్కప్ఐర్లాండ్ 329 వర్సెస్ ఇంగ్లండ్, బెంగళూరు, 2011 వన్డే వరల్డ్కప్శ్రీలంక రికార్డు బద్దలుఈ మ్యాచ్తో ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండింది. 2017 ఎడిషన్లో భారత్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 322 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక లక్ష్య ఛేదనలు..ఆస్ట్రేలియా 352 వర్సెస్ ఇంగ్లండ్, లాహోర్, 2025శ్రీలంక 322 వర్సెస్ భారత్, ద ఓవల్, 2017ఇంగ్లండ్ 308 వర్సెస్ బంగ్లాదేశ్, ద ఓవల్, 2017ఆసీస్ వన్డే హిస్టరీలో రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదనఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఛేదించిన 352 పరుగుల లక్ష్యం, ఆ దేశ వన్డే హిస్టరీలోనే రెండో అత్యధికం. వన్డేల్లో ఆసీస్ అత్యుత్తమ లక్ష్య ఛేదన 2013లో రికార్డైంది. అప్పట్లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 359 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.పాక్ గడ్డపై రెండో అత్యధిక ఛేదనఈ మ్యాచ్లో ఆసీస్ ఛేదించిన లక్ష్యం.. పాక్ గడ్డపై రెండో అత్యధికం. పాక్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన ఘనత పాక్ ఖాతాలోనే ఉంది. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాక్ 355 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. వన్డేల్లో ఇదే పాక్కు అత్యధిక లక్ష్య ఛేదన.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లిస్ (120 నాటౌట్) మెరుపు సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ మరో 15 బంతులు మిగిలుండగానే ఊదేసింది. స్టార్ ప్లేయర్ల గైర్హాజరీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆసీస్.. రికార్డు లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ ఛాంపియన్స్ అనిపించుకుంది. ఈ మ్యాచ్కు ముందు ఆసీస్.. శ్రీలంక చేతిలో 0-2 తేడాతో వన్డే సిరీస్ను కోల్పోయింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. బెన్ డకెట్ (143 బంతుల్లో 165; 17 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జో రూట్ (68) అర్ద శతకంతో రాణించాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (10 బంతులోల 21 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ 350 పరుగుల మార్కును తాకగలిగింది. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిష్ 3, లబూషేన్, జంపా తలో 2, మ్యాక్స్వెల్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జోస్ ఇంగ్లిస్ మెరుపు శతకంతో విజృంభించి ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. మాథ్యూ షార్ట్ (63), అలెక్స్ క్యారీ (69), లబూషేన్ (47), మ్యాక్స్వెల్ (32 నాటౌట్) ఇంగ్లిస్కు సహకరించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్, ఆర్చర్, కార్స్, రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ తీశారు. -
ఐసీసీ ట్రోఫీలో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం
-
బెన్ డకెట్ అరుదైన ఘనత.. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి 165 స్కోర్ నమోదు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 165 పరుగులు స్కోర్ చేసిన డకెట్.. ఓ యూనిక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ బ్యాటర్ నుంచి 165 పరుగుల స్కోర్ నమోదైంది. డకెట్కు ముందు వన్డేల్లో ఎవరూ ఈ సంఖ్యను (165) నమోదు చేయలేదు. తాజాగా డకెట్ 165 పరుగుల స్కోర్ చేయడంతో వన్డేల్లో 0 నుంచి 183 పరుగుల వరకు స్కోర్లు కనీసం ఒక్కసారైనా నమోదైనట్లైంది.ఈ మ్యాచ్లో 165 పరుగులు స్కోర్ చేయడంతో డకెట్ మరిన్ని రికార్డులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ను నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు నాథన్ ఆస్టిల్ (145), జింబాబ్వే ప్లేయర్ ఆండీ ఫ్లవర్ (145 నాటౌట్) పేరిట ఉండింది. అలాగే ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగానూ డకెట్ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (141) పేరిట ఉండింది.తాజా ప్రదర్శనతో డకెట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు జో రూట్ (133 నాటౌట్) పేరిట ఉండింది.మ్యాచ్ విషయానికొస్తే.. డకెట్ రికార్డు సెంచరీ సాధించినప్పటికీ ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక టీమ్ స్కోర్ (356/5) కూడా ఇదే.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బెన్ డకెట్ (143 బంతుల్లో 165; 17 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జో రూట్ (68) అర్ద శతకంతో రాణించాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (10 బంతులోల 21 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ 350 పరుగుల మార్కును తాకగలిగింది. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిష్ 3, లబూషేన్, జంపా తలో 2, మ్యాక్స్వెల్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. జోస్ ఇంగ్లిస్ మెరుపు శతకంతో (120 నాటౌట్) విజృంభించడంతో మరో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. మాథ్యూ షార్ట్ (63), అలెక్స్ క్యారీ (69), లబూషేన్ (47), మ్యాక్స్వెల్ (32 నాటౌట్) ఇంగ్లిస్కు సహకరించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్, ఆర్చర్, కార్స్, రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ తీశారు. -
ఇన్గ్లిస్ ధనాధన్ షో
లాహోర్: ఐసీసీ చాంపియన్స్(ICC Champions) ట్రోఫీలో పలు రికార్డుల్ని చెరిపేసిన మ్యాచ్లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో శనివారం జరిగిన మ్యాచ్లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్(England)నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (143 బంతుల్లో 165; 17 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ సెంచరీతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.మిడిలార్డర్ బ్యాటర్ జో రూట్ (78 బంతుల్లో 68; 4 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసి గెలిచింది. 136/4 స్కోరు వద్ద ఓటమి వెంటాడుతున్న దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ ఇన్గ్లిస్ (86 బంతుల్లో 120 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు సెంచరీతో జట్టును గెలిపించే దాకా క్రీజులో నిలిచాడు.ఓపెనర్ మాథ్యూ షార్ట్ (66 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (63 బంతుల్లో 69; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, లబుõÙన్ (45 బంతుల్లో 47; 5 ఫోర్లు) రాణించాడు. చివర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అండగా నిలిచాడు. 2009 తర్వాత ఆసీస్ చాంపియన్స్ ట్రోఫీలో గెలవడం ఇదే తొలిసారి. 2013 ఈవెంట్లో రెండింట ఓడిపోగా, ఓ మ్యాచ్ రద్దయ్యింది. 2017లో రెండు మ్యాచ్లు రద్దవగా, ఓ మ్యాచ్లో ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల ఛేదన చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) కేరీ (బి) డ్వార్షుయిస్ 10; డకెట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లబుషేన్ 165; జేమీ స్మిత్ (సి) కేరీ (బి) డ్వార్షుయిస్ 15; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 68; హ్యారీ బ్రూక్ (సి) కేరీ (బి) జంపా 3; బట్లర్ (సి) ఎలీస్ (బి) మ్యాక్స్వెల్ 23; లివింగ్స్టోన్ (సి) ఎలిస్ (బి) డ్వార్షుయిస్ 14; కార్స్ (సి) అండ్ (బి) లబుõÙన్ 8; ఆర్చర్ నాటౌట్ 21; రషీద్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 351.వికెట్ల పతనం: 1–13, 2–43, 3–201, 4–219, 5–280, 6–316, 7–322, 8–338. బౌలింగ్: జాన్సన్ 7–0–54–0, డ్వార్షుయిస్ 10–0–66–3, నాథన్ ఎలిస్ 10–0–51–0, మ్యాక్స్వెల్ 7–0–58–1, జంపా 10–0–64–2, షార్ట్ 1–0–7–0, లబుõÙన్ 5–0–41–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: షార్ట్ (సి) అండ్ (బి) లివింగ్స్టోన్ 63; హెడ్ (సి) అండ్ (బి) ఆర్చర్ 6; స్మిత్ (సి) డకెట్ (బి) వుడ్ 5; లబుషేన్ (సి) బట్లర్ (బి) రషీద్ 47; ఇంగ్లిస్ నాటౌట్ 120; కేరీ (సి) బట్లర్ (బి) కార్స్ 69; మ్యాక్స్వెల్ నాటౌట్ 32; ఎక్స్ట్రాలు 14; మొత్తం (47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 356. వికెట్ల పతనం: 1–21, 2–27, 3–122, 4–136, 5–282. బౌలింగ్: మార్క్వుడ్ 9.3–0–75–1, జోఫ్రా ఆర్చర్ 10–0–82–1, కార్స్ 7–0–69–1, రషీద్ 10–1–47–1, లివింగ్స్టోన్ 7–0–47–1, రూట్ 4–0–26–0.లాహోర్లో ‘భారత భాగ్య విధాత’ భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లలేదు... ఆ దేశంలో మ్యాచ్ ఆడటం లేదు... అయినా సరే మన జనగణమన... అక్కడ మోగింది. నిర్వాహకులు చేసిన పొరపాటు వల్ల ఇది చోటు చేసుకుంది. ఏదైనా మ్యాచ్కు ముందు ఇరు జట్ల జాతీయ గీతాలు వినిపించడం రివాజు. శనివారం కూడా ముందుగా ఇంగ్లండ్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ద కింగ్’ వినిపించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా ‘అడ్వాన్స్ ఆ్రస్టేలియా ఫెయిర్’ రావాల్సి ఉంది. అయితే ఆసీస్ జెండా కనిపిస్తుండగా సాంకేతిక పొరపాటు జరిగింది.భారత జాతీయ గీతంలోని పదం ‘భారత భాగ్య విధాత’ వినిపించింది. ఒక్కసారిగా షాక్కు గురైన సిబ్బంది దానిని వెంటనే నిలిపివేశారు. అయితే అప్పటికే అది ప్రసారం అయిపోయింది. దీనిపై పాక్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. మైదానంలో నిర్వహణా బాధ్యతలు చూస్తున్న ఐసీసీ వివరణ ఇవ్వాలని కోరింది. -
ఇంగ్లండ్పై 5 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్(England) నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కాగా ఈ భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా(Australia) నిర్ణీత (47.3) ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసి విజేతగా నిలిచింది.తుది జట్లుఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ -
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు (ఫిబ్రవరి 22) బిగ్ ఫైట్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇవాళ (ఫిబ్రవరి 22) బిగ్ ఫైట్ జరుగనుంది. గాయాలతో సతమతమవుతున్న వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా.. ఇటీవలే భారత్ చేతిలో భంగపడ్డ ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-బిలో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా.. ఆఫ్ఘనిస్తాన్ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది.కీలక ఆటగాళ్లు దూరంఈ టోర్నీలో ఆస్ట్రేలియా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతుంది. కీలక ఆటగాళ్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ మార్ష్ గాయాల బారిన పడగా.. మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల చేత ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. మరో స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ సారథ్య బాధ్యతలను మోస్తున్నాడు.భారత్ చేతిలో భంగపాటుఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ భారత్ చేతిలో వన్డే సిరీస్ను కోల్పోయి భంగపాటుకు గురైంది. భారత్తో సిరీస్లో ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఆసీస్తో మ్యాచ్ ప్రారంభానికి రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. యువ ఆటగాడు జేమీ స్మిత్ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. రూట్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.ఆసీస్తో వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..!ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు వన్డేల్లో 161 సార్లు ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఆసీస్ 91 సార్లు గెలుపొందగా.. ఇంగ్లండ్ 65 మ్యాచ్ల్లో విజేతగా నిలిచింది. రెండు మ్యాచ్లు టై కాగా.. మూడు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరిది ఆధిపత్యం..?ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్, ఇంగ్లండ్ ఇప్పటివరకు 5 మ్యాచ్ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 3, ఆసీస్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. చివరి రెండు ఎడిషన్లలో (2013, 2017) ఇంగ్లండ్ ఆసీస్పై జయకేతనం ఎగురవేసింది. ఇక ఇరు జట్లు చివరిగా తలపడిన ఐదు వన్డేల్లో ఆసీస్ 3, ఇంగ్లండ్ 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఆసీస్ జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), మాథ్యూ షార్ట్, ట్రవిస్ హెడ్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, గ్లెన్ మ్యాక్స్వెల్, సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిష్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ -
మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: పాక్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్ దశలో తమ జట్టుకు గట్టిపోటీ తప్పదంటున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed). టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల జట్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో పాకిస్తాన్(Pakistan) తప్పకుండా సెమీ ఫైనల్కు మాత్రం చేరుతుందని సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు.కాగా 2017లో చివరగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్లో పాక్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాడు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఎనిమిదేళ్ల అనంతరంఇక ఇప్పుడు.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఈ మెగా టోర్నీ మరోసారి జరుగనుండగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.ఇక ఈ ఐసీసీ ఈవెంట్కు పాకిస్తాన్తో పాటు వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.ఈ క్రమంలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ , ఇంగ్లండ్ను చేర్చారు. ఇక పాక్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడనుంది.సెమీ ఫైనల్స్లో ఆ నాలుగేఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ చేరే జట్లపై తన అంచనా తెలియజేశాడు. ‘‘పాకిస్తాన్ ఉన్న గ్రూపులో జట్ల నుంచి గట్టి పోటీ తప్పదు. అయితే, నా అభిప్రాయం ప్రకారం... ఈసారి పాకిస్తాన్, ఇండియా, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా బలమైన జట్లుగా కనిపిస్తున్నాయి. సెమీ ఫైనల్స్ ఈ నాలుగే చేరతాయి’’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.ఇక తమ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ టీమ్ పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై టోర్నీ ఆడనుండటం అతిపెద్ద సానుకూలాంశం. సొంత మైదానాల్లో ఎలా ఆడాలన్న అంశంపై ప్రతి ఒక్క ఆటగాడికి అవగాహన ఉంది. 2017లో ట్రోఫీ గెలిచిన జట్టుతో పోలిస్తే.. ప్రస్తుత జట్టు మరింత స్ట్రాంగ్గా కనిపిస్తోంది.ప్రధాన బలం వారేబాబర్ ఆజం రూపంలో జట్టులో వరల్డ్క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. ఫఖర్ జమాన్ ఆనాడు కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు అనుభవం కలిగిన ఆటగాడిగాబరిలోకి దిగబోతున్నాడు. వీళ్దిద్దరు పాకిస్తాన్ జట్టుకు ప్రధాన బలం’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.కాగా 2017లో చివరగా ఐసీసీ టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఇప్పటివరకు మళ్లీ మెగా ఈవెంట్లలో గెలుపు రుచిచూడలేదు. 2023 వన్డే వరల్డ్కప్, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడు స్వదేశంలోనైనా.. గత చేదు అనుభవాలను మరిపించేలా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇటీవల వన్డే సిరీస్లలో వరుస విజయాలతో జోరు మీదున్న పాక్ జట్టుకు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురైంది.మహ్మద్ రిజ్వాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించిన పాక్.. సౌతాఫ్రికాలో 3-0తో క్లీన్స్వీప్ చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే, తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్తో జరిగిన ట్రై సిరీస్లో ఫైనల్ చేరుకున్న రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో ఓటమిపాలైంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
లంక చేతిలో ఘోర పరాజయం.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు అవమానం
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాకు ఘోర అవమానం జరిగింది. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆసీస్ 0-2 తేడాతో చిత్తుగా ఓడింది. ఇవాళ (ఫిబ్రవరి 14) జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 174 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాలతో సతమతమవుతున్న ఆసీస్ను ఈ పరాజయం మరింత కృంగదీసింది.మ్యాచ్ విషయానికొస్తే.. కొలొంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక (6) వికెట్ కోల్పోయింది. అయితే నిషాన్ మధుష్క (51), కుసాల్ మెండిస్ (101) రెండో వికెట్కు 98 పరుగులు జోడించి లంక ఇన్నింగ్స్కు జీవం పోశారు. మధుష్క ఔటైన అనంతరం కుసాల్ మెండిస్.. కెప్టెన్ అసలంక (78 నాటౌట్) సహకారంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. మెండిస్, అసలంక నాలుగో వికెట్కు 94 పరుగులు జోడించి తమ జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. ఇన్నింగ్స్ చివర్లో అసలంకతో కలిసి జనిత్ లియనాగే (32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిష్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. తొలుత ఆసీస్ను అశిత ఫెర్నాండో (4-0-23-3) ఇబ్బంది పెట్టాడు. ఆతర్వాత దునిత్ వెల్లలగే (7.2-0-35-4), వనిందు హసరంగ (7-2-23-3) ఆసీస్ భరతం పట్టారు. లంక బౌలర్ల ధాటికి ఆసీస్ 100 పరుగులు చేయడం కూడా అసాధ్యమనిపించింది. మొత్తానికి ముక్కీమూలిగి ఆసీస్ 24.2 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (29) టాప్ స్కోరర్ కాగా.. జోస్ ఇంగ్లిస్ (22), ట్రవిస్ హెడ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.కాగా, ఆసీస్ తొలి వన్డేలోనూ ఇదే రీతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ మ్యాచ్లో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కెప్టెన్ అసలంక సెంచరీ చేయడంతో అతికష్టం మీద 214 పరుగులు చేయగలిగింది. అయితే ఈ ఇంతటి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఆసీస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహీశ్ తీక్షణ (9.5-1-40-4), అశిత ఫెర్నాండో (5-1-23-2), వెల్లలగే (7-0-33-2), హసరంగ (6-0-47-1), అసలంక (2-0-5-1) ఆసీస్ను దెబ్బకొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో అలెక్స్ క్యారీ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇదిలా ఉంటే, ఆసీస్.. శ్రీలంక నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నేరుగా పాకిస్తాన్కు బయల్దేరుతుంది. ఛాంపియన్స్ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ] -
CT 2025: చతికిలపడ్డ ఇంగ్లండ్.. గాయాల ఊబిలో ఆస్ట్రేలియా
ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కు ఇంగ్లండ్పై మూడు వన్డేల సిరీస్ విజయం టీమిండియాలో ఉత్తేజాన్ని రెట్టింపు చేసింది. ఈ సిరీస్ సందర్భంగా జట్టులోని ప్రధాన బ్యాటర్లందరూ పరుగులు సాధించడంతో మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. జట్టులోని ప్రధాన బౌలరైన జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడం జట్టుకి కాస్త అసంతృప్తిని కలిగించినా.. గాయాలపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కానీ.. టీమ్ మేనేజిమెంట్ కానీ చేయగలిగింది ఏమీ లేదు.ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న క్రీడాకారులతో వ్యూహం రూపొందించాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆస్టేలియా పర్యటనలోనూ, సొంతగడ్డ పై శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల తో వరుసగా పరాజయాలు చవిచూసింది రోహిత్ సేన. అయితే, ఇంగ్లండ్ విజయంతో మళ్ళీ మునుపటి రీతిలో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టు తో ఈ సిరీస్ ఏర్పాటు చేయడం భారత్ వ్యూహం ఫలించిందని చెప్పాలి.వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఇంగ్లండ్అయితే ఈ టోర్నమెంట్లో టీమిండియా ప్రధాన ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పేపర్ మీద ఇంగ్లండ్ చాలా పటిష్టమైన జట్టుగా కనిపిస్తున్నా..ఈ టోర్నమెంట్ పాకిస్తాన్, దుబాయ్ ల లో జరుగుతున్నందున.. ఆసియా జట్లు ఈ పిచ్లపై ఆధిపత్యం చెలాయించే అవకాశముంది. ఇక బుధవారం అహ్మదాబాద్లో జరిగిన మూడవ వన్డేలో ఇంగ్లండ్ 142 పరుగుల భారీ ఓటమి చవిచూడడం ఆ జట్టుకి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు.ఇంగ్లండ్ ఈ వన్డే సిరీస్ను 0-3 తేడాతో కోల్పోవడమే కాక అంతకుముందు జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కూడా భారత్ చేతిలో 1-4 తేడాతో పరాజయం చవిచూసింది. ఈ పరాజయంపై స్పందిస్తూ, భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టును తీవ్రంగా దుయ్యబట్టారు.భారత పర్యటనలో ఇంగ్లీష్ జట్టు కేవలం ఒక నెట్ సెషన్ లో మాత్రమే పాల్గొందని, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు ఇది చాల దారుణమైన విషయమని శాస్త్రి వెల్లడించాడు. "నేను విన్న దాని ప్రకారం, ఈ పర్యటన అంతటా ఇంగ్లాండ్ ఒకే ఒక నెట్ సెషన్ లో పాల్గొంది. ఇంగ్లండ్ జట్టు సిరీస్ విజయం కోసం కష్టపడటానికి సిద్ధంగా లేదు," అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. వ్యాఖ్యాత బృందంలో భాగమైన పీటర్సన్, జాకబ్ బెథెల్ స్థానంలో ఇంగ్లాండ్ జట్టులో చేరిన టామ్ బాంటన్ భారత్ తో జరిగిన మూడో వన్డే కి ముందు గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని వెల్లడించడంతో.. శాస్త్రి ఆ జట్టుపై మరింత అసంతృప్తి వ్యక్తం చేసాడు.గాయాల ఊబిలో ఆస్ట్రేలియాఇక ఇంగ్లండ్ పరిస్థితి ఇలా ఉంటే, ఈ టోర్నమెంట్ లో ప్రధాన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియా జట్టు గాయాల ఊబిలో చిక్కుకొని ఉంది. ఇటీవల శ్రీలంకలో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా ఆ తర్వాత జరిగే వన్డే మ్యాచ్లలో కూడా విజయం సాధించాలని.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జట్టు ఆత్మవిశ్వాసానికి ఇది ఎంతో కీలకమని భావిస్తోంది.ఇటీవల భారత్తో సొంత గడ్డ పై జరిగిన టెస్ట్ సిరీస్ లో తన సత్తా చాటిన ఆస్ట్రేలియా తర్వాత గాయాల కారణంగా చతికిలపడింది. జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్, సీనియర్ బౌలర్ మిచెల్ స్టార్క్, మరో పేస్ బౌలర్ జోష్ హాజిల్వుడ్, ఆల్ రౌండర్ మిచ్ మార్ష్ గాయాల కారణంగా జట్టు నుంచి తప్పుకున్నారు, మరో ముఖ్యమైన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ గత వారం వన్డేల నుండి రిటైర్మెంట్ అవుతున్నట్టు అనూహ్యమైన ప్రకటన చేసాడు.ఈ ఈ పరిస్థితులలోశ్రీలంక సిరీస్ కోసం రిజర్వ్ ఫాస్ట్ బౌలర్లు సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్, బెన్ డ్వార్షుయిస్తో పాటు లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘ, స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీ, బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్లను సెలెక్టర్లు జట్టులోకి చేర్చారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలకమైన టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా వంటి ప్రత్యర్థి ని పూర్తిగా కొట్టివేయడానికి లేకపోయినా, ఆ జట్టు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పడంలో సందేహం లేదు.చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. కోహ్లి కామెంట్స్ వైరల్ -
శ్రీలంకలో విజృంభించిన ఆసీస్ స్పిన్నర్పై ఫిర్యాదు
సిడ్నీ: శ్రీలంక పర్యటనలో విజృంభించిన ఆ్రస్టేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ (Australia Left Arm Spinner) మ్యాట్ కునేమన్ (Matthew Kuhnemann) బౌలింగ్ శైలిపై (Bowling Action) సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ సందర్భంగా కునేమన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడి లేదని అంపైర్లు సందేహాలు లేవనెత్తడంతో... ఆసీస్ స్పిన్నర్ బయోమెకానికల్ పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన రెండో టెస్టు తర్వాత మ్యాచ్ అధికారుల కునేమన్ బౌలింగ్ అంశాన్ని ఆ్రస్టేలియా జట్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో మా ప్లేయర్కు పూర్తి మద్దతు ఇస్తాం’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2017లో ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి 100కు పైగా మ్యాచ్లు ఆడిన కునేమన్... ఆ్రస్టేలియా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 5 మ్యాచ్లాడి 25 వికెట్లు పడగొట్టాడు. తాజాగా శ్రీలంతో సిరీస్లో 28 ఏళ్ల కునేమన్ 17.18 సగటుతో 16 వికెట్లు తీశాడు. కునేమన్ బౌలింగ్పై ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అని సీఏ వెల్లడించింది. ఈ నెల ఆఖర్లో బ్రిస్బేన్లో కునేమన్ బయోమెట్రిక్ పరీక్ష చేయించుకోనున్నాడు. అనంతరం ఫలితాలను విశ్లేషణ కోసం ఐసీసీకి పంపనున్నారు. ఒకవేళ కునేమన్ ఈ పరీక్షలో విఫలమైతే అతడిపై సస్పెన్షన్ వేటు పడగనుంది. -
ఆసీస్తో తొలి వన్డే.. స్వల్ప స్కోర్కే పరిమితమైన శ్రీలంక.. సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన అసలంక
రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కొలొంబో వేదికగా ఆస్ట్రేలియాతో (Australia) జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక (Sri Lanka) కెప్టెన్ చరిత్ అసలంక (Charith Asalanka) సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో కష్టాల్లో ఉన్న తన జట్టును అసలంక ఒంటిచేత్తో ఆదుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 55 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో అసలంక.. వెల్లలగే (30), మిగతా టెయిలెండర్ల సాయంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. మరో ఎండ్లో బౌలర్ ఎషాన్ మలింగను (26 బంతుల్లో 1 నాటౌట్) పెట్టుకుని అసలంక కెరీర్లో నాలుగో వన్డే సెంచరీని పూర్తి చేశాడు. అసలంక 112 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును తాకాడు. 127 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అసలంక తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో అషిత ఫెర్నాండో డకౌట్ కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 214 పరుగుల వద్ద ముగిసింది (46 ఓవర్లలో).అంతకుముందు శ్రీలంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు పథుమ్ నిస్సంక 4, అవిష్క ఫెర్నాండో ఒక్క పరుగుకే ఔటయ్యారు. వన్డౌన్లో వచ్చిన కుసాల్ మెండిస్ 19 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఆతర్వాత కమిందు మెండిస్ 5, జనిత్ లియనాగే 11 పరుగులకు ఔటయ్యారు. టెయిలెండర్లు వనిందు హసరంగ 7, మహీశ్ తీక్షణ 2 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇల్లిస్ 9 ఓవర్లలో 2 మెయిడిన్లతో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మరో పేసర్ ఆరోన్ హార్డీ 6 ఓవర్లలో 13 పరుగులిచ్చి అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్ వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ 3, స్పెన్సర్ జాన్సన్ 2, మాథ్యూ షార్ట్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, ఈ వన్డేకు ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆసీస్ 2-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన ఆసీస్.. రెండో టెస్ట్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ను వెళ్లనుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. ఈ టోర్నీకి శ్రీలంక అర్హత సాధించలేకపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ] -
ఛాంపియన్స్ ట్రోఫీకి గాయాల బెడద.. ఒక్కొక్కరుగా దూరమవుతున్న స్టార్ పేసర్లు
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy-2025) గాయాల బెడద పట్టుకుంది. మెగా టోర్నీకి స్టార్ పేసర్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే అన్రిచ్ నోర్జే, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, క్రిస్ వోక్స్, లోకీ ఫెర్గూసన్, గెరాల్డ్ కొయెట్జీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కాగా.. తాజాగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వైదొలిగారు.వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లంతా దూరమైతే మెగా టోర్నీ కళ తప్పే ప్రమాదముంది. అన్ని జట్ల కంటే గాయాల సమస్య ఆస్ట్రేలియాను (Australia) ఎక్కువగా వేధిస్తుంది. ఆ జట్టులో ఏకంగా ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. ఒకరు (Marcus Stoinis) ఏకంగా వన్డే క్రికెట్కే రిటైర్మెంట్ ప్రకటించారు. జట్టులో సగానికి పైగా రెగ్యులర్ ఆటగాళ్లు దూరం కావడం ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అసలే గత రెండు ఎడిషన్లలో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు లేదు. 2013, 2017 ఎడిషన్లలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు.పేలవ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఆస్ట్రేలియా, అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగి ఏ మేరకు విజయాలు సాధిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుత ఎడిషన్లో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఆసీస్ సెలెక్టర్లు కీలక ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించారు. బెన్ డ్వార్షుయిష్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్ కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరికంతా అనుభవం అంతంతమాత్రమే.బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. హర్షిత్ ఇటీవలే వన్డే అరంగ్రేటం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహ్మద్ షమీ ఒక్కడే అనుభవజ్ఞుడు. అర్షదీప్ సింగ్ ఉన్నా, అతను ఆడింది కేవలం 8 వన్డేలే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో భారత్ మరో మార్పు చేసింది. యశస్వి జైస్వాల్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు.ఆఫ్ఘనిస్తాన్నూ వదలని గాయాల సమస్యఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాల సమస్య ఆఫ్ఘనిస్తాన్ను కూడా వదల్లేదు. గాయం కారణంగా ఆ జట్టు స్పిన్ సంచలనం అల్లా ఘజన్ఫర్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. 18 ఏళ్ల ఘజన్ఫర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్ఫర్కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్ఫన్ నాలుగు నెలలు క్రికెట్కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది.ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్ఫర్ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్ఫర్కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు.కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఈ టోర్నీలో ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్-బిలో ఉండగా.. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టులో మరో బిగ్ వికెట్ డౌన్
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy) ముందు ఆస్ట్రేలియా జట్టులో పెద్ద మరో వికెట్ పడింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వ్యక్తిగత కారణాల చేత మెగా టోర్నీ మొత్తానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్టార్క్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. స్టార్క్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శ్రీలంకతో జరిగే రెండు వన్డేల్లో కూడా పాల్గొనడని బెయిలీ ప్రకటించాడు. స్టార్క్కు ముందు గాయాల కారణంగా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh), కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins), పేసర్ జోష్ హాజిల్వుడ్ (Josh Hazzlewood) ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. ఈ మధ్యలో మరో ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్టార్క్తో కలుపుకుని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో మొత్తం ఐదు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని బెన్ డ్వార్షుయిష్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, స్పెన్సర్ జాన్సన్,తన్వీర్ సంఘా, సీన్ అబాట్లతో భర్తీ చేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కూపర్ కన్నోలీ ట్రావెలింగ్ రిజర్వ్గా ఉంటాడని పేర్కొంది. మార్పులు చేర్పుల తర్వాత ప్రకటించిన 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ (Steve Smith) సారథ్యం వహిస్తాడు.కాగా, ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇవాళ (ఫిబ్రవరి 12) ఆ జట్టు లంకతో వన్డే మ్యాచ్ ఆడుతుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ వన్డే జరుగుతుంది. రెండో వన్డే ఫిబ్రవరి 14న జరుగుతుంది. ప్రస్తుత లంక పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్ట్లు కూడా ఆడింది. ఈ రెండు మ్యాచ్ల్లో ఆ జట్టే జయభేరి మోగించింది. రెండు వన్డేల సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా పాకిస్తాన్కు (ఛాంపియన్స్ ట్రోఫీ కోసం) బయల్దేరుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ]శ్రీలంకతో రెండు వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. -
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. డబుల్ సెంచరీ.. తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు
ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ల్లో 200 క్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో స్మిత్ మొత్తం ఐదు క్యాచ్లు పట్టుకున్నాడు. స్మిత్ క్యాచ్ల్లో డబుల్ సెంచరీ సాధించే క్రమంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) రికార్డును అధిగమించాడు. 🚨 HISTORY BY STEVEN SMITH. 🚨- Smith becomes the first ever Australian fielder to complete 200 catches in Tests. 🙇♂️pic.twitter.com/3T2v9jgcid— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025పాంటింగ్ 287 ఇన్నింగ్స్ల్లో 196 క్యాచ్లు అందుకోగా.. స్మిత్ 205 ఇన్నింగ్స్ల్లోనే 200 క్యాచ్లు పూర్తి చేశాడు. ఆసీస్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టుకున్న నాన్ వికెట్కీపర్ల జాబితాలో స్మిత్, పాంటింగ్ తర్వాతి స్థానంలో మార్క్ వా ఉన్నాడు. మార్క్ వా 209 ఇన్నింగ్స్ల్లో 181 క్యాచ్లు పట్టుకున్నాడు.ఓవరాల్గా ఐదో క్రికెటర్టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే 200 క్యాచ్లు పూర్తి చేశారు. వీరిలో టీమిండియా గ్రేట్ రాహుల్ ద్రవిడ్ (Rahu Dravid) 210 క్యాచ్లతో (164 టెస్ట్ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. జో రూట్ (152 టెస్ట్ల్లో 207), మహేళ జయవర్దనే (149 టెస్ట్ల్లో 205), జాక్ కల్లిస్ (166 టెస్ట్ల్లో 200) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో మ్యాచ్లో స్మిత్ కల్లిస్ సరసన చేరడంతో పాటు 200 క్యాచ్ల క్లబ్లో చేరిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అలాగే టెస్ట్ల్లో అత్యంత వేగవంతంగా 200 క్యాచ్లు పూర్తి చేసిన ఆటగాడిగానూ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. స్మిత్ కేవలం 116 టెస్ట్ల్లోనే 200 క్యాచ్లు పూర్తి చేశాడు. స్మిత్ మరో 11 క్యాచ్లు పడితే టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొడతాడు.లంకతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఐదు క్యాచ్లు పట్టిన స్మిత్.. బ్యాటింగ్లోనూ చెలరేగి టెస్ట్ల్లో 36వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ టెప్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్, జో రూట్ తలో 36 సెంచరీలతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది.అంతకుముందు స్మిత్ లంకతో జరిగిన తొలి టెస్ట్లోనూ సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్లో స్మిత్ టెస్ట్ల్లో 10000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్కు దూరం కాగా.. అతని గైర్హాజరీలో స్మిత్ ఆసీస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. తొలి టెస్ట్లోనూ ఘన విజయం సాధించిన ఆసీస్.. రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఊడ్చేసింది. ఫిబ్రవరి 12, 14 తేదీల్లో ఆసీస్.. శ్రీలంకతో రెండు వన్డేలు ఆడనుంది. -
విరాట్ కోహ్లిని అధిగమించిన స్టీవ్ స్మిత్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. టెస్ట్ల్లో స్టీవ్కు ఇది 36వ సెంచరీ. ఈ సెంచరీతో స్టీవ్ పలు రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు (జో రూట్తో కలిసి) చేసిన ఆటగాడిగా నిలిచాడు. రూట్, స్టీవ్ ప్రస్తుతం టెస్ట్ల్లో తలో 36 సెంచరీలు చేశారు.టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు.ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.విరాట్ను అధిగమించిన స్టీవ్విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ ఇప్పటివరకు విదేశాల్లో 16 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో స్టీవ్ విదేశీ సెంచరీల సంఖ్య 17కు పెరిగింది. తాజా సెంచరీతో స్టీవ్.. అలిస్టర్ కుక్, బ్రియాన్ లారా సరసన చేరాడు. కుక్, లారా ఇద్దరూ విదేశాల్లో తలో 17 టెస్ట్ సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్టీవ్.. విదేశీ టెస్ట్ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు (7) చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (120), అలెక్స్ క్యారీ (139) అజేయ సెంచరీలతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 73 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు. -
SL VS AUS 2nd Test: శతక్కొట్టిన అలెక్స్ క్యారీ.. ఆధిక్యంలో ఆస్ట్రేలియా
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసీస్ (Australia) వికెట్కీపర్ బ్యాటర్ ఆలెక్స్ క్యారీ (Alex Carey) శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో ఐదో స్థానంలో బరిలోకి దిగిన క్యారీ.. 117 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్లో రెండో టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్యారీ తన సెంచరీ మార్కును బౌండరీతో చేరుకున్నాడు. క్యారీ తన తొలి టెస్ట్ సెంచరీని 2022 బాక్సింగ్ డే టెస్ట్లో సాధించాడు.MOST TEST HUNDREDS IN ASIA BY WICKET-KEEPER BATTERS FROM AUSTRALIA:Adam Gilchrist - 4Alex Carey - 1* pic.twitter.com/E7yGUofiiB— Johns. (@CricCrazyJohns) February 7, 2025ఈ మ్యాచ్లో క్యారీకి ముందు స్టీవ్ స్మిత్ (Steve Smith) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్కు టెస్ట్ల్లో ఇది 36వ శతకం. స్మిత్, క్యారీ సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్ ఆధిక్యంలోకి వెళ్లింది. 74 ఓవర్ల అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ స్కోర్ 309/3గా ఉంది. క్యారీ (123), స్మిత్ (115) సెంచరీల అనంతరం అదే జోరుతో ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, రెండు టెస్ట్ మ్యాచ్లు, రెండు వన్డేల సిరీస్ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఆసీస్ ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.టెస్ట్ సిరీస్ అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది. -
స్టీవ్ స్మిత్ ఖాతాలో 36వ టెస్ట్ శతకం.. రూట్ రికార్డు సమం
ఆస్ట్రేలియా తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) టెస్ట్ల్లో 36వ శతకాన్ని నమోదు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ శతకాన్ని స్మిత్ 191 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో పూర్తి చేశాడు. స్మిత్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకున్నాడు. లంక పర్యటనలో స్మిత్కు ఇది వరుసగా రెండో సెంచరీ. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్లోనూ స్మిత్ శతక్కొట్టాడు. THE MAN, THE MYTH, THE LEGEND - ITS STEVE SMITH IN TEST CRICKET 🦁 pic.twitter.com/phZ6XlCX9T— Johns. (@CricCrazyJohns) February 7, 2025తాజా సెంచరీతో స్మిత్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) రికార్డును సమం చేశాడు. రూట్, స్మిత్ టెస్ట్ల్లో తలో 36 సెంచరీలు చేశారు. ఫాబ్ ఫోర్గా పిలువబడే వారిలో ప్రస్తుతం స్మిత్, రూట్ అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. కేన్ విలియమ్సన్ (Kane Williamson) 33, విరాట్ కోహ్లి (Virat Kohli) 30 సెంచరీలతో స్మిత్, రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.తాజా సెంచరీ స్మిత్కు టెస్ట్ కెప్టెన్గా 17వ సెంచరీ. ఈ సెంచరీ స్మిత్కు ఆసియాలో 7, శ్రీలంకలో 4వది. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్మిత్ టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్, రూట్తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది. సచిన్ తర్వాతి స్థానాల్లో జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఉన్నారు.టెస్ట్ల్లో స్మిత్ సెంచరీలు..ఆస్ట్రేలియాలో 18ఇంగ్లండ్లో 8శ్రీలంకలో 4భారత్లో 3న్యూజిలాండ్లో 1సౌతాఫ్రికాలో 1వెస్టిండీస్లో 1మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టెస్ట్లో స్మిత్ శతక్కొట్టడంతో ఆసీస్ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆసీస్ 10 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. 68 ఓవర్ల అనంతరం ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. స్మిత్కు జతగా క్రీజ్లో ఉన్న అలెక్స్ క్యారీ (92) కూడా శతకానికి చేరువయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
SL VS AUS 2nd Test: ఉస్మాన్ ఖ్వాజా అరుదైన ఘనత.. తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు
ఆసీస్ (Australia) వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ల్లో 35 ఏళ్ల తర్వాత 3000 పరుగులు సాధించిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ క్రికెట్ చరిత్రలో 35 అంతకుమించిన వయసులో ఎవరూ 3000 పరుగుల మార్కును తాకలేదు. ఖ్వాజాకు ముందు స్టీవ్ వా 2554 పరుగులు (53.30 సగటున) చేశాడు.35 అంతకంటే ఎక్కువ వయసులో ఆసీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..- ఉస్మాన్ ఖ్వాజా-3016 (51.11)- స్టీవ్ వా-2554 (53.30)- అలెన్ బోర్డర్-2473 (42.63)- మైక్ హస్సీ-2323 (50.50)- క్రిస్ రోజర్స్-1996 (44.35)- డాన్ బ్రాడ్మన్-1903 (105.72)శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా ఖ్వాజా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఖ్వాజా 36 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన అనంతరం లయోన్ ఎవరికీ సాధ్యంకాని ఓ ఘనతను సాధించాడు. ఆసియా గడ్డపై టెస్ట్ల్లో 150 వికెట్లు తీసిన నాన్ ఏషియన్ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు.శ్రీలంక ఆలౌటైన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 43 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (36), ట్రవిస్ హెడ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేసి ఔట్ కాగా.. లబూషేన్ నాలుగు పరుగులకే పెవిలియన్కు చేరాడు. తొలి టెస్ట్లో సెంచరీతో కదంతొక్కిన స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్లోనూ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. స్మిత్ 69 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అలెక్స్ క్యారీ (39) క్రీజ్లో ఉన్నాడు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2 వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నాడు.తొలి టెస్ట్లో డబుల్ సెంచరీఉస్మాన్ ఖ్వాజా తొలి టెస్ట్లో డబుల్ సెంచరీతో (232) కదంతొక్కాడు. తద్వారా ఆసీస్ తరఫున డాన్ బ్రాడ్మన్ తర్వాత అత్యంత లేటు వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఖ్వాజా 38 ఏళ్ల 43 రోజుల వయసులో తన కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్లో ఖ్వాజా డబుల్ సెంచరీ.. స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ సెంచరీలతో మెరవడంతో ఆస్ట్రేలియా శ్రీలంకపై భారీ విజయం సాధించింది. -
శ్రీలంకతో రెండో టెస్ట్.. ఆసీస్ బౌలర్ల విజృంభణ.. హెడ్ వెరైటీ సెలబ్రేషన్
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆస్ట్రేలియా (Australia) పైచేయి సాధించింది. ఆ జట్టు బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు మాత్రమే చేసింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో మూడు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బేశారు. మాథ్యూ కుహ్నేమన్ 2, ట్రవిస్ హెడ్ ఓ వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్లో దినేశ్ చండీమల్ (74), కుసాల్ మెండిస్ (59 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పథుమ్ నిస్సంక 11, దిముత్ కరుణరత్నే 36, ఏంజెలో మాథ్యూస్ 1, కమిందు మెండిస్ 13, ధనంజయ డిసిల్వ 0, రమేశ్ మెండిస్ 28, ప్రభాత్ జయసూర్య 0, నిషాన్ పెయిరిస్ డకౌట్ అయ్యారు. కుసాల్ మెండిస్కు జతగా లహీరు కుమార (0) క్రీజ్లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్లో ముగ్గురు డకౌట్ అయ్యారు.pic.twitter.com/IRsGEkTBll— rohitkohlirocks@123@ (@21OneTwo34) February 6, 2025హెడ్ వినూత్న సంబురాలుఈ మ్యాచ్లో కమిందు మెండిస్ను ఔట్ చేసిన అనంతరం ట్రవిస్ హెడ్ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. చేయి నొప్పి పెడితే కాని, కాలితే కాని ఎలా విదిలించుకుంటామో అలా చేశాడు. హెడ్ ఇలాంటి వెరైటీ సంబురాలు చేసుకోవడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల కిందట భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇంచుమించు ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు.కాగా, రెండు టెస్ట్లు, రెండు వన్డే మ్యాచ్ల సిరీస్ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.టెస్ట్ సిరీస్ అనంతరg ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు వరుస ఎదురుదెబ్బలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy 2025) ముందు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా మెగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. తొలుత మిచెల్ మార్ష్ (Mitchel Marsh).. తాజాగా ఫాస్ట్ బౌలర్లు కమిన్స్ (Pat Cummins), జోష్ హాజిల్వుడ్ (Josh Hazzlewood) ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. ఈ మధ్యలో ఆస్ట్రేలియాకు మరో ఊహించని షాక్ కూడా తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) అనూహ్యంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా మొత్తం నలుగురు ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. ఈ నలుగురికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంది. రేసులో కూపర్ కన్నోలీ, బ్యూ వెబ్స్టర్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ ముందువరసలో ఉన్నారు.కాగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం రెండు టెస్ట్లు, రెండు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో ఇదివరకే తొలి టెస్ట్ పూర్తి కాగా.. ఇవాళే (ఫిబ్రవరి 6) రెండో టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీ విరామం సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (11), దిముత్ కరుణరత్నే (36), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), ధనంజయ డిసిల్వ (0) ఔట్ కాగా.. దినేశ్ చండీమల్ (70), కుసాల్ మెండిస్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 3, మిచెల్ స్టార్క్, ట్రవిస్ హెడ్ తలో వికెట్ పడగొట్టారు.తొలి టెస్ట్లో ఆసీస్ భారీ విజయంతొలి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.ఫిబ్రవరి 12 నుంచి వన్డేలు.. ఆతర్వాత నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకే..!ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆసీస్ జట్టు (ముందుగా ప్రకటించింది)పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
ఆసీస్కు భారీ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టోయినిస్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు స్టోయినిస్ విడ్కోలు పలికాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్న మార్కస్ అనుహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. గత కొనేళ్లగా వైట్ బాల్ ఫార్మాట్లో ఆస్ట్రేలియా జట్టులో స్టోయినిస్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో కూడా అతడు సభ్యునిగా ఉన్నాడు. అయితే టీ20 క్రికెట్పై దృష్టి సారించేందుకు 35 ఏళ్ల ఆల్రౌండర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. స్టోయినిస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో ఆడుతున్నాడు. స్టోయినిస్ చివరగా ఆస్ట్రేలియా తరపున చివరి వన్డే మ్యాచ్ పాకిస్తాన్పై ఆడాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే తన జట్టుకు ఆల్ది బెస్ట్ స్టోయినిస్ చెప్పుకొచ్చాడు.అందుకే రిటైర్మెంట్.."ఆస్ట్రేలియాకు అత్యుత్తున్నత స్దాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ముఖ్యంగా వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఆడిన ప్రతీ క్షణానాన్ని నేను అస్వాదించాను. ఈ రోజు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ఇది అంత ఈజీగా తీసుకున్న నిర్ణయం కాదు. కానీ నా కెరీర్లోని తదుపరి అధ్యాయంపై దృష్టి సారించేందుకు సరైన సమయంగా భావిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మా కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతడు నాకు ఎంతో మద్దతిచ్చాడు. నాకు సపోర్ట్గా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా, నా సహచరులు, అభిమానులందరికి ధన్యవాదాలు" అని తన రిటైర్మెంట్ ప్రకటనలో స్టోయినిస్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు 71 వన్డేలు ఆడిన మార్కస్ స్టోయినిస్.. 1495 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 48 వికెట్లు తీశాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టోయినిస్ తీసుకున్న నిర్ణయం ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే ఆస్ట్రేలియా తమ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సేవలు కోల్పోయే సూచనలు కన్పిస్తున్నాయి. చీలమండ గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ ఛాంపియన్స్ ట్రొఫీకి దూరమయ్యే అవకాశముంది.ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుపాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. స్టోయినిష్ స్ధానంలో మరో కొత్త ఆటగాడు ఈ జట్టులోకి రానున్నాడు.చదవండి: CT 2025: 'బుమ్రా దూరమైతే అతడికి ఛాన్స్ ఇవ్వండి.. అద్భుతాలు సృష్టిస్తాడు' -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు అతి భారీ షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy) ముందు ఆస్ట్రేలియాకు (Australia) అతి భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) మెగా టోర్నీకి దూరం కానున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ పరోక్షంగా వెల్లడించాడు. కమిన్స్ కాలి మడమ సమస్యతో బాధపడుతున్నట్లు మెక్డొనాల్డ్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరమైన పక్షంలో ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆసీస్ కెప్టెన్సీ రేసులో ఉంటారని మెక్డొనాల్డ్ అన్నాడు. కమిన్స్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న టెస్ట్ సిరీస్లోనూ పాల్గొనడం లేదు. అతని భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనందున లంక సిరీస్కు దూరంగా ఉన్నాడు. టెస్ట్ జట్టులో లేని సభ్యులు లంకతో వన్డే సిరీస్ కోసం ఇవాళ ఆస్ట్రేలియా నుంచి బయల్దేరాల్సి ఉంది. ఈ బృందంలో కమిన్స్ లేడు. మరోవైపు మెక్డొనాల్డ్ మరో ఆసీస్ పేసర్ గాయంపై కూడా కీలక అప్డేట్ ఇచ్చాడు. గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే వైదొలిగిన జోష్ హాజిల్వుడ్ ఫిట్నెస్ సాధించేందుకు పోరాడుతున్నాడని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజిల్వుడ్ కూడా అనుమానమే అని మెక్డొనాల్డ్ పరోక్షంగా వెల్లడించాడు. కొద్ది రోజుల ముందే ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి వైదొలిగాడు. ఇప్పుడు కమిన్స్, హాజిల్వుడ్ కూడా మెగా టోర్నీకి దూరమైతే ఆ జట్టు విజయావకాశాలు పూర్తి స్థాయిలో దెబ్బతింటాయి. మార్ష్కు ప్రత్యామ్నాయ ఆటగాడిని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా ప్రకటించలేదు. బ్యూ వెబ్స్టర్ మార్ష్కు బదులు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో యాడ్ అవుతాడని కోచ్ మెక్డొనాల్డ్ అన్నాడు. పై ముగ్గురితో పాటు ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్న మరికొందరు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఆల్రౌండర్లు మార్కస్ స్టోయినిస్, ఆరోన్ హార్డీ గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితాలో ఉన్నారని సమాచారం.కాగా, ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం రెండు టెస్ట్లు, రెండు వన్డేల సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో తొలుత టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందటే తొలి టెస్ట్ ముగిసింది. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియాలో ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లో ఆసీస్కు స్టీవ్ స్మిత్ సారథ్యం వహిస్తున్నాడు (కమిన్స్ గైర్హాజరీలో). తొలి టెస్ట్లో స్మిత్ కెప్టెన్సీలో సత్తా చాటడమే కాకుండా వ్యక్తిగతంగానూ రాణించాడు. ఈ మ్యాచ్లో స్మిత్ (141) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్లో ఆసీస్ వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ తన అరంగేట్రం టెస్ట్లోనే శతక్కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. ఆసీస్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ రేపటి నుంచి (ఫిబ్రవరి 6) ప్రారంభమవుతుంది. అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్ ఇంగ్లండ్తో తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆసీస్ జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న ట్రవిస్ హెడ్
2025 ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ విజేతల వివరాలను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (ఫిబ్రవరి 3) ప్రకటించింది. ట్రవిస్ హెడ్, జోష్ హాజిల్వుడ్, ఆడమ్ జంపా, అన్నాబెల్ సదర్ల్యాండ్, ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ వివిధ ఫార్మాట్లకు సంబంధించిన అవార్డులు గెలుచుకున్నారు. విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ తొలిసారి అలెన్ బోర్డర్ మెడల్ను గెలుచుకున్నాడు. ఈ మెడల్ కోసం జోష్ హాజిల్వుడ్, పాట్ కమిన్స్ హెడ్తో పోటీపడ్డారు. ఔహెడ్కు మొత్తం 208 ఓట్లు వచ్చాయి. హాజిల్వుడ్ కంటే 50 ఓట్లు, కమిన్స్ కంటే 61 ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. గతేడాది ఫార్మాట్లకతీతంగా రాణించినందుకు హెడ్కు అలెన్ బోర్డర్ మెడల్ దక్కింది. హెడ్ 2024లో మూడు ఫార్మాట్లలో 1427 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. హెడ్.. అలెన్ బోర్డర్ మెడల్తో పాటు మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం అలెక్స్ క్యారీ హెడ్తో పోటీపడ్డాడు.హాజిల్వుడ్కు టెస్ట్ ప్లేయర్, జంపాకు టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులుగతేడాది టెస్ట్ల్లో ఇరగదీసిన జోష్ హాజిల్వుడ్కు షేన్ వార్న్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. హాజిల్వుడ్ 2024లో 13.17 సగటున 30 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన కారణంగా హాజిల్వుడ్కు టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. గతేడాది పొట్టి ఫార్మాట్లో విశేషంగా రాణించిన ఆడమ్ జంపాకు మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.మహిళల విభాగానికి వస్తే.. అన్నాబెల్ సదర్ల్యాండ్ తొలిసారి బెలిండా క్లార్క్ అవార్డు గెలుచుకుంది. సదర్ల్యాండ్ గతవారం యాషెస్ సిరీస్ ఏకైక టెస్ట్లో ఇంగ్లండ్పై సెంచరీ సాధించింది. గత సీజన్ చివర్లో సదర్ల్యాండ్ సౌతాఫ్రికాపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ (210) చేసింది. సదర్ల్యాండ్ గతేడాది మూడు ఫార్మాట్లలో 46.94 సగటున 798 పరుగులు చేసి 34 వికెట్లు పడగొట్టింది.గార్డ్నర్కు వన్డే, మూనీకి టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులుఆష్లే గార్డ్నర్ 2024 ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. గార్డ్నర్ గతేడాది వన్డేల్లో 385 పరుగులు చేసి 23 వికెట్లు పడగొట్టింది. బెత్ మూనీ ఆస్ట్రేలియా మహిళల టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. మూనీ గతేడాది టీ20ల్లో 47.53 సగటున, 129.83 స్ట్రయిక్రేట్తో 618 పరుగులు చేసింది.మ్యాక్స్వెల్, పెర్రీలకు బిగ్బాష్ లీగ్ అవార్డులుఆల్రౌండర్లు గ్లెన్ మ్యాక్స్వెల్, కూపర్ కన్నోలీ జాయింట్గా మెన్స్ బిగ్బాష్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నారు. ఎల్లిస్ పెర్రీ, జెస్ జొన్నాసెన్ జాయింట్గా మహిళల బిగ్బాష్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నారు. -
లేటు వయసులోనూ ఇరగదీసిన వార్నర్.. వచ్చాడు.. విరుచుకుపడ్డాడు..!
అబుదాబీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో (ILT20 2025) దుబాయ్ క్యాపిటల్స్ (Dubai Capitals) వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) వచ్చీరాగానే తన ప్రతాపం చూపించాడు. ఐఎల్టీ20లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. అబుదాబీ నైట్రైడర్స్పై విధ్వంసకర ఇన్నింగ్స్ (57 బంతుల్లో 93 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) ఆడి తన జట్టుకు క్వాలిఫయర్స్కు చేర్చాడు. తాజాగా ఇన్నింగ్స్తో వార్నర్ తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించాడు. వార్నర్ మెరుపు బ్యాటింగ్తో చెలరేగడంతో ఈ మ్యాచ్లో నైట్రైడర్స్పై క్యాపిటల్స్ 26 పరుగుల తేడాతో గెలుపొందింది.క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో వార్నర్తో పాటు షాయ్ హోప్ (24 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గుల్బదిన్ నైబ్ (25 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), దసున్ షనక (12 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. షనక చివర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చివరి రెండు ఓవర్లలో షనక ఎక్కువ భాగం స్ట్రయిక్ తీసుకుని వార్నర్కు బ్యాటింగ్ ఇవ్వలేదు. చివరి రెండు ఓవర్లలో వార్నర్కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చి ఉంటే సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. షనక, వార్నర్ ధాటికి నైట్రైడర్స్ బౌలర్ జేసన్ హోల్డర్ 4 ఓవర్లలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు. నైట్రైడర్స్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్, హోల్డర్, సునీల్ నరైన్, ఇబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్ చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి లక్ష్యానికి 27 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రియస్ గౌస్ (47 బంతుల్లో 78; 7 ఫోర్లు, 4 సిక్సర్లు).. ఆఖర్లో జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు), సునీల్ నరైన్ (8 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నైట్రైడర్స్ను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. క్యాపిటల్స్ బౌలర్ దుష్మంత చమీరా 19వ ఓవర్ను అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవరే నైట్రైడర్స్ విజయావకాశాలపై నీళ్లు చల్లింది.కాగా, ప్రస్తుత ఐఎల్టీ20 ఎడిషన్లో దుబాయ్ క్యాపిటల్స్తో పాటు డెజర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్ క్వాలిఫయర్స్కు చేరుకున్నాయి. గల్ఫ్ జెయింట్స్, అబుదాబీ నైట్రైడర్స్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి.ఉదయం శ్రీలంకలో సెంచరీ.. సాయంత్రం అబుదాబీలో మెరుపు ఇన్నింగ్స్నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో క్యాపిటల్స్ ఆటగాడు దసున్ షనక మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు ముందు షనక కొన్ని మైళ్ల దూరం ప్రయాణించాడు. ఉదయం శ్రీలంకలో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో సెంచరీ బాదిన షనక.. సాయంత్రం నైట్రైడర్స్పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షనక.. మేజర్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా సింహలీస్ క్లబ్కు ఆడుతూ 87 బంతుల్లో 123 పరుగులు చేశాడు. -
ఆస్ట్రేలియాను ముంచెత్తిన వరదలు
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ను వరదలు ముంచెత్తాయి. అవి ముంచెత్తడంతో వేలాది మంది ఇళ్లను వదిలి పారిపోయారు. సోమవారం రికార్డు స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద నీరు రెండో అంతస్తు స్థాయికి పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరదలతో టౌన్స్ విల్లే, పర్యాటక కేంద్రమయిన కెయిర్న్స్ మధ్య రహదారులు తెగిపోయాయి. ఉత్తర క్వీన్స్ల్యాండ్లోని కొన్ని ప్రాంతాల్లో 700 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో 24 గంటల్లో ఆరు గంటల్లోనే 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరదలతో హెర్బర్ట్ నది నీటిమట్టం 15.2 మీటర్లకు చేరుకుంది. కుండపోత వర్షాలు, ఈదురు గాలులు మరింత ఆకస్మిక వరదలకు దారితీసే అవకాశం ఉందని బ్యూరో హెచ్చరించింది. సుమారు 200,000 మంది జనాభా ఉన్న టౌన్స్విల్లే నగరంలో గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వరదలు వచ్చాయని క్వీన్స్ల్యాండ్ ప్రీమియర్ డేవిడ్ క్రిసఫుల్లీ తెలిపారు.