breaking news
australia
-
బోండి బీచ్ ఎఫెక్ట్.. ‘గన్ బైబ్యాక్’ సంచలనం!
ఆస్ట్రేలియా ప్రభుత్వం బోండి బీచ్ ఉగ్రవాద ఘటన దరిమిలా దేశవ్యాప్తంగా తుపాకీ సంస్కరణల దిశగా ముందడుగు వేసింది. మూడు దశాబ్దాల అనంతరం అత్యంత భారీస్థాయిలో ‘గన్ బైబ్యాక్’ పథకాన్ని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అధికారికంగా ప్రకటించారు. బోండి బీచ్లో జరిగిన భీకర ఉగ్రవాద దాడి నేపథ్యంలో, తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసి, దేశ పౌరుల భద్రతను కాపాడే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నాటి ‘పోర్ట్ ఆర్థర్’ మారణకాండలలో ..దేశంలో 1996లో జరిగిన ‘పోర్ట్ ఆర్థర్’ మారణకాండ తర్వాత ఆస్ట్రేలియా చేపడుతున్న అతిపెద్ద ఆయుధ సేకరణ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. నాడు టాస్మేనియాలోని పోర్ట్ ఆర్డర్ ద్వీపంలో ఒక సాయుధ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 35 మంది మృతిచెందారు. ఈ ఘటన దరిమిలా ఆస్ట్రేలియా ప్రభుత్వం తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేసింది. అప్పట్లో సుమారు ఏడు లక్షల ఆయుధాలను తొలగించగా, ప్రస్తుతం ఈ పథకం ద్వారా లక్షలాది తుపాకులను సేకరించాలని ఆస్ట్రేలియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.మూడు విధాలుగా సేకరణలైసెన్స్ కలిగిన యజమానుల వద్దనున్న మిగులు ఆయుధాలను లేదా కొత్తగా నిషేధించిన ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తే, వారికి తగిన పరిహారం చెల్లించనున్నారు. ఈ భారీ ఆపరేషన్ను అటు ఫెడరల్, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్నాయి. రాష్ట్ర పోలీసులు, అధీకృత డీలర్లు తుపాకీలను సేకరిస్తారు. ఇలా సేకరించిన ఆయుధాల నాశనాన్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు స్వయంగా పర్యవేక్షిస్తారు. దీనివల్ల నిధుల వినియోగం, భద్రతలో లోపాలు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ సాగుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది.40 లక్షలకు పైగా తుపాకులుబోండి బీచ్లో ఇస్లామిక్ స్టేట్ భావజాలంతో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని అల్బనీస్.. ప్రస్తుతం దేశంలో 40 లక్షలకు పైగా తుపాకులు చెలామణిలో ఉన్నాయని, ఇది పోర్ట్ ఆర్థర్ సమయం కంటే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తుపాకీ నియంత్రణకు ఇదే సరైన సమయమని ఆయన స్పష్టం చేశారు. ఈ ‘బైబ్యాక్’లో ప్రధానంగా మూడు రకాల ఆయుధాలను సేకరించనున్నారు.తుపాకీ నియంత్రణకు సమగ్ర ప్యాకేజీకొత్తగా నిషేధించిన అత్యాధునిక ఆయుధాలు, ఇప్పటికే చట్టవిరుద్ధంగా ముద్ర వేసినవి, యజమానులు ఇకపై తమకు అవసరం లేదని భావించే అదనపు ఆయుధాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. ఫలితంగా అనవసరంగా ఇళ్లలో ఉండే ఆయుధాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం కేవలం బైబ్యాక్ మాత్రమే కాకుండా, తుపాకీ నియంత్రణ కోసం ఒక సమగ్ర ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి గరిష్టంగా ఎన్ని తుపాకులు కలిగి ఉండాలనే దానిపై కఠినరీతిలో పరిమితులు విధిస్తారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గల తుపాకీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘నేషనల్ గన్ రిజిస్టర్’ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది.పౌర స్వేచ్ఛావాదుల విమర్శలు2026 మధ్య నాటికి తుపాకీ నియంత్రణ కొత్త చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానాన్ని న్యాయవాదులు, కాల్పుల బాధితులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆయుధాల సంఖ్య తగ్గితేనే సమాజం సురక్షితంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై కొందరు తుపాకీ యజమానులు, పౌర స్వేచ్ఛావాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. చట్టబద్ధంగా ఆయుధాలు కలిగిన వారు ఈ నిర్ణయంతో ఇబ్బంది పడతారని వారు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ దేశంలో భద్రతా ముప్పు దృష్ట్యా ఇది ఒక తప్పనిసరి చర్య అని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది.ఇది కూడా చదవండి: ఆగని పాక్ అరాచకం.. బలూచ్ మహిళల దీనగాథలు -
మార్చురీలోనే సాజిద్ మృతదేహం
తోటి వ్యక్తుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న సాజిద్ను తాను క్షమించనని.. ఆ డెడ్బాడీని తాను చూడనని.. అంత్యక్రియలు చేయనని... పోలీసులకు స్పష్టం చేసింది ఆస్ట్రేలియా ముష్కరదాడి కింగ్పిన్ సాజిద్ భార్య వెర్నా. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోండీ ముష్కర కాల్పుల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన తెలిసిందే.ఆ కాల్పులు జరిపి 16మందిని పొట్టన పెట్టుకున్న సాజిద్ అక్రమ్ను అదే రోజు పోలీసులు కాల్చి చంపేశారు. అయితే డిసెంబర్ 14న జరిగిన ఈ ఘటన తర్వాత అతని మృతదేహాన్ని తీసుకెళ్లమని సాజిద్ కుటుంబీకులను, భార్య వెర్నాను పోలీసులు కోరినా.. ఆమె మాత్రం భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేయడానికి నిరాకరించింది. దీంతో సాజిద్ అంత్యక్రియలు చేయడానికి ఆస్ట్రేలియా పోలీసులే సిద్ధమవుతున్నారు.ఏం జరిగింది ఆరోజుడిసెంబర్ 14న ఆస్ట్రేలియాలోని బోండిలోని చనుకా బై ది సీ ఈవెంట్ పై ఒక్క సారిగా విరుచుకు పడ్డ సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని ఈ ఉగ్రదాడి కారణంగా ఒక్కసారిగా 16మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న ఈవెంట్ ఒక్కసారిగా మారణహోమంగా మారిపోయింది. క్షణాల వ్యవధిలో 16మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.సుమారు 100 మంది గాయాల బారిన పడ్డారు. ధైర్యం చేసిన మరో స్థానికుడు అహ్మద్ ధైర్య సాహసాలు ప్రదర్శించి... తూటాలకు భయపడకుండా సాజిద్ను ఎదుర్కొని ప్రాణనష్టాన్ని నివారించగలిగాడు. అప్పట్లో అక్కడికి చేరుకున్న పోలీసులు సాజిద్ను కాల్చి చంపేయడం.. అతని కుమారుడు నవీద్ను అదుపులోకి తీసుకోవడంతో డెత్గేమ్కు ఫుల్స్టాప్ పడింది. మారణకాండ గురించి తెలుసుకున్న ప్రపంచ దేశాలు తీవ్రవాద ఘటనను ఖండించాయి.నవీద్పై 59 కేసులుఆ తర్వాత పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. మారణహోమాన్ని సృష్టించిన సాజిద్ అదే రోజు చనిపోవడంతో అతని డెడ్బాడీని కరోనర్ కార్యాలయంలోని మార్చురీకి తరలించి తదుపరి దర్యాప్తుపై పోలీసులు ఫోకస్ చేశారు. అక్కడి చట్ట ప్రకారం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పచెప్పాల్సి ఉంటుంది. కానీ భార్య వెర్నా మాత్రం ఆ డెడ్బాడీని తాను తీసుకెళ్లనని స్పష్టం చేసింది. ఈ తీవ్రవాద ఘటనలో ప్రధాన పాత్ర పోషించి పోలీసుల కాల్పుల్లో మరణించిన సాజిద్ కుమారుడు 24ఏళ్ల నవీద్ మాత్రం ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు.అతన్ని విచారించిన ఆస్ట్రేలియా పోలీసులు అతనిపై మొత్తం 59 కేసులు నమోదు చేశారు. వీటిలో 16 హత్య కేసులు, ఉగ్రవాద చర్యకు పాల్పడిన కేసుతో పాటు తీవ్రవాద కార్యకలాపాలు, ఇతర కేసులున్నాయి. విచారించగా... తండ్రీ కొడుకులు ఫిలిప్పీన్స్లోని మిండనావోలో "సైనిక తరహా శిక్షణ" పొందినట్లు, ఐసిస్ నుంచి ప్రేరణ పొందినట్లు నవీద్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో అనే ద్వీపంలో 1990 నుంచి ఐఎస్ తీవ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు సమాచారం.దూరమైన బంధువులుఅంతటి ఘోరానికి పాల్పడ్డ సాజిద్ గురించి హైదరాబాద్లోని కుటుంబీకులు సైతం అతని మరణంపై ఎలాంటి సంతాపం వ్యక్తం చేయడం లేదు. సాజిద్ ఇప్పుడు కాదు... 1998లోనే దూరమయ్యాడని... తాజా ఉదంతం కారణంగా అతను మరింత దూరమయ్యాడని చెబుతున్నారు. అతనిలో అంతటి రాక్షసత్వం ఉందని... అతని "రాడికలైజేషన్" గురించి "తమకు తెలియదు" అని టోలీచౌకీలో నివాసముంటున్న అతని వృద్ధ తల్లి, సోదరుడు చెబుతున్నారు.ఆస్తులు కూడ బెట్టిన సాజిద్తీవ్రవాదం జీర్ణించుకున్న సాజిద్ గతంలోనే భార్యతో కూడా దూరమయ్యాడట. అయితే ఘటనకు ఆరు నెలల ముందు నుంచి భార్యతో తిరిగి సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భార్య వెర్నా పోలీసులకు వివరించింది. అయినా భార్యతో కాకుండా కుమారుడితో కలిసి కాంప్సీ ప్రాంతంలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే నివసిస్తున్నాడు. అంతకు ముందే భారీగా ఆస్తులు కూడబెట్టిన సాజిద్ తొలుత 7లక్షల డాలర్లకు మూడు పడకగదుల ఆస్తిని 2016లో కొనుగోలు చేసి భార్య వెర్నా పేరిట రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత 5 లక్షల డాలర్లతో మరో ఇంటిని కొనుగోలు చేశాడు. అతను మరణించిన నాటికి అతని ఆస్తుల విలువ సుమారు 2 మిలియన్ డాలర్ల వరకు ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించినట్లు సమాచారం.మారణకాండకు పక్కా స్కెచ్మారణకాండ సృష్టించడానికి తండ్రీ కొడుకులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 14న సాయంత్రం7గంటల సమయంలో కాంప్సీ ప్రాపర్టీ నుండి బోండి బీచ్ కు వెళ్లారు. క్యాంప్ బెల్ పరేడ్ లో హ్యుండాయ్ ఎలాంట్రా కారును పార్క్ చేసి, వాహనం కిటికీపై ఐసిస్ జెండాను ఎగరవేశారు. బోండి బీచ్ నుండి మీటర్ల దూరంలో ఉన్న పార్కులో హనుక్కా మొదటి రోజును జరుపుకుంటున్నప్పుడు యూదు కుటుంబాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులకు చిక్కిన కొడుకు నవీద్ ఇచ్చిన ఆధారాలతో ఆ సాయంత్రం, సిడ్నీ నైరుతి ప్రాంతంలోని బోనీరిగ్ లోని ఒక ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు ఆ ఇంటిని వెర్నా, సాజిద్ లు కలిసి 2016లో కొనుగోలు చేశారని గుర్తించారు.ఇండియాలో నేర చరిత్ర లేదుహైదరాబాద్కు చెందిన సాజిద్ ఆస్ట్రేలియాకు వలస వచ్చిన తర్వాత ఆరుసార్లు ఇండియాకు వచ్చి వెళ్లినట్లు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా ఆస్తి సంబంధిత అంశాలు, అతని వృద్ధ తల్లిదండ్రులను పరామర్శించడం లాంటి కారణాలతోనే వచ్చి వెళ్లాడు. అయినప్పటికీ, అతని తండ్రి మరణించినప్పుడు అతను భారతదేశానికి రాలేదు. ఉపాధి నిమిత్తం 1998లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సాజిద్ 1999లోనే యూరప్కు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.భారతీయ పాస్ పోర్ట్ కలిగి ఉన్న 50 ఏళ్ల సాజిద్కు ఇండియా నుంచి నేర చరిత్ర లేదు. అతను భారతదేశంలో రాడికలైజ్ అయ్యే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని అతని కుటుంబం కూడా అతని "రాడికలైజేషన్" గురించి "తమకు తెలియదు" అని చెబుతున్నారు. ఇప్పటికీ మధ్యతరగతి అధికంగా ఉన్న టోలిచౌకిలోని ఓ ఇంట్లో సాజిద్ తల్లి, సోదరుడు నివాసముంటున్నారు. సాజిద్ గురించి.. అతని రాకపోకల గురించి తమకేమీ తెలియదని ఇరుగు పొరుగు వారు కూడా చెప్పడం గమనార్హం.ఫిలిప్పీన్స్లో నెల రోజులు తీవ్రవాద శిక్షణఅయితే తండ్రీ కొడుకులు ఫిలిప్పీన్స్ లో తీవ్రవాద శిక్షణ పొందినట్లు సంకేతాలు స్పష్టం అయ్యాయి. గత నవంబర్లో నెల రోజల పాటు దక్షిణ ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లిన సాజిద్, నవీద్లో అక్కడే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ మిండనోవా అనే ద్వీపంలో "సైనిక తరహా శిక్షణ" పొందినట్లు ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. ఫిలిప్పీన్స్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న ఆస్ట్రేలియన్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో ద్వీపం.. 1990 దశకం నుంచే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు షెల్టర్జోన్గా మారిందని... తీవ్రవాదులు తరచూ సందర్శించే మిండనోవా ద్వీపం వారికోసం ఓ హాట్ స్పాట్ అని చెప్పవచ్చు.తండ్రీ కొడుకులిద్దరూ నవంబర్ 1న సిడ్నీ నుంచి ఫిలిప్పీన్స్ చేరుకున్నట్లు ఫిలిప్పీన్స్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. మిండనావోలోని దావావో నగరానికి వెళ్లే ముందు వారు మనీలాలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఇద్దరూ దావావోను తమ తుది గమ్యస్థానంగా మార్క్ చేసినట్లు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ తెలిపింది. వీళ్లిద్దరూ ఫిలిప్పీన్స్లో ఏ విధమైన ఉగ్రవాద శిక్షణను పొందారనే అంశాలను రాబట్టేందుకు ఫిలిప్పీన్స్ అధికారులతో ఆస్ట్రేలియా పోలీసులు చర్చలు సాగిస్తున్నారు.అయితే ఐసిస్తో సంబంధాలున్నాయన్న వాదనను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ తిరస్కరించారు. అయితే ఐసిస్ తో సంబంధం ఉన్న ఉగ్రవాదుల సంఖ్య కేవలం 50 మాత్రమే ఉందని ఫిలిప్పీన్స్ సైన్యాధికారి తెలిపారు. తిరిగి తండ్రీ కొడుకులు నవంబర్ 28న దావావో నుండి మనీలాకు కనెక్టింగ్ విమానంలో అక్కడి నుంచి బయలుదేరి సిడ్నీ చేరుకున్నారు. ఉగ్రవాదుల వాహనం నుండి ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన రెండు జెండాలను స్వాధీనం చేసుకున్నారు, ఐసిస్తో సంబంధం కలిగి ఉన్నాయనడానికి కొన్ని ఆధారాలను ఆస్ట్రేలియా పోలీసులు సేకరించారు.- మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, సాక్షి డిజిటల్ -
ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ
-
అత్యంత అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ స్టార్క్
ఆసీస్ వెటరన్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 750 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో స్టార్క్కు ముందు కేవలం 12 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆసీస్ తరఫున కేవలం ఇద్దరే 750 వికెట్ల మార్కును తాకారు. ఇంగ్లండ్తో ఇవాళ ముగిసిన మూడో యాషెస్ టెస్ట్లో స్టార్క్ ఈ ఘనత సాధించాడు.ఫార్మాట్లవారీగా స్టార్క్ ప్రదర్శనలు..103 టెస్ట్ల్లో 424 వికెట్లు130 మ్యాచ్ల్లో 247 వికెట్లు65 టీ20ల్లో 79 వికెట్లుఅంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..మురళీథరన్-1347షేన్ వార్న్-1001జిమ్మీ ఆండర్సన్-991అనిల్ కుంబ్లే-956గ్లెన్ మెక్గ్రాత్-949వసీం అక్రమ్-916స్టువర్ట్ బ్రాడ్-847షాన్ పొల్లాక్-829వకార్ యూనిస్-789టిమ్ సౌథీ-776రవిచంద్రన్ అశ్విన్-765చమింద వాస్-761మిచెల్ స్టార్క్-750అడిలైడ్ వేదికగా ఇవాళ ముగిసిన యాషెస్ మూడో టెస్ట్లో స్టార్క్ 4 వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాట్తోనూ (54) సత్తా చాటాడు. ఈ సిరీస్ తొలి రెండు టెస్ట్ల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన (7,3) నమోదు చేసిన అతను.. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో 8 వికెట్లతో (6,2) సత్తా చాటాడు.రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో స్టార్క్ బ్యాటింగ్లోనూ (77 పరుగులు) రాణించాడు. తొలి రెండు టెస్ట్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన స్టార్క్ ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.మూడో టెస్ట్లో స్టార్క్తో పాటు అలెక్స్ క్యారీ (106, 5 క్యాచ్లు, 72, ఓ స్టంప్, ఓ క్యాచ్) విజృంభించడంతో ఆసీస్ ఇంగ్లండ్పై 82 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్ మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్ట్ల్లో కూడా ఆసీసే విజయం సాధించింది. ఈ సిరీస్లోని నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న మొదలవుతుంది.చదవండి: Ashes Series 2025: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం -
2012లో హైదరాబాద్కు సాజిద్.. 27 సార్లు ఎందుకు వచ్చాడు?
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్లో మారణహోమానికి తెగబడి, పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. టోలిచౌకి అల్ హనస్ కాలనీలో ఉండే అతడి కుటుంబీకులను ప్రశ్నించిన నిఘా వర్గాలు ఈ విషయం గుర్తించాయి. మరోపక్క గడిచిన 27 ఏళ్లలో అతడు నగరానికి రాకపోకలు సాగించిన అంశాల పైనా అధికారులు వివరాలు సేకరించారు. 👉నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూం కాలేజీ నుంచి బీకాం పూర్తి చేసిన సాజిద్ 1998 నవంబర్లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. 2000లో ఇటాలియన్ వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమె ఆ దేశంలోని పర్మనెంట్ రెసిడెంట్గా (పీఆర్) ఉన్నారు. దీంతో 2001లో సాజిద్ తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నారు.👉ఆ దేశ పర్మనెంట్ రెసిడెంట్ను వివాహం చేసుకున్నా... వారితో చట్టబద్ధంగా సహజీవనం చేస్తున్నా ఆస్టేలియా ఈ వీసాను జారీ చేస్తుంది. ఇది కలిగి ఉన్న వాళ్లకు అక్కడ ఉండే, పని చేసే, చదువుకునే, మెడికేర్ సదుపాయం పొందే హక్కులు వస్తాయి. ఆపై పీఆర్గా మారిన సాజిద్ 2002లో రెసిడెంట్ రిటర్న్ వీసా తీసుకున్నారు. 👉పీఆర్ హోదా ఉన్న వారికి ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా వచ్చిపోయే పరిమితి ఐదేళ్ల కాలానికే ఉంటుంది. ఆ తరువాతఅవసరమైన వారు దరఖాస్తు చేసుకుని ఈ రెసిడెంట్ రిటర్న్ వీసా పొందాల్సి ఉంటుంది. ఇలా తన పీఆర్ హోదాను సాజిద్ అక్రమ్ కొనసాగించారు. 👉ఆస్ట్రేలియాలో ఓటు హక్కు ఉండాలన్నా, ఆ దేశ పాస్పోర్టు పొందాలన్నా, విదేశాల్లో ఆస్ట్రేలియన్ రాయబార కార్యాలయం ద్వారా రక్షణ పొందాలన్నా సిటిజన్షిప్ అవశ్యం. ఈ నేపథ్యంలోనే సాజిద్ అనేకసార్లు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి ప్రయత్నించాడని, అయితే అతడి దరఖాస్తు ప్రతి సందర్భంలోనే తిరస్కరణకు గురైందని కుటుంబీకులు చెప్తున్నారు. అందుకు కారణాలను మాత్రం అతడు ఎప్పుడూ తమతో పంచుకోలేదని పోలీసులకు వివరించారు. 👉ఇతడి కుమారుడైన మరో ఉగ్రవాది నవీద్ అక్రమ్ 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలోనే జన్మించడంతో అక్కడి పౌరసత్వం, ఆ దేశ పాస్పోర్టు లభించాయి. గడిచిన 27 ఏళ్లల్లో సాజిద్ ఆరుసార్లు, అక్రమ్ ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లారని ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రాకపోకలకు గల కారణాల పైనా స్పష్టత ఇచ్చాయి. 👉2001లో తొలిసారిగా తన భార్యతో కలిసి వచ్చిన సాజిద్ ఇక్కడ కుటుంబీకుల సమక్షంలో తమ సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకున్నారు. 2004లో కుమారుడు నవీద్ను టోలిచౌకీలో ఉన్న కుటుంబీకులకు చూపించడానికి తీసుకువచ్చాడు. 👉2009లో తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన సాజిద్... ఆ తర్వాత వచ్చి తల్లితో పాటు కుటుంబీకుల్నీ కలిసి వెళ్లాడు. వారసత్వంగా తనకు సంక్రమించిన ఆస్తి అయిన శాలిబండలోని ఇంటిని విక్రయించడానికి 2016లో వచ్చి వెళ్లాడు. 👉ఈ డబ్బు వెచ్చించే ఆస్ట్రేలియాలోని బోనిరిగ్ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇందులో భార్య సైతం కొంత షేర్ కలిగి ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సాజిద్ తన వాటాను కూడా భార్య వెనెరా పేరుతో బదిలీ చేశాడు. 👉2022 ఫిబ్రవరిలో ఆఖరుసారిగా హైదరాబాద్ వచ్చిన సాజిద్ తన కుటుంబీకుల్ని కలిసి వెళ్లాడు. ఆ సందర్భంలోనే పదేళ్ల కాలపరిమితికి తన పాస్పార్ట్ను రెన్యువల్ చేయించుకున్నాడు. సాజిద్ వివరాలు ఇలా..1998 నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్.ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెంట్ వీసా కోసం 27 సార్లు ప్రయత్నించిన సాజిద్.2000 సంవత్సరంలో వెన్నసాను వివాహం చేసుకున్న సాజిద్.2001లో పార్ట్నర్ వీసా మార్చుకున్న సాజిద్.2008లో రెసిడెంట్ రిటన్ వీసా పొందిన సాజిద్.27 సార్లు ప్రయత్నం తర్వాత రెసిడెంట్ రిటన్ వీసా పొందిన సాజిద్.27 ఏళ్లుగా ఇండియా రాకపోకలపై ఆరా తీస్తున్న అధికారులు.2012లో చివరిసారిగా హైదరాబాద్ రాక.నవీద్ 2019లో సిడ్నీలోని అల్–మురాద్ ఇన్స్టిట్యూట్లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు.అంతకుముందే.. 2018లో హైదరాబాద్లో ఆస్తిని అమ్మి ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుగోలు.2022 తర్వాత సాజిద్ ఇండియాకు రాలేదు. తండ్రి మరణించినా, కుటుంబంలో ఇతర శుభకార్యాలకు హాజరుకాలేదు.ఇదిలా ఉండగా.. బాండీ బీచ్ మారణహోమంలో పాల్గొన్న ఇరువురిలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో చనిపోగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడిపై న్యూ సౌత్ వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించినవీ ఉన్నాయి. సాజిద్, నవీద్లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాజిద్ వినియోగించిన కారులో ఆరు తుపాకులు, రెండు ఐసిస్ జెండాలు ఉన్నాయి. -
యూదులపై కాల్పులు: అక్కడ మ్యారేజ్.. ఇక్కడ నిఖా!
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో యూదులపై కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ రెండుసార్లు వివాహం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. 1998 నవంబర్లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ 1999లో యూరోపియన్ మహిళ వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడు. తొలుత అక్కడ అమలులో ఉన్న సాధారణ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ సాజిద్ తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి నిఖా జరిగింది. వీరికి 2001 ఆగస్టు 12న నవీద్ జన్మించగా.. అతడి 15వ ఏట తండ్రితో కలిసి హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో కొద్దిరోజులు టోలిచౌకీలో ఉండి దూద్బౌలీలో కొన్ని స్థిరాస్తుల్ని విక్రయించి వెళ్లినట్లు తెలిసింది. ఉగ్రవాద బాటపట్టిన సాజిద్, నవీద్ భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలను ముందే ఊహించి ఉంటారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సాజిద్ ఆస్తిపాస్తుల్లో తనకు ఉన్న వాటాలను గత ఏడాది ఫిబ్రవరిలోనే వెనెరాకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. నవీద్ 2019లో సిడ్నీలోని అల్–మురాద్ ఇన్స్టిట్యూట్లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు. అక్కడే ఇతడికి పరిచయమైన వారి ద్వారా ఐసిస్లో చేరాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లు ఫిలిప్పీన్స్లో ఉన్న మిండానావో ఐలాండ్లోని ఐసిస్ శిబిరంలో శిక్షణ తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినప్పటి నుంచి గత ఆదివారం వరకు వీరి కదలికలను పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం ఉదయం వీళ్లు దాదాపు 20 కిమీ ప్రయాణించి బీచ్ వద్దకు చేరుకున్నట్లు ఆధారాలు సేకరించారు. బాండీ బీచ్ మారణహోమంలో పాల్గొన్న ఇరువురిలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో చనిపోగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడిపై న్యూ సౌత్ వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించినవీ ఉన్నాయి. సాజిద్, నవీద్లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాజిద్ వినియోగించిన కారులో ఆరు తుపాకులు, రెండు ఐసిస్ జెండాలను కూడా స్వాదీనం చేసుకున్నారు. -
బెడ్ మీదే బేడీలు !
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ప్రముఖ బాండీ బీచ్ సమీప ఆర్చర్ పార్క్లోని యూదులపై విచక్షణా రహితంగా రైఫిళ్లతో కాల్పులు జరిపి పలువురిని పొట్టనబెట్టుకున్న 24 ఏళ్ల నవీద్ అక్రమ్ను పోలీసులు ఆస్పత్రిలోనే అరెస్ట్చేశారు. బీచ్లో ఇష్టారీతిగా కాల్పులు జరుపుతున్న నవీద్పైకి భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడటంతో అతన్ని సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యపరిస్థితి విషమించి తర్వాత నవీద్ కోమాలోకి వెళ్లాడు. కోమాలో ఉన్న నవీద్ బుధవారం కళ్లు తెరచి కోలుకోగానే ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మందిని చంపినందుకు 15 నేరాలు, ఉగ్రవాద చర్యతో పలువురిని పొట్టనబెట్టుకోవడం, పలువురిని గాయపర్చడం, అక్రమంగా ఆయుధాలు కల్గి ఉండటం, దుర్వినియోగపర్చడం, ఒక భవంతి సమీపంలో బాంబు అమర్చడం, కారులో పేలుడు పదార్థాలను పెట్టడం వంటి అంశాలపై మరో 40కిపైగా నేరాలను ఆ కేసులో పేర్కొన్నారు. నవీద్ కారులో ఇప్పటికే ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండాలను పోలీసులు గుర్తించడంతో అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాల నేరాన్ని సైతం కేసుకు జతచేశారు. మొత్తంగా 59 నేరాలు చేసినట్లుగా అతనిపై కేసు నమోదుచేశారు. వెలుగులోకి మరో జంట సాహసం50 ఏళ్ల ఉగ్రవాది సాజిద్, అతని కుమారుడు నవీద్ సమీప పార్క్ పాదచారుల వంతెన వద్ద కాల్పులతో తెగబడుతున్నప్పుడు వారిని అడ్డుకునేందుకు ఒక వృద్ధజంట ప్రయత్నించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరిస్, సోఫియా గుర్మాన్ అనే వృద్ధ జంట అటుగా వెళ్తున్నప్పుడే ఈ తండ్రీకొడుకులు కాల్పులు మొదలెట్టినట్లు తెలుస్తోంది. వెంటనే వీళ్లను అడ్డుకునేందుకు బోరిస్, సోఫియా విశ్వప్రయత్నంచేశారు. షూటర్ల చేతుల్లోని రైఫిళ్లను లాక్కునే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో దంపతులిద్దరూ కిందపడ్డారు. రైఫిల్ మాత్రం షూటర్ చేతుల్లోనే ఉండిపోయింది. దీంతో షూటర్ జరిపిన కాల్పులకు దంపతులిద్దరూ నేలకొరి వీరమరణం పొందారని ఆస్ట్రేలియా మీడియా వారిని సాహసోపేత చర్యను పొగిడింది. పలువురిని కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన దంపతులను కీర్తిస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు లక్షలాదిగా పోస్ట్లు పెడుతున్నారు. షూటర్ల మీదకు ఇటుకలు విసిరి, గాయపరిచేందుకు ప్రయత్నించిన 60 ఏళ్ల తన తండ్రి రీవెన్ మోరిస్ సైతం ప్రాణాలు కోల్పోయారని కూతురు వెల్లడించారు. -
కేరీ సూపర్ సెంచరీ
అడిలైడ్: వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక ‘యాషెస్ సిరీస్’ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆ్రస్టేలియా... సిరీస్ చేజిక్కించుకునే దిశగా కీలక పోరులోనూ మంచి ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా... బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ ‘శత’క్కొట్టగా... ఉస్మాన్ ఖ్వాజా (126 బంతుల్లో 82; 10 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గాయం కారణంగా గత రెండు టెస్టులకు దూరమైన ఆ్రస్టేలియా రెగ్యులర్ కెపె్టన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగగా... టాస్ వేయడానికి 45 నిమిషాల ముందు స్టీవ్ స్మిత్ అనూహ్యంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ మ్యాచ్కు దూరమయ్యాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వెల్లడించింది. ఐపీఎల్–2026 మినీ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న పేస్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (0) డకౌట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. కేరీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై భారీ జన సందోహం మధ్య తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో జేక్ వెదరాల్డ్ (18)ను ఆర్చర్ అవుట్ చేయగా... మరుసటి ఓవర్లో ట్రావిస్ హెడ్ (10) కూడా వెనుదిరిగాడు. తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన హెడ్ను కార్స్ బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో లబుషేన్ (19)తో కలిసి ఉస్మాన్ ఖ్వాజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. స్మిత్ గైర్హాజరీతో చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న ఖ్వాజా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే లంచ్ అనంతరం ఆర్చర్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి మరోసారి ఆసీస్ను కష్టాల్లోకి నెట్టాడు. అతడి ధాటికి లబుషేన్, హెడ్ పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆసీస్ 94/4తో నిలిచింది. ఈ దశలో అడిలైడ్ ‘లోకల్ బాయ్’ కేరీ గొప్ప సంయమనం కనబర్చాడు. మరో ఎండ్లో ఖ్వాజా కూడా పట్టువదలకుండా ప్రయతి్నంచాడు. ఈ జంట ఐదో వికెట్కు 91 పరుగులు జత చేసింది. తొలి రోజు ఆటకు రికార్డు స్థాయిలో 56,298 మంది అభిమానులు హాజరయ్యారు. అడిలైడ్ మైదానంలో ఇదే అత్యధికం. ‘ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు టెస్టు మ్యాచ్ చూసేందుకు తరలి రావడం అద్భుతంగా ఉంది. సొంత మైదానంలో 56 వేల పైచిలుకు జనం ముందు సెంచరీ చేయడం ఎంతో ప్రత్యేకం’ అని కేరీ అన్నాడు. జోష్ ఇన్గ్లిస్తో ఆరో వికెట్కు 59 పరుగులు జోడించిన కేరీ... ఎనిమిదో వికెట్కు మిచెల్ స్టార్క్ (63 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో కలిసి 50 పరుగులు జోడించాడు. 135 బంతుల్లో ‘యాషెస్ సిరీస్’ల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న కేరీ... కాసేపటికే పెవిలియన్ చేరాడు. స్టార్క్తో పాటు లయన్ (18 బంతుల్లో 0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు అడిలైడ్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా... నేడు మరింత ఎండ తీవ్రత ఉండనుంది. సిడ్నీ బాండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఈ మ్యాచ్లో చేతికి నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. -
బోండీ బీచ్ ఉగ్రదాడిలో ముగ్గురు భారత విద్యార్థులకు గాయాలు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు భారత విద్యార్థులు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, వీరిలో ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన విద్యార్థుల పేర్లు వెల్లడి కాలేదు. కాగా, డిసెంబర్ 14న (ఆదివారం) సిడ్నీలోని బోండీ బీచ్కు సమీపంలో గల ఓ చిన్న పార్కులో యూదులు "హనుక్కా బైదసీ" అనే పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సాయుధులు వేడుకల్లో మునిగిపోయిన యూదులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఈ దుర్ఘటనలో 10 ఏళ్ల బాలుడు సహా 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం 40 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు పోలీసు అధికారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని నవీద్ అక్రమ్గా గుర్తించగా.. మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్వేల్స్ పోలీసులు వెల్లడించారు. వీరిద్దరు పాకిస్తాన్ జాతీయులు. నవీద్కు ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
ఆస్ట్రేలియా ఉగ్రదాడి కేసు.. నిందితుడికి హైదరాబాద్ లింక్స్
హైదరాబాద్: ఆస్ట్రేలియా ఉగ్రదాడి కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ ఉగ్రదాడికి పాల్పడిన సాజిద్ అక్రమ్ అనే వ్యక్తికి హైదరాబాద్ నగరంతో లింక్స్ ఉన్నట్లు వెల్లడైంది. సాజిద్ హైదరాబాద్లో వీసా పొందినట్లు గుర్తించారు. స్టూడెంట్ వీసాపై 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్.. 2001లో పార్టనర్ వీసాగా మార్చుకున్నాడు. ఆపై 2002లో రెసిడెంట్ రిటర్న్స్ వీసా పొందాడు సాజిద్. 2022లో టోలీచౌక్లోని ఆస్తులను అమ్ముకుని తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. హైదరాబాద్లోనే బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన్ సాజిద్.. అక్కడ యూరోపియన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు.దీనిపై తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. సాజిద్ అనే వ్యక్తి 27 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లాడని, తిరిగి భారత్కు ఆరుసార్లు మాత్రమే వచ్చాడన్నారు. సాజిద్తో తెలంగాణకు కానీ, భారత్తో కానీ ఎలాంటి సంబంధం లేదని డీజీపీ వెల్లడించారు. సాజిద్ చివరిసారిగా 2022లో భారత్కు..భారతదేశంలోని సాజిద్ బంధువుల ప్రకారం, గత 27 సంవత్సరాలుగా సాజిద్ కు తన కుటుంబంతో చాలా తక్కువ సంబంధాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత అతను ఆరుసార్లు భారతదేశాన్ని సందర్శించాడు. దీనికి కారణం ఆస్తికి సంబంధించిన కుటుంబ సమస్యలు. ఇండియన్ ఎక్స్ప్రెస్లోని ఒక నివేదిక ప్రకారం, సాజిద్ చివరిసారిగా 2022లో భారతదేశాన్ని సందర్శించాడు. తన తండ్రి మరణించిన సమయంలో కూడా అతను భారతదేశాన్ని సందర్శించలేదని సమాచారం. సాజిద్ లేదా నవీద్ యొక్క తీవ్రమైన అభిప్రాయాలు లేదా కార్యకలాపాల గురించి తమకు తెలియదని కుటుంబం వాదిస్తోంది.అంతకుముందు, సాజిద్ అక్రమ్ గత నెల నవంబర్ 1న తన కుమారుడు నవీద్తో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్లాడని ఫిలిప్పీన్స్ అధికారులను ఉటంకిస్తూ సీఎన్ఎన్ ప్రచురించింది.సాజిద్ భారతీయ పాస్పోర్ట్ను ఉపయోగించగా, అతని కుమారుడు ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ను ఉపయోగించాడు. వారు ఒక నెల నుండి దాడికి ప్రణాళిక వేశారుకాగా, ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్లో ఆదివారం(డిసెంబర్ 14వ తేదీ) ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. బాండీ బీచ్లో హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి:బీచ్ అటాక్.. ఉగ్రవాది తల్లి సంచలన విషయాలు..బాండీ బీచ్ హీరోకు సర్వత్రా ప్రశంసలు.. భారీ విరాళాలు -
బోండీ బీచ్ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన అహ్మద్ అల్ అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టిమరీ దుండగులను నిలువరించిన అహ్మద్కు నాలుగు నుండి ఐదు తుపాకీ గాయాలు అయ్యాయి. చాలా రక్తం పోవడంతో పలు మార్లు ఆపరేషన్లు చేయాల్సి ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. అలాగే ఎడమ భుజం బ్లేడ్ వెనుక భాగంలో ఒక బుల్లెట్ను ఇంకా తీయలేదు. ఈగాయం కారణంగా అతని ఎడమ చేయిని తీసివేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అతని పరిస్థితి ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు అహ్మద్ చూపించిన తెగువ, దైర్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ముఖ్యంగా సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో అహ్మద్ను ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పరామర్శించారు. నిజమైన నేషనల్ హీరో అంటూ కొనియాడారు. ఆస్ట్రేలియన్లకు ప్రేరణ అంటూ అభివర్ణించారు. కాల్పుల తర్వాత వెంటనే బాధితులకు చికిత్స చేయడంలో సహాయం చేసిన అహ్మద్,ఇతరును ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసించారు. VIDEO | "Ahmed al Ahmed represents best of our country, will not let the nation to be divided," says Australian PM Anthony Albanese on Bondi Beach bystander who disarmed shooter.#SydneyAttack #BondiBeachTerrorAttack (Source: Third Party)(Full video available on PTI Videos -… pic.twitter.com/y6K1Ci2NTJ— Press Trust of India (@PTI_News) December 16, 2025 అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హెడ్జ్ ఫండ్ బిలియనీర్ బిల్ అక్మాన్ అహ్మద్ ధైర్య సాహసాలను కొనియాడారు. పెర్షింగ్ స్క్వేర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు అక్మాన్ అహ్మద్ను డేరింగ్ హీరో అంటూ ప్రశంసించారు. కుటుంబానికి మద్దతుగా హెడ్జ్ ఫండ్ సంస్థ ఏర్పాటు చేసిన నిధుల సేకరణకు భారీ స్పందన లభిస్తోంది. గోఫండ్మీ పేజీ విరాళాలు 2 మిలియన్ల డాలర్ల (రూ. 18.15కోట్లు)కు సమీపంలో ఉండటం విశేషం. దాదానె 33వేల మంది విరాళాలందించారు. అంతేకాదు అత్యధిక విరాళం (99,999 డాలర్లు) ఇచ్చిన వ్యక్తిగా విలియం అక్మాన్ నిలవడం విశేషం. సిరియాలో జన్మించిన అహ్మద్, 15 మందిని బలిగొన్న ఈ మారణహోమం సమయంలో కాల్పులకు గురైన వారిలో ఒకరిపైకి దూకి, అతని చేతుల నుండి తుపాకీని లాక్కున్నాడు. ఈ సంఘటన యొక్క అసాధారణ దృశ్యాలు వైరల్ అయ్యాయి. సిడ్నీలోని బోన్డీ బీచ్లో జరిగిన హనుకా కార్యక్రమంలో యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన దుండగులు తండ్రీ కొడుకులేనని ఆస్ట్రేలియా అధికారులు ధృవీకరించారు. ఆస్ట్రేలియా చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడి అయిన ఈ మారణహోమంలో15 మంది మరణించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరిలో 50 ఏళ్ల తండ్రి ఎదురుకాల్పుల్లో మరణించారు. 24 ఏళ్ల కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో హీరోగా నిలిచిన 43 ఏళ్ల అహ్మద్ను దక్షిణ సిడ్నీకి చెందినవాడిగా గుర్తించారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన అహ్మద్ 2006లో సిరియా నుండి ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఆస్ట్రేలియన్ పౌరసత్వం ఉన్న అతను చిన్న షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. -
బీచ్ అటాక్.. ఉగ్రవాది తల్లి సంచలన విషయాలు
ఆస్ట్రేలియా బీచ్లో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 16మంది అమాయక ప్రజలను పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాల్పులు జరిపిన ఉగ్రవాది తల్లి ఆసక్తికర విషయాలు తెలిపింది. కాల్పులు జరిపే కొద్ది సేపటి ముందు తన కుమారుడితో ఫోన్ మాట్లాడినట్లు పేర్కొంది. తన కుమారుడు తనతో ఎప్పటిలాగానే సాధారణంగా మాట్లాడాడని కొద్దిసేపటి తర్వాత తినడానికి వెళ్తానన్నాడని తెలిపింది.ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్లో ఆదివారం ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని కొద్దికాలం క్రితమే ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఈకాల్పుల ఘటనపై ఉగ్రవాది నవీద్ అక్రమ్ తల్లి స్పందించింది. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే అక్రమ్ తనతో మాట్లాడరని తెలిపింది.ఉగ్రవాది తల్లి వెరినా మాట్లాడుతూ "ఘటన జరగడానికి కొద్ది సేపు మందు నా కొడుకుతో మాట్లాడా అక్రమ్ చాలా సాధారణంగా మాట్లాడారు. కొద్దిసేపటి క్రితమే స్కూబా డ్రైవింగ్కు, స్విమ్మింగ్కు వెళ్లివచ్చాను. ఈ రోజు చాలా వేడిగా ఉంది హోటల్లోనే ఉంటాను. కొద్దిసేపు తర్వాత తింటాను " అని అక్రమ్ అన్నారని తన తల్లి పేర్కొంది. తన కొడుకు చాలా మంచివాడని అతనికి ఏలాంటి దురలవాట్లు లేవని,స్నేహితులతో కూడా ఎక్కువ తిరగడని తనకు పనికి వెళ్లడం ఇంటికి రావడం తప్ప మరేది తెలియదని ఆమె అంది. అయితే తన కుమారుడి చిత్రాలను ప్రస్తుతం చూపిస్తున్న చిత్రాలతో సరిపోల్చలేమని తెలిపింది. నవీద్ అక్రమ్ సిడ్నీలోని హెకెన్బర్గ్- అల్- మురాద్ ఇనిస్టిట్యుూట్లో ఖురాన్ సంబంధింత అధ్యయనాలని పూర్తి చేశాడు. 2024లో అక్కడే ఒక గృహాన్ని కొనుగోలు చేశాడు. ఇటీవల తన పని చేస్తున్న నిర్మాణ సంస్థ దివాళా తీయడంతో అతని ఉద్యోగం పోయినట్లు అతని తల్లి తెలిపింది. -
ఉగ్రవాదమా.. నీ మతమేంటి?
అలజడులు సృష్టించడం.. పదుగురు అటెన్షన్ రాబట్టుకోవడం.. మనుషుల ప్రాణాలను ఏమాత్రం ఆదలెక్కలేకుండా ఎడాపెడా తీసేయడం.. ఇవే కదా ఉగ్రవాద లక్షణాలు.. లక్ష్యాలు. మరి ఈ ఉగ్రవాదం ఏదో ఒక మతానికి పరిమితం చేయడం ఎంతవరకు సబబు? క్రూరత్వానికి మతమేముంటుంది? విద్వేషానికి, కుట్రలకు, కుతంత్రాలకు మతమంటూ ఉంటుందా? తాజాగా ఆస్ట్రేలియా దేశం సిడ్నీలోని ఓ బీచ్లో ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే వీరిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారు కావడంతో విమర్శలు మరింత ఘాటుగా.. నాటుగా ఉంటున్నాయి.బాండీ బీచ్ లో ఆదివారం తుపాకులు గర్జించడంతో ఆస్ట్రేలియా సిడ్నీ ఉలిక్కిపడ్డాయి. బాండీ బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చిన సందర్శకులకు ఆక్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులు చేతపట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాండీ బీచ్ లో సంప్రదాయంగా జరుగుతున్న హనుక వేడుకల్లో పాల్గొన్న జుయిష్ కమ్యూనిటీ ప్రజల్లో ఏమయ్యిందో తెలుసుకునేలోగా 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 29 మందికి గాయాలయ్యాయి. ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న వేడుక.. రక్తసిక్త రణరంగంగా మారిపోయింది. ఈ ఉగ్రదాడుల్లో తండ్రి కుమారుడు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చిన వారు...ముస్లిం మతస్తులు కావడంతో...ఆ మతం పై సహజంగానే కొందరు విరుచుకు పడుతున్నారు.అయితే ఇంత ఘోర ఉగ్రచర్యల్ని అడ్డుకుంది కూడా ఓ ముసల్మానే అని మనం గుర్తుంచుకోవాలి. అతనో పండ్ల వ్యాపారి. ఉగ్రవాదులైన తండ్రీ కొడుకులిద్దరూ తుపాకులు పట్టుకుని విచక్షణ రహితంగా కాలుస్తుంటే.. పండ్లవ్యాపారి అహ్మద్ అత్యంత ధైర్యసాహసాలను, మానవత్వాన్ని ప్రదర్శించాడు. వెనకనుంచి వచ్చి వారిలో ఒకరికి వారి గన్ తీసుకుని గురిపెట్టి తరిమేయసాగాడు. కానీ మరో ఉగ్రవాది అతడిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో అహ్మద్ రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అహ్మద్ చొరవ ప్రదర్శించకుండా ఉంటే మరికొందరు కచ్చితంగా ప్రాణాలు కోల్పోయేవారే.కాల్పుల ఘటన సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్...కామెంటేటర్ మైకేల్ వాన్ అహ్మద్ చూపిన చొరవ తెగింపును ప్రశంసించాడు. ఘటన సమయంలో బాండీ బీచ్ కు దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్లో వాన్ తన కుటుంబంతో ఉన్నాడు. ఫోన్లో మాటాడ్డానికి బైటికి వెళ్లిన సమయంలో ఈ కాల్పుల శబ్దం వినిపించినట్లు వివరించాడు. అహ్మద్ చూపిన మానవీయ దైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అహ్మద్ నిజమైన హీరో అని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.పెహల్గాం దాడిలో పాల్గొంది ముస్లింలే కావచ్చు. వారు బాధితుల్ని మతం అడిగి మరీ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చు. అలాగే మన దేశంలో చాలా వరకు ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల మతం ముస్లిం మతమే కావచ్చు. అయినంత మాత్రాన అందరినీ అదే గాటన కట్టేయడం సరికాదని కొందరి అభిప్రాయం. ఉగ్రవాదమనేది మనిషిలోని అతిరేక లక్షణమే గానీ మతం విధానం కానేకాదు.ఇప్పుడు చెప్పండి.. విచక్షణారహితంగా ఉగ్రరూపంతో కాల్పులు జరిపిన తండ్రీ కొడుకులు ముస్లిం మతానికి చెందిన వారు. అలాగే ధైర్య సాహసాలతో మానవీయతతో ప్రజల్ని ఆ కాల్పుల నుంచి కాపాడిన వ్యక్తి ముస్లిం మతానికి చెందిన వాడే. మరి ముస్లింలందరూ ఉగ్రవాదులే అన్న కొందరి వితండ వాదన నిజమైతే ...పండ్ల వ్యాపారి అహ్మద్ కు ఎదుర్కోవాల్సిన పనేం ఉంది. తను కూడా ఉగ్రవాదుల చర్యల్ని సమర్థించవచ్చు కదా అంటున్నారు సెక్యూలరిస్టులు. ముస్లింలలో కొంతమంది ఉగ్రవాదులుండవచ్చేమో గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే అనడం అర్థరహితం. అసలు ఉగ్రవాదానికి ముస్లిం మతమెందుకు ఉంటుంది? అది కొందరు పనిగట్టుకుని అద్దిన రంగు మాత్రమే.- ఆర్ఎం. -
అక్కడే లాక్ అయిపోయాం: బాండీ బీచ్ ఘటనపై మైకేల్ వాన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆస్ట్రేలియాలో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను కూడా బాండీ బీచ్కు వెళ్లాలనుకున్నానని.. అయితే, రెస్టారెంట్ నిర్వాహకుల అప్రమత్తతే తనను కాపాడిందని పేర్కొన్నాడు. తాను, తన కుటుంబం ప్రస్తుతం సురక్షితంగా ఉన్నామని తెలిపాడు.కాగా బాండీ బీచ్లో కాల్పుల మోతతో ఆస్ట్రేలియా ఆదివారం ఉలిక్కి పడింది. ఇద్దరు ముష్కరులు తుపాకీలు చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సంప్రదాయ హనుక్కా వేడుకలో పాల్గొంటున్న యూదులుపై కాల్పులకు తెగబడి దాదాపుగా పదహారు మందిని పొట్టనబెట్టుకున్నారు.తండ్రీ-కొడుకులేఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడగా.. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరులు తండ్రీ-కొడుకులే కావడం గమనార్హం. వీరు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.పండ్ల వ్యాపారి ధైర్యంమరోవైపు.. వీరిద్దరు ఉన్మాద చర్యకు పాల్పడుతుండగా అహ్మద్ అనే పండ్ల వ్యాపారి ధైర్యం ప్రదర్శించి ఓ ఉగ్రవాదిని చెట్టు వెనుక నుంచి పట్టుకుని.. అతడికే గన్ గురిపెట్టి తరిమేశాడు. ఇంతలో మరో ఉగ్రవాది అతడిపై కాల్పులు జరుపగా అహ్మద్ కుప్పకూలిపోయాడు. ఏదేమైనా అహ్మద్ లేకుంటే మరికొంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారే!ఆ శబ్దాలు వినిఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ తాజాగా స్పందించాడు. బాండీ బీచ్లో కాల్పులు జరిపిన సమయంలో తాను అక్కడికి దగ్గర్లోనే ఉన్నానని తెలిపాడు. ‘‘తొలుత ఆ శబ్దాలు విని షార్క్ దాడి చేసిందేమో అనుకున్నాము. అయితే, కాసేపటి తర్వాత చెవులు రిక్కించి వినగా.. అది ఇంకేదో శబ్దమని అర్థమైంది.అపుడు నేను నా కుటుంబంతో కలిసి దగ్గర్లోని ఓ రెస్టారెంట్లో ఉన్నాను. మేము ఆర్డర్ చేసిన పదార్థాల కోసం వేచి ఉన్నాము. ఇంతలో నాకు ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లి మాట్లాడుతున్నా.అప్పుడు ఓ బౌన్సర్ తన చేతిలో తుపాకీ పట్టుకుని నా వైపు వేగంగా దూసుకువచ్చాడు. వెంటనే లోపలికి వెళ్లాలని నన్ను హెచ్చరించాడు. బయట జరుగుతున్న దాడి గురించి మాకు అప్పుడే తెలిసింది. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బీచ్లో చాలా మందిని బంధించారని కొంతమంది అన్నారు.లోపలి నుంచి తాళం వేశారుసిడ్నీ, ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఇలాంటి దాడులు ప్లాన్ చేశారనే చర్చ నడుస్తోంది. మేమున్న రెస్టారెంట్ తలుపులన్నింటికి లోపలి నుంచి తాళం వేశారు. బయట పరిస్థితి చక్కబడిందని తెలిసిన తర్వాతే మమ్మల్ని పంపించారు. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు మేము అక్కడే లాక్ అయిపోయాం.నా జీవితంలో ఇంతటి భయంకర అనుభవాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. నాతో పాటు నా భార్య, సోదరి, నా ఇద్దరు కుమార్తెలు, వారి స్నేహితురాలు ఇలా.. అందరం అక్కడే ఉన్నాము. పిల్లలు భయపడకుండా నాలో భయాన్ని అణిచిపెట్టుకుంటూ వారికి ధైర్యం చెప్పాను. వారి గురించే నా ఆందోళన, భయం. బయట ఉన్నవారి పరిస్థితి గురించి కూడా బాధేసింది.బీచ్కు వెళ్లాలని మేము అనుకున్నాము. అక్కడే నా కుమారుడు క్రికెట్ ఆడుతూ.. పరుగులు తీస్తుంటే చూశాము. పబ్, రెస్టారెంట్ కాకుండా మా తదుపరి గమ్యం అదే అయి ఉండేది’’ అని ది టెలిగ్రాఫ్నకు రాసిన కాలమ్లో మైకేల్ వాన్ పేర్కొన్నాడు.ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలిఇక ఎక్స్ వేదికగానూ ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘‘బాండీ ఘటన సమయంలో మేము రెస్టారెంట్లో లాక్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాము. ఎమర్జెన్సీ సర్వీస్ వారికి ధన్యవాదాలు.అదే విధంగా.. ఉగ్రవాదిని అడ్డుకుని ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలి. ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికి నా సానుభూతి’’ అని మైకేల్ వాన్ పోస్ట్ పెట్టాడు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ కామెంట్రీ కోసం వాన్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు.చదవండి: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు! -
యూదులపై టెర్రర్ ఎటాక్.. మోదీ దిగ్భ్రాంతి
-
తండ్రీకొడుకుల పనే
సిడ్నీ: ప్రశాంత ఆస్ట్రేలియాలో రక్తపుటేరులు పారించింది పాక్ జాతీయులైన తండ్రీకొడుకులని తేలింది. ఇద్దరు సాయుధులు ఆదివారం సిడ్నీలోని బాండీ బీచ్ను ఆనుకుని ఉన్న చిన్న పార్క్లో వేడుకల్లో మునిగిపోయిన యూదులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించి 15 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని ఆదివారమే నవీద్ అక్రమ్గా గుర్తించగా మరో ఆగంతకుడు నవీద్ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్ అని న్యూ సౌత్వేల్స్ పోలీసులు సోమవారం వెల్లడించారు. సాజిద్ను పోలీసులు ఆదివారం ఘటనాస్థలిలోనే అంతంచేయగా నవీద్కు బుల్లెట్ గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్పించి ప్రశ్నిస్తున్నామని న్యూ సౌత్వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ చెప్పారు. సోదాల్లో నవీద్కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జెర్సీ ధరించినట్లుగా కార్డ్పై ఫొటోలో కన్పిస్తోంది. కార్డ్ ప్రకారం నవీద్ ఆస్ట్రేలియాలోనే 2001 ఆగస్ట్ 12న జన్మించారు. దీంతో నవీద్కు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. తండ్రి సాజిద్ విద్యార్థి వీసాతో పాకిస్తాన్ నుంచి 1998లో ఆస్ట్రేలియాకు వచ్చాడు. 2001లో ఆ వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. తర్వాత దానిని ‘రెసిడెంట్ రిటర్న్’ వీసాగా మార్చుకున్నాడని ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి టోనీ బుర్కీ సోమవారం వెల్లడించారు. గతంలో ఇచ్చిన వీసా గడువు ముగిసేలోపే ఆస్ట్రేలియాను వీడినా లేదా ఆస్ట్రేలియాకు ఆవల ఉన్నప్పుడు వీసా గడువు ముగిసిన పక్షంలో అలాంటి వాళ్లకు తిరిగి ఆస్ట్రేలి యాలోకి అడుగుపెట్టాక ‘రెసిడెంట్ రిటర్న్’ వీసా జారీచేస్తారు. ఆ వీసాతో ప్రస్తుతం సాజిద్ ఆస్ట్రేలియాలో ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలి యాకు వచ్చిన ఇన్నేళ్లలో సాజిద్ మూడు సార్లు మాత్రమే దేశం దాటాడు. గతంలో నిఘా పరిధిలో ఉన్నా..యువ నవీద్పై గతంలో కొన్ని నెలలపాటు ఆస్ట్రేలియా నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి. ఐఎస్ఐఎస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 2019 అక్టోబర్లో తొలిసారిగా నవీద్పై ఆస్ట్రేలియా నిఘా వర్గాలు నిఘా పెట్టాయి. ఉగ్రవాదంతో సంబంధమున్న ఇద్దరికీ జైలుశిక్ష పడింది. వీళ్లతో నవీద్కు సంబంధం ఉన్నట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. దీంతో ఇతను సైతం ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడయ్యాడా లేదా అని తెల్సుకునేందుకు 2019 ఏడాదిలో దాదాపు ఆరునెలలపాటు అతని కదలికలపై ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్(ఏఎస్ఐవో) అధికారులు నిఘా పెట్టారు. అయితే తనపై నిఘా ఉందని ముందే పసిగట్టిన నవీద్ ఏళ్ల తరబడి ఎలాంటి ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా మంచివాడిలా నటించాడు. దీంతో వేర్పాటువాద లక్షణాలు, ప్రవర్తన ఇతడిలో లేవని భావించి నవీద్ను నిఘా వర్గాలు సీరియస్గా తీసుకోలేదు. అదను చూసి ఆదివారం ఇలా దుశ్చర్యకు పాల్పడటంతో ఆస్ట్రేలియా నిఘా వ్యవస్థలో లోటుపాట్లపై మరోసారి సమీక్ష అవసరమనే వాదనలు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం నవీద్ను మేస్త్రీ పని నుంచి ఒక సంస్థ తొలగించింది. ఆ సంస్థ ఇటీవల దివాలా తీయడంతో వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా నవీద్ను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 🚨 Here’s a full 10 minute video of the terrorist attack that happened today in Bondi beach Australia. How utterly terrifying pic.twitter.com/KNr8Xo6lRU— Queen Natalie (@TheNorfolkLion) December 14, 2025 -
బాండీ బీచ్ ఘటన.. భారత్లో జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో యూదు సమాజంపై ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో యూదు ప్రార్థనా మందిరాలు, సాంస్కృతిక కేంద్రాలు, యూదు సమాజానికి చెందిన సంస్థలు ఉగ్రవాదుల లక్ష్యంగా మారే అవకాశం ఉందని గూఢచార సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాయి.సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రవాద దాడి పట్ల భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా బాండీ బీచ్లో ఇద్దరు ముష్కరుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయాలపాలైయ్యారు. కాగా పోలీసులు కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరొక ఉగ్రవాదిని అరెస్టు చేశారు. -
యూదులపై ఉగ్రదాడి
సిడ్నీ: ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లింది. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదాంతంగా మారింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో బీచ్లో ఉత్సాహంగా పండగలో పాల్గొంటున్న యూదులపై ఇద్దరు ఉగ్రవాదులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మరణించారు. ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడ్డారు. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రకటించింది. మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకోవడం, ఆయుధాలతో విరుచుకుపడడంపై కచ్చితంగా ఉగ్రవాద దాడిగా ప్రభుత్వం పేర్కొంది. యూదులపై కాల్పుల జరిపిన ఇద్దరు ముష్కరులపై పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఒకరిని మట్టుబెట్టారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రెండో ఉగ్రవాది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఉగ్రవాద దాడిని ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా ఖండించారు. ఈ రాక్షస కాండ ఘటన ఆ్రస్టేలియా హృదయాన్ని గాయపర్చిందని ఉద్ఘాటించారు. దుశ్చర్య పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. యూదులపై విద్వేషాన్ని అల్బనీస్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తాజా దాడికి ఆయనే కారణమని ఆరోపించారు. విచ్చలవిడిగా కాల్పులు ప్రాచీన కాలంలో జెరూసలేం నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా యూదులు హనుక్కా పండుగను ప్రతిఏటా ఘనంగా నిర్వహించుకుంటారు. యూదులకు ఇది ప్రధానమైన పండుగ. ఆస్ట్రేలియాలోని యూదులు బాండీ బీచ్లో హనుక్కాలో పాల్గొనడానికి భారీగా తరలివచ్చారు. వందలాది మంది గుమికూడారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సంతోషంగా ఆటపాటల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో నల్లటి దుస్తులు ధరించి అక్కడికి చేరుకున్న ఇద్దరు ముష్కరులు తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే 16 మంది విగతజీవులయ్యారు. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. బీచ్లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. యూదులపై కాల్పుల్లో జరిపిన సాయుధ దుండగుల్లో ఒకరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తించారు. సిడ్నీ బానీరిగ్ ప్రాంతంలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రవాద దాడి పట్ల భారత ప్రధాని మోదీ ది్రగ్బాంతి వ్యక్తంచేశారు. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో ఆ్రస్టేలియా ప్రజలకు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. యూకేలో భద్రత కట్టుదిట్టం ఆ్రస్టేలియాలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఖండించారు. యూదుల మరణించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. యూకేలో యూదులు నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా లండన్లో యూదుల ప్రార్థనా మందిరాలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలియజేశారు. సామూహిక వేడుకల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దేశంలో ఆయుధ చట్టాలు కఠినం ఆ్రస్టేలియాలో సామాన్య జనంపై కాల్పులు ఘటనలు చాలా అరుదే. 1996లో పోర్ట్ అర్థర్ టౌన్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆయుధ చట్టాలను కఠినతరం చేసింది. ఆయుధ లైసెన్స్లు సులభంగా దక్కకుండా చర్యలు చేపట్టింది. ఆ తర్వాత 2014లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు, 2018లో ఏడుగురు మృతిచెందారు. ఆయా ఘటనల్లో సాయుధులు తమ కుటుంబ సభ్యులపైనే కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019లో ఉత్తర ఆ్రస్టేలియాలోని డారి్వన్ సిటీలో జైలు నుంచి పెరోల్పై బయటకు వచి్చన ఖైదీ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 2022లో క్వీన్స్లాండ్ స్టేట్లో ఓ తీవ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. ఆ్రస్టేలియాలో భారీ ఎత్తున కాల్పులు జరగడం, పది మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. పెచ్చరిల్లుతున్న యూదు వ్యతిరేకత ఆ్రస్టేలియా జనాభా 2.8 కోట్లు. వీరిలో 1.17 లక్షల మంది యూదులు ఉన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఆ్రస్టేలియాలోని యూదులపై దాడులు పెరిగిపోయాయి. వారి ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయి. యూదు వ్యతిరేక ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గత ఏడాది సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో యూదులే లక్ష్యంగా దాడులు జరిగాయి. యూదుల ప్రార్థనా మందిరాలకు, వారి వాహనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు యూదులకు తగిన రక్షణ కల్పించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ్రస్టేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.రియల్ హీరో అహ్మద్ బీచ్లో ముష్కరులు కాల్పులు జరుపుతుండగా అహ్మద్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. చెట్టు చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ఓ ఉగ్రవాదిని గట్టిగా పట్టుకొని, తుపాకీను లాక్కొని అతడికే గురిపెట్టాడు. అహ్మద్ను గమనించిన మరో మరో ఉగ్రవాది కాల్పులు ప్రారంభించారు. దాంతో అహ్మద్ గాయాలపాలై కుప్పకూలిపోయాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అహ్మద్ సాహసోపేతంగా వ్యవహరించిన దృశ్యం ఆస్ట్రేలియా టీవీ చానళ్లలో ప్రసారమైంది. అతడు ధైర్యంగా అడుగు ముందుకు వేయకపోతే ఉగ్రవాదుల కాల్పుల్లో మరికొందరు మరణించేవారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రియల్ హీరో అహ్మద్ అంటూ జనం ప్రశంసిస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి.. భారత్లో ‘హై అలర్ట్’
ఢిల్లీ: భారత్లోని పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో యూదుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో హై-అలర్ట్ జారీ చేశారు.ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన యూదుల పండుగ హనుక్కా సందర్భంగా ఉగ్రవాదులు పెద్ద దాడులు చేయాలని యోచిస్తున్నట్లు భారత్లోని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇజ్రాయెల్కు సంబంధించిన సంస్థల్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.హనుక్కా పండుగ ఎప్పుడు?యూదులు ఘనంగా జరుపుకునే ఎనిమిది రోజుల పండుగ హనుక్కా. ఈ పండుగ డిసెంబర్ 14 నుండి ప్రారంభమైంది. ఈ పండుగ సమయంలో యూదులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తారు. అందువల్లే పండుగ పర్వదినాన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఏ నగరాలు ప్రధాన టార్గెట్?ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం యూదు సంస్థలు, ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద భద్రత పెంచారు. విదేశీ పర్యాటకులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం, రాష్ట్రాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. -
ఉగ్రమూకపై తిరగబడి.. వైరల్ వీడియో
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండై బీచ్లో ఉగ్ర దాడి వేళ ఓ పౌరుడు పెద్ద సాహసమే చేశాడు. ఉగ్ర మూకపై స్థానిక పౌరుడు తిరగబడ్డాడు. కాల్పులు జరుపుతున్న ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కొని అతడిపైనే కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతడిని తరిమికొట్టాడు. వందలాది మంది పర్యాటకులను ఉగ్రవాదుల నుంచి ఆ వ్యక్తి రక్షించాడు. ఈ వీడియో వైరల్గా మారింది.బాండి బీచ్ కాల్పుల ఘటనలో 10 మంది మరణించారు. బీచ్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైరింగ్ చేయడంతో వందల మంది పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగులను అదుపులోకి తీసుకున్నారు. హెలికాప్టర్లు, 30 అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH— Terrible Pics (@TerriblePic) December 14, 2025 -
ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు
జెరూసలేం: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ దాడి ఘటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. ముందే అలర్ట్ చేయడంతో ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదుల వేడుకలను టార్గెట్ చేసిన ఉగ్రమూక దాడిలో 10 మంది మృతిచెందగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్ట్లు హతమయ్యారు.యూదులపై దాడులు జరగవచ్చని ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని.. యాంటీ-సెమిటిజాన్ని అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని ఇజ్రాయెల్ విమర్శించింది. ఈ సందర్భంగా సిడ్నీ కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్ చేశారు. సిడ్నీ కాల్పుల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి’అని పేర్కొన్నారు. I'm appalled by the murderous shooting attack at a Hanukkah event in Sydney, Australia.These are the results of the anti-Semitic rampage in the streets of Australia over the past two years, with the anti-Semitic and inciting calls of “Globalise the Intifada” that were realized… pic.twitter.com/ZMveTRIvwx— Gideon Sa'ar | גדעון סער (@gidonsaar) December 14, 2025మరోవైపు, సిడ్నీ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ-సెమిటిజాన్ని ఎదుర్కోవడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మన సోదరులు, సోదరీమణులు.. ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారు’ అంటూ హెర్జోగ్ యెరూషలేములో జరిగిన ఒక కార్యక్రమంలో విచారం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను వేధిస్తున్న ‘యాంటీ-సెమిటిజం’ని ఎదుర్కోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఉగ్రదాడి యూదులే లక్ష్యంగా జరిగిందా? అనేదానిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.బాండీ బీచ్లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఈ ఘటన దృశ్యాలు కలచివేస్తున్నాయని.. బాధితులకు తన ప్రగాఢ సానుభూతి’’ అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు. -
ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి
-
ఆస్ట్రేలియాలో పహల్గామ్ తరహా టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. జమ్మూకశ్మీర్ పహల్గాం తరహాలో సిడ్నీ బాండీ బీచ్లో ఉగ్రదాడి జరిగింది. బీచ్లోని యూదులే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పదిమందికి పైగా పర్యాటకులు మృతిచెందారు. ముసుగు ధరించిన ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు.అయితే బీచ్లో సరదాగా గడుపుతున్న పర్యాటకులు.. కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీచ్లో ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.బీచ్లోకి పర్యాటకులను నిషేధించారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లొద్దంటూ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కాల్పుల తర్వాత ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH— Terrible Pics (@TerriblePic) December 14, 2025 -
15000 అడుగుల ఎత్తులో మృత్యువుతో పోరాటం..
-
సోషల్ మీడియా నిషేధంపై కోర్టుకు
మెల్బోర్న్: పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆన్లైన్ వేదిక రెడ్డిట్ సవాలు చేసింది. ఈ అమెరికన్ ఆన్లైన్ ఫోరమ్ శుక్రవారం హైకోర్టులో దావా వేసింది. యువతను రక్షించాలనుకుంటే ప్రభుత్వానికి మరింత మెరుగైన మార్గాలున్నాయని, కానీ సోషల్ మీడియా కనీస వయసు చట్టం వల్ల రాజకీయ చర్చల నుంచి వేరుచేయడం అవుతుందని, ధ్రువీకరణ ప్రక్రియ కూడా అంత సురక్షితం కాదని రెడ్డిట్ తెలిపింది. 16 ఏళ్ళలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. పిల్లల ఆన్లైన్ భద్రతరీత్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆస్ట్రేలియా పిల్లల ఖాతాలను తొలగించకపోతే రెడ్డిట్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, కిక్, స్నాప్చాట్, త్రెడ్స్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్లకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కొత్త నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే.. దీనిపై ఇప్పటికే ఇద్దరు బాలికల తరపున సిడ్నీకి చెందిన హక్కుల వేదిక డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్టు గత నెలలో కేసు వేసింది. కాలిఫోరి్నయాకు చెందిన రెడ్డిట్ దానిని అనుసరించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని రెండు వాజ్యాలు పేర్కొన్నాయి. -
మృత్యువు అంచునుంచి..
అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్, టల్లీ ఎయిర్ పోర్ట్.. ఆకాశం నిర్మలంగా ఉంది.. సాధారణ స్కైడైవింగ్ విన్యాసం కోసం సిద్ధమైన ప్రత్యేక రోజది. 17 మంది పారాచూటిస్టులతో కూడిన ’సెస్నా కారవాన్’ విమానం 15,000 అడుగుల (సుమారు 4,500 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. 16 మంది స్కైడైవర్లు కలిసి ఒక అద్భుతమైన ఫార్మేషన్ జంప్ చేయబోతున్నారు. అంతా సిద్ధంగా ఉంది.. విమానం తలుపు వద్ద నిల్చున్న స్కైడైవర్ ఆడ్రియన్ ఫెర్గూసన్ గుండె వేగం పెరిగింది. విమానం నుంచి బయటికి దూకడానికి సెకన్ మాత్రమే ఉంది.. కానీ, ఆ క్షణంలోనే ఊహించని విపత్తు సంభవించింది. ఆడ్రియన్ ఫెర్గూసన్ గాల్లోకి దూకే ప్రయత్నంలో ఉండగా, అతని రిజర్వ్ పారాచూట్ తాడు విమానం రెక్క ఫ్లాప్ను తాకింది. అంతే.. కళ్లు మూసి తెరిచేలోపే, పారాచూట్ ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది. ఆ ఉధృతి ఫెర్గూసన్ను వెనక్కి లాగేసింది. నియంత్రణ కోల్పోయిన అతను.. విమానం వద్దే వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న కెమెరా ఆపరేటర్ను ఢీకొట్టాడు. ఆ ఆపరేటర్ వెంటనే విమానం నుంచి బయటకు దూకి, అదుపులేని ఫ్రీ–ఫాల్లో పడిపోయాడు. అసాధారణ ధైర్యశాలికళ్లు మూసి తెరిచేలోపే, ఫెర్గూసన్ కాళ్లు విమానం తోక భాగంలోని ’హారిజాంటల్ స్టెబిలైజర్’కు బలంగా తగిలాయి. అంతలో, తెరుచుకున్న పారాచూట్ మొత్తం తోకకు చుట్టుకుపోయింది! ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించినట్టు అనిపించింది. 15,000 అడుగుల ఎత్తులో.. ఆడ్రియన్ ఫెర్గూసన్ విమానం తోకకు వేలాడుతూ, చావు అంచున చిక్కుకుపోయాడు. అతని ముఖంలో మృత్యు భయం స్పష్టంగా కనిపించింది. కింద అగాధం.. పైన మృత్యుపాశం.. పట్టు తప్పితే ప్రాణాలు దక్కవు. ఆ ప్రమాదకర స్థితిలో, ఆడ్రియన్ ఫెర్గూసన్ భయంతో వణికిపోకుండా, అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు అతని వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం.. చేతిలో ఉన్న చిన్న హుక్ కత్తి. ఆ చిన్న కత్తితోనే ఆడ్రియన్ మృత్యువుతో పోరాడాలి. ప్రాణం కాపాడిన కత్తిఆడ్రియన్ తన వద్ద ఉన్న చిన్న ’హుక్ కత్తి’ తీశాడు. వేలాడుతూనే.. విమానం తోకకు గట్టిగా చిక్కుకుపోయిన తన రిజర్వ్ పారాచూట్ లైన్లను ఒక్కొక్కటిగా కోయడం మొదలుపెట్టాడు. ఇది సాహసం కాదు, ఆత్మరక్షణ! ఆఖరికి 11 లైన్లను తెగ్గొట్టగలిగాడు. చివరికి, చిరిగిన పారాచూట్లోని కొంత భాగంతో సహా విమానం నుంచి పూర్తిగా విడిపోయి కిందకు పడిపోవడం మొదలుపెట్టాడు. వెంటనే, ఆడ్రియన్ తన ప్రధాన పారాచూట్ను తెరిచాడు. రిజర్వ్ పారాచూట్ అవశేషాలు అడ్డుప డినా, అది పూర్తిస్థాయిలో విచ్చుకుంది. చివరకు, ఫెర్గూసన్ కేవలం స్వల్ప కాలి గాయాలతో సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యాడు. మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది ప్రమాదంలో విమానం..ఇంతలో పైన విమానం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. పారాచూట్ లైన్లు తోకకు గట్టిగా చుట్టుకోవడంతో, పైలట్ కొంతవరకు విమానంపై నియంత్రణ కోల్పోయాడు. వెంటనే, ఆయన ’మేడే’ అత్యవసర సంకేతాన్ని పంపారు. తోకకు చిక్కుకున్న పారాచూట్తో విమానాన్ని నియంత్రించడం కష్టమని భావించినా, బ్రిస్బేన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయంతో, పైలట్ అత్యంత చాకచక్యంగా ఆ విమానాన్ని టల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు. కానీ తోక భాగానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. A skydiver in Queensland Australia was left dangling thousands of metres in the air after their parachute caught on the plane’s tail. The dramatic footage was released by the Australian Transport Safety Bureau following an investigation into the incident. pic.twitter.com/ntXU6d8pAQ— Channel 4 News (@Channel4News) December 11, 2025శభాష్ ఫెర్గూసన్!ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరిగిన ఈ అసాధారణ ఘటనపై ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ఏటీసీబీ) దర్యాప్తు జరిపి, ఈ ఉత్కంఠభరితమైన వీడియోను విడుదల చేసింది. ఏటీసీబీ ముఖ్య కమిషనర్ ఆంగస్ మిచెల్ మాట్లాడుతూ, ‘హుక్ కత్తిని వెంట తెచ్చుకోవడం తప్పనిసరి నియమం కానప్పటికీ, రిజర్వ్ పారాచూట్ విచ్ఛిన్నమైనప్పుడు అదే ప్రాణాలు కాపాడింది’.. అని ఫెర్గూసన్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు. పదిహేను వేల అడుగుల ఎత్తులో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఫెర్గూసన్ సాహసం, ఆత్మవిశ్వాసం ప్రపంచ స్కైడైవింగ్ చరిత్రలో ఒక పాఠ్యాంశంగా నిలిచిపోయింది.ఇదీ చదవండి: రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా -
కోహ్లి ఒక్కడే మిస్ అయ్యాడు.. మిగతా ముగ్గురూ..!
ఐసీసీ తాజాగా (డిసెంబర్ 10) విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆసీస్, ఇంగ్లండ్ ప్లేయర్ల హవా కొనసాగింది. తాజాగా ఇరు జట్ల మధ్య యాషెస్ రెండో టెస్ట్ (పింక్ బాల్) జరగడమే ఇందుకు కారణం. ఆ టెస్ట్లో 8 వికెట్లతో చెలరేగిన ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ ఏకంగా మూడు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. అదే మ్యాచ్లో బ్యాటింగ్లో ఇరగదీసిన ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అగ్రపీఠాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.ఇదే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఓ మోస్తరు ప్రదర్శనలు చేసిన ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకగా.. ఆసీస్ వికెట్కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ ఓ స్థానం మెరుగుపర్చుకొని 17వ స్థానానికి చేరాడు. టాప్-10లో ఉండిన ఆసీస్, ఇంగ్లండ్ బ్యాటర్లలో ట్రవిస్ హెడ్, హ్యారీ బ్రూక్ తలో రెండు స్థానాలు కోల్పోయి 4, 7 స్థానాలకు పడిపోయారు.తాజాగా విండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అర్ద సెంచరీతో రాణించిన కేన్ విలియమ్సన్ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లెక్కన చూస్తే.. టెస్ట్ల్లో ఫాబ్-4గా పిలువబడే వారిలో విరాట్ కోహ్లి మినహా మిగతా ముగ్గురు టాప్-3లో (రూట్, కేన్, స్టీవ్) ఉన్నారు. విరాట్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ర్యాంకింగ్స్లో అతని పేరే లేదు.ఈ వారం బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారీగా లబ్ది పొందిన వారిలో రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, జాక్ క్రాలే, షాయ్ హోప్, జస్టిన్ గ్రీవ్స్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. విండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రచిన్, లాథమ్ భారీ సెంచరీలతో కదంతొక్కి 15, 34 స్థానాలకు ఎగబాకగా.. ఆదే మ్యాచ్లో సెంచరీ, డబుల్ సెంచరీతో చెలరేగిన హోప్, గ్రీవ్స్ 48, 60 స్థానాలకు ఎగబాకారు.ఇంగ్లండ్తో రెండో యాషెస్ టెస్ట్లో బ్యాట్తోనూ రాణించిన మిచెల్ స్టార్క్ 12 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకగా.. అదే మ్యాచ్లో అర్ద సెంచరీతో రాణించిన జాక్ క్రాలే 6 స్థానాలు మెరుగుపర్చుకొని 45వ స్థానానికి ఎగబాకాడు.బౌలింగ్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్లో స్టార్క్తో (3 స్థానాలు ఎగబాకి) పాటు కీమర్ రోచ్ (5 స్థానాలు ఎగబాకి), బ్రైడన్ కార్స్ (4 స్థానాలు ఎగబాకి), జకరీ ఫౌల్క్స్ (9 స్థానాలు ఎగబాకి) లబ్ది పొందారు. అత్యుత్తంగా న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ 76 స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరాడు. టాప్-2 బౌలర్లుగా బుమ్రా, మ్యాట్ హెన్రీ కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, జడేజా, కుల్దీప్ వరుసగా 12 నుంచి 14 స్థానాల్లో ఉన్నారు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా, జన్సెన్, స్టోక్స్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మరో ఇద్దరు భారత ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్య తలో స్థానం మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు. -
టీనేజర్ల డిజిట్రబుల్స్!
డిసెంబరు 10 బుధవారం సూర్యోదయం కాగానే, ఆ్రస్టేలియా చరిత్రలో తొలిసారిగా ఒక చట్టం అమల్లోకి రానుంది. దేశంలోని 16 ఏళ్ల లోపు యువతకు సోషల్ మీడియా తలుపులు మూసుకుపోతాయి. అయితే, ప్రపంచంలోనే ఈ తొలి నిషేధం, రిలే అలెన్ అనే 15 ఏళ్ల స్కూల్ బాయ్కి నిద్ర లేకుండా చేస్తోంది. దక్షిణ ఆ్రస్టేలియాలోని కేవలం 1,000 మంది జనాభా ఉన్న ’వుడిన్నా’ అనే చిన్న కమ్యూనిటీకి 5 కిలోమీటర్ల దూరంలో రిలే కుటుంబం నివసిస్తోంది. గొర్రెల ఫారంలో నివసించే ఈ కుర్రాడికి, దూరంగా ఉన్న స్నేహితులతో మాట్లాడడానికి సోషల్ మీడియానే ఏకైక మార్గం. బుధవారం అర్ధరాత్రి దాటితే, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సహాధ్యాయులతో ఎలా అందుబాటులో ఉండాలి?.. ఒక్క మీట నొక్కగానే.. తమ ప్రపంచం తెగిపోతుందనే భయం ఈ పల్లెటూరి పిల్లాడిని వెంటాడుతోంది. ఉల్లంఘిస్తే భారీ జరిమానా బుధవారం నుంచి 16 ఏళ్లలోపు ఉన్నవారు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, కిక్, రెడ్డిట్, స్నాప్చాట్, త్రెడ్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్ తదితర ప్లాట్ఫాంలలో ఖాతాలను కలిగి ఉండకుండా చట్టం నిషేధిస్తుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, ఆయా ప్లాట్ఫాంలపై 32.9 మిలియన్ల వరకు భారీ జరిమానాలు విధిస్తారు. ‘మెటా’.. ఇప్పటికే అనుమానిత యువకుల ఖాతాలను తొలగించడం ప్రారంభించింది. రిలేకు.. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, కానీ ఏ క్షణమైనా తనను తొలగిస్తారేమోనని భయపడుతున్నాడు. ఇదీ చదవండి: ఉల్లి, వెల్లుల్లి తెచ్చిన తంటా, 11 ఏళ్ల బంధానికి స్వస్తినా కొడుక్కి సాయం చేసేదే లేదు.. రిలే తల్లి, స్కూల్ టీచర్ అయిన సోనియా అలెన్ మాత్రం.. నిషేధాన్ని తప్పించుకోవడానికి తన కొడుక్కి సహాయం చేయనని స్పష్టం చేసింది. అయితే, ఇతర తల్లిదండ్రులు సహాయం చేస్తారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గతంలో రిలే.. అర్ధరాత్రి వరకు సోషల్ మీడియాలో మునిగితేలుతూ హోంవర్క్ చేయనందుకు, రెండు నెలలపాటు అతని సోషల్ మీడియాను ఆమె నిషేధించింది. ‘అప్పటినుంచే తన కొడుకు మరింత బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను ఉపయోగించడం నేర్చుకున్నాడు’.. అని అలెన్ గుర్తు చేసుకుంది. ఏప్రిల్లో 16 సంవత్సరాలు నిండనున్న రిలే.. ఈ నిషేధం లక్ష్యాలను అర్థం చేసుకున్నానని, అయితే వాటిని సాధించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశాడు. చిన్న పిల్లలు నిద్రకు దూరం కాకుండా, రాత్రి 10 గంటల నుండి సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తప్పనిసరిగా నిషేధించాలని సూచించాడు.హైకోర్టులో టీనేజర్ల పోరాటం రిలేకు.. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన సిడ్నీలో ఒక మిత్రుడు ఉన్నాడు. ఆగస్టులో 16 ఏళ్లు వచ్చే నోహ్ జోన్స్. మరో విద్యారి్థని మేసీ నైలాండ్లు ఈ చట్టాన్ని హైకోర్టులో సవాలు చేస్తున్నారు. ఈ చట్టం అక్రమంగా 2.6 మిలియన్ల యువ ఆ్రస్టేలియన్ల రాజకీయ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కును లాగేసుకుంటుందని వారు వాదిస్తున్నారు. కాగా, సోషల్ మీడియా వల్ల తమ పిల్లలకు కలుగుతున్న హానిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారని ఆ్రస్టేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఈ సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 140 మందికి పైగా అంతర్జాతీయ విద్యావేత్తలు.. ప్రధాని ఆంథోనీ అల్బనీస్కు రాసిన బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పునిషేధం దాటేస్తారు: నిపుణుల హెచ్చరిక డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్ట్ అధ్యక్షుడు జాన్ రూడిక్.. ఈ నిషేధం అమలులోకి రాకుండా కోర్టు నిషేధాజ్ఞ కోసం ప్రయతి్నంచాలని భావించారు, కానీ న్యాయవాదుల సలహా మేరకు విరమించుకున్నారు. ఈ రాజ్యాంగ సవాలుపై పూర్తిస్థాయి విచారణ ఫిబ్రవరి చివరిలో జరగనుంది. పిల్లలు ఈ నిషేధాన్ని తప్పించుకోవడానికి వీపీఎన్లను ఉపయోగించి తమ స్థానాన్ని మార్చుకుంటారని ఆయన అంచనా వేశారు. ‘పిల్లలు దీన్ని తప్పించుకుంటారు, ఆ తర్వాత వారు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా, మరింత ప్రమాదకరమైన ’అండర్గ్రౌండ్’ సోషల్ మీడియాను ఉపయోగిస్తారు’.. అని రూడిక్ హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 10, 2025 నుంచి అమలులోకి రానుంది.ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ (సోషల్ మీడియా మినిమం ఏజ్) బిల్లు’ ను 2024 నవంబర్లో ఆమోదించింది. ఈ చట్టం ఆన్లైన్ సేఫ్టీ చట్టం 2021 (Online Safety Act 2021)కు సవరణగా ఉంది.ఈ నియమంలోని కీలక అంశాలు ఏమిటి?ఈ చట్టం ముఖ్య ఉద్దేశం పిల్లలపై కాకుండా సోషల్ మీడియా సంస్థలపై బాధ్యతను మోపుతుందని ప్రభుత్వం తెలిపింది. కొన్ని నిర్దిష్ట సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వినియోగదారులు ఖాతాలను సృష్టించకుండా లేదా కొనసాగించకుండా నిరోధించడానికి సంస్థలు సహేతుకమైన చర్యలు తీసుకోవాలి.తల్లిదండ్రులు అనుమతి ఇచ్చినా కూడా 16 ఏళ్ల లోపు వారు ఈ ప్లాట్ఫామ్లను ఉపయోగించడానికి అనుమతి లేదు.ప్రస్తుతానికి ఈ నిబంధనలు వర్తించే ప్రధాన ప్లాట్ఫామ్లు ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్, టిక్టాక్, ఎక్స్, రెడ్డిట్, థ్రెడ్స్, ట్విచ్, కిక్.ప్రధానంగా మెసేజింగ్ లేదా గేమింగ్ కోసం ఉపయోగించే WhatsApp, Discord, Roblox వంటి సర్వీసులను ప్రస్తుతానికి మినహాయించారు. అయినప్పటికీ, సేఫ్టీ కమీషనర్ అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ఈ జాబితాను మార్చే అవకాశం ఉంది.ప్లాట్ఫామ్లు వినియోగదారుల వయస్సును నిర్ధారించడానికి కొత్త వయస్సు ధ్రువీకరణ విధానాలను అమలు చేయనున్నారు.సంస్థలు వయస్సు ధ్రువీకరణ కోసం ప్రభుత్వ గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా కోరకూడదు. అయితే ఫొటో లేదా వీడియో ఆధారిత వయస్సు అంచనా లేదా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించే అవకాశం ఉంది.అనుసరించకపోతే జరిమానాలుఈ నిబంధనలను పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా సంస్థలకు గరిష్టంగా 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ.270 కోట్లు) వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు ఎలాంటి జరిమానాలు ఉండవు. ఈ చట్టం బాధ్యత పూర్తిగా టెక్ కంపెనీలపై మాత్రమే ఉంటుంది.ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలుఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత పట్ల ఉన్న తీవ్ర ఆందోళనలే కారణం. సోషల్ మీడియా అధిక వినియోగంతో కౌమార దశలో ఉన్నవారిలో ఆందోళన, నిరాశ, ఒంటరితనం పెరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. నిరంతర పోలికలు, లైక్ల కోసం ఎదురుచూడటం, సైబర్బుల్లింగ్ (Cyberbullying-డిజిటల్ వేదికల ద్వారా ఇతరులను అవమానించడం, బెదిరించడం, వేధించడం లేదా హింసించడం) వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తోంది.ప్రమాదకరమైన కంటెంట్ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ‘ప్రెడేటరీ అల్గారిథమ్స్’ కారణంగా పిల్లలు హింస, ఆత్మహత్యకు ప్రేరేపించే అంశాలు, అసభ్యకరమైన కంటెంట్, తప్పుడు సమాచారం వంటి ప్రమాదకరమైన కంటెంట్ బారిన పడుతున్నారు. ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ దీన్ని ‘బిహేవియరల్ కొకైన్’తో పోల్చారు.సోషల్ మీడియా వేదికలు పిల్లల మధ్య తోటివారి ఒత్తిడికి, ఆన్లైన్ వేధింపులకు వాహకంగా మారుతున్నాయి. మోసగాళ్లు పిల్లలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇవి సులువైన మార్గాలుగా మారుతున్నాయి.సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లలు చదువు, నిద్ర, ఆటలు వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు దూరం అవుతున్నారు.కంపెనీలపై ప్రభావం ఇలా..ఈ నియమం వల్ల సోషల్ మీడియా కంపెనీలు ముఖ్యంగా ఆదాయం, మార్కెట్ పరిమాణం పరంగా నష్టాలను ఎదుర్కొంటాయి. 16 ఏళ్ల లోపు ఉన్న వినియోగదారులను తొలగించడం లేదా వారిని చేర్చుకోకపోవడం వల్ల ఆస్ట్రేలియాలో మొత్తం యూజర్ బేస్ గణనీయంగా తగ్గుతుంది. ఈ వయస్సు సమూహం తరచుగా అత్యంత చురుకైన వినియోగదారులలో ఒకటిగా ఉంటుంది.ప్రకటనల ఆదాయంపై ప్రభావంసోషల్ మీడియా కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. యూజర్ల సంఖ్య తగ్గితే ప్రకటనలను చేరుకునే అవకాశం ఉన్న జనాభా (Ad Reach) కూడా తగ్గుతుంది. ఫలితంగా ప్రకటనదారులకు ప్లాట్ఫామ్ ఆకర్షణ తగ్గి ప్రకటనల ఆదాయం తగ్గుతుంది.నియంత్రణ అమలు ఖర్చులువయస్సు ధ్రువీకరణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, వాటిని అమలు చేయడానికి టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాలి. ఈ కొత్త సాంకేతికతలను కొనసాగించడం, డేటా భద్రతను నిర్ధారించడం, స్థానిక చట్టాలను నిరంతరం పర్యవేక్షించడం అనేది అదనపు నిర్వహణ ఖర్చులను పెంచుతుంది.సాంకేతిక సవాళ్లువయస్సు ధ్రువీకరణ అనేది సాంకేతికంగా చాలా క్లిష్టమైన విషయం. కొన్ని పద్ధతులు (ముఖ ధ్రువీకరణ వంటివి) గోప్యత సమస్యలను పెంచుతాయి. ఏఐ ఆధారిత వయస్సు అంచనా (AI-based Age Estimation) వంటి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సవాళ్లు ఎదురుకావొచ్చు. అందుకోసం భారీగా పెట్టుబడులు అవసరం. వయస్సు ధ్రువీకరణ కోసం వినియోగదారుల నుంచి అదనపు వ్యక్తిగత సమాచారం సేకరించాల్సి వస్తుంది. దీని వల్ల డేటా ఉల్లంఘనలు, ప్రైవసీ ఉల్లంఘనల ప్రమాదం పెరుగుతుంది. ప్లాట్ఫామ్లు తమ కంటెంట్ సిఫార్సు అల్గారిథమ్లను మార్చాలి. తద్వారా 16 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే సరియైన కంటెంట్ చేరుకునేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: క్రికెట్పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే.. -
భారత ఆటగాడి కోటాలో ఐపీఎల్ వేలంలోకి ఎంటరైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ అద్భుతం జరిగింది. ఓ విదేశీ ఆటగాడు భారతీయ ఆటగాడి కోటాలో వేలంలోకి ప్రవేశించాడు. భారత్లో (ఢిల్లీలో) పుట్టి, ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో భాగంగా ఉన్న 29 ఏళ్ల నిఖిల్ చౌదరి 2026 సీజన్ వేలంలోకి చివరి నిమిషంలో భారత ఆటగాడి కోటాలో ఎంట్రీ ఇచ్చాడు.ఆస్ట్రేలియాలో టాస్మానియా తరఫున పూర్తి స్థాయి ఫస్ట్క్లాస్ ఆడుతూ, బిగ్బాష్ లీగ్లో హోబార్ట్ హరికేన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఖిల్.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలిచాడు. ఊహించని ఈ పరిణామం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు.ఓ ఆటగాడు విదేశీ లీగ్ల్లో ఆడుతూ, ఐపీఎల్లో దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలవడం ఇదే మొదటిసారి. లెగ్ స్పిన్ ఆల్రౌండర్ అయిన నిఖిల్ వేలంలో సెట్ 35లో (ఆల్రౌండర్లు) షార్ట్లిస్ట్ అయ్యాడు. షార్ట్లిస్ట్ అయిన 350 మంది ఆటగాళ్ల జాబితాలో నిఖిల్ పేరు ప్రత్యేకంగా నిలిచింది. టీమిండియాకు ఆడాలన్నదే అతని కల, కానీ..!నిఖిల్కు చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలన్నదే కల. ఢిల్లీలో పుట్టి పెరిగిన అతను.. శుభ్మన్ గిల్తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు. అయితే COVID-19 సమయంలో నిఖిల్ పర్యాటకుడిగా వెళ్లి ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయాడు.దీంతో అతని కెరీర్కు పుల్స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. అయితే నిఖిల్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలనుకున్న తన కలను సజీవంగానే ఉంచుకున్నాడు. అందులో భాగంగా అతను ఆస్ట్రేలియా తరఫున తన కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు. నిరంతర సాధన చేస్తూ 2023–24 సీజన్లో హోబార్ట్ హరికేన్స్ తరఫున బిగ్ బాష్ లీగ్ ఆడే అవకాశం దక్కించుకున్న నిఖిల్.. తొలి సీజన్లోనే ఆకట్టుకున్నాడు. ఫలితంగా అతనికి ఈ ఏడాదే టాస్మానియా తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం కూడా దక్కింది. అరంగేట్రం మ్యాచ్లోనే నిఖిల్ చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. గత నెలలో బ్యాటర్గానూ సత్తా చాటి, న్యూ సౌత్ వేల్స్పై శతకంతో విరుచుకుపడ్డాడు. -
క్యాన్సర్ను జయించి మళ్లీ బరిలోకి దిగనున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మాడిన్సన్ (Nic Maddinson) తన జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలును జయించి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్కు ఈ ఏడాది ప్రారంభంలో టెస్టిక్యులర్ క్యాన్సర్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను తొమ్మిది వారాలు కెమోథెరపీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను క్యాన్సర్ను పూర్తిగా జయించి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్ త్వరలో ప్రారంభం కానున్న (డిసెంబర్ 14) బిగ్బాష్ లీగ్ 2025-26 కోసం సిడ్నీ థండర్తో ఒప్పందం చేసుకున్నాడు. క్యాన్సర్పై పోరాటంలో భాగంగా మాడిన్సన్ గత సీజన్ (బీబీఎల్ 2024-25) మొత్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు సిడ్నీ థండర్తో బీబీఎల్ జర్నీని కొత్తగా ప్రారంభించనున్నాడు. థండర్తో ఒప్పందం అనంతరం మాడిన్సన్ మాట్లాడుతూ.. కొన్ని వెనుకడుగులు ఉన్నా కుటుంబం, స్నేహితులు, క్లబ్ ఇచ్చిన మద్దతుతో మళ్లీ ముందుకు వచ్చాను. ఈ సీజన్లో జట్టుకు తనవంతు సాయం చేసి, గత సీజన్ కంటే ఓ మెట్టు పైకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని అన్నాడు.మాడిన్సన్ థండర్తో జతకట్టడంపై ఆ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ ట్రెంట్ కోపెలాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో మాడిన్సన్ తప్పక ప్రభావం చూపుతాడని ఆశాభావంగా ఉన్నాడు. 33 ఏళ్ల మాడిన్సన్ బిగ్బాష్ లీగ్లో ఇప్పటివరకు మూడు జట్లకు (సిడ్నీ సిక్సర్స్ (7 సీజన్లు), మెల్బోర్న్ స్టార్స్ (3), మెల్బోర్న్ రెనెగేడ్స్ (3)) ప్రాతినిథ్యం వహించాడు. సిడ్నీ థండర్ అతని నాలుగో జట్టు. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన మాడిన్సన్ ఆసీస్ తరఫున 2013-18 మధ్యలో 3 టెస్ట్లు, 6 టీ20లు ఆడాడు. మాడిన్సన్ 2014 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున కూడా 3 మ్యాచ్లు ఆడాడు. బిగ్బాష్ లీగ్ మినహా అతను ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. -
16 ఏళ్ల వయసు.. ఆ తల్లిదండ్రుల గుండెకోత నుంచి పుట్టిందే ఇది!
ప్రపంచంలో.. మొట్టమొదటిసారిగా టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తోంది ఆస్ట్రేలియా. మరో రెండు రోజుల్లో (డిసెంబర్ 10) ఈ సంచలనాత్మక నిర్ణయం ఆచరణలోకి రానుంది. ఈ దరిమిలా ప్రపంచమంతా ఇది ఎలా అమలు కానుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే మిగతా దేశాలు తమ బాటలో పయనిస్తాయని తానేం ఆనుకోవడం లేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అంటున్నారు. అంతేకాదు.. తాము తీసుకున్నది పరిపూర్ణమైన నిర్ణయమేమీ కాదని కూడా ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు చిన్నారులకు సో.మీ. నిషేధంపై తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేమీ కాదని స్పష్టత ఇచ్చారు. ‘‘ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనుకుంటే మీరు పొరపడినట్లే. సో.మీ. ప్రభావం వల్ల ప్రభావితమైన.. వ్యక్తిగతంగా విషాదాల్ని ఎదుర్కొన్న తల్లిదండ్రులు కోరుకున్న మార్పు ఇది. మరికొందరు తల్లిదండ్రులు అలాంటి శోకం అనుభవించకూడదనే ఉద్దేశంతో వాళ్లు ఈ చట్టం రావాలని కోరుకున్నారు. ఇది తల్లిదండ్రుల బాధను గౌరవిస్తూ.. సోషల్ మీడియా కంపెనీలను బాధ్యత వహించేలా చేసే చట్టం’’ అని అల్బనీస్ పేర్కొన్నారు. ..అలాగని మేం దీనిని పరిపూర్ణమైన నిర్ణయం అని అనుకోవడం లేదని కూడా చెబుతున్నారు. ఈ చట్టంలో లోపాలున్నా ప్రాణాలను మాత్రం రక్షిస్తుందని అంటన్నారు. ఈ మేరకు పిల్లల భద్రతకు అవసరమైన అడుగుగా భావిస్తున్నాం అని అన్నారాయన. పిల్లల మానసిక ఆరోగ్యం .. భద్రత నేపథ్యాలే ఈ నిషేధం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు ఈ నిర్ణయాన్ని అనుసరించాలని కోరుకుంటున్నారా? అని అడగా.. అలా తాము భావించడం లేదని, అది ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఉంటుందని.. అయితే పాటిస్తే మాత్రం తప్పకుండా మేలే జరుగుతుందని అంటున్నారు. సోషల్ మీడియా వాడకానికి మినిమమ్ ఏజ్ (Online Safety Amendment Bill 2024)ను గుర్తిస్తూ.. ప్రపంచంలోనే మొదటిసారి అమలు కాబోతోంది. దీని ప్రకారం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్, స్నాప్చాట్, ఫేస్బుక్, థ్రెడ్స్, ఎక్స్(ట్విటర్) వంటి ప్రధాన ప్లాట్ఫారమ్లలో అకౌంట్లు ఉండకూడదు. ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ సైట్లకు మాత్రం అనుమతి ఉంటుంది. టెక్ కంపెనీలు ఈ నిబంధనను పాటించకపోతే భారీ జరిమానాలు($49.5 మిలియన్.. మన కరెన్సీలో రూ.4,500 కోట్ల దాకా జరిమానా) చెల్లించాల్సి వస్తుంది.తల్లిదండ్రుల బాధను విన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అల్బనీస్ మరోమారు స్పష్టం చేశారు. పిల్లలను ఆన్లైన్ బులీయింగ్(వేధింపులు), హానికర కంటెంట్కు దూరంగా ఉంచడం.. తద్వారా మానసిక ఒత్తిళ్ల నుండి పరిరక్షించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలని ఆల్బనీస్ ఉద్ఘాటించారు. స్క్రీన్లకు అతుక్కుపోకుండా.. పిల్లలు ఆటలు, సంగీతం, పుస్తకాలు వంటి నిజజీవిత కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. సవాళ్లు.. వయసు ధృవీకరణ కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని.. సంబంధిత డాక్యమెంట్లనూ పరిశీలిస్తామని సో.మీ. ప్లాట్ఫారమ్లు చెబుతున్నాయి. అయితే.. అదెంత వరకు వీలవుతుందో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(VPN)లు వాడడమో.. లేదంటో ఫేక్ అకౌంట్లు వాడో నిబంధల్ని అతిక్రమించే అవకాశం లేదా? అనేది మున్ముందు తెలిసేది.రియాక్షన్లు ఇవిగో.. టీనేజర్ల సో.మీ. స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్న ఈ చట్టం.. ఓ అతినియంత్రణేనని కొందరు ఆస్ట్రేలియన్ మైనర్లు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారు. ఆ పిటిషన్లు ప్రస్తుతానికి విచారణ దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోని యువత నుంచి ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కొంతమంది టీనేజర్లు ఈ నిషేధం వల్ల ఆన్లైన్ బులీయింగ్, హానికర కంటెంట్ తగ్గుతుందని భావిస్తున్నారు. మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదిగా చూస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం “ఇది బ్లాక్ అండ్ వైట్ విషయం కాదు” అని.. అంటే పూర్తిగా మంచిదీ చెడిదీ అని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. -
ఓటమి అంచుల్లో ఇంగ్లండ్
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ వన్ సైడెడ్గా సాగుతోంది. మరోసారి ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి టెస్ట్లో బంపర్ విక్టరీ సాధించిన ఆసీస్ మరోసారి అదే స్థాయి గెలుపు దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గట్టెక్కడం అసంభవం. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. ఇన్నింగ్స్ పరాభవం తప్పించుకోవాలంటే ఇంగ్లండ్ మిగిలిన 4 వికెట్లు కోల్పోకముందే ఈ పరుగులు చేయాలి. బెన్ స్టోక్స్ (4), విల్ జాక్స్ (4) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, మైఖేల్ నెసర్, స్కాట్ బోలాండ్ తలో 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రాలే 44, డకెట్ 15, పోప్ 26, రూట్ 15, బ్రూక్ 15, జేమీ స్మిత్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. వీరందరికీ మంచి ఆరంభమే లభించినప్పటికీ.. ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు.అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో 11 మంది తలో చేయి వేసి ఈ స్కోర్ వచ్చేలా చేశారు. స్పెషలిస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ (77) బ్యాట్తోనూ చెలరేగి టాప్ స్కోరర్గా నిలవడం విశేషం.స్టార్క్తో పాటు మరో నలుగురు కూడా అర్ద సెంచరీలు చేశారు. జేక్ వెదరాల్డ్ 72, లబూషేన్ 65, స్టీవ్ స్మిత్ 61, అలెక్స్ క్యారీ 63 పరుగులు చేశారు.ట్రవిస్ హెడ్ (33), గ్రీన్ (45) కూడా పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో ఇంగ్లిస్ 23, నెసర్ 16, బోలాండ్ 21 (నాటౌట్), డాగెట్ 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 4 వికెట్లతో సత్తా చాటగా.. స్టోక్స్ 3, ఆర్చర్, అట్కిన్సన్, జాక్స్ తలో వికెట్ తీశారు.తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జో రూట్(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో 334 పరుగులు చేసింది. జాక్ క్రాలీ(76),ఆర్చర్(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ రికార్డును బద్దలు కొట్టాడు. యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ తొలి రోజు ఇది జరిగింది. హ్యారీ బ్రూక్ వికెట్ తీయడంతో స్టార్క్ ఖాతాలో ఈ రికార్డు వచ్చి చేరింది. వసీం అక్రమ్ 104 టెస్ట్ల్లో 414 వికెట్లు తీయగా.. స్టార్క్ 102వ టెస్ట్లోనే ఈ ఘనత సాధించాడు.టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు (టాప్-5)స్టార్క్-415*వసీం అక్రమ్-414చమింద వాస్-355బౌల్ట్-317జహీర్ ఖాన్-311మ్యాచ్ విషయానికొస్తే.. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా ఇవాళే మొదలైన మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వారి ఈ సంతోషాన్ని స్టార్క్ ఎంతో సేపు మిగిల్చలేదు. ఓపెనర్ బెన్ డకెట్, అదే స్కోర్ వద్ద (5) వన్ డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ను డకౌట్ చేశాడు. అనంతరం కొద్ది గ్యాప్ ఇచ్చి హ్యారీ బ్రూక్ను (31) పెవిలియన్కు పంపాడు.42 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 182/4గా ఉంది. డకెట్, పోప్, క్రాలే, బ్రూక్ ఔట్ కాగా.. జో రూట్ (65), కెప్టెన్ బెన్ స్టోక్స్ (4) క్రీజ్లో ఉన్నారు. స్టార్క్ 3 వికెట్లు తీయగా.. మైఖేల్ నెసర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.స్టార్క్ నిప్పులు చెరగడంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆతర్వాత కుదురుకుంది. రూట్, క్రాలే అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో వికెట్కు 117 పరుగులు జోడించారు. క్రాలే 76 పరుగుల వద్ద ఉండగా నెసర్ అద్బుతమైన బంతితో క్రాలే వికెట్ తీశాడు. అనంతరం రూట్తో జత కలిసిన బ్రూక్ కాసేపు పోరాడాడు. నాలుగో వికెట్కు వీరిద్దరు 54 పరుగులు జోడించారు.ఈ దశలో మరోసారి బంతినందుకున్న స్టార్క్ బ్రూక్ను బోల్తా కొట్టించి, ఇంగ్లండ్ను మరోసారి కష్టాల్లోకి నెట్టేశాడు. రూట్, స్టోక్స్ ఇంగ్లండ్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, 5 మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఈసారి ఎన్ని రోజుల్లో!
బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్లో రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి బ్రిస్బేన్లోని ‘గాబా’ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో గెలిచిన ఆ్రస్టేలియా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలో ఉంది. అదే జోరు కొనసాగిస్తూ ‘డే అండ్ నైట్’ టెస్టులోనూ విజయం సాధించాలని స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆసీస్ జట్టు భావిస్తోంది. మరోవైపు 2010–11 నుంచి ఆసీస్ గడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేకపోయిన ఇంగ్లండ్ జట్టు ‘ఫ్లడ్ లైట్’ల వెలుతురులో జరగనున్న పోరులో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. ‘పింక్ బాల్’ టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉన్న ఆసీస్... ఇప్పటి వరకు ఆడిన 14 ‘గులాబీ’ టెస్టుల్లో 13 గెలిచి, ఒక్కటి మాత్రమే ఓడింది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో అతిగా స్వింగ్ అయ్యే ఆసీస్ పేసర్ల బంతులను ఎదుర్కోవడం ఇంగ్లండ్ ఆటగాళ్లకు శక్తికి మించిన పనే. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఉస్మాన్ ఖ్వాజా స్థానంలో జోష్ ఇన్గ్లిస్కు ఆ్రస్టేలియా తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయమే. గత మ్యాచ్లో సూపర్ సెంచరీతో జట్టును గెలిపించిన ట్రావిస్ హెడ్ మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... లబుషేన్, స్మిత్, గ్రీన్, కేరీ కీలకం కానున్నారు. బౌలింగ్లో స్టార్క్కు బొలాండ్, డగెట్ నుంచి చక్కటి సహకారం లభిస్తోంది. మరోవైపు ‘బాజ్బాల్’నే నమ్ముకున్న ఇంగ్లండ్ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్తో బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉన్నా... వీరంతా సమష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది. బౌలింగ్లో ఆర్చర్, అట్కిన్సన్, కార్స్ కీలకం కానున్నారు. -
టిమ్ డేవిడ్ విలయతాండవం
అబుదాబీ టీ10 లీగ్ (Abu Dhabi T10 League) 2025 ఎడిషన్లో యూఏఈ బుల్స్ (UAE Bulls) విజేతగా ఆవిర్భవించింది. నిన్న (నవంబర్ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్ స్టాల్లియన్స్పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగుల ఊహకందని స్కోర్ చేసింది.బుల్స్కు ఆడుతున్న ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు టిమ్ డేవిడ్ (Tim David) కేవలం 30 బంతుల్లో 12 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. మిగతా ఆటగాళ్లలో రోవ్మన్ పావెల్ 20 బంతుల్లో 24 (నాటౌట్), ఫిల్ సాల్ట్ 8 బంతుల్లో 18 పరుగులు చేశారు. జేమ్స్ విన్స్ డకౌటయ్యాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్టాల్లియన్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ కమ్ కెప్టెన్ రహ్మానుల్లా గుర్బాజ్ (15 బంతుల్లో 18) సహా అంతా నిదానంగా ఆడారు. ఆండీ ఫ్లెచర్ 2 (రిటైర్డ్ హర్ట్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ డకౌట్, డు ప్లూయ్ 16, కట్టింగ్ 11, కరీమ్ జనత్ 15, సామ్ బిల్లింగ్స్ 3 పరుగులు మాత్రమే చేశారు. సిక్సర్ల సునామీ సృష్టించి యూఏఈని ఒంటిచేత్తో గెలిపించిన టిమ్ డేవిడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 9 సీజన్ల లీగ్ చరిత్రలో యూఏఈ బుల్స్కు ఇదే మొదటి టైటిల్. -
62 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న ప్రధాని
-
‘నాకు పెళ్లైందోచ్..’ 62 ఏళ్ల ఆస్ట్రేలియా ప్రధాని
62 ఏళ్ల వయసులో ఆ దేశ ప్రధాని మళ్లీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ‘నాకు పెళ్లైందోచ్..’ అంటూ ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆరేళ్లుగా పబ్లిక్గా ఈ జంట డేటింగ్లో ఉండగా.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కావడం విశేషం. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇవాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన గర్ల్ఫ్రెండ్ జోడీ హైడెన్ (Jodie Haydon)ను ఆయన పెళ్లాడారు. కాన్బెర్రాలోని ఆంథోనీ (Anthony Albanese) అధికారిక నివాసం ది లాడ్జ్ తోటలో కొద్దిమంది మధ్య ఈ వేడుకలు జరిగాయి. తన పార్ట్నర్ చేతిని పట్టుకుని నడుస్తున్న వీడియోను ఆంథోనీ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Married💍❤️💍 pic.twitter.com/mSzojtBF2I— Anthony Albanese (@AlboMP) November 29, 2025జోడీ హైడెన్(47) అడ్వొకేట్తో పాటు ఆర్థిక నిపుణురాలు కూడా. 2019లో మెల్బోర్న్లో జరిగిన ఓ బిజినెస్ డిన్నర్లో ఆంథోనీ అల్బనీస్ను తొలిసారి ఈమె కలుసుకున్నారు. దాదాపు అదే సమయంలో అల్బనీస్ తన భార్య(మొదటి) కార్మెల్ నుంచి విడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆల్బనీస్-హైడెన్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 2022లో ఫెడరల్ ఎన్నికల ప్రచారంలో అల్బనీస్ వెంట జోడీ హైడెన్ సందడి చేశారు. ప్రధాని పదవి చేపట్టాక అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వచ్చారు. దుబాయ్, మాడ్రిడ్, స్పెయిన్, పారిస్ పర్యటనల్లో పాల్గొన్న ఆమె.. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు, 2023లో నాటి అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన విందుకూ ఆల్బనీస్ వెంట ఆమె కనిపించారు. ఈ క్రమంలో వారి ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేశాయి. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రధాని హోదాలో ఓ వ్యక్తి వివాహం చేసుకోవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో యూకే ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ 2021లో క్యారీ సైమండ్స్ను వివాహం చేసుకున్నారు. -
స్క్రీన్పై 'బ్యాన్'
ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించారు. వచ్చే డిసెంబర్ 10 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తోంది. వీరు కొత్తగా సామాజిక మాధ్యమాల ఖాతాలు తెరవడానికి వీల్లేదు. ఇప్పటికే ఉంటే అవి రద్దు అవుతాయి. ఈ బిల్లుకు 2024 నవంబర్ 28న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తద్వారా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ప్రపంచంలో నిషేధాన్ని ప్రకటించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా అవతరించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్సామాజిక మాధ్యమాలతో పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. వీటిలో ఉండే కంటెంట్ పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సుకు హాని కలిగిస్తోంది. పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా నిషేధానికి శ్రీకారం చుట్టినట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చేపట్టిన ఒక అధ్యయనంలో 10–15 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 96% మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వీరిలో 10 మందిలో ఏడుగురు హానికరమైన కంటెంట్, వేధింపులకు గురయ్యారని తేలింది.నిషేధం బాటలో మరిన్ని..ఇప్పటికే చాలా దేశాలు పాఠశాలల్లో స్మార్ట్ఫోన్ల వినియోగాన్ని నిషేధించాయి. తాజాగా సోషల్ మీడియా బ్యాన్ విషయంలో ఆస్ట్రేలియా బాటలో మరిన్ని దేశాలు ఉన్నాయి. పదిహేనేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించనున్నట్టు డెన్మార్క్ ప్రకటించింది. అయితే 13, ఆపై వయసున్న పిల్లలు వీటిని వినియోగించాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి.పిల్లల దైనందిన జీవితం, బాల్యాన్ని రూపొందించడంలో హానికరమైన కంటెంట్, వాణిజ్య ఆసక్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న డిజిటల్ ప్రపంచంలో వారిని ఒంటరిగా వదిలివేయకూడదని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. పదహారేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా వాడకుండా వచ్చే ఏడాది నుంచి అడ్డుకట్ట వేయనున్నట్టు మలేషియా వెల్లడించింది. హానికారక కంటెంట్ 18 ఏళ్లలోపు పిల్లలకు చేరకుండా బ్రిటిష్ ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ను యూకే అమలు చేస్తోంది. పదిహేనేళ్లలోపు పిల్లలను సామాజిక మాధ్యమాల నుంచి దూరం చేసేందుకు నార్వే ఓ చట్టాన్ని తీసుకొస్తోంది. న్యూజిలాండ్, ఫ్రాన్స్, పాకిస్తాన్ సైతం ఈ బాటలో ఉంది. ‘15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలి’.. అని నెదర్లాండ్స్ ప్రభుత్వం సూచించింది.కోట్లలో యూజర్లు..ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్, స్నాప్చాట్.. వేదిక ఏదైనా ఈ సామాజిక మాధ్యమాలను వినియోగించేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 566 కోట్లు ఉన్నట్టు అంచనా. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఉపయోగిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలూ ఇందుకు మినహాయింపు కాదు. ఒక్కొక్క దేశాన్నిబట్టి 13–17 ఏళ్ల వయసున్న పిల్లల్లో 95% వరకు, 8–12 ఏళ్లవారిలో 40% మందికి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.అత్యధికుల మాట అదే..ఫ్రాన్స్కు చెందిన మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇప్సాస్ ఈ ఏడాది జూన్–జూలైలో 30 దేశాల్లో సర్వే చేపట్టింది. 18–75 ఏళ్ల వయసున్న 23,700 మంది ఇందులో పాలుపంచుకున్నారు. ఇప్సాస్ ఎడ్యుకేషన్ మానిటర్–2025 ప్రకారం.. 14 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలంటూ 71% మంది తమ గళం వినిపించారు. గత ఏడాది సర్వేలో 65% మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇండోనేషియాలో 87% మంది, ఫ్రాన్స్ 85, ఆస్ట్రేలియాలో 79% మంది బ్యాన్వైపు మొగ్గు చూపారు. అయితే భారత్లో గత ఏడాది 73% మంది ఈ అంశాన్ని ఏకీభవిస్తే.. 2025లో ఈ సంఖ్య 68%కి వచ్చి చేరింది. -
ఆస్ట్రేలియా టూ అమెరికా.. రమణ గోగుల మ్యూజిక్ జాతర (ఫొటోలు)
-
ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!
ఈ భూమ్మీద ఉండే ప్రతి జీవి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కొన్ని విచిత్రమైన జీవులు మనం రోజూ చూసే జీవుల మాదిరిగా ఉండి, అత్యంత విశిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే ఎలుక మాదిరి ఈ మార్సుపియల్. ఇది చూడటానికి అచ్చం ఎలుకను పోలి ఉంటుంది. దీనికున్న ప్రత్యేక లక్షణాలు గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి అవేంటో చకచక చూసేద్దామా..!.ఆ జీవి పేరు ఆంథెకనస్. ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే చిన్న ఎలుక లాంటి మార్సుపియల్. వీటిని పెద్ద పాదాల మార్సుపియల్స్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇవి ఎలుకలు మాత్రం కాదట. వీటిలో అత్యంత విలక్షణమైనది సంతానోత్పత్తి కాలం. సంవత్సరానికి రెండు నుంచి మూడు వారాలు మాత్రమే ఉండే ఈ సంతానోత్పత్తి కాలంలో మగ ఆంథెకనస్ కోసం తీవ్రంగా అన్వేషిస్తుందట. అయితే ఈ మగ మార్సుపియల్ ఆడ మార్సుపియల్లతో ఏకంగా 14 గంటల వరకు సంభోగం చేస్తుందట. అందుకోసం మగ మార్సుపియల్లు నిద్రను సైతం పక్కనపెట్టేస్తాయట. దాంతో వాటి శరీరంలో టెస్టోస్టెరాన్, ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు అమాంతం పెరిపోతాయి. దాంతో వాటి అంతర్గత అవయవాల పనితీరు దెబ్బతిని, రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఫలితంగా మగ ఆంథెకినేసులు ఏడాది వయసు కూడా రాకమునుపే చనిపోతాయట. అలాగే ఈ ఆడ ఆంథెకినేసులు పునరుత్పత్తి వ్యవస్థ సైతం ఇతర జీవుల కంటే భిన్నంగా ఉంటుందట. అచ్చం కంగారుల మాదిరిగా పూర్తి స్థాయి బొడ్డు సంచి ఉండదట. కేవలం చర్మ సంచి మాత్రమే ఉంటుందట. గర్భధారణ కాలం దాదాపు 25 నుంచి 35 రోజులు. ఆ తర్వాత అపరిపక్వ పిల్లలను అనేక వారాల పాటు తల్లి శరీరాన్ని అంటిపెట్టుకుని పెరుగుతాయట. వీటికి బీటిల్స్, సాలెపురుగులు, స్లగ్స్, వంటి కీటకాలు ఆహారం, ఒక్కోసారి చిన్న చిన్న సరీసృపాలను కూడా వేటాడతాయట. ఇవి టార్పోర్ అనే ప్రత్యేకమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయట. అంటే.. శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ రేటుని తగ్గించి శక్తిని ఆదా చేసేలా ఒక రకమైన లోతైన నిద్రలాంటిది ఈ టార్పోర్. ఇక వీటి తోకలు వాటి శరీరం కంటే చాలా పొడవుగా ఉండి, మందపాటి బూడిద లేదా గోధుమ వర్ణం బొచ్చుని కలిగి ఉంటాయి.(చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!)) -
ఆస్ట్రేలియాలోని ఎన్నారైల సహకారం మరువలేనిది : లక్ష్మీపార్వతి
గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోనీ మెల్బోర్న్ పర్యటనలో ఉన్న లక్ష్మీపార్వతి గారు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ నాయకులని ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతు తీర్చుకుంటామని తెలియజేశారు. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసిపి నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మెల్బోర్న్ టీం వైయస్ఆర్సీపీ సభ్యులకు ఆస్ట్రేలియా సీనియర్ వైసీపీ లీడర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు -
అటు స్టార్క్... ఇటు స్టోక్స్
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాషెస్ సిరీస్ అనూహ్య రీతిలో ఆరంభమైంది. కిక్కిరిసిన పెర్త్ స్టేడియంలో ఆసీస్ పేసర్లు అదరగొట్టడంతో... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశాం అనుకుంటే... ఇంగ్లండ్ బౌలర్లు కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు. స్టార్క్ ధాటికి ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే కుప్పకూలగా... బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బంతితో విజృంభించాడు. ఐదు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బ తీశాడు. వెరసి... పర్యాటక ఇంగ్లండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్లో కీలకమైన ఆధిక్యం దక్కే అవకాశాలున్నాయి. పెర్త్: పేసర్లకు అనుకూలించే పెర్త్ పిచ్పై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా యాషెస్ సిరీస్ తొలి టెస్టు తొలి రోజే 19 వికెట్లు నేలకూలాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ధాటిగా ఆడుతూ 32.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (61 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా... ఒలీ పోప్ (58 బంతుల్లో 46; 4 ఫోర్లు), జేమీ స్మిత్ (22 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఆసీస్ పేసర్లు ఆకట్టుకున్న చోట... ఇంగ్లండ్ బౌలర్లు కూడా సత్తా చాటారు. సారథి బెన్ స్టోక్స్ 6 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ చెరో 2 వికెట్లు తీశారు. చేతిలో ఒక వికెట్ ఉన్న ఆస్ట్రేలియా... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. నాథన్ లయన్ (3 బ్యాటింగ్), బ్రెండన్ డగెట్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లోనే వికెట్...ఆస్ట్రేలియా గడ్డపై గత కొన్నాళ్లుగా ప్రభావం చూపలేకపోతున్న ఇంగ్లండ్ జట్టును స్టార్క్ (7/58) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో గట్టిదెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ జాక్ క్రాలీ (0)ని అవుట్ చేసిన అతడు... చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. తొలి ఓవర్లో వికెట్ పడగొట్టడం స్టార్క్కు ఇది 24వసారి. సీనియర్ బ్యాటర్ జో రూట్ (0) డకౌట్ కాగా... కెప్టెన్ బెన్ స్టోక్స్ (6) ప్రభావం చూపలేకపోయాడు. బెన్ డకెట్ 21 పరుగులు చేశాడు. పేసర్లకు సహకరిస్తున్న పిచ్పై సంయమనంతో బ్యాటింగ్ చేయడానికి బదులు ఇంగ్లండ్ జట్టు... తమకు అలవాటైన ‘బాజ్బాల్’ ఆటతీరును అవలంభించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. దీంతో ఒకవైపు వికెట్లు పడుతున్నా... ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అరంగేట్ర పేసర్ బ్రెండన్ డగెట్ 2 వికెట్లు తీశాడు. కామెరూన్ గ్రీన్కు ఒక వికెట్ దక్కింది. 6 ఓవర్లు వేసి 5 వికెట్లు...తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్... బౌలింగ్లో పట్టుదల కనబర్చింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఆసీస్ అరంగేట్ర ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (0)ను ఆర్చర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబుషేన్ (41 బంతుల్లో 9; 1 ఫోర్) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోగా... ఈ మ్యాచ్లో సారథ్యం వహిస్తున్న స్టీవ్ స్మిత్ (49 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఉస్మాన్ ఖ్వాజా (2) విఫలం కాగా... ట్రావిస్ హెడ్ (21), కామెరూన్ గ్రీన్ (24) తలా కొన్ని పరుగులు చేశారు. తొలి నాలుగు వికెట్లను ఆర్చర్, కార్స్ పంచుకోగా... ఆ తర్వాత కెప్టెన్ స్టోక్స్ మ్యాజిక్ ప్రారంభమైంది. కేవలం ఆరు ఓవర్లే బౌలింగ్ చేసిన అతడు... వరుసగా హెడ్, గ్రీన్, స్టార్క్ (12), కేరీ, బోలండ్ (3)లను పెవిలియన్ బాట పట్టించాడు. ఇంగ్లండ్ కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా... 5.23 రన్రేట్తో పరుగులు సాధించగా... ఆస్ట్రేలియా మాత్రం ఆ పని చేయలేకపోయింది.19 యాషెస్ టెస్టులో తొలి రోజే 19 వికెట్లు నేలకూలడం 1909 తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1909 మాంచెస్టర్ టెస్టు తొలి రోజు ఇరు జట్లు ఆలౌటయ్యాయి.5 ఆస్ట్రేలియా గడ్డపై 5 వికెట్లు పడగొట్టిన ఐదో ఇంగ్లండ్ కెప్టెన్గా బెన్ స్టోక్స్ నిలిచాడు. చివరిసారిగా 1982లో ఇంగ్లండ్ సారథి బాబ్ విల్లీస్ బ్రిస్బేన్ టెస్టులో ఈ ఘనత సాధించాడు.36 బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు పడగొట్టేందుకు వేసిన బంతులు. ఇంగ్లండ్ పేసర్లలో ఇది మూడో వేగవంతమైంది. గతంలో స్టువర్ట్ బ్రాడ్ 19 బంతుల్లో (ఆస్ట్రేలియాపై), 34 బంతుల్లో (న్యూజిలాండ్పై) ఈ ఫీట్ నమోదు చేశాడు.7/58 ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్కు టెస్టు క్రికెట్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆసీస్ ఆడిన గత మ్యాచ్లో వెస్టిండీస్పై స్టార్క్ 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టెస్టుల్లో స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 17వ సారి.100 ‘యాషెస్’ టెస్టుల్లో 100 వికెట్లు తీసిన 11వ ఆస్ట్రేలియా పేసర్గా స్టార్క్ నిలిచాడు. 21వ శతాబ్దంలో టెస్టు అరంగేంట్రం చేసిన వారిలో ఈ ఘనత సాధించిన మొదటి పేసర్ అతడే.0/1 యాషెస్ సిరీస్లో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదు కాకుండా ఇరు జట్లు ఓపెనింగ్ బ్యాటర్ వికెట్ కోల్పోవడం ఇదే తొలిసారి.10 బెన్స్టోక్స్ను స్టార్క్ అవుట్ చేయడం ఇది పదోసారి. భారత స్పిన్నర్ అశ్విన్ 13 సార్లు స్టోక్స్ను పెవిలియన్ చేర్చాడు. -
అక్కడేమో భారీ జరిమానాలు.. మరి భారత్లో?!
మీ అకౌంట్లు క్లోజ్ చేస్తున్నాం. అప్రమత్తం అవ్వండి.. అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు అక్కడి మైనర్లకు నోటిఫికేషన్లు పంపిస్తున్నాయి. ఆస్ట్రేలియా డిసెంబర్ 10, 2025 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో భారత్లో ఇలాంటి నిషేధం అమలు చేయడం సాధ్యమేనా? అనే అంశాన్ని ఓసారి పరిశీలిద్దాం.. పిల్లలు.. పిల్లలాగే ఉండనివ్వాలి అన్నది ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ చెబుతున్నమాట. సో.మీ. ప్రభావంతో పిల్లలు హానికరమైన కంటెంట్, ఆన్లైన్ బుల్లీయింగ్, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని చెబుతోంది. ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్(సోషల్ మీడియా మినిమమ్ ఏజ్) బిల్లు ప్రకారం.. ఆన్లైన్ ఎడ్యుకేషన్, యూట్యూబ్ కిడ్స్, ఈ లెర్నింగ్ యాప్లకు మాత్రం బ్యాన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే సో.మీ. యాప్లు ఈ బ్యాన్ను వ్యతిరేకించినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయబోతున్నాయి. మెటా.. దాని అనుబంధ యాప్లు, టిక్టాక్, యూట్యూబ్, ఎక్స్.. ఇలా ఎందులోనూ వాళ్లకు అకౌంట్లు ఉండడానికి వీల్లేదు. ఇప్పటికే మెయిల్స్, నోటిఫికేషన్ల రూపంలో మైనర్లకు సందేశాలు పంపిస్తున్నాయి. ఆ అకౌంట్లలో ఉన్న తమ డేటాను భద్రపరుచుకోవాలని వాళ్లకు సూచిస్తున్నాయి. నిర్ణీత వయసు దాటితే గనుక తమను తగిన ఆధారాలతో సంప్రదించాలని.. ఫేషియల్ ఏజ్ స్క్రీనింగ్ లాంటి సాంకేతిక సాయంతో ఆ విషయాన్ని ధృవీకరించుకుని ఆపై ఆ అకౌంట్లను యాక్టివేట్ చేస్తామని చెబుతున్నాయి. పలు యాప్లు పిల్లల అకౌంట్లను డీ యాక్టివేట్ చేయడం ప్రారంభించాయి. డిసెంబర్ 4వ తేదీ నుంచే పిల్లలు అకౌంట్లను క్రియేట్ చేయడానికి వీలుండదు. 10వ తేదీ నుంచి సంపూర్ణ నిషేధం అమల్లోకి వస్తుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. సదరు ప్లాట్ఫారమ్లకు 50 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు(మన కరెన్సీలో రూ.2,856 కోట్లు) దాకా జరిమానా విధిస్తారు. భారత్లో ఇది పరిస్థితి..ఆస్ట్రేలియా ప్రపంచంలో ఈ తరహా బ్యాన్ తేబోతున్న దేశం. అలాగే.. డెన్మార్క్ వంటి దేశాలు వయస్సు ఆధారంగా సోషల్ మీడియా నిషేధం అమలును పరిశీలిస్తున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ తరహా నిషేధం అమలు అవుతోంది కూడా. ఈ నేపథ్యంలో.. భారతదేశంలో కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది. అయితే డిజిటల్ నిపుణులు చెబుతోంది ఏంటంటే.. నిషేధం అమలు చేయడం కష్టమని. ఎందుకంటే భారత్లో 25 కోట్ల మైనర్లు సో.మీ. వాడుతున్నారనే అంచనా ఒకటి ఉంది. అంతేకాదు.. భారతదేశంలో డిజిటల్ మానిటరింగ్ బలహీనంగా ఉందని. సోషల్ మీడియా వాడకాన్ని ఆరోగ్యకరంగా ప్రోత్సహించడం (healthy use) మంచిదని సూచిస్తున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, పూర్తిగా నిషేధం కంటే నియంత్రణ, అవగాహన అవసరమని నిపుణులు భావిస్తున్నారు. అయితే బిజీ లైఫ్లో ఇటు భారత్లో అలాంటి నిషేధం వద్దనే చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.కోర్టు ఏం చెప్పిందంటే.. భారత్లో చిన్నారులు సోషల్ మీడియా(Social Media) వాడకుండా నిషేధించడం తమ పరిధిలో లేదని సర్వోన్నత న్యాయస్థానం ఇది వరకే తేల్చి చెప్పింది. ఇది చట్టపరిధిలోని అంశమని స్పష్టం చేసింది. అంతేకాదు.. 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. కఠిన చట్టం లేదా?.. భారత్లో మైనర్లు సో.మీ. వాడకూడదనే రూల్ ఏం లేదు. రాజకీయ కోణం, ఇక్కడి జనాభా, సో.మీ. ప్లాట్ఫారమ్ జరిపే వ్యాపారాలను పరిగణనలోకి తీసుకుంటే అది సాహసమనే చెప్పాలి. అయితే.. కేంద్ర ప్రభుత్వం 2023లో Digital Personal Data Protection (DPDP) Act, 2023ను ఆమోదించింది. దీని ఆధారంగా DPDP Rules, 2025ను నోటిఫై చేసింది. ఈ నియమాల ప్రకారం.. 18 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల లేదా లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియా కంపెనీలు పిల్లల డేటా సేకరణ, వినియోగం, షేరింగ్పై కఠిన నియంత్రణలు పాటించాలి. ఉల్లంఘన జరిగితే కంపెనీలకు రూ. 250 కోట్లు వరకు జరిమానా విధించవచ్చు. అయితే.. ఇది సక్రమంగా అమలు కావడం లేదు. చివరగా.. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటి దేశంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు చేస్తోంది. భారతదేశంలో ఇలాంటి నిషేధం అమలు సాధ్యమా అనే ప్రశ్నపై నిపుణులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి నిషేధం కంటే నియంత్రణ, అవగాహన, డిజిటల్ లిటరసీపై దృష్టి పెట్టడం భారతదేశానికి అత్యంత అనుకూలమని సూచిస్తున్నారు. -
‘యాషెస్’ సమరానికి సిద్ధం
టెస్టు క్రికెట్లో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న సుదీర్ఘ వైరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్కు నేటితో తెర లేవనుంది. ఇరు జట్ల ఆటగాళ్లను ఒక్క మంచి ప్రదర్శనతో హీరోలుగా, ఒక్క పరాజయంతో జీరోలుగా మార్చగల ఈ సమరంపై క్రికెట్ అభిమానులందరి దృష్టీ నిలిచింది. సొంతగడ్డపై ఆ్రస్టేలియా ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తున్నా... ‘బాజ్బాల్’ తరహా ఆటతో తమకంటూ విజయావకాశాలు ఉన్నాయని ఇంగ్లండ్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడు వారాల పాటు హోరాహోరీ ఆట ఖాయం. పెర్త్ స్టేడియంలో పిచ్పై పచ్చిక ఉంది. ఆరంభంలో పేస్, బౌన్స్కు బాగా అనుకూలిస్తూ ఆ తర్వాత నెమ్మదించే అవకాశం ఉంది. పెర్త్: యాషెస్ సిరీస్లో భాగంగా రెండేళ్ల క్రితం ఇంగ్లండ్లో ఆ్రస్టేలియా పర్యటించగా, ఆ సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అంతకుముందు 2021లో ఆసీస్ గడ్డపై ఆడిన ఇంగ్లండ్ 0–4తో చిత్తుగా ఓడింది. ఈ గణాంకాలు చూస్తే ఎవరిది పైచేయో అర్థమవుతుంది. అయితే కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పర్యవేక్షణలో దూకుడు కనబరుస్తున్న ఇంగ్లండ్ తమ ప్రత్యర్థిని ఓడించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది.ముఖ్యంగా తొలి టెస్టులో ఇద్దరు ఆసీస్ ప్రధాన పేసర్లు జట్టుకు దూరం కావడం ఇంగ్లండ్కు సానుకూలంగా మారే అవకాశం ఉంది. సిరీస్లో శుభారంభం చేస్తే దానిని కొనసాగించాలని బెన్ స్టోక్స్ బృందం పట్టుదలగా ఉంది. అయితే సమర్థుడైన స్టీవ్ స్మిత్ టీమ్కు నాయకత్వం వహించడం ఆసీస్కు బలం. ఇద్దరు అరంగేట్రం... ‘స్మిత్ను 40 పరుగుల్లోపు ఆపగలిగితే మంచిది. లేదంటే మ్యాచ్ చేజారినట్లే’... ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్య ఇది. అతని బ్యాటింగ్ ప్రభావం ఎలాంటిదో ఇది చెబుతుంది. ఇప్పుడు కూడా స్మిత్ బలమైన బ్యాటింగే ఆసీస్కు పెద్ద బలం. ఇతర సీనియర్లలో లబుషేన్, హెడ్లపై ప్రధానంగా బ్యాటింగ్ భారం ఉంది. చాలా కాలంగా విఫలమవుతున్నా ఉస్మాన్ ఖ్వాజా అదృష్టవశాత్తూ ఈ సిరీస్లో అవకాశం దక్కించుకున్నాడు. అతనికి ఓపెనింగ్ భాగస్వామిగా కొత్త ఆటగాడు జేక్ వెదరాల్డ్ బరిలోకి దిగుతాడు. కీపర్ అలెక్స్ కేరీకి కూడా టెస్టు బ్యాటర్గా మంచి రికార్డు ఉంది. ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ ఫిట్నెస్ సమస్యలు దాటి కొత్తగా మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. గాయాల కారణంగా రెగ్యులర్ కెపె్టన్ కమిన్స్, హేజల్వుడ్ తొలి టెస్టు నుంచి తప్పుకోవడంతో బౌలింగ్లో సీనియర్ మిచెల్ స్టార్క్పై చాలా పెద్ద బాధ్యత ఉంది. బోలండ్ అతనికి తగిన భాగస్వామి కాగా, మరో పేసర్ బ్రెండన్ డగెట్ తొలి టెస్టు ఆడబోతున్నాడు. ఎప్పటిలాగే ఏకైక స్పిన్నర్ లయన్ ప్రత్యర్థి కి సవాల్ విసురుతున్నాడు. 2019 తర్వాత ఆ్రస్టేలియా జట్టు తరఫున ఒకే టెస్టులో ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. స్పిన్నర్ లేకుండా... తొలి టెస్టు వరకు మాత్రం ఆసీస్తో పోలిస్తే ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆ జట్టు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగనుండటం విశేషం. ఆర్చర్, మార్క్వుడ్లాంటి ఫాస్టెస్ట్ బౌలర్లతో పాటు అట్కిన్సన్, కార్స్ ఆడనుండగా బౌలింగ్లో స్టోక్స్ కీలక పాత్ర పోషించడం ఖాయం. తుది జట్టులో ఇంగ్లండ్ ఒక్క స్పిన్నర్ను కూడా తీసుకోవడం లేదు. బ్యాటింగ్తో భారత్తో సిరీస్ సహా గత కొంతకాలంగా టాప్–7లో ఎలాంటి మార్పూ లేదు. పెద్దగా రాణించకపోయినా క్రాలీ, పోప్లపై జట్టు నమ్మకం ఉంచింది. డకెట్, బ్రూక్, స్టోక్స్ ఎలా ఆడతారనేది ఆసక్తికరం. అందరి దృష్టీ ఇప్పుడు జో రూట్పై నిలిచింది. ఆధునిక టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు ఉన్న రూట్ ఆసీస్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతని తాజా ఫామ్ను బట్టి చూస్తే ఈ సిరీస్లో ఆ లోటును పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా, జట్టుపరంగా చూసినా కూడా రూట్ ఆట సిరీస్ ఫలితాన్ని నిర్దేశించగలదు. 34-32ఓవరాల్గా 73 యాషెస్ సిరీస్లు జరిగితే...ఆ్రస్టేలియా 34, ఇంగ్లండ్ 32 గెలవడం ఇరు జట్ల మధ్య పోటీని చూపిస్తోంది.152-111యాషెస్ సిరీస్లో ఇరు జట్ల మధ్య మొత్తం 361 టెస్టులు జరిగాయి. ఆ్రస్టేలియా 152 గెలవగా, ఇంగ్లండ్ 111 మ్యాచ్లలో విజయం సాధించింది. 13సొంతగడ్డపై జరిగిన గత 15 యాషెస్ టెస్టుల్లో ఆ్రస్టేలియా 13 గెలిచి, 2 ‘డ్రా’ చేసుకుంది. ఒక్కదాంట్లోనూ ఓడలేదు. 2011 జనవరి తర్వాత ఇక్కడ ఇంగ్లండ్ ఒక్క టెస్టు కూడా నెగ్గలేకపోయింది. 2023 తర్వాత ఓవరాల్గా అన్ని జట్లపై కలిపి ఆడిన 18 టెస్టుల్లో ఆసీస్ 14 గెలిచింది. ఆసీస్ గడ్డపై ఆడిన గత మూడు ‘యాషెస్’లలో ఇంగ్లండ్ 0–5, 0–4, 0–4తో ఓడింది. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ విధ్వంసకర శతకం
మహిళల బిగ్బాష్ లీగ్లో (WBBL 2025) మెల్బోర్న్ స్టార్స్ ఓపెనర్, మహిళల ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన మెగ్ లాన్నింగ్ (Meg Lanning) చెలరేగిపోయింది. సిడ్నీ సిక్సర్స్తో జరుగుతున్న మ్యాచ్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. 74 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. WBBL HUNDRED FOR THE GOAT, MEG LANNING....!!!! 🐐 pic.twitter.com/0mc50pUij9— Johns. (@CricCrazyJohns) November 20, 2025ఆమెకు తోడు మరో ఓపెనర్ మెక్కెన్నా (34 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.స్టార్స్ ఇన్నింగ్స్లో లాన్నింగ్, మెక్కెన్నా మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ అన్నాబెల్ సదర్ల్యాండ్ 12, మారిజన్ కాప్ 6 పరుగులు చేసి ఔట్ కాగా.. డానియెలా గిబ్సన్ 7, యామీ జోన్స్ 0 పరుగులతో అజేయంగా నిలిచారు. సిక్సర్స్ బౌలర్లలో లారెన్ చీటిల్, ఆష్లే గార్డ్నర్, మ్యాడీ విలియర్స్కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో స్టార్స్ చేసిన 219 పరుగుల స్కోర్ మహిళల బిగ్బాష్ లీగ్ చరిత్రలో మూడో అత్యధికం. ఈ లీగ్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సిడ్నీ సిక్సర్స్ (242) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానంలో బ్రిస్బేన్ హీట్ (229) ఉంది.ఈ మ్యాచ్లో లాన్నింగ్ చేసిన స్కోర్ (135) కూడా లీగ్ చరిత్రలో మూడో అత్యధికం. మొదటి రెండు స్థానాల్లో లిజెల్ లీ (150 నాటౌట్), గ్రేస్ హ్యారిస్ (136 నాటౌట్) ఉన్నారు. ఈ సెంచరీతో లాన్నింగ్ WBBLలో అత్యధి ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ప్లేయర్ల జాబితాలో ఎల్లిస్ పెర్రీని (34) వెనక్కు నెట్టి రెండో స్థానానికి (35) ఎగబాకింది. టాప్ ప్లేస్లో బెత్ మూనీ (48) ఉంది. ఈ సెంచరీ లాన్నింగ్కు మహిళల బిగ్బాష్ లీగ్లో రెండవది. చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్లో చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్ -
BMW కారు బీభత్సం: భారత సంతతి గర్భిణి దుర్మరణం
డ్రైవింగ్ సరిగ్గా రాకుండానే స్టీరింగ్ పట్టుకున్న ఒక మైనర్ అత్యుత్సాహం ఒక కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టేసింది. రెండో బిడ్డ రాక కోసం కలలు కంటున్న నిండు గర్భిణి తన కల తీరకుండానే అనంత లోకాలకు చేరింది.ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో 33 ఏళ్ల గర్భిణి భారతీయ మహిళ కన్నుమూసింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన సమన్విత ధరేశ్వర్ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా అదుపు తప్పిన లగ్జరీ BMW కారు ఢీకొట్టింది. గత వారం ఈ విషాదం చోటు చేసుకుంది.శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హార్న్స్బైలోని జార్జ్ సెయింట్ వెంబడి ఉన్న ఫుట్పాత్పై వాకింగ్ చేస్తోంది ధరేశ్వర్. వేగంగా వస్తున్న BMW కారు, ముందున్న కియా కార్నివాల్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కియా కారు ధరేశ్వర్ను బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ధరేశ్వర్ కు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే వెస్ట్ మీడ్ ఆసుపత్రికి తరలించినా, వారిని కాపాడలేక పోయామన్నారు. ఈ ఘటనలో రెండు కార్ల డ్రైవర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. ధరేశ్వర్ భర్త, ఆమె మూడేళ్ల బిడ్డ ఎలా ఉన్నారనే దానిపై సమాచారం లేదు. ఇదీ చదవండి: మాజీ ప్రియుడి లైంగిక వేధింపులు, నాలుక కొరికేసిన యువతినిందితుడు 19 ఏళ్ల P-ప్లేటర్ (తాత్కాలిక లేదా ప్రొబేషనరీ లైసెన్స్ ఉన్న డ్రైవర్) ఆరోన్ పాపాజోగ్లుగా గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బెయిల్ నిరాకరించారు. కాగా మృతురాలు ధరేశ్వర్ IT సిస్టమ్స్ ఎనలిస్ట్గా పని చేస్తున్నారు. చదవండి: అరగంటలో రూ. 10 లక్షలు : సేల్స్మేన్కు దిమ్మ తిరిగింది -
ఆస్ట్రేలియా ఎన్నారైల మద్దతు చిరస్మరణీయం:లక్ష్మీపార్వతి
సిడ్నీ: వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆస్ట్రేలియా ఎన్నారై వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ఆమె పార్టీ నాయకుడు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్టీ కష్టకాలంలో ఉన్న వైఎస్ జగన్పై మీరు చూపిన ఆధారాభిమానానికి పార్టీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది. మీ మద్దతు చిరస్మరణీయంగా నిలుస్తుంది’అని పేర్కొన్నారు. ‘మీ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. తమలో చాలామంది మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల విదేశాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ఆ రుణం తీర్చుకునేందుకు మేము ఎల్లప్పుడూ వైఎస్ జగన్కు మద్దతుగా ఉంటాం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరం రెడ్డి, గజ్జల చంద్ర ఓబుల రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, దూడల కిరణ్ రెడ్డి, నరెడ్డి ఉమా శంకర్, కృష్ణ చైతన్య కామరాజు, నల్ల జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో లక్ష్మీపార్వతికి వైఎస్సార్సీపీ శ్రేణుల ఘనస్వాగతం
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లక్ష్మీపార్వతికి నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ,గజ్జల చంద్ర ఓబుల రెడ్డి,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి ,దూడల కిరణ్ రెడ్డి, కామరాజు కృష్ణ చైతన్య ,కోటా శ్రీనివాసరెడ్డి, దుగ్గింపుడి కిరణ్ రెడ్డి, సిద్ధన సురేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం బ్రిస్బేన్లో ఉన్న లక్ష్మీపార్వతి.. వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారు. అక్కడ వివిధ నగరాల్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాకు ఆమె హాజరుకానున్నారు. -
ఒంటరి దేశాలేవో మీకు తెలుసా?
ఒక రాష్ట్రానికి కానీ, దేశానికి కాని వాటి సరిహద్దులో ఉన్న ప్రాంతాలు చాలా కీలకం ఎందుకంటే నైబర్ హుడ్ ప్రాంతాలతో ఉండే సంబంధాల వల్ల ఆ ప్రాంత శాంతిభద్రతలు ఆధారపడతాయి అంతేకాకుండా అభివృద్దికి సైతం పొరుగు ప్రాంతాలు ఎంతో కీలకం.అయితే ఏ దేశాలతో సరిహద్దులు లేకుండా ఒంటరిగా ఉన్న కంట్రీస్ మీకు తెలుసా. ఆ దేశాలు ఇతర దేశాలతో ఎటువంటి బార్డర్స్ లేకుండా స్వతంత్ర్యంగా ఉంటున్నాయి. మరి అవేంటే తెలుసుకోవాలనుందా అయితే ఈస్టోరీ చదవండి.ఆస్ట్రేలియాఖండాలలో ఏడవదిగా పిలవబడే ఆస్ట్రేలియా ఒక ద్వీపం అని అందరికీ తెలుసు. అయితే ఆస్ట్రేలియాకు ఇతర ఏ దేశాలతో సరిహద్దులు లేవు.ఈ విధంగా ఉండడం వల్ల అక్కడ ప్రత్యేకమైన జీవవైవిధ్యత ఏర్పడింది.అంతే కాకుండా కంగారులాంటి అరుదైన జంతువులు ఈ ఖండంలోనే అధికంగా జీవిస్తాయి. ఆ దేశానికి సరాసరీ 150 కిలోమీటర్ల దూరాన పాపువా న్యూగియానా అనే దేశం ఉంది. న్యూజిలాండ్ న్యూజిలాండ్ అనగానే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. ఇక్కడి జలపాతాలు, సరస్సులు చూపరులను కట్టిపడేస్తాయి. ఇక్కడి ప్రజలు సైతం మంచి స్నేహపూర్వకంగా ఉంటూ అత్యన్నత జీవనవిధానాన్ని కలిగి ఉంటారు. ఆస్ట్రేలియాకు సూమారు 2000 కిమీ దూరంలో ఈ దేశం ఉంటుంది. ప్రకృతిని అస్వాదించుకునే పర్యాటకులకు ఈ న్యూజిలాండ్ మంచి ఛాయిస్.జపాన్ ఈ దేశం పేరు వింటే చాలు కష్టపడేతత్వం అధికంగా ఉన్న ప్రజలు గుర్తొస్తారు. సహజ సంపదలు అధికంగా లేకున్నా, అణుబాంబు బాధిత దేశమైనా, మానవశ్రమనే నమ్ముకొని సాంకేతికతతో దూసుకుపోతూ ప్రపంచంలోని అగ్రదేశాలకు పోటీ ఇస్తున్న దేశం. అయితే ఈ కంట్రీ సైతం ఏ ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకోవడం లేదు.ఇక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి సైతం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ప్రత్యేకంగా విభిన్నంగా ఉంటుంది.ఐస్ లాండ్ఐస్ లాండ్ ఉత్తర యూరప్ లో ఉన్న ఈ కంట్రీలో అగ్నిపర్వతాలు, హిమనదులు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ దేశంలో దోమలు ఉండేవి కావు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఐస్ లాండ్ లోనూ దోమలు వచ్చినట్లు ఇటీవల కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. -
నిప్పులు చెరిగిన స్టార్క్
యాషెస్ సిరీస్కు ముందు ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ప్రత్యర్ధి ఇంగ్లండ్కు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపాడు. యాషెస్ సన్నాహకాల్లో భాగంగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడుతున్న అతడు (న్యూ సౌత్ వేట్స్).. విక్టోరియాపై 4 వికెట్ల ప్రదర్శనలతో చెలరేగాడు. తొలి రోజు ఆటలో ఇది జరిగింది.ఆట ప్రారంభం నుంచే నిప్పులు చెరిగిన స్టార్క్.. ఓపెనర్లు క్యాంప్బెల్ కెల్లావే (51), హ్యారీ డిక్సన్ (20) సహా కీలకమైన ఒలివర్ పీక్ (0), సామ్ హార్పర్ (54) వికెట్లు తీశాడు. స్టార్క్తో పాటు నాథన్ లియోన్ (22-1-65-2), సీన్ అబాట్ (18-1-70-1) కూడా రాణించడంతో న్యూ సౌత్ వేల్స్ తొలి రోజు ఆటలో 7 వికెట్లు తీసింది.ఆట ముగిసే సమయానికి విక్టోరియా 340 పరుగులు చేసింది. కెప్టెన్ విల్ సదర్ల్యాండ్ (36), సామ్ ఇలియట్ (4) క్రీజ్లో ఉన్నారు. పీటర్ హ్యాండ్స్కోంబ్ (104) సెంచరీ సాధించి, విక్టోరియా ఇన్నింగ్స్కు జీవం పోశాడు. న్యూ సౌత్ వేల్స్కే ఆడుతున్న మరో ఆసీస్ స్పీడ్స్టర్ జోష్ హాజిల్వుడ్ తొలి రోజు వికెట్ తీయలేకపోయాడు. హాజిల్వుడ్ ప్రత్యర్ది బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా వికెట్ లేకుండా మిగిలాడు.షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో స్టార్క్, హాజిల్వుడ్, నాథన్ లియోన్ సహా ఆసీస్ జట్టు సభ్యులంతా పాల్గొంటున్నారు.ఇవాళే ప్రారంభమైన మరో మ్యాచ్లో సౌత్ ఆస్ట్రేలియా, టస్మానియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా.. బ్రెండన్ డాగ్గెట్ (19.2-4-66-5), లియామ్ స్కాట్ (18-5-46-3), మెక్ ఆండ్రూ (16-2-54-1), థార్న్టన్ (10-2-31-1) ధాటికి 209 పరుగులకే ఆలౌటైంది. టస్మానియా ఇన్నింగ్స్లో కెప్టెన్ సిల్క్ (64) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. యాషెస్ తొలి టెస్ట్ జట్టులో సభ్యుడైన బ్యూ వెబ్స్టర్ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. మెక్స్వీని (2), జేసన్ సంఘా (12), ట్రవిస్ హెడ్ (9) ఔట్ కాగా.. హెన్రీ హంట్ (34), అలెక్స్ క్యారీ (25) క్రీజ్లో ఉన్నారు. చదవండి: బీసీసీఐ చారిత్రక నిర్ణయం..! -
మ్యాచ్ రద్దు... మన ఖాతాలో సిరీస్
బ్రిస్బేన్: వర్షంతో మొదలైన భారత్, ఆ్రస్టేలియా టి20 సిరీస్ చివరకు వర్షంతోనే ముగిసింది. శనివారం ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టి20 మ్యాచ్ వాన కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్ను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన వర్షం ఎంతకీ తగ్గలేదు. దాంతో చివరకు ఆటను అంపైర్లు రద్దు చేయక తప్పలేదు. ఆడింది 29 బంతులే అయినా ఓపెనర్లు అభిషేక్ శర్మ (13 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (16 బంతుల్లో 29 నాటౌట్; 6 ఫోర్లు) క్రీజ్లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో అభిషేక్కు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి ఓవర్లోనే 5 పరుగుల వద్ద అతను ఇచ్చిన సులువైన క్యాచ్ను మ్యాక్స్వెల్ వదిలేయగా, 11 పరుగుల వద్ద మరో క్యాచ్ను డ్వార్షుయిస్ అందుకోలేకపోయాడు. మరో వైపు డ్వార్షుయిస్ ఓవర్లోనే 4 ఫోర్లు బాది గిల్ ధాటిని చూపించాడు. 161.38 స్ట్రైక్రేట్తో మొత్తం 163 పరుగులు చేసిన అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్ తొలి మ్యాచ్ రద్దు కాగా, మెల్బోర్న్లో జరిగిన రెండో పోరులో ఆసీస్ గెలిచింది. ఆ తర్వాత హోబర్ట్, కరారాలలో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి పైచేయి సాధించిన భారత్ చివరకు 2–1తో సిరీస్ సొంతం చేసుకుంది. భారత్ తమ తర్వాతి పోరులో సొంతగడ్డపై నవంబర్ 14 నుంచి జరిగే టెస్టు సిరీస్లో బరిలోకి దిగనుండగా... నవంబర్ 21 నుంచి ఇంగ్లండ్తో ‘యాషెస్’లో ఆసీస్ తలపడుతుంది. ‘తొలి మ్యాచ్ ఓడిన తర్వాత కోలుకొని గెలిపించిన జట్టు సభ్యులకు అభినందనలు. ప్రతీ ఒక్కరికి తమ బాధ్యతపై స్పష్టత ఉంది. పేసర్లు, స్పిన్నర్లు అంతా సమష్టిగా రాణించారు. దాని వల్లే మేం అనుకున్న ప్రణాళికలను సమర్థంగా అమలు చేయగలిగాం. ప్రపంచ కప్ కోసం సిద్ధంగా ఉన్న ఎంతో మంది ప్లేయర్లు మా జట్టులో ఉండటం చాలా మంచి విషయం. వరల్డ్ కప్కు ముందు ఉన్న 2–3 సిరీస్లు సన్నాహకంగా ఉపయోగపడతాయి. జట్టులోని ప్రతీ ఒక్కరికి తమదైన ప్రత్యేక ప్రతిభ ఉండటం కెపె్టన్గా నా అదృష్టం. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా గత కొన్ని నెలలుగా మంచి ఫలితాలు సాధించగలిగాం. ఎలాంటి లోపాలు లేవని చెప్పను. ఎందుకంటే నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది’ –సూర్యకుమార్ యాదవ్, భారత కెప్టెన్ 528 ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టి20ల్లో అత్యంత వేగంగా (528 బంతుల్లో) 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. -
అక్కడా మన వైద్యులే!
అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య రంగంలో మన భారతీయ వైద్యులు, నర్సులు వెన్నెముకగా నిలిచారు. ఈ దేశాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య పరంగా తొలి స్థానంలో, నర్సుల సంఖ్యలో రెండవ స్థానంలో నిలిచి భారత్ తన హవాను కొనసాగిస్తోంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియనిది కాదు. ఒక్క ఐటీ నిపుణులే కాదు.. మన వైద్య నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థలకు భారతీయ వైద్య నిపుణులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్–2025 నివేదిక వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియాతో సహా 38 ఓఈసీడీ సభ్య దేశాలు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం ఇతర దేశాలపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపింది. మనమే టాప్ఓఈసీడీ సభ్య దేశాల్లో ఇతర దేశాలకు చెందిన 8.30 లక్షల మంది వైద్యులు, 17.5 లక్షల మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. 38 ఓఈసీడీ సభ్య దేశాల్లోని మొత్తం వైద్యుల్లో 25 శాతం, నర్సుల్లో ఆరింట ఒక వంతు ఇతర దేశాలకు చెందినవారు. వైద్యుల్లో 40%, నర్సుల్లో 37% మంది ఆసియాకు చెందినవారు కావడం విశేషం. ఓఈసీడీ దేశాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల విషయంలో సంఖ్య పరంగా భారత్, జర్మనీ, చైనా టాప్–3లో నిలి^éయి. ఇక నర్సుల విషయంలో ఫిలిప్పీన్స్, భారత్, పోలాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఐదుగురు వైద్యులు, నర్సులలో ఒకరు యూరోపియన్ ఎకనామిక్ ఏరియాకు (ఈఈఏ) చెందినవారు.ఆ నాలుగు దేశాలేవిశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వృత్తిపరమైన ఉన్నత విద్యా కార్యక్రమాలలో 18 లక్షల నూతన విద్యార్థులకు 2024లో ఓఈసీడీ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ 3.90 లక్షలు, యునైటెడ్ కింగ్డమ్ 3.84 లక్షల మంది విద్యార్థులకు అనుమతులను జారీచేసి అగ్రగామిగా నిలిచాయి. కెనడా 2.13 లక్షలు, ఆస్ట్రేలియా 1.82 లక్షల మంది విద్యార్థులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రధాన దేశంగా..చాలా కాలంగా ఓఈసీడీ దేశాలకు వలస వెళ్తున్నవారిలో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రధాన దేశంగా ఉన్న చైనాను అధిగమించి 2023 వరకు కూడా భారత్ ఆధిక్యంలో కొనసాగింది. ఆ ఏడాది దాదాపు 6,00,000 మంది భారతీయ పౌరులు ఓఈసీడీ సభ్య దేశాలకు వలస వెళ్లారు. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 8% పెరిగింది.నలుగురిలో ఒకరు బ్రిటన్కు2023లో భారత్ నుంచి వలసదారులలో దాదాపు నలుగురిలో ఒకరు యునైటెడ్ కింగ్డమ్ను (1,44,000) ఎంచుకున్నారు. ఇందులో 97,000 మంది ఆరోగ్య, సంరక్షణ కార్మిక వీసాలపై వెళ్లారు. కెనడాలో 2023లో 1,40,000 మంది అడుగుపెట్టారు. యునైటెడ్ స్టేట్స్కు 68,000 మంది భారతీయులు ఉపాధి కోసం వలస వెళ్లారు.75వేల డాక్టర్లు మనవాళ్లే2021–23 మధ్య.. ఓఈసీడీ సభ్య దేశాల్లో పనిచేస్తున్న 6.06 లక్షల మంది విదేశీ వైద్యుల్లో 12 శాతం (75,000) మంది భారతీయ డాక్టర్లు. అలాగే 7.33 లక్షల మంది విదేశీ నర్సుల్లో 17 శాతం మంది (1.22 లక్షలు) భారతీయ నర్సులు కావడం విశేషం. అత్యధిక డాక్టర్లు యూకేలో, అత్యధిక నర్సులు యూఎస్లో ఉన్నారు. -
సిరీస్ విజయమే లక్ష్యంగా...
బ్రిస్బేన్: గత టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ భారత టి20 జట్టు కెప్టెన్గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టాడు. అతని సారథ్యంలో ఆడిన నాలుగు ద్వైపాక్షిక సిరీస్లు గెలిచిన టీమిండియా... ఆసియా కప్ను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో సిరీస్ను తమ ఖాతాలో వేసుకునేందుకు జట్టు సిద్ధమైంది. ఆ్రస్టేలియాతో ఐదు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు చివరిదైన ఐదో మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిస్తే భారత్ 3–1తో సిరీస్ గెలుచుకుంటుంది. ఒకవేళ ఓడినా సిరీస్ చేజారిపోయే ప్రమాదం ఉండదు. మరోవైపు ఆతిథ్య ఆ్రస్టేలియా మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉంది. స్వదేశంలో సిరీస్ కోల్పోరాదని ఆ జట్టు పట్టుదలగా ఉంది. ఈనేపథ్యంలో ఆసీస్ శైలికి తగినట్లు చక్కటి బౌన్స్ ఉండే గాబా మైదానంలో ఆసక్తికర పోరు ఖాయం. మ్యాచ్ రోజు స్వల్ప వర్షసూచన ఉంది. గిల్ సత్తా చాటేనా... ఆసీస్ పర్యటనకు ముందు శుబ్మన్ గిల్ వన్డే, టి20 ఫామ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగానే అతను పూర్తి స్థాయిలో ఇక్కడ తడబడ్డాడు. రెండు ఫార్మాట్లలో ఏడు ఇన్నింగ్స్లు కలిపి ఒక్క అర్ధ సెంచరీ కూడా అతను నమోదు చేయలేకపోయాడు. ఇలాంటి స్థితిలో బాగా ఆడి ఘనంగా ముగింపు పలకాలని గిల్ భావిస్తున్నాడు. మరో ఓపెనర్ అభిõÙక్ దూకుడును కొనసాగిస్తుండగా, సూర్యకుమార్ ఫామ్ కూడా అంతంత మాత్రమే. గత 18 ఇన్నింగ్స్లలో సూర్య ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ దాటలేదు. తిలక్ వర్మ కూడా తనదైన శైలిలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. గత మ్యాచ్లో భారత్ చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో నెగ్గినా, మన బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అక్షర్, సుందర్లతో పాటు దూబే రెండు విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చడం సానుకూలాంశం. మరో స్పిన్నర్ వరుణ్ను ఎదుర్కోవడం ప్రత్యర్థి ని మరోసారి కష్టంగా మారనుంది. వరుసగా రెండు విజయాలు అందించిన తుది జట్టులో టీమిండియా మార్పులు చేయకపోవచ్చు. అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్ల మైలురాయికి ఒకే ఒక వికెట్ దూరంలో ఉన్న స్టార్ బౌలర్ బుమ్రా చెలరేగితే ప్రత్యర్థి కి కష్టాలు తప్పవు. బ్యాటింగ్ తడబాటు... ప్రధాన ఆటగాళ్లు హేజల్వుడ్, హెడ్లాంటి వాళ్లు సిరీస్ మధ్యలో తప్పుకున్న తర్వాత ఆసీస్ జట్టులో పూర్తి తడబాటు కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్ తరహాలో నెమ్మదైన పిచ్లు ఉన్న హోబర్ట్, కరారాలలో ఆ జట్టు బ్యాటర్లు పూర్తి చేతులెత్తేశారు. మన స్పిన్నర్లను ఎదుర్కోవడం ఎవరి వల్లా కావడం లేదు. ఫలితంగా తక్కువ స్కోర్లతో జట్టుకు పరాజయాలు ఎదురయ్యాయి. అభిమానులందరి దృష్టీ యాషెస్ సిరీస్పై ఉండటంతో ఈ టి20 సిరీస్ ఫలితం జట్టుకు పెద్దగా నష్టం కలిగించకపోవచ్చు కానీ వరుసగా మూడు టి20 మ్యాచ్లు ఓడటం టీమ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. ఇలాంటి స్థితిలో కనీసం సిరీస్ను ‘డ్రా’గానైనా ముగించాలని జట్టు కోరుకుంటోంది. మిచెల్ మార్ర్ష్ ఒక్కడే బ్యాటింగ్లో నిలకడ కనబరుస్తుండగా, మిగతా వారంతా విఫలమయ్యారు. టాప్–4లో షార్ట్, ఇన్గ్లిస్, టిమ్ డేవిడ్ రాణిస్తే భారీ స్కోరు సాధ్యమవుతుంది. మ్యాక్స్వెల్ ఇక్కడైనా మెరుస్తాడేమో చూడాలి. జట్టు బౌలింగ్లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. భారత స్పిన్నర్లు చెలరేగిన చోట ఆడమ్ జంపా భారీగా పరుగులిస్తున్నాడు. -
భారత్ను గెలిపించిన బౌలర్లు
కరారా: ఆ్రస్టేలియా పర్యటనలో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు టి20 సిరీస్ను కోల్పోకుండా తిరిగి రావడం ఖాయమైంది. చివరి పోరులో సత్తా చాటితే సిరీస్ను గెలుచుకునే అవకాశం కూడా టీమిండియా ముందుంది. గురువారం ఏకపక్షంగా సాగిన నాలుగో టి20 మ్యాచ్లో భారత్ 48 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. తాజా ఫలితంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా... అభిషేక్ శర్మ (21 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబే (18 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 20; 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. గిల్, అభిషేక్ తొలి వికెట్కు 40 బంతుల్లో 56 పరుగులు జోడించి సరైన ఆరంభం అందించగా, తర్వాతి బ్యాటర్లు తలా ఓ చేయి వేశారు. ఆసీస్ బౌలర్లలో ఎలిస్, జంపా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 30; 4 ఫోర్లు), మాథ్యూ షార్ట్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా ఇతర బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. ఒకదశలో 91/3తో మెరుగైన స్థితిలో కనిపించిన ఆసీస్ తర్వాతి 28 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని కుదేలైంది. వాషింగ్టన్ సుందర్ 8 బంతులు వేసి 3 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో 2 వికెట్లు తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఇరు జట్ల మధ్యచివరిదైన ఐదో టి20 శనివారం బ్రిస్బేన్లో జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) డేవిడ్ (బి) జంపా 28; గిల్ (బి) ఎలిస్ 46; దూబే (బి) ఎలిస్ 22; సూర్యకుమార్ (సి) డేవిడ్ (బి) బార్త్లెట్ 20; తిలక్ వర్మ (సి) ఇన్గ్లిస్ (బి) జంపా 5; జితేశ్ (ఎల్బీ) (బి) జంపా 3; సుందర్ (సి) (సబ్) కునెమన్ (బి) ఎలిస్ 12; అక్షర్ పటేల్ (నాటౌట్) 21; అర్ష్దీప్ (సి) ఫిలిప్ (బి) స్టొయినిస్ 0; వరుణ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–56, 2–88, 3–121, 4–125, 5–131, 6–136, 7–152, 8–164. బౌలింగ్: డ్వార్షుయిస్ 4–0–31–0, బార్త్లెట్ 4–0–26–1, ఎలిస్ 4–0–21–3, స్టొయినిస్ 4–0–41–1, జంపా 4–0–45–3. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మార్ష్ (సి) అర్ష్దీప్ (బి) దూబే 30; షార్ట్ (ఎల్బీ) (బి) అక్షర్ 25; ఇన్గ్లిస్ (బి) అక్షర్ 12; డేవిడ్ (సి) సూర్యకుమార్ (బి) దూబే 14; ఫిలిప్ (సి) వరుణ్ (బి) అర్ష్దీప్ 10; స్టొయినిస్ (ఎల్బీ) (బి) సుందర్ 17; మ్యాక్స్వెల్ (బి) వరుణ్ 2; డ్వార్షుయిస్ (బి) బుమ్రా 5; బార్త్లెట్ (సి అండ్ బి) సుందర్ 0; ఎలిస్ (నాటౌట్) 2; జంపా (సి) గిల్ (బి) సుందర్ 0; ఎక్స్ట్రాలు 2; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 119. వికెట్ల పతనం: 1–37, 2–67, 3–70, 4–91, 5–98, 6–103, 7–116, 8–116, 9–118, 10–119. బౌలింగ్: అర్ష్దీప్ 3–0–22–1, బుమ్రా 4–0–27–1, వరుణ్ 4–0–26–1, అక్షర్ 4–0–20–2, దూబే 2–0–20–2, సుందర్ 1.2–0–3–3. -
పైచేయి కోసం...
గోల్డ్కోస్ట్: సిరీస్లో కీలకమైన పైచేయి కోసం భారత్, ఆ్రస్టేలియా జట్లు సమరానికి సై అంటున్నాయి. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవడం... తదుపరి రెండు మ్యాచ్ల్లో చెరోటి గెలవడంతో ఇరు జట్లు ప్రస్తుతం 1–1తో సమవుజ్జీగా నిలిచాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇక్కడ జరిగే నాలుగో టి20లో గెలిచిన జట్టు ఇక సిరీస్లో ఓడిపోదు. 2–1తో ఆధిక్యంలోకి వెళ్లిన జట్టు ఆఖరిపోరులో ఓడినా సిరీస్ సమమవుతుందే కానీ చేజారనే చేజారదు. దీంతో భారత్, ఆ్రస్టేలియా జట్లు ఇక్కడే గెలిసి సిరీస్ పట్టు పట్టాలనే లక్ష్యంతో ఉన్నాయి. ఇదే జరిగితే మాత్రం టి20లో మెరుపుల హోరు ఖాయం! ఎందుకంటే పిచ్ కూడా బ్యాటింగ్కు స్వర్గధామం. అంతర్జాతీయ మ్యాచ్లు అరకొరగా జరిగినా... బిగ్బాష్ లీగ్లలో భారీస్కోర్లకు లోటే లేదు. దీంతో బౌలర్లకే కఠిన సవాళ్లు ఎదురవక తప్పదు. గిల్ బాకీ పడ్డాడు ఓపెనర్ శుబ్మన్ గిల్ ఈ టి20 సిరీస్లోనే కాదు... అంతకుముందు జరిగిన వన్డే సిరీస్లోనూ పెద్దగా ప్రభావమే చూపలేదు. పరుగుల పరంగా రెండు సిరీస్లకు బాకీ పడ్డాడు. బహుశా బ్యాటింగ్కు అచ్చొచ్చే ఈ మ్యాచ్లో ఆ బాకీ ఏదో తీర్చుకుంటే భారత్కు శుభారంభం లభిస్తుంది. టి20 స్పెషలిస్టు ఓపెనర్, ధనాధన్ హిట్టర్ అభిషేక్ వర్మ పవర్ ప్లేలో కావల్సినదానికంటే పెద్ద సంఖ్యలోనే పరుగులు కూడబెడతాడు. కెపె్టన్ సూర్యకుమార్, తిలక్ వర్మలు సైతం భారీ షాట్లకు తెగబడితే, బౌలింగ్ ఆల్రౌండర్లు ఆక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు అడపాదడపా దంచేస్తే మాత్రం 200 పైచిలుకు స్కోరు టీమిండియాకు ఏమంత కష్టమే కాదు. అప్పుడు బుమ్రా, అర్‡్షదీప్, వరుణ్, అక్షర్, సుందర్లతో కూడిన బౌలింగ్ దళం తమ పనిని చింత లేకుండా చక్కబెట్టే అవకాశం ఉంటుంది. కీలక ఆటగాళ్లు దూరం రెండో టి20తోనే హాజల్వుడ్, మూడో మ్యాచ్తో హెడ్, అబాట్లు జట్టు వీడారు. త్వరలోనే జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ కోసం తుదిసన్నాహాల్లో ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడేందుకు కీలకమైన ఆటగాళ్లను విడుదల చేశారు. అయితే ఇది ఆసీస్ లాంటి అగ్రశ్రేణి జట్టుకు ప్రతికూలత కాదు... భారత్కు గొప్ప అనుకూలతగా భావించరాదు. ఎందుకంటే ఇది కంగారూ జట్టు. మేటి ఆటగాళ్లెంతో మంది ఉన్నారు. తొలి మూడు మ్యాచ్లు ఆడని విధ్వంసకర ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. స్టొయినిస్, టిమ్ డేవిడ్, ఇన్గ్లిస్లాంటి హిట్టర్లూ ఉన్నారు. కాబటి ఒకరిద్దరు లేనంత మాత్రం ఆసీస్ బలహీనమనుకుంటే తప్పులో కాలేసినట్లే కెప్టెన్ మిచెల్ మార్‡్ష, టిమ్ డేవిడ్, స్టొయినిస్లు ఈ సిరీస్లో చక్కని ఫామ్లో ఉన్నారు. అనుభవజు్ఞలైన పేస్ బలగం లేకపోవడం కాస్త ఇబ్బందికరమైనప్పటికీ బార్ట్లెట్, ఎలిస్లు ఆ బాధ్యతను సమర్థవంతగా నిర్వర్తించగలరు. ఈ నేపథ్యంలో సొంత ప్రేక్షకుల మద్దతుతో ఆతిథ్య జట్టు దంచేయడం ఖాయం! తద్వారా ఇరుజట్ల బ్యాటింగ్ మెరుపులతో స్కోరు హోరెత్తడం కూడా ఖాయమే!పిచ్–వాతావరణం ఈ కరార వేదిక బిగ్బాష్ లీగ్కు ఫేమస్. మెరుపుల టి20లో భారీస్కోర్లకు చిరునామా దీంతో బ్యాటర్లకు పండగే. ఇక అంతర్జాతీయ మ్యాచ్ల విషయానికొస్తే ఇక్కడ కేవలం రెండే మ్యాచ్లు జరిగాయి. వర్ష సూచన లేదు.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, శుబ్మన్, తిలక్వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్, శివమ్ దూబే, అర్‡్షదీప్, వరుణ్, బుమ్రా. ఆస్ట్రేలియా: మార్ష్(కెప్టెన్ ), షార్ట్, ఇన్గ్లిస్, టిమ్ డేవిడ్, మిచ్ ఒవెన్, స్టొయినిస్, మ్యాక్స్వెల్, బార్ట్లెట్, డ్వార్షుయిస్, ఎలిస్, కునెమన్. -
యాషెస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే తొలి యాషెస్ (Ashes Series 2025-26) టెస్ట్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును (Australia) ఇవాళ (నవంబర్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగానే ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్మిత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు.ఈ జట్టులో ఎవరూ ఊహించని ఓ ఆటగాడికి (జేక్ వెదరాల్డ్, Jake Weatherald) చోటు దక్కింది. ఇటీవల దేశవాలీ క్రికెట్లో సెంచరీల మోత మోగించిన మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) తిరిగి జట్టులోకి వచ్చాడు. వెదరాల్డ్, లబూషేన్లలో ఎవరో ఒకరు ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఓపెనింగ్ చేస్తారు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా కెమెరాన్ గ్రీన్, బ్యూ వెబ్స్టర్ చోటు దక్కించుకున్నారు. కమిన్స్ గైర్హాజరీలో సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్ బ్యాకప్ బౌలర్లుగా జట్టులోకి వచ్చారు. అలెక్స్ క్యారీ రెగ్యులర్ వికెట్కీపర్గా, జోస్ ఇంగ్లిస్ రిజర్వ్ వికెట్కీపర్గా ఎంపికయ్యారు. పేలవ ఫామ్ కారణంగా యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ జట్టులో స్థానంలో కోల్పోయాడు. మ్యాట్ రెన్షా పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ అతనికి నిరాశే మిగిలింది.పేసర్లుగా జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా నాథన్ లియాన్ కొనసాగుతున్నారు.యాషెస్ సిరీస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్మరోవైపు యాషెస్ సిరీస్ మొత్తానికి బెన్ స్టోక్స్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు. యాషెస్ సిరీస్ 2025-26కి ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేకబ్ బేతెల్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, ఓలీ పోప్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, మాథ్యూ పాట్స్చదవండి: పాకిస్తాన్, సౌతాఫ్రికా తొలి వన్డేలో హైడ్రామా -
ఆస్ట్రేలియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్..
హాంగ్కాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 టోర్నమెంట్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్గా బిగ్ బాష్ లెజెండ్ అలెక్స్ రాస్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో బెన్ మెక్డెర్మాట్, ఆండ్రూ టై, క్రిస్ గ్రీన్ వంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.క్రిస్ గ్రీన్కు కెప్టెన్గా అపారమైన అనుభవం ఉనప్పటికి రాస్కే జట్టు పగ్గాలను సెలక్టర్లు కట్టబెట్టారు. గతేడాది ఆస్ట్రేలియా సెమీఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కంగారులు పట్టుదలతో ఉన్నారు. కాగా ఈవెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు భాగం కానున్నాయి. నవంబర్ 7 నుంచి 9 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్లో జరగనుంది. ఈ సిక్సెస్ టోర్నీ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీమిండియా కెప్టెన్ దినేష్ కార్తీక్ వ్యవహరించనున్నాడు.హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ కోసం ఆస్ట్రేలియా జట్టు:అలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హాబ్సన్, క్రిస్ గ్రీన్, విలియం బోసిస్టో , ఆండ్రూ టై.అసలేంటి హాంకాంగ్ సిక్సెస్?1992లో హాంకాంగ్ క్రికెట్ ఆధ్వర్యంలో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. చివరగా 2017 వరకు జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ టోర్నీని నిర్వహించలేదు. అయితే ఈ ఈవెంట్కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీని మళ్లీ నిర్వహించారు. గత సీజన్ విజేతగా శ్రీలంక నిలిచింది.దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు అత్యధికంగా 5 సార్లు ఈ టోర్నమెంట్ విజేతలగా నిలవగా.. పాకిస్తాన్ 4 సార్లు, శ్రీలంక రెండు సార్లు ఈ హాంకాంగ్ సిక్సెస్ ట్రోఫీని ముద్దాడింది. భారత్, ఆస్ట్రేలియా, విండీస్ జట్లు చెరో ఒక్కసారి ఛాంపియన్స్గా నిలిచాయి. గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం ఆడారు.రూల్స్ ఇవే..ఒక మ్యాచ్లో ప్రతీ జట్టు 6 ఓవర్లు మాత్రమే ఆడుతోంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఆరుగురు ఆటగాళ్లు ఉండాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్కు ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. . వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు -
8 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలు.. ఆసీస్ బ్యాటర్ సూపర్ ఫామ్
టెస్ట్, వన్డే జట్ల నుంచి ఉద్వాసనకు గురైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne).. స్వదేశవాలీ సీజన్లో చెలరేగిపోతున్నాడు. 8 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలు సహా 679 పరుగులు చేసి సూపర్ ఫామ్ను చాటుకున్నాడు.యాషెస్ జట్టులో స్థానమే లక్ష్యంగా జైత్రయాత్రను కొనసాగిస్తున్న లబూషేన్.. తాజాగా న్యూ సౌత్ వేల్స్తో జరిగిన మ్యాచ్లో (వన్డే కప్-2025) 111 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 101 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్లో లబూషేన్ బంతితోనూ సత్తా చాటాడు. జాతీయ జట్టు సహచరుడు క్రిస్ గ్రీన్ సహా 2 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో లబూషేన్ క్వీన్స్లాండ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మొత్తంగా లబూషేన్కు లిస్ట్-ఏ క్రికెట్లో ఇది ఆరో శతకం. ప్రస్తుత వన్డే కప్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో ఇది మూడవది.ప్రస్తుత స్వదేశవాలీ సీజన్లో లబూషేన్ లిస్ట్-ఏ ఫార్మాట్తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ చెలరేగిపోతున్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టస్మానియా, సౌత్ ఆస్ట్రేలియాపై శతకాలు నమోదు చేశాడు.ఆగస్ట్లో సౌతాఫ్రికాతో జరిగిన స్వదేశీ వన్డే సిరీస్కు ముందు లబూషేన్పై వేటు పడింది. అప్పటి నుంచి వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో జట్టులో చోటు కోల్పోయాడు. 31 లబూషేన్ ప్రస్తుత అరివీర భయంకరమైన ఫామ్కు ముందు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చాలాకాలం పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు.ప్రస్తుతం లబూషేన్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే యాషెస్ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. యాషెస్ సిరీస్ 2025-26 నవంబర్ 21 నుంచి మొదలవుతుంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ జట్టును ప్రకటించాల్సి ఉంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి టెస్ట్కు స్టీవ్ స్మిత్ను తాత్కాలిక కెప్టెన్గా ఎంపిక చేశారు. -
ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయం
నవంబర్ 6న గోల్డ్కోస్ట్ వేదికగా భారత్తో జరుగబోయే నాలుగో టీ20కి ముందు ఆస్ట్రేలియా సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ను (Travis Head) జట్టు నుంచి విడుదల చేశారు. షెఫీల్డ్ షీల్డ్లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని ఆదేశించారు. ఆసీస్ సెలెక్టర్ల ఈ నిర్ణయం యాషెస్ సిరీస్ వ్యూహాల్లో భాగంగా తీసుకోబడింది. పని భారం తగ్గించే క్రమంలో హెడ్కు చివరి రెండు టీ20లకు విశ్రాంతి కల్పించారు. హెడ్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారో సెలెక్టర్లు చెప్పలేదు.అంతకుముందు మరికొందరు సీనియర్లను కూడా భారత్ను ఎదుర్కొనే టీ20 జట్టు నుంచి రిలీజ్ చేశారు. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్ షెఫీల్డ్ షీల్డ్లో న్యూసౌత్ వేల్స్ తరఫున ఆడతారు. కెమరూన్ గ్రీన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.హెడ్ భారత్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మూడు మ్యాచ్లు ఆడాడు. ఇందులో హెడ్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. రెండో టీ20లో 28, మూడో మ్యాచ్లో 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన హెడ్.. అంతకుముందు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 8, 28, 29 స్కోర్లు చేశాడు.కాగా, ప్రస్తుతం భారత్తో జరుగుతున్న సిరీస్లో ఆస్ట్రేలియా 1-1 సమంగా ఉంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా, మూడో మ్యాచ్లో భారత్ గెలుపొందాయి.భారత్తో నాలుగు, ఐదు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్లి బియర్డ్మన్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, బెన్ డ్వార్షుయిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాచదవండి: విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ -
ఆసీస్పై టీమిండియా గెలుపు
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్లో తొలి మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఇన్నింగ్స్లో టిమ్ డేవిడ్ (74), స్టోయినిస్ (64) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. జితేశ్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) సుందర్కు సహకరించాడు. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 25, శుభ్మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరున్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టగా... ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3, బార్ట్లెట్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది.ఐదో వికెట్ కోల్పోయిన భారత్14.2వ ఓవర్- 145 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బార్ట్లెట్ బౌలింగ్లో తిలక్ వర్మ (29) ఔటయ్యాడు.15 ఓవర్ద తర్వాత భారత్ స్కోర్ 152/5గా ఉంది. సుందర్ (30), జితేశ్ శర్మ (5) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్11.1 ఓవర్- 111 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇల్లిస్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (17) ఔటయ్యాడు. 11.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 117/4గా ఉంది. వాషింగ్టన్ సుందర్ (6), తిలక్ వర్మ (24) క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 76 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్లో ఇల్లిస్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (24) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 82/3గా ఉంది. అక్షర్ పటేల్ (3), తిలక్ వర్మ (12) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్5.3వ ఓవర్- 61 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లిస్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (15) ఔటయ్యాడు.6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్లో ఉన్నారు. టీమిండియా రెండో వికెట్ డౌన్..శుభ్మన్ గిల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన శుభ్మన్ గిల్.. నాథన్ ఎల్లీస్ బౌలింగ్లో వికెట్లు ముందు దొరికిపోయాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 63/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్3.3 ఓవర్- 187 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేసి నాథన్ ఇల్లిస్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 41/1గా ఉంది. శుభ్మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్లో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(24), శుభ్మన్ గిల్(5) ఉన్నారు.భారత్ ముందు భారీ టార్గెట్హోబర్ట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 74), మార్కస్ స్టోయినిష్(39 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్స్లతో 64) విధ్వసంకర హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ దూబే ఒక్క వికెట్ సాధించారు.ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్12.6వ ఓవర్- 118 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (74) శివమ్ దూబే బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 143/5గా ఉంది.వరుణ్ మ్యాజిక్.. వరుస బంతుల్లో వికెట్లువరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో వరుస బంతుల్లో మిచెల్ మార్ష్ (11), మిచెల్ ఓవెన్ను (0) ఔట్ చేశాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 75/4గా ఉంది. స్టోయినిస్ (1), టిమ్ డేవిడ్ (55) క్రీజ్లో ఉన్నారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా డేవిడ్ మెరుపు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ 23 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 5 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లో, మూడో ఓవర్లో వికెట్లు తీశాడు. తొలుత ట్రవిస్ హెడ్ (6), ఆతర్వాత జోస్ ఇంగ్లిస్ను (1) పెవిలియన్కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 35/2గా ఉంది. టిమ్ డేవిడ్ (20), మిచ్ మార్ష్ (7) క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్హోబర్ట్ వేదికగా ఇవాళ (నవంబర్ 2) భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో ఓ మార్పుతో బరిలోకి దిగింది. హాజిల్వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్భారత్: శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: IND vs SA: వారెవ్వా అన్షుల్!.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
IND vs AUS: సమం చేసేందుకు సమరం
హోబర్ట్: ఆతిథ్య ఆ్రస్టేలియా ఆధిక్యానికి ఆదిలోనే గండికొట్టాలని, ఈ మ్యాచ్తోనే సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. మరోవైపు వన్డే సిరీస్లాగే పొట్టి ఫార్మాట్లోనూ వరుస మ్యాచ్లు గెలవాలనే లక్ష్యంతో కంగారూ సేన ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టి20 మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం. ప్రధానంగా భారత టీమ్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ లోపాలపైనే దృష్టిపెట్టింది. ఈ పర్యటన ఆరంభం నుంచే టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ తన లయను ఇప్పటికీ అందుకోలేకపోతున్నాడు. రద్దయిన తొలి టి20లో 30 పైచిలుకు పరుగులైతే చేశాడు కానీ... ఫలితం తేలిన నాలుగు మ్యాచ్ల్లో (మూడు వన్డేలు, రెండో టి20 కలిపి) గిల్ ఆట తీవ్రంగా నిరాశపరిచింది. గత పోరుతో పరుగుల జోరును అందుకున్న అభిషేక్తో పాటు గిల్, సంజూ సామ్సన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగుతేజం ఠాకూర్ తిలక్వర్మ మూకుమ్మడిగా మెరుపులు మెరిపిస్తే ఆసీస్ను 20 ఓవర్ల మ్యాచ్లో ఓడించడం ఏమంత కష్టమేకాదు. వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా ఈ సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిందే. లేదంటే సూర్య సేన ఒత్తిడిలోకి కూరుకుపోతుంది. మరోవైపు ఆతిథ్య జట్టు వరుసగా ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇక సిరీస్ను కోల్పోలేని పటిష్టస్థితిలో నిలవాలని చూస్తోంది. బ్యాటింగ్లో కెప్టెన్ మార్ష్, ట్రవిస్ హెడ్, ఇన్గ్లిస్ ఫామ్లో ఉన్నారు. బౌన్సీ పిచ్లపై నిప్పులు చెరిగే బార్ట్లెట్, ఎలిస్, స్టొయినిస్లు టీమిండియా ప్రధాన బ్యాటర్లను ఆదిలోనే పడేయాలని ఆశిస్తున్నారు. -
‘ఆస్ట్రేలియా స్కోరు చూసి భయపడలేదు’
ముంబై: ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో ఆ్రస్టేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని చూసి తాము ఏ దశలోనూ భయపడలేదని, సాధించగలమనే నమ్మకంతోనే బరిలోకి దిగామని భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. ఈ పోరులో 134 బంతుల్లో 127 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్తో జెమీమా మన జట్టును గెలిపించింది. ‘ఆ్రస్టేలియా జట్టు ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు, చివరకు వారు సాధించిన స్కోరును చూస్తే కనీసం 30 పరుగులు తక్కువగా చేశారని చెప్పగలను. డీవై పాటిల్ స్టేడియం పిచ్పై ఎలాంటి లక్ష్యమైనా ఛేదించవచ్చని మాకు బాగా తెలుసు. కొద్ది సేపు క్రీజ్లో ఉండి నిలదొక్కుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని కూడా మాకు ఇక్కడ ఉన్న అనుభవం చెబుతుంది. అందుకే ముందు పట్టుదలగా నిలబడటంపైనే దృష్టి పెట్టాను’ అని జెమీమా వ్యాఖ్యానించింది. తాను, హర్మన్ కలిసి మ్యాచ్ను ముగించాలని గట్టిగా అనుకున్నామని...అయితే హర్మన్ అవుట్తో తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె పేర్కొంది. ‘ఒక దశలో నేను బాగా అలసిపోయి ఏకాగ్రత కోల్పోతూ వచ్చాను. అయితే హర్మన్ అవుట్ కావడంతో మళ్లీ పరిస్థితి మారిపోయింది. ఇది ఒక రకంగా నాకు మేలు చేసింది. ఆమె పరుగులు కూడా నేను చేయాల్సి ఉందని అనిపించింది. దాంతో మళ్లీ సరైన స్థితికి వచ్చి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాను’ అని జెమీమా చెప్పింది. -
పైచేయి ఎవరిదో!
మెల్బోర్న్: తొలి టి20 మ్యాచ్ వర్షంతో రద్దయిన తర్వాత భారత్, ఆ్రస్టేలియా తర్వాతి పోరుకు సిద్ధమయ్యాయి. నేడు ఎంసీజీలో జరిగే రెండో టి20లో ఇరు జట్లు తలపడతాయి. గత మ్యాచ్లో ఫలితం రాకపోయినా... ఆట ముగిసేసరికి టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో అదే జోరును కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఆసీస్ కూడా సొంతగడ్డపై విజయంతో ఆధిక్యంలో నిలవాలని భావిస్తోంది. భారత జట్టు ఎంసీజీలో తాము ఆడిన ఆరు టి20ల్లో నాలుగు గెలిచింది. మ్యాచ్కు వర్షసూచన ఉంది. మార్పుల్లేకుండా... కాన్బెర్రా మ్యాచ్లో ఇరు జట్లకు కూడా తమ ఆటగాళ్లను పెద్దగా పరీక్షించే అవకాశం రాలేదు. దాంతో తుది జట్టులో ఎలాంటి మార్పూ లేకుండా టీమ్లు బరిలోకి దిగడం ఖాయం. దూకుడుకు మారుపేరైన అభిõÙక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చేందుకు ఇది మరో అవకాశం. గిల్, సూర్య కూడా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నారు. తిలక్ వర్మ, సామ్సన్, దూబేలతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సీనియర్ బుమ్రాతో పాటు హర్షిత్ పేస్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటాడు. కుల్దీప్, వరుణ్ల స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడం ఆసీస్ బ్యాటర్లకు అంత సులువు కాదు. మరోవైపు ఆసీస్ బృందంలోనూ హిట్టర్లకు కొదవ లేదు. కెప్టెన్ మార్ష్, హెడ్, టిమ్ డేవిడ్, స్టొయినిస్ ఒంటి చేత్తో మ్యాచ్ను శాసించగల బ్యాటర్లు. ఇన్గ్లిస్, ఒవెన్, ఫిలిప్ రూపంలో దూకుడుగా ఆడగల ఇతర ఆటగాళ్లూ ఉన్నారు. భారీ స్కోరు సాధించేందుకు, భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు కావాల్సిన బృందం ఆసీస్ వద్ద ఉంది. -
అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..!
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 30) భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ నాకౌట్ సమరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియాను వరుణుడు పరీక్షించబోతున్నాడు.ఈ మ్యాచ్కు వాతావరణం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. AccuWeather నివేదిక ప్రకారం, DY పాటిల్ స్టేడియం పరిసరాల్లో ఇవాళ ఉదయం ఆకాశం 93 శాతం మేఘావృతంగా ఉంటుంది. 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగవుతాయన్న అంచనా ఉన్నా, నవీ ముంబైలో వాతావరణ పరిస్థితులను నమ్మడానికి వీల్లేదు. ఈనెల 28న ఇక్కడ జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ను కూడా వర్షం ముంచేస్తుందేమోనని భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.మ్యాచ్ పూర్తిగా రద్దైతే..?ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనా రిజర్వ్ డే (అక్టోబర్ 31) ఉంది. ఇవాళ కొంత మ్యాచ్ జరిగి ఆగిపోయినా, ఇదే స్థితి నుంచి రిజ్వర్ డేలో కొనసాగుతుంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం టీమిండియా కొంప కొల్లేరవుతుంది. గ్రూప్ దశలో భారత్ కంటే ఎక్కువ పాయింట్లు ఉండటం చేత ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంటుంది. గ్రూప్ దశలో ఆసీస్ 7 మ్యాచ్ల్లో ఓటమెరుగని జట్టుగా 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ 7 మ్యాచ్ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే, నిన్న (అక్టోబర్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) చెలరేగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి -
పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి
క్రికెట్ మైదానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంతి తగిలి 17 ఏళ్ల ఆస్ట్రేలియా (Australia) యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ (Ben Austin) మృత్యువాత పడ్డాడు. ప్రీ మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ విషాదం చోటు చేసుకుంది.మెల్బోర్న్లోని ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించే బెన్.. అక్టోబర్ 29న ఓ టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ సంధించిన ఓ బంతి బెన్ ఛాతీపై బలంగా తాకింది. దీంతో బెన్ స్పృహ తప్పి పడిపోయాడు.హుటాహుటిన సమీపంలోని అసుపత్రికి తరలించగా.. రెండు రోజుల చికిత్స అనంతరం బెన్ నిన్న తుదిశ్వాస విడిచాడు. అప్పటివరకు తమతో ప్రాక్టీస్ చేసిన బెన్ ఇక లేడని తెలిసి సహచరులు కన్నీరుమున్నీరయ్యారు. బెన్ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోధించారు. బెన్ మరణవార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా బెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. పాపులర్, లవబుల్, గ్రేట్ యంగ్ పర్సన్ను కోల్పోయామని ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ శోకం వ్యక్తం చేసింది.బెన్ ఉదంతం ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్ను (Phil Hughes) గుర్తు చేసింది. హ్యూస్ కూడా 2014లో బెన్ తరహాలోనే మృత్యువాత పడ్డాడు. ఓ దేశవాలీ మ్యాచ్ ఆడుతుండగా ఓ రాకాసి బౌన్సర్ హ్యూస్ తల వెనుక భాగంలో బలంగా తాకింది. అక్కడిక్కడే కుప్పకూలిపోయిన హ్యూస్ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదం ప్రతిష్టాత్మక సిడ్నీ మైదానంలో జరిగింది. చదవండి: పంత్ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ -
World Cup 2025: భారత్ సత్తాకు పరీక్ష
నవీ ముంబై: సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. లీగ్ దశలో పడుతూ లేస్తూ సాగిన టీమిండియా... నేడు జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో పోరుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు సెమీఫైనల్ ఆడిన టీమిండియా అందులో రెండుసార్లు గెలిచి ఫైనల్లో పరాజయం పాలైంది. చివరిసారిగా 2017లో ఆ్రస్టేలియాతో జరిగిన సెమీఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ సుడిగాలి ఇన్నింగ్స్తో విజయం సాధించిన టీమిండియా... ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇటీవలి కాలంలో ఆ్రస్టేలియాకు గట్టి పోటీనిస్తున్న హర్మన్ప్రీత్ బృందం ఈ మ్యాచ్లోనూ సమష్టిగా సత్తా చాటి తొలి టైటిల్ కరువు తీర్చుకోవాలని భావిస్తోంది. స్మృతి, హర్మన్లపైనే భారం 2017 ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత ఆ్రస్టేలియా జట్టుకు ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో పరాజయం ఎదురవ్వలేదు. లీగ్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసినా ... బౌలర్లు విఫలమవడంతో దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఆసీస్తో ఆడిన గత ఐదు మ్యాచ్ల్లో స్మృతి మంధాన వరుసగా 105, 58, 117, 125, 80 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్కు కూడా ఆసీస్పై మంచి రికార్డే ఉంది. వీరిద్దరూ చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. గాయం కారణంగా మరో ఓపెనర్ ప్రతీకా రావల్ వరల్డ్కప్నకు దూరం కావడంతో ఈ మ్యాచ్లో స్మృతితో కలిసి షఫాలీ వర్మ ఇన్నింగ్స్ ఆరంభించనుంది. హర్లీన్æ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. బౌలింగ్లో రేణుక, శ్రీచరణి, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా కీలకం కానున్నారు. మరోవైపు అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, సదర్లాండ్, బెత్ మూనీ, యాష్లే గార్డ్నర్లతో ఆసీస్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. మేగన్ షుట్, అలానా కింగ్ బౌలింగ్ భారం మోయనున్నారు. సెమీఫైనల్కు వర్షం ముప్పు పొంచి ఉంది. వరుణుడి కారణంగా మ్యాచ్ సాగకపోతే శుక్రవారం ‘రిజర్వ్ డే’ ఉంది. అందులోనూ ఆట సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టు (ఆస్ట్రేలియా) ఫైనల్కు చేరుతుంది. 11భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 60 మ్యాచ్లు జరిగాయి. 11 మ్యాచ్ల్లో భారత్ గెలిచి, 49 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక వన్డే ప్రపంచకప్లో ఈ రెండు జట్లు 14 సార్లు తలపడ్డాయి. 3 సార్లు భారత్ గెలిచి, 11 సార్లు పరాజయం పాలైంది. -
శతక్కొట్టిన స్టీవ్ స్మిత్
యాషెస్ సిరీస్కు (Ashes Series 2025-26) ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సింహ గర్జన చేశాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీతో సత్తా చాటాడు. న్యూ సౌత్ వేల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్.. 158 బంతుల్లో 16 ఫోర్లు, సిక్సర్ సాయంతో మూడంకెల మార్కును చేరాడు.ఈ సెంచరీతో యాషెస్ తొలి టెస్ట్కు ముందు ప్రత్యర్ది ఇంగ్లండ్కు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపాడు. ఐదు మ్యాచ్ల యాషెస్ సిరీస్లో తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో స్మిత్ ఆసీస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్గా లేకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది.తొలి టెస్ట్ కోసం ఆసీస్ జట్టును ప్రకటించాల్సి ఉంది. 2018లో సాండ్పేపర్ వివాదం తర్వాత స్మిత్ కెప్టెన్సీ కోల్పోయాడు. అప్పటి నుంచి వైస్ కెప్టెన్గా కొనసాగుతూ ఆరు టెస్టుల్లో తాత్కాలిక నాయకత్వం వహించాడు. సాధారణ ఆటగాడిగా కంటే కెప్టెన్గా స్మిత్ బ్యాటింగ్ రికార్డు అద్భుతంగా ఉంది. సాధారణ ఆటగాడిగా అతని సగటు 49.9గా ఉంటే, కెప్టెన్గా అది 68.98గా ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. క్వీన్స్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూ సౌత్ వేల్స్ రెండో రోజు మూడో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్తో పాటు కర్టిస్ ప్యాటర్సన్ (112) సెంచరీ పూర్తి చేసుకొని బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు. న్యూ సౌత్ వేల్స్కే ఆడే ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ 10 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.చదవండి: బట్లర్ మరో ఆడుగు ముందుకు..! -
IND Vs AUS: బోణీ ఎవరిదో?
కాన్బెర్రా: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా... భారత జట్టు కీలక సిరీస్కు సిద్ధమైంది. ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా... నేటి నుంచి ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడనుంది. ఇటీవల టి20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు... ఆసీస్పై కూడా అదే జోరు కనబర్చాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై భారత హిట్టర్లను అడ్డుకునేందుకు బౌన్సీ పిచ్లతో ఆ్రస్టేలియా సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా... రెండో ‘ప్లేస్’లో ఉన్న ఆ్రస్టేలియా మధ్య రసవత్తర పోరు ఖాయమే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్కప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా మరో 15 టి20లు మాత్రమే ఆడనుంది. దీంతో మెగా టోర్నీ సన్నాహాల్లో ఈ సిరీస్ కీలకం కానుంది.గతేడాది టి20 ప్రపంచకప్ సాధించాక టీమిండియా ఈ ఫార్మాట్లో కేవలం 3 మ్యాచ్ల్లోనే ఓడింది. బ్యాటింగ్ లైనప్ హిట్టర్లతో పటిష్టంగా ఉండగా... వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాకతో బౌలింగ్ మరింత పదును పెరిగింది. మరోవైపు ఆస్ట్రేలియా గత 20 టి20ల్లో కేవలం రెండింట్లోనే ఓడింది. మరి సమ ఉజ్జీల సమరంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి! కెప్టెన్ సూర్యపైనే దృష్టి! ఆసియా కప్లో బ్యాటర్లు దంచికొట్టడం... స్పిన్నర్లు తిప్పేయడంతో ఏమాత్రం పోటీ లేకుండానే భారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఆడిన అన్నీ మ్యాచ్ల్లోనూ పూర్తి ఆధిపత్యంతో విజయాలు సాధించింది. అయితే ఆ్రస్టేలియా పర్యటనలో మాత్రం తొలి మ్యాచ్ నుంచే గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఆసియా కప్లో పరుగుల వరద పారించిన ఓపెనర్ అభిషేక్ శర్మపై జట్టు గంపెడాశలు పెట్టుకుంది. అభిషేక్తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ సామ్సన్, రింకూ సింగ్తో మిడిలార్డర్ బలంగా ఉంది. అయితే గత కొంతకాలంగా సూర్యకుమార్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా అక్షర్కు చోటు ఖాయం కాగా... శివమ్ దూబే, హర్షిత్ రాణాలో ఒకరికి చోటు దక్కనుంది. బుమ్రాతో కలిసి అర్ష్ దీప్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్ర వర్తి, కుల్దీప్లలో ఒకరికి చోటు దక్కనుంది. సమతూకంగా... గత వరల్డ్కప్లో భారత్ చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి వైదొలిగిన ఆ్రస్టేలియా ఇప్పుడు సొంతగడ్డపై టీమిండియాతో పోరులో సమష్టిగా మెరిపించాలని భావిస్తోంది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఆ జట్టుకు ప్రధాన బలం. ఇన్గ్లిస్, టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మిచ్ ఓవెన్తో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. పేస్ ఆల్రౌండర్ స్టొయినిస్ భారీ షాట్లు కొట్టడంలో సిద్ధహస్తుడు. ఇక బౌలింగ్లో హాజల్వుడ్ నుంచి టీమిండియాకు ప్రధాన ముప్పు పొంచి ఉంది. వచ్చే ఏడాది భారత్లో వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో కునేమన్ను పరీక్షించేందుకు ఇంతకుమించిన సమయం రాకపోవచ్చు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలిరాగా... ఇప్పుడు టి20 సిరీస్ కూడా ‘హౌస్ ఫుల్’ కావడం ఖాయమే. భారీ జనసందోహం ముందు ఆడటం బాగుంటుందని మార్ష్ అన్నాడు. పిచ్, వాతావరణం బిగ్బాష్ లీగ్లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బౌండరీ పెద్దది కాగా... స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బుధవారం ఇక్కడ తేలికపాటి వర్ష సూచన ఉంది. అయితే అది మ్యాచ్కు పెద్దగా ఆటంకం కలిగించకపోవచ్చు. 7 ఆస్ట్రేలియా గడ్డపై ఆ్రస్టేలియాతో భారత్ ఇప్పటి వరకు 12 టి20లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్ల్లో గెలిచి, 4 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. 2 భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరగనుండటం ఇది రెండోసారి. 2023లో భారత్ వేదికగా జరిగిన ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను టీమిండియా 4–1తో గెలిచింది. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, తిలక్, సామ్సన్, రింకూ సింగ్, అక్షర్, శివమ్ దూబే/హర్షిత్ రాణా, కుల్దీప్/వరుణ్, అర్ష్ దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ఆ్రస్టేలియా: మార్ష్ (కెప్టెన్), హెడ్, ఇన్గ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, మిచ్ ఓవెన్, స్టొయినిస్, సీన్ అబాట్/జేవియర్, ఎలీస్, కునేమన్, హజల్వుడ్. -
కొత్త రూల్: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు.. 16 ఏళ్లలోపు వినియోగదారులను తొలగించాలని ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదించింది. ఈ నిబంధనలను పాటించకపోయితే.. టెక్ కంపెనీలకు భారీ జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. దీని కోసం 2025 డిసెంబర్ 10 వరకు గడువు ఇచ్చింది.ఆస్ట్రేలియా పార్లమెంట్ విధించిన.. అండర్-16 సోషల్ మీడియా నిషేధాన్ని పాటించడానికి తాము (మెటా, టిక్టాక్ & స్నాప్చాట్) సిద్ధమని ప్రకటించాయి.చట్టానికి మేము కట్టుబడి ఉన్నప్పటికీ.. దీనిని అమలు చేయడం కష్టమని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దిగ్గజాలు వెల్లడించాయి. అయితే.. ఇలాంటి చట్టాన్ని విధించడం పట్ల ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. డిసెంబర్ 10 నాటికి 16 ఏళ్లలోపు లక్షలాది మంది వినియోగదారులను గుర్తించడం.. వారిని తొలగించడం అనేది చాలా పెద్ద సవాలు. దీనిని పరిష్కరించడం అంత సులభం కాదని మెటా పాలసీ డైరెక్టర్ మియా గార్లిక్ అన్నారు.వయసుకు సంబంధించిన సోషల్ మీడియా నిషేధం అనేది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని టిక్టాక్ ఆస్ట్రేలియా పాలసీ లీడ్ ఎల్లా వుడ్స్ జాయిస్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. అస్పష్టం, సమస్యాత్మకం, తొందరపాటు చర్యగా టెక్ కంపెనీలు విమర్శించాయి. 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియా నిషేధం విధించడం అనేది.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిషేధాలలో ఒకటిగా పరిగణించబడుతుందని అన్నాయి.ఇదీ చదవండి: ఇంటర్నేషనల్ నంబర్లతో యూపీఐ చెల్లింపులు -
Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు!
సిడ్నీ: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా తేలింది. ఆ్రస్టేలియాతో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ పక్కటెముకలకు గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతడికి ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అతడి పక్కటెముకల లోపలి భాగంలో రక్త స్రావం జరిగినట్లు నిర్ధారణ అయింది. వైద్య పరిభాషలో ‘స్పీన్ లేసరేషన్’గా వ్యవహరించే ఈ ప్రమాదంతో ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంది. దాంతో వెంటనే శ్రేయస్ను స్థానిక ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స నిర్వహించారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్రేయస్ చికిత్సను పర్యవేక్షిస్తూ స్థానిక వైద్యులకు సహకరించేందుకు భారత టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్ను సిడ్నీలోనే ఉంచినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఎప్పటికప్పుడు శ్రేయస్ ఆరోగ్యంపై సమీక్ష నిర్వహిస్తామని బోర్డు వెల్లడించింది. కనీసం వారం రోజుల పాటు అతను సిడ్నీలోనే ఉండే అవకాశం ఉంది. తమ కొడుకు వద్దకు వెళ్లేందుకు శ్రేయస్ తల్లిదండ్రులు అత్యవసర వీసా కోసం ప్రయతి్నస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బోర్డు నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా... శ్రేయస్ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. -
Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడిన ఈ ముంబై బ్యాటర్ ప్రస్తుతం ఇంటెన్సిక్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు.గాయం మూలంగా శ్రేయస్ అయ్యర్కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన వైద్యులు సిడ్నీ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. టీమిండియా డాక్టర్ కూడా సిడ్నీలోనే ఉండి.. స్థానిక వైద్యులతో కలిసి ఎప్పటికప్పుడు శ్రేయస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.వేగంగా కోలుకుంటున్నాడు!ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. క్యాచ్ అందుకునే క్రమంలో అతడి పక్కటెముకల్లో (ఎడమ) గాయం అయిందని.. స్ల్పీన్ (ప్లీహం) ఇంజూరీ అయిందని తెలిపింది. ప్రస్తుతం శ్రేయస్ వేగంగా కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!దీంతో, శ్రేయస్ అయ్యర్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాజా సమాచారం మాత్రం వారిని మరోసారి ఆందోళనలోకి నెట్టింది. ఈ టీమిండియా స్టార్ కుటుంబ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. శ్రేయస్ గాయం తీవ్రత దృష్ట్యా అతడి తల్లిదండ్రులు వెంటనే సిడ్నీకి పయనం కానున్నట్లు తెలిపాయి. ఇందుకోసం అర్జెంట్ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించాయి. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటనే వీసా మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు శ్రేయస్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి.అభిమానుల్లో సందేహాలుఈ నేపథ్యంలో మరోసారి శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి రెండు మ్యాచ్లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో శనివారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయగా.. 34వ ఓవర్లో హర్షిత్ రాణా బంతితో రంగంలోకి దిగాడు.అప్పటికి క్రీజులో ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ మిడాఫ్/ఎక్స్ట్రా కవర్ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయస్ డైవ్ కొట్టి మరీ సంచలన క్యాచ్ అందుకున్నాడు.Shreyas SUPERMAN Iyer! 💪Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025ఐసీయూలో ఉంచి చికిత్సఈ క్రమంలో శ్రేయస్ గాయపడ్డాడు. ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు, ఫిజియో వచ్చి పరిశీలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్ కోసం సిడ్నీలోని ఆస్పత్రికి పంపగా అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఏడు రోజుల పాటు అయ్యర్ను ఐసీయూలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.కాగా చాన్నాళ్ల క్రితమే టీమిండియా టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవలే టెస్టు క్రికెట్కు విరామం ప్రకటించాడు. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్కు ఆసీస్ టూర్ సందర్భంగా వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. కానీ ఈ గాయం కారణంగా అతడు చాన్నాళ్లపాటు జట్టుకు దూరమయ్యే పరిస్థితుల తలెత్తాయి. ఇక మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. తద్వారా క్లీన్స్వీప్ గండం నుంచి గట్టెక్కింది.Update: Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు! చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ -
భారత్తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు
టీమిండియాతో తొలి టీ20కి ముందు (India vs Australia) ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు జరిగింది. వారి స్టార్ స్పిన్నర్, టీ20 లీడింగ్ వికెట్ టేకర్ ఆడమ్ జంపా (Adam Zampa) వ్యక్తిగత కారణాల చేత (రెండోసారి తండ్రి కాబోతున్నాడు) తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. జంపా స్థానాన్ని మరో స్పిన్నర్ తన్వీర్ సంఘా (Tanveer Sangha) భర్తీ చేయనున్నాడు. సంఘా రెండేళ్ల తర్వాత టీ20 ఆడనున్నాడు. అతని చివరి మ్యాచ్ భారత్తోనే ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తన కోటా 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి రింకూ సింగ్ వికెట్ తీశాడు. సంఘా ఆస్ట్రేలియా తరఫున 4 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. సంఘా జంపా స్థానంలో జట్టులోకి వచ్చినప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడో లేదో చూడాలి. ఆసీస్కు ఇప్పటికే మాథ్యూ కుహ్నేమన్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఉంది.ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్బెర్రా వేదికగా ఈ నెల 29న తొలి టీ20 జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్లకు ఓ జట్టు.. మూడో టీ20కి ఓ జట్టు.. చివరి రెండు మ్యాచ్లకు మరో జట్టును ప్రకటించారు.తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మాథ్యూ కుహ్నేమన్, తన్వీర్ సంఘా (ఆడమ్ జంపా స్థానంలో తొలి టీ20కు మాత్రమే)మూడో టీ20కి ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్లీ బియర్డ్మన్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాచివరి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్లీ బియర్డ్మన్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాభారత్ టీ20 జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాటీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ -
IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..!
టెస్ట్, వన్డే ఫార్మాట్లలో గుత్తాధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా జట్టుకు పొట్టి క్రికెట్ బలహీనత ఉంది. ముఖ్యంగా టీమిండియా ఎదురైనప్పుడు ఆ బలహీనత మరింత ఎక్కువవుతుంది. 2007 నుంచి భారత్తో ఆడిన 32 మ్యాచ్ల్లో (India vs Australia) ఆసీస్ కేవలం 11 మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు సాధించింది.ద్వైపాక్షిక సిరీస్ల్లో అయితే ఆసీస్ ట్రాక్ రికార్డు మరింత చెత్తగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 11 సిరీస్లు జరగ్గా, ఆసీస్ రెండింట మాత్రమే గెలుపొందింది. త్వరలో జరుగనున్న ఐదు మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో భారత్-ఆసీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్లపై ఓ లుక్కేద్దాం.తొలి పంజా మనదేభారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2007 అక్టోబర్ 20న జరిగింది. వన్ మ్యాచ్ సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆసీస్పై తొలి పంజా విసిరింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో సత్తా చాటింది. బౌలింగ్లో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. బ్యాటింగ్లో గౌతమ్ గంభీర్ (63), యువరాజ్ సింగ్ (31 నాటౌట్) రాణించారు.అనంతరం 2008 ఫిబ్రవరి 1న మెల్బోర్న్లో జరిగిన వన్ మ్యాచ్ సిరీస్లో (డే అండ్ నైట్) ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 74 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ మరో 52 బంతులు మిడిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.గంభీర్ మరోసారి..!2012 ఫిబ్రవరిలో ఇరు జట్ల మధ్య తొలి మల్టీ మ్యాచ్ సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో గంభీర్ (56 నాటౌట్) టీమిండియాను గెలిపించాడు. యువీ విధ్వంసం2013 అక్టోబర్లో జరిగిన మరో వన్ మ్యాచ్ సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆరోన్ ఫించ్ (89) చెలరేగడంతో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం యువరాజ్ సింగ్ (77 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.చెలరేగిన కోహ్లి.. వైట్వాష్మళ్లీ మూడేళ్ల తర్వాత (2016, జనవరి) భారత్, ఆసీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మూడు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0తో వైట్వాష్ చేసింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు (90 నాటౌట్, 59 నాటౌట్, 59) బాది టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ కూడా రెండు అర్ద సెంచరీలతో రాణించాడు.రాణించిన శిఖర్అనంతరం 2017 అక్టోబర్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ (భారత్), 2018 నవంబర్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లు (ఆస్ట్రేలియా) 1-1తో డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి సత్తా చాటారు. ఈ సిరీస్లోని చివరి మ్యాచ్లో కృనాల్ పాండ్యా (4-0-36-4) అదరగొట్టాడు.తొలి పరాభవం2019లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్లో పర్యటించింది. ఈ సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి సత్తా చాటారు.హ్యాట్రిక్ విక్టరీస్ఆతర్వాత భారత్ వరుసగా 2020 (ఆస్ట్రేలియాలో), 2022 (భారత్లో), 2023 (భారత్లో) సిరీస్ల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 2020 సిరీస్లో రాహుల్, ధవన్, కోహ్లి, నటరాజన్, చహల్ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 2022 సిరీస్లో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 2-1 తేడాతో గెలుపొందింది.యువ ఆటగాళ్ల హవా.. రుతురాజ్ విధ్వంసకర శతకం2023లో జరిగిన సిరీస్లో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫలితంగా భారత్ 4-1 తేడాతో ఆసీస్ను ఖంగుతినిపించింది. ఈ సిరీస్లోని మూడో మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకం బాదాడు.చదవండి: రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..! -
అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!
మహిళల వన్డే ప్రపంచకప్లో (women's Cricket World Cup) ఆస్ట్రేలియా (Australia Women's Cricket Team) ప్రస్తానం అద్వితీయంగా సాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు పూర్తైన 12 ఎడిషన్లలో ఏడు సార్లు ఛాంపియన్గా నిలిచింది. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు కలిగి ఉంది.ఘన చరిత్ర కలిగిన ఆసీస్.. ప్రస్తుతం ఎనిమిదో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2025 ఎడిషన్లో ఓటమెరుగని ఏకైక జట్టుగా సెమీస్కు చేరింది. సెమీస్లో భారత్తో అమీతుమీకి సిద్దమైంది. ఈ మ్యాచ్ నవీ ముంబై వేదికగా అక్టోబర్ 30న జరుగనుంది. తొలి సెమీస్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. ఆసీస్ మరోసారి సెమీస్కు చేరిన నేపథ్యంలో ప్రపంచకప్లో ఆ జట్టు ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.తొట్ట తొలి ఛాంపియన్ ఇంగ్లండ్ఈ మెగా టోర్నీ 1973లో (ఇంగ్లండ్లో) తొలిసారి జరిగింది. ఈ ఎడిషన్లో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి తొట్ట తొలి జగజ్జేతగా ఆవిర్భవించింది. 7 జట్లు పాల్గొన్న ఆ ఎడిషన్లో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచి రన్నరప్తో సరిపెట్టుకుంది. తొలిసారి జగజ్జేతభారత్ వేదికగా జరిగిన రెండో ఎడిషన్లో (1978) ఆస్ట్రేలియా తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. ఈ ఎడిషన్లో ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. కేవలం నాలుగు జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్లో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య భారత్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. భారత్కు ఇదే తొలి ప్రపంచకప్. రెండోసారిన్యూజిలాండ్ వేదికగా జరిగిన మూడో ఎడిషన్లో (1982) ఆస్ట్రేలియా రెండో సారి ఛాంపియన్గా నిలిచింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లోనే జరిగిన ఈ ఎడిషన్లో ఆసీస్ అజేయగా జట్టుగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్లోనూ ఇంగ్లండ్ రన్నరప్తో సరిపెట్టుకుంది. హ్యాట్రిక్స్వదేశంలో జరిగిన 1988లో ఎడిషన్లో ఆసీస్ మరోసారి ఛాంపియన్గా నిలిచి, హ్యాట్రిక్ సాధించింది. ఐదు జట్లుతో 60 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ ఎడిషన్లోనూ ఇంగ్లండ్ రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో ఆసీస్ ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించి, ముచ్చటగా మూడో టైటిల్ ఎగరేసుకుపోయింది.తొలిసారి పరాభవం1993 ఎడిషన్లో ఆస్ట్రేలియా తొలిసారి ఫైనల్కు చేరలేకపోయింది. రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన ఈ ఎడిషన్లో ఇంగ్లండ్ ఛాంపియన్గా, న్యూజిలాండ్ రన్నరప్గా నిలువగా.. ఆస్ట్రేలియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ ఎడిషన్లో 8 జట్లు పాల్గొనగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.తిరిగి జగజ్జేతగా..1997లో భారత్ వేదికగా జరిగిన ఎడిషన్లో ఆస్ట్రేలియా తిరిగి జగజ్జేతగా ఆవిర్భవించింది. 11 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్లో న్యూజిలాండ్ రన్నరప్గా నిలువగా.. భారత్ సెమీస్ వరకు చేరుకుంది.మూడు సార్లు పరాభవం తర్వాత..!మూడు సార్లు ఫైనల్లో పరాభవం తర్వాత న్యూజిలాండ్ తొలిసారి 2000 ఎడిషన్లో ఛాంపియన్గా అవతరించింది. స్వదేశంలో జరిగిన ఈ ఎడిషన్లో న్యూజిలాండ్ తిరుగులేని ఆధిపత్యం చలాయించి టైటిల్ను సొంతం చేసుకుంది. 8 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్లో ఆస్ట్రేలియా రన్నరప్తో సరిపెట్టుకుంది.భారత్పై గెలిచి ఐదోసారిసౌతాఫ్రికా వేదికగా జరిగిన 2005 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఐదోసారి జగజ్జేతగా ఆవతరించింది. ఫైనల్లో భారత్పై విజయం సాధించి, ఛాంపియన్గా అవతరించింది.ఊహించని పరాభవంస్వదేశంలో జరిగిన 2009 ఎడిషన్లో ఆసీస్కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్లో ఆ జట్టు సూపర్ సిక్స్ దశను అధిగమించలేకపోయింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్కు చేరుకోగా.. ఇంగ్లండ్ తమ మూడో టైటిల్ను సొంతం చేసుకుంది.ఆరో టైటిల్భారత్ వేదికగా జరిగిన 2013 ఎడిషన్లో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకొని ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో వెస్టిండీస్పై విజయం సాధించి ఆరో టైటిల్ను ఖాతాలో వేసుకుంది. ఈ ఎడిషన్లో భారత్ సూపర్ సిక్స్కు కూడా చేరలేకపోయింది.ఇంగ్లండ్ నాలుగోసారి..స్వదేశంలో జరిగిన 2017 ఎడిషన్లో ఇంగ్లండ్ విజేతగా అవతరించింది. ఫైనల్లో భారత్పై విజయం సాధించి, నాలుగసారి జగజ్జేతగా నిలిచింది.ఏడోసారి జగజ్జేతగా..న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2022 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఏడో సారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో ఇంగ్లండ్పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్లో భారత్ నాకౌట్ దశకు చేరలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆసీస్ ఎనిమిదో టైటిల్పై కన్నేసింది. చదవండి: కేకేఆర్ హెడ్ కోచ్గా రోహిత్ శర్మ ఫిట్నెస్ గురు -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో తలపడనుంది. ఆడిన 7 మ్యాచ్లలో 6 విజయాలతో (1 రద్దు) పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానాన్ని అందుకుంది. నేడు బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్కు నాలుగో స్థానం ఖాయమైంది. భారత్, ఆ్రస్టేలియా సెమీస్ 30న ముంబైలో జరగనుండగా, గువాహటిలో 29న జరిగే తొలి సెమీస్లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడనుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆ్రస్టేలియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. లారా వోల్వర్ట్ (30), సినాలో జాఫ్తా (29) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (7/18) తన లెగ్ స్పిన్తో 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. అనంతరం ఆ్రస్టేలియా 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసి విజయాన్నందుకుంది. బెత్ మూనీ (42), జార్జియా వోల్ (38 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. -
రోహిత్ – కోహ్లి సూపర్హిట్
‘సినిమా ఇంకా మిగిలే ఉంది’... ఆ్రస్టేలియాతో చివరి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆట చూస్తే అభిమానులందరికీ ఇదే అనిపిస్తుంది. సిరీస్ ఆరంభానికి ముందు వారి బ్యాటింగ్పై సందేహాలు, జట్టులో చోటుపై చర్చ... తొలి మ్యాచ్లో వైఫల్యం తర్వాత రోహిత్పై ఒత్తిడి పెరగగా, వరుసగా రెండు డకౌట్లు కోహ్లి సత్తాపై సందేహాలు రేకెత్తించాయి. కానీ వన్డే క్రికెట్ దిగ్గజాలుగా తమ అసలు స్థాయి ఏమిటో వారు ఇప్పుడు చూపించారు.మరికొంత కాలం తమ స్థానం గురించి ఎవరూ మాట్లాడకుండా చేశారు... అలవోకగా పరుగులు సాధించి తమ బ్యాటింగ్లో పదును తగ్గలేదని నిరూపించారు. ఆస్ట్రేలియా గడ్డపై చివరి సారిగా ఆడిన రోహిత్, కోహ్లి సిడ్నీ మైదానంలోని 40,587 మంది ప్రేక్షకులను చక్కటి షాట్లతో అలరించారు. రోహిత్ శతకంతో చెలరేగగా, కోహ్లి దీటైన ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో రికార్డు స్థాయిలో 5483 పరుగులు జోడించిన ఈ జంట తమ జుగల్బందీతో మరో మ్యాచ్ను గెలిపించి ఫ్యాన్స్కు జోష్ను అందించింది. సిడ్నీ: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్ను భారత్ విజయంతో ముగించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయినా... చివరి మ్యాచ్ టీమిండియాకు ఆనందాన్ని పంచింది. శనివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. మాట్ రెన్షా (58 బంతుల్లో 56; 2 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 237 పరుగులు సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (124 బంతుల్లో 121 నాటౌట్; 13 ఫోర్లు, 3 సిక్స్లు) కెరీర్లో 33వ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లి (81 బంతుల్లో 74; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్కు 170 బంతుల్లో అభేద్యంగా 168 పరుగులు జోడించడంతో మరో 11.3 ఓవర్లు ఉండగానే భారత్ విజయం ఖాయమైంది. తొలి రెండు వన్డేలు నెగ్గిన ఆసీస్ 2–1తో సిరీస్ సొంతం చేసుకోగా, మొత్తంగా 202 పరుగులు చేసిన రోహిత్కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ మొదలవుతుంది. హర్షిత్ రాణాకు 4 వికెట్లు... ఆ్రస్టేలియా ఇన్నింగ్స్లో టాప్–6 బ్యాటర్లు మెరుగ్గా ఆరంభించినా, ఒక్కరూ కూడా దానిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. ఓపెనర్లు మిచెల్ మార్ష్(50 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 29; 6 ఫోర్లు) తొలి వికెట్కు 56 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్ (41 బంతుల్లో 30; 2 ఫోర్లు), రెన్షా కూడా ఫర్వాలేదనిపించడంతో ఒక దశలో స్కోరు 183/3 వద్ద నిలిచింది. అయితే శ్రేయస్ అద్భుత క్యాచ్తో అలెక్స్ క్యారీ (24)ని అవుట్ చేయడంతో ఆసీస్ పతనం మొదలైంది. గత మ్యాచ్ గెలిపించిన కూపర్ కలోనీ (23)తో పాటు ఇతర బ్యాటర్లెవరూ క్రీజ్లో నిలబడలేకపోయారు. ఫలితంగా 53 పరుగుల వ్యవధిలో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయింది. మరో 3.2 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు ఆలౌట్ అయింది. క్యారీ క్యాచ్ పట్టే క్రమంలో శ్రేయస్ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. నితీశ్ రెడ్డి, అర్ష్ దీప్ స్థానాల్లో కుల్దీప్, ప్రసిధ్ కృష్ణలకు చోటు కల్పించింది. భారీ భాగస్వామ్యం... ఛేదనలో భారత్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, శుబ్మన్ గిల్ (24) చకచకా 62 బంతుల్లోనే 69 పరుగులు జత చేశారు. గిల్ వెనుదిరిగిన తర్వాత ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య కోహ్లి బరిలోకి దిగాడు. తన తొలి బంతికే సింగిల్ తీయడంతో స్టేడియం హోరెత్తిపోగా, కోహ్లి కూడా నవ్వుతూ వారికి అభివాదం చేయడం విశేషం! రోహిత్, కోహ్లి జోడి ఎదురు లేకుండా దూసుకుపోయింది. రోహిత్ దూకుడు ప్రదర్శించగా, కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. జంపా బౌలింగ్లో లాంగాఫ్ మీదుగా రోహిత్ కొట్టిన ‘ఇన్సైడ్ అవుట్’ సిక్స్ హైలైట్గా నిలిచింది. ముందుగా 63 బంతుల్లో రోహిత్, ఆ తర్వాత 56 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వికెట్ తీయడంలో విఫలమయ్యారు. జంపా బౌలింగ్లో సింగిల్తో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ ఎలాంటి సంబరాలు చేసుకోకపోగా, భారత్ స్కోరు 200 పరుగులకు చేరింది. ఆ తర్వాత మరో 33 బంతుల్లో జట్టు మ్యాచ్ను ముగించింది. 14,255 వన్డేల్లో కోహ్లి పరుగుల సంఖ్య. సంగక్కర (14,234)ను అధిగమించిన అతను సచిన్ (18,426) తర్వాత రెండో స్థానానికి చేరుకున్నాడు.9 ఆస్ట్రేలియాపై రోహిత్ సెంచరీల సంఖ్య. సచిన్ (9)తో అతను సమంగా నిలిచాడు.50 అన్ని ఫార్మాట్లు కలిపి రోహిత్ సెంచరీల సంఖ్య. మరో 9 మంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మార్ష్(బి) అక్షర్ 41; హెడ్ (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 29; షార్ట్ (సి) కోహ్లి (బి) సుందర్ 30; రెన్షా (ఎల్బీ) (బి) సుందర్ 56; క్యారీ (సి) అయ్యర్ (బి) రాణా 24; కనోలీ (సి) కోహ్లి (బి) రాణా 23; ఒవెన్ (సి) రోహిత్ (బి) రాణా 1; స్టార్క్ (బి) కుల్దీప్ 2; ఎలిస్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 16; జంపా (నాటౌట్) 2; హాజల్వుడ్ (బి) రాణా 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 236. వికెట్ల పతనం: 1–61, 2–88, 3–124, 4–183, 5–195, 6–198, 7–201, 8–223, 9–236, 10–236. బౌలింగ్: సిరాజ్ 5–1–24–1, రాణా 8.4–0–39–4, ప్రసిధ్ 7–0–52–1, కుల్దీప్ 10–0–50–1, అక్షర్ 6–0–18–1, సుందర్ 10–0–44–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 121, గిల్ (సి) క్యారీ (బి) హాజల్వుడ్ 24; కోహ్లి (నాటౌట్) 74; ఎక్స్ట్రాలు 18; మొత్తం (38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 237. వికెట్ల పతనం: 1–69. బౌలింగ్: స్టార్క్ 5–0–31–0, హాజల్వుడ్ 6–1–23–1, ఎలిస్ 7.3–0–60–0, కనోలీ 5–0–36–0, జంపా 10–0–50–0, ఒవెన్ 1–0–2–0, షార్ట్ 4–0–29–0. -
భారతీయ సినిమా వీరవిహారాలు..ఆస్ట్రేలియన్ సినిమా ఆర్తనాదాలు
ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంలో తొలిసారిగా, స్థానిక బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమాలు ఆస్ట్రేలియన్ సినిమాల కలెక్షన్లను అధిగమించాయని ఒక కొత్త నివేదిక వెల్లడించింది. త్వరలో వచ్చే వారం జరగనున్న ఒక ప్రధాన సినిమా పరిశ్రమ సమావేశానికి ముందు ఈ నివేదికను విడుదల చేసిన చిత్ర పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ నిక్ హేస్, హిందీ, తెలుగు, తమిళం. ఇతర భారతీయ భాషలలోని చిత్రాలు అమెరికన్ బ్రిటిష్ చిత్రాల తర్వాత ఆస్ట్రేలియాలో మూడవ అతిపెద్ద మార్కెట్గా మారాయని చెప్పారు.అవి 2021లో 32.5 మిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ సంవత్సరం అంచనా వేసిన దాని కన్నా మిన్నగా 50 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే కాలంలో, ఆస్ట్రేలియన్ చిత్రాలు ‘పేలవమైన‘ బాక్సాఫీస్ ప్రదర్శనతో 54.2 మిలియన్ డాలర్ల నుంచి ఈ సంవత్సరం 16.8 మిలియన్ డాలర్లకు పడిపోయాయని హేస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆంగ్లోఫోన్ మాట్లాడని చలనచిత్ర రంగం జాతీయ పరిశ్రమ కంటే ముందుకెళ్లిన మొదటి ప్రధాన ఆంగ్ల భాషా మార్కెట్ ఆస్ట్రేలియా ఇది యుకె. యుఎస్ లేదా కెనడాలో కనిపించని నిర్మాణాత్మక మైలురాయి‘ అని ఆయన అంటున్నారు. అంటే ఆంగ్లేతర చిత్రాలు ఆస్ట్రేలియాలో ఈ స్థాయి విజయం సాధించడం మరే దేశంలోనూ లేని వైచిత్రి అని ఆయన భావం.భారీ సంఖ్యలో ప్రేక్షకుల బలం, నమ్మకమైన చిత్రాల సరఫరా కమ్యూనిటీ ఆధారిత మార్కెటింగ్ భారతీయ విజయం వెనుక ఉన్నాయని డెండీ సినిమాస్, ఐకాన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, అంబ్రెల్లా ఎంటర్టైన్మెంట్లలో సీనియర్ పాత్రలు పోషించిన హేస్ అభిప్రాయపడుతున్నారు.గత ఐదు సంవత్సరాలలో అతిపెద్ద భారతీయ హిట్లుగా హిందీ సినిమా యానిమల్(Animal Movie) 5.2 మిలియన్ డాలర్లు వసూలు చేయగా మరో బాలీవుడ్ మూవీ పఠాన్(Pathaan) 4.7 మిలియన్లు రాబట్టింది. అదే బాటలో జవాన్(Jawan) కూడా 4.7 మిలియన్లతో 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్ అక్కడ సత్తా చాటింది. తెలుగు సినిమా పుష్ప: ది రూల్ – పార్ట్ 2 4.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఆ తర్వాతి స్థానంలోనూ మరో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ 3.6 మిలియన్లతో అంతర్జాతీయ స్థాయిలో దక్షిణ భారత సినిమా సత్తా చాటినట్టు న్యూమెరో బాక్స్ ఆఫీస్ డేటా వెల్లడిస్తోంది. ‘‘ఆడియన్స్ స్పీక్ – ఇట్స్ టైమ్ వుయ్ లిజెన్’’ అనే పేరుతో వెలువరించిన ఈ నివేదిక గోల్డ్ కోస్ట్లో ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ మూవీ కన్వెన్షన్కు ముందు బహుళ మార్గాల ద్వారా ప్రేక్షకులను పెంచుకోవడానికి సినిమాలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచిస్తోంది.ఇదే పంథా కొనసాగితే... మరోఐదు సంవత్సరాలు ఈ ట్రెండ్ కొనసాగితే, న్యూజిలాండ్ సినిమాలు, బహుశా చైనీస్. ఫ్రెంచ్ సినిమాలు కూడా ఆస్ట్రేలియన్ సినిమాలను అధిగమించవచ్చని హేస్ విశ్వసిస్తున్నారు. ‘ఆస్ట్రేలియన్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంట్లో ఇంగ్లీష్ కాకుండా వేరే భాష మాట్లాడుతుండగా, ప్రతి 10 సినిమా టిక్కెట్లలో ఒకటి కంటే తక్కువ ఇంగ్లీష్ కాని భాషా టైటిల్స్కు అమ్ముడవుతున్నాయి‘ అని నివేదిక చెబుతోంది. ‘శనివారం రాత్రి సిడ్నీ లేదా మెల్బోర్న్లోని ఏదైనా సినిమా థియేటర్లోకి నడిచి చూడండి, మీరు అరబిక్, తగలోగ్, హిందీ, వియత్నామీస్, మాండరిన్, గ్రీక్. లాబీలో తదితర డజను భాషలను వినవచ్చు కానీ లైట్లు మసకబారినప్పుడు, దాదాపు ప్రతి స్క్రీన్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది.’’ఇంగ్లీష్ సినిమాలు ఇప్పటికీ అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వాటి మార్కెట్ వాటా 2021లో దాదాపు 95 శాతం నుంచి ఈ సంవత్సరం 91 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ‘జనాభా స్క్రీన్ వాటా మధ్య దాదాపు సమానత్వాన్ని సాధించిన ఏకైక విదేశీ భాషా రంగం భారతీయ భాష మాత్రమే‘ అని అది పేర్కొంది. ‘మాండరిన్, అరబిక్ వియత్నామీస్ జనాభా వారి జనాభాతో పోలిస్తే గణనీయమైన రీతిలో వారి స్క్రీన్ వాటా తక్కువగా కనిపిస్తోందని తేల్చింది. -
విజయంతో ముగిస్తారా!
సిడ్నీ: ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ విజేత హోదాలో భారీ అంచనాలతో ఆ్రస్టేలియాకు వచ్చిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో ఇప్పటికే 0–2తో సిరీస్ను కోల్పోయింది. మిగిలిన చివరి మ్యాచ్లోనైనా గెలిస్తే టీమిండియాకు ఊరట దక్కుతుంది. భారత జట్టు తమ వన్డే చరిత్రలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా చేతిలో క్లీన్స్వీప్నకు గురి కాలేదు. వన్డే ఫార్మాట్లో టీమిండియా కొత్త కెపె్టన్ శుబ్మన్ గిల్ నాయకత్వంలో అలాంటి అవకాశం ఇవ్వరాదని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. కోహ్లి ఈసారైనా... సిరీస్కు ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల బ్యాటింగ్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తొలి మ్యాచ్లో విఫలమైనా...అడిలైడ్లో అర్ధసెంచరీతో రోహిత్ కాస్త ఫర్వాలేదనిపించాడు. అయితే అతని ఆటలో సహజశైలి, దూకుడు కనిపించలేదు. కోహ్లి అయితే రెండు సార్లూ డకౌట్ అయి పూర్తిగా నిరాశపర్చాడు. ఈ మ్యాచ్లో కూడా సహజంగానే వారిద్దరి బ్యాటింగ్పైనే అందరి దృష్టీ నిలిచింది. గతేడాది అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆ్రస్టేలియా గడ్డపై ఆడటం ఇదే చివరిసారి కానుంది. అందుకే ఈ మ్యాచ్పై సిడ్నీ అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించడంతో టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయి మైదానం హౌస్ఫుల్గా కనిపించనుంది. కోహ్లి తన స్థాయికి తగినట్లు ఆడి ఆకట్టుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అయితే గిల్, కేఎల్ రాహుల్ కూడా విఫలమవుతుండటం భారత్ బృందానికి ఆందోళన కలిగించే అంశం. మరోసారి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కీలకం కానుండగా... ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్లో ప్రభావం చూపించాల్సి ఉంది. బౌలింగ్లో ఈ మ్యాచ్లోనైనా కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. వారిద్దరికి విశ్రాంతి... అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరమైనా... ఆసీస్ యువ క్రికెటర్లు రెండో వన్డేను గెలిపించడం టీమ్ మేనేజ్మెంట్కు ఉత్సాహాన్ని ఇచి్చంది. షార్ట్, కనోలీ, ఒవెన్, రెన్షాలాంటి ఆటగాళ్లంతా ప్రభావం చూపించగలిగారు. బౌలింగ్లో బార్త్లెట్ ఆకట్టుకోగా, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన విలువను ప్రదర్శించాడు. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో టాప్ పేసర్లు స్టార్క్, హాజల్వుడ్లకు ఆసీస్ విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. వీరి స్థానాల్లో ఎలిస్, జాక్ ఎడ్వర్డ్స్ బరిలోకి దిగుతారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలం కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఆ్రస్టేలియా ఇక్కడ ఆడిన గత ఆరు వన్డేల్లో విజయం సాధించింది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. 16 సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 19 వన్డేలు జరిగాయి. భారత్ రెండు మ్యాచ్ల్లో గెలిచి, 16 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక వన్డేలో ఫలితం రాలేదు. -
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో ఇంత కష్టం ఉంటుందా..?
ఎవరెస్టుని అధిరోహించిన ఎందరో సాహస వీరులు, నారీమణలు గురించి విన్నాం. అందుకోసం ఎంతో ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. అంత కష్టపడ్డా తీర ఎవరెస్టుని అధిరోహిస్తుండగా వాతావరణం ప్రతికూలంగా ఉంటే మధ్యలోనే వెనుతిరగాల్సిందే..అంత కష్టమైనది ఎవరెస్టుని అధిరోహించడం. ఒకపక్క ఎముకలు కొరికే చలి, మరోవైపు ప్రమాదకరమైన డెత్ జోన్లు, అననూకూలమైన వాతావరణం వంటి సవాళ్లను ఓర్చుకుంటేనే..అధిరోహించడం సాధ్యమవుతుంది. ఇలానే ఓ అమ్మాయి ఎంతో ఉత్సాహంగా వెళ్లి ..అననూకూలమైన వాతావరణంతో పాపం వెనుదిరగక తప్పకలేదు. అందుక సంబంధించిన అనుభవాన్ని నెట్టింట షేర్ చేయడంతో ఇంత కష్టసాధ్యమైనదా ఎవరెస్టుని ఎక్కడం అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లుఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన 17 ఏళ్ల బియాంకా అడ్లర్ ఈ ఏడాది మేలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించింది. ఆమె శిఖరానికి దాదాపు 400 మీటర్ల 8,450 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. అయితే అక్కడకి చేరుకున్న తర్వాత క్లిష్టమైన వాతావరణం కారణంగా వెనుదిరగక తప్పలేదు బియాంకాకి. దాంతే బేస్ క్యాంప్కి చేరుకుంది. అక్కడకు చేరుకున్నాక..తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రికార్డు చేసి మరి పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తాను బేస్ క్యాంపులో ఉన్నానని, భయంగా ఉందంటూ మాట్లాడింది. తన మెడ, గొంతు, ఊపిరితిత్తులు చాలా నొప్పిగా ఉన్నాయని..ఊపిరి ఆడటం లేదంటూ ఆందోళనగా చెప్పుకొచ్చింది. క్యాంప్4, క్యాంప్2 సమావేశాల్లో అక్కడ వాతావరణ పరిస్థితుల బాగోక పోవడంతో మూడు రాత్రులు అనంతరం బేస్ క్యాంప్కి తిరిగి వచ్చింది. ఇక్కడ తనకు చాలా భయంకరంగా అనిపిస్తోందని బాధగా చెప్పింది. ఒకపక్క దగ్గుతూ, ముఖం మంతా ఎర్రగా కందిపోయి, అనారోగ్యంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి ఎవరెస్టులో మూడు రోజుల అనంతరం డెత్ జోన్ నుంచి తిరిగి వచ్చా అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు సైతం ఎవరెస్టు ఎత్తులో శరీరం ఇంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందా అని ఆశ్చర్యపోతూ పోస్టులు పెట్టారు. అయినా పర్వతారోహణలో చేయగలిగిందంతా ఇప్పటి వరకు చేశారు అందుకు మీకు హ్యాట్సాఫ్ అని పోస్టులు పెట్టారు మరికొందరు. View this post on Instagram A post shared by Bianca Adler (@bianca_adler1) (చదవండి: అలా బంగారం దానం చేయడం ఇవాళ సాధ్యమేనా?) -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో హర్మన్ సేన ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(109), ప్రతికా రావల్(122) అద్భుతమైన సెంచరీలతో సత్తాచాటగా.. జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్ణయించారు. కానీ న్యూజిలాండ్ లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ ఓటమితో కివీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్లో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఆసీస్ రికార్డు బ్రేక్..మహిళల వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్పై అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లోనే ఇండోర్ వేదికగా కివీస్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 326 పరుగులు చేసింది. తాజా మ్యాచ్లో 340 రన్స్ చేసిన టీమిండియా.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది.చదవండి: రోహిత్ నీకు ఇది ఫేర్వెల్ మ్యాచా? ఒక్క ఫోటో అయినా పెట్టు: గంభీర్ -
సిరీస్ కాపాడుకునేందుకు...
అడిలైడ్: శుబ్మన్ గిల్ నాయకత్వంలో తొలి వన్డే ఓడిన భారత జట్టు మరో పోరులో తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు జరిగే రెండో వన్డేలో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. ప్రస్తుతం 0–1తో వెనుకంజతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో ఓడితే సిరీస్ను చేజార్చుకుంటుంది. వర్షం కారణంగా 26 ఓవర్లకే కుదించిన గత మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ్రస్టేలియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. సహజంగానే మరోసారి అందరి దృష్టీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపైనే ఉంది. తొలి వన్డేలో వీరిద్దరు విఫలం కావడం కొత్త చర్చకు దారి తీసింది. ప్రతీ మ్యాచ్ వీరికి పరీక్ష కాదని చీఫ్ సెలక్టర్ అగార్కర్ చెబుతున్నా... కచి్చతంగా రాణించాల్సిన ఒత్తిడి వీరిపై ఉందనేది వాస్తవం. అరంగేట్ర మ్యాచ్లో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి తన ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. భారత్ తుది జట్టు విషయంలో మార్పు ఉండకపోవచ్చు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అక్షర్, సుందర్లలో ఒకరిని తప్పించి రెగ్యులర్ స్పిన్నర్ కుల్దీప్కు అవకాశం ఇస్తారా అనేది సందేహమే. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్లో ఫిలిప్స్, కునెమన్ స్థానాల్లో అలెక్స్ కేరీ, ఆడమ్ జంపా రావడం ఖాయమైంది. అడిలైడ్ మైదానం బ్యాటింగ్కు బాగా అనుకూలం కావడంతో భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడిన గత రెండు వన్డేల్లో (2012, 2019) భారత జట్టే గెలిచింది. -
రాణించిన ఆసీస్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన ఇంగ్లండ్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 22) ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు (Australia vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. అన్నాబెల్ సదర్ల్యాండ్ (10-1-60-3), సోఫీ మోలినెక్స్ (10-0-52-2), ఆష్లే గార్డ్నర్ (9-0-39-2), అలానా కింగ్ (10-1-20-1), కిమ్ గార్త్ (7-2-43-0) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ (78) మాత్రమే సత్తా చాటింది. అలైస్ క్యాప్సీ (38), ఛార్లోట్ డీన్ (26), సోఫీ డంక్లీ (22), హీథర్ నైట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. యామీ జోన్స్ 18, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ 7, ఎమ్మా ల్యాంబ్ 7, లిన్సే స్మిత్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ 10, లారెన్ బెల్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇదివరకే సెమీస్కు అర్హత సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ రెండు జట్లతో పాటు సౌతాఫ్రికాకు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. చదవండి: శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం -
తెలంగాణ-ఆర్ఎమ్ఐటీల మధ్య వ్యూహాత్మక ఒప్పందం
హైదరాబాద్: జీవవిజ్ఞాన (లైఫ్ సైన్సెస్) విద్య మరియు పరిశోధన రంగాల్లో గ్లోబల్ సహకారాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరియు ఆస్ట్రేలియాలోని RMIT University వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో ఇరు సంస్థలు Letter of Intent (LoI) పై సంతకాలు చేశాయి.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖల మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RMIT విశ్వవిద్యాలయం డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాథరిన్ ఇట్సియోపోలస్ (Catherine Itsiopoulos), తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరయ్యారు.RMIT విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోని ప్రముఖ గ్లోబల్ విద్యాసంస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 90,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ విశ్వవిద్యాలయం ఇండస్ట్రీ-ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, అప్లైడ్ రీసెర్చ్లో అగ్రగామిగా ఉంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో "ఇంటర్నేషనల్ అవుట్లుక్" విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 75వ స్థానంలో నిలిచింది. RMIT విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన భాగస్వామ్యాలు మరియు పరిశ్రమలతో ఉన్న బలమైన సంబంధాల వల్ల పేరుపొందింది. దాని సైన్స్ విభాగం బయోటెక్నాలజీ, బయోసైన్స్, మాలిక్యులర్ బయాలజీ రంగాల్లో ఆధునిక పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలకు అత్యాధునిక ల్యాబ్లు మరియు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.తాజాగా RMIT విశ్వవిద్యాలయం, బిట్స్ హైదరాబాద్తో కలిసి “BITS–RMIT హయ్యర్ ఎడ్యుకేషన్ అకాడమీను ప్రారంభించింది. ఆస్ట్రేలియా మరియు భారతదేశాల మధ్య అధునాతన పరిశోధన, విద్యా మార్పిడి, ఆవిష్కరణ ఆధారిత విద్యను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ నుండి పరిశోధకులు జాయింట్ పీహెచ్డీ ప్రోగ్రామ్లను కొనసాగించవచ్చు. విద్యార్థులు తమ విద్యా కాలంలో కొంత భాగాన్ని బిట్స్ హైదరాబాద్లో, మరికొంత భాగాన్ని RMIT మెల్బోర్న్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులు, అధ్యాపకులు రెండు దేశాల మధ్య మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. కలిసి పరిశోధనలు చేస్తారు. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించి, భారతదేశంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను బలపరచడమే లక్ష్యం.ఈ సందర్భంగా మంత్రి డి. శ్రీధర్బాబు మాట్లాడుతూ - తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలపై, వారి ఆలోచనలపై పెట్టుబడి పెట్టే దిశగా ఈ భాగస్వామ్యం ముందడుగు వేస్తోంది. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ స్థాపన దిశగా సాగుతున్న సమయంలో, ఇలాంటి ఒప్పందాలు దేశంలోని బయోటెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లగల నైపుణ్యం గల యువతను తయారు చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.RMIT డిప్యూటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ఇట్సియోపోలస్ (Itsiopoulos) మాట్లాడుతూ - తెలంగాణతో కలిసి తదుపరి తరానికి చెందిన పరిశోధకులు, ఆవిష్కర్తలను తీర్చిదిద్దడం మాకు గర్వకారణం. ఇండస్ట్రీ ఆధారిత విద్య, సంయుక్త పరిశోధనతో మేము ప్రభావవంతమైన మార్పు తీసుకురావాలని తెలంగాణతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది” అని చెప్పారు.తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రేపటి జీనోమ్ వ్యాలీకి రూపకల్పన వంటిది. RMIT అందించే ప్రామాణిక విద్యను, హైదరాబాద్లో ఉన్న అత్యుత్తమ బయోటెక్ వేదికలతో మిళితం చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించటమే కాదు… మన పరిశోధన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ, భారత్ను ప్రపంచ ఫార్మా ఆవిష్కరణల కేంద్రంగా తయారు చేయడానికి ప్రయత్నిస్త్తున్నారు. -
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా డీల్
స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలు రక్షణ, అంతరిక్ష రంగంలో కీలక ఉపకరణాల దాకా అన్నింటి తయారీకి అత్యావశ్యకమైన ఖనిజాల సరఫరాపై చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. విదేశాలకు తమ అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయాలంటే కఠిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చైనా మొండికేయడం తెల్సిందే.దీంతో చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, ఆస్ట్రేలియా రూ.75,000 కోట్ల విలువైన చరిత్రాత్మకమైన ‘అరుదైన ఖనిజాల ఒప్పందం’కుదుర్చుకున్నాయి. అధ్యక్షభవనంలో డొనాల్డ్ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.‘‘గత కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఎట్టకేలకు నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో ఏడాదిలోగా మా రెండు దేశా లు భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిల్వలను సాధించనున్నాయి. ఈ నిల్వలతో మేమేం చేస్తామో మీకు కూడా తెలీదు’’అని వ్యాఖ్యానించారు.తొలి ఆరు నెలల్లో ఇరు దేశాలు చెరో 3 బిలియన్ డాలర్ల మేర ఖనిజాల తవ్వకాల ప్రాజెక్ట్ల్లో పెట్టుబడులు పెడతాయి. ఉపగ్రహాలు, ఎంఆర్ఐ యంత్రాలు, గైడెన్స్ వ్యవస్థలు, లేజర్లు, జెట్ ఇంజిన్లదాకా అన్నింటి తయారీలోనూ అరుదైన భూ మూలకాలనే ఉపయోగిస్తారు. -
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) టేబుల్ టాపర్గా కొనసాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ అయిన అలైస్సా హీలీ (Alyssa Healy) గాయం (కాలు వెనుక భాగంలో) కారణంగా ఇంగ్లండ్తో రేపు (అక్టోబర్ 23) జరుగబోయే మ్యాచ్కు దూరమైంది.ప్రస్తుత ప్రపంచకప్లో హీలీ అరివీర భయంకరమైన ఫామ్లో ఉంది. భారత్, బంగ్లాదేశ్పై వరుసగా రెండు మ్యాచ్ల్లో విధ్వంసకర శతకాలు బాదింది. బంగ్లాదేశ్తో మ్యాచ్ ముగిశాక ప్రాక్టీస్ సమయంలో హీలీ గాయపడినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్తో మ్యాచ్లో హీలీ స్థానంలో బెత్ మూనీ వికెట్ కీపింగ్ చేస్తుందని ఆసీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఓపెనర్గా హీలీ స్థానాన్ని 22 ఏళ్ల జార్జియా వాల్ భర్తీ చేస్తుందని వెల్లడించింది.ఆసీస్ శిబిరంలో కలవరంహీలీ గాయం నేపథ్యంలో ఆసీస్ శిబిరం కలవరపడుతుంది. ఆమె గాయం తీవ్రతపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతుంది. ఆసీస్ ఇదివరకే సెమీస్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఒకవేళ హీలీ సెమీస్ మ్యాచ్కు కూడా దూరమైతే ఆసీస్ విజయావకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్తో తర్వాత ఆసీస్ లీగ్ దశలో మరో మ్యాచ్ (సౌతాఫ్రికా) ఆడుతుంది. ఆ మ్యాచ్ అక్టోబర్ 25న జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్లు అక్టోబర్ 29, 30 తేదీల్లో జరుగనున్నాయి. ఆ సమయానికి హీలీ కోలుకుంటుందని ఆసీస్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. తొలి ప్లేయర్గా రికార్డు -
కాంతార చాప్టర్-1 మరో రికార్డ్.. ఆ దేశంలోనూ ఘనత!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతంలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. దీపావళి కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు తిరగరాసింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలను అధిగమించింది.తాజాగా మరో రికార్డ్ను కాంతార చాప్టర్-1 తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా ఘనత దక్కించుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా కేరళలోనూ రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.తెలుగులో రాష్ట్రాల్లోనూ రికార్డు..కాంతార చాప్టర్-1 తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు వారాల్లోనే రూ.105 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. అలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది. శాండల్వుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.The divine roar echoes across oceans! 🌊#KantaraChapter1 emerges as 2025’s Highest-Grossing Indian Film in Australia 🇦🇺❤️🔥#BlockbusterKantara running successfully in cinemas near you ✨#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara @hombalefilms… pic.twitter.com/658jFJTaQz— Hombale Films (@hombalefilms) October 20, 2025 -
బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా (Team India) ఓటమితో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో (India vs Australia) 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.వరుణుడి ఆటంకాలు.. 26 ఓవర్ల మ్యాచ్పలు అంతరాయాల తర్వాత మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆదుకున్న రాహుల్, అక్షర్.. నితీశ్ మెరుపులువికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.దారుణంగా విఫలమైన రోహిత్, కోహ్లినాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. సత్తా చాటిన ఆసీస్ బౌలర్లుఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.సునాయాసంగా ఛేదించిన ఆసీస్26 ఓవర్లలో భారత్ 136 పరుగులు చేసినప్పటికీ.. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు.ఈ సిరీస్లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే మ్యాచ్
-
భారత్కు రజత పతకం
జొహోర్ బారు (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రజత పతకం దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని మూడు సార్లు చాంపియన్ టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. చివరి నిమిషంలో ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు... పెనాల్టీ కార్నర్ అవకాశాలను వృథా చేసుకొని పరాజయం వైపు నిలిచింది. భారత్ తరఫున అన్మోల్ ఎక్కా (17వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా... ఆస్ట్రేలియా తరఫున ఇయాన్ గ్రాబెలార్ (13వ, 59వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో మెరిశాడు.తొలి క్వార్టర్లో ఆ్రస్టేలియా గోల్ చేసి ఆధిక్యం సాధించగా... రెండో క్వార్టర్లో అన్మోల్ గోల్తో భారత్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. అయితే మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా... వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని ఆ్రస్టేలియా సద్వినియోగం చేసుకొని ఆధిక్యం రెట్టింపు చేసుకుంది. గత మూడు ఫైనల్స్లో ఓడిన ఆ్రస్టేలియాకు ఇది నాలుగో ట్రోఫీ. భారత జట్టుకు చివరి నిమిషంలో ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కగా... వాటిలో ఒక్కదాన్ని కూడా గోల్గా మలచలేకపోయింది. ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాగ్నస్ మెక్కాస్లాండ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. గత రెండు పర్యాయాలు కాంస్య పతకాలు సాధించిన భారత జట్టు... ఈసారి రజతం గెలుచుకుంది. -
భారత్ x ఆస్ట్రేలియా
ఆసియా కప్ టి20ల్లో అజేయంగా ట్రోఫీ గెలుపు, అంతకు ముందు ఇంగ్లండ్తో టెస్టుల్లో అద్భుత ప్రదర్శన...ఇప్పుడు కొంత విరామానంతరం భారత జట్టు మూడో ఫార్మాట్లో పెద్ద టీమ్తో సమరానికి సిద్ధమైంది. ఈ సారి ఎదురుగా ఉంది వన్డే ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా. ఆసీస్ గడ్డపైనే జరిగే ఈ మూడు వన్డేల పోరులో పైచేయి సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కొత్త కెప్టెన్ గిల్ నేతృత్వంలో ఈ సమరానికి భారత్ సిద్ధం కాగా... ఈ ఫార్మాట్లో ఆల్టైమ్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఇద్దరైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల ఆటపైనే అందరి దృష్టీ నిలిచింది. మరో వైపు పలువురు కీలక ఆటగాళ్లు దూరమైనా...ఆసీస్ తమ స్వదేశంలో పటిష్టమైన బలగంతోనే బరిలోకి దిగుతోంది. పెర్త్: చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన దాదాపు ఏడు నెలల తర్వాత భారత జట్టు వన్డేల్లో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మధ్య నేడు (ఆదివారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లు చివరిసారిగా తలపడిన వన్డేలో (చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్) భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియాకు సంబంధించి కెప్టెన్ గా శుబ్మన్ గిల్ రావడం ప్రధాన మార్పు కాగా...గాయంతో ప్యాట్ కమిన్స్ తప్పుకోవడంతో మిచెల్ మార్ష్ ఆసీస్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఆటగాళ్లంతా ఫామ్లో... చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ 2027 వరల్డ్ కప్ జట్టు విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా...దానికి చాలా సమయం ఉందని కోచ్ గంభీర్ చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఏమిటో సగటు క్రికెట్ అభిమానులందరికీ తెలుసు. ఈ సిరీస్ గెలిచినా గెలవకపోయినా స్టార్ బ్యాటర్లు కోహ్లి, రోహిత్ ఎలా ఆడతారనేదే అన్నింటికంటే ముఖ్యం. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంతకంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నా...ఇలాంటి అనుభవం పూర్తిగా భిన్నం. వీరిద్దరు పరస్పర కెప్టెన్సీలో కాకుండా మరో సారథి (ధోని) నాయకత్వంలో ఆడి తొమ్మిదేళ్లయింది. ఇప్పుడు ఎంతో జూనియర్ అయిన గిల్ కెప్టెన్సీలో ఆడటంతో పాటు కచ్చితంగా రాణించాల్సిన స్థితిలో వీరిద్దరు ఉన్నారు. ఆట, అనుభవం విషయంలో కొత్తగా చెప్పాల్సింది లేకపోయినా, ఇక్కడా బాగా ఆడాలని అంతా కోరుకుంటున్నారు. ఇతర బ్యాటర్లలో గిల్, శ్రేయస్, రాహుల్ కీలకం కానున్నారు. వన్డే టీమ్లోనూ జట్టులో పలువురు ఆల్రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అక్షర్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లతో పాటు ఆంధ్ర ఆటగాడు నితీశ్ రెడ్డి బరిలోకి దిగడం కూడా ఖాయం. రెగ్యులర్ స్పిన్నర్గా కుల్దీప్ ఆడతాడు. బుమ్రా వన్డే సిరీస్కు లేకపోవడంతో ప్రధాన పేసర్గా సిరాజ్ బాధ్యతలు తీసుకోనుండగా, ఆసీస్ పరిస్థితులను బట్టి చూస్తే రెండో పేసర్గా ప్రసిధ్ లేదా అర్ష్ దీప్ లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. మొత్తంగా జట్టు అన్ని విధాలా పటిష్టంగా కనిపిస్తోంది. కొత్త ఆటగాళ్లతో... వేర్వేరు కారణాలతో పలువురు ఆస్ట్రేలియా రెగ్యులర్ వన్డే ఆటగాళ్లు ఈ మ్యాచ్కు దూరమయ్యారు. వారి స్థానాల్లో యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెన్షా, ఒవెన్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. ఆసీస్ టాప్ పేసర్లు స్టార్క్, హాజల్వుడ్తో పాటు కమిన్స్ గైర్హాజరు ఎలిస్కు అవకాశం ఇస్తోంది. ఫామ్లో ఉన్న ఓపెనర్లు హెడ్, మార్ష్తమ దూకుడైన బ్యాటింగ్తో మ్యాచ్ను ప్రభావితం చేయగలరు. మిగతా ప్రధాన బ్యాటర్లకు పెద్దగా అనుభవం లేకపోయినా సొంతగడ్డ అనుకూలత వారికి బలం కానుంది.పిచ్, వాతావరణం ఆప్టస్ స్టేడియం బ్యాటింగ్కు పెద్దగా అనుకూలించే మైదానం కాదు. బౌలర్లే ప్రభావం చూపిస్తారు. గత ఆరేళ్లలో మూడు వన్డేలే జరగ్గా, అన్నింటిలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. ఆసీస్ ఇక్కడ ఆడిన మూడూ ఓడింది. మ్యాచ్కు స్వల్ప వర్ష సూచన ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్, రాహుల్, నితీశ్, సుందర్, కుల్దీప్, సిరాజ్,ప్రసిధ్/ అర్ష్ దీప్. ఆ్రస్టేలియా: మార్ష్(కెప్టెన్), హెడ్, షార్ట్, రెన్షా, ఫిలిప్, ఒవెన్, కనోలీ, స్టార్క్, ఎలిస్, కునెమన్,హాజల్వుడ్. -
‘రాబోయే కాలమంతా భారత్ది.. ఆ దేశ ప్రధానిది.. అటు తర్వాతే ఎవరైనా’
న్యూఢిల్లీ: రాబోయే కాలమంతా భారత్దే అంటున్నారు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్. ఈ 21 శతాబ్దం అనేది కచ్చితంగా భారత్దేనని అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కనీసం నాలుగు నుంచి ఐదు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందన్నారు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్-2025లో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన టోనీ అబాట్.. మాట్లాడుతూ.. భారత్పై, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. స్వేచ్ఛా ప్రపంచం అనే మాటకు భారత్ను సరైన నిర్వవచనంగా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు నుంచి స్వేచ్ఛా ప్రపంచ నాయకుడు అనే బాధ్యతను భారత ప్రధాని తీసుకోవచ్చని అబోట్ అభిప్రాయపడ్డారు. ఈ 21వ శతాబ్దంలో చైనా ఎలాగైతే ఎదిగిందో అలాగే భారత్ కూడా ఎదుగుతుందన్నారు. కనీసం 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పాటు ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందన్నారు. భారత్ సూపర్పవర్గా ఆవిష్కృతం కావడానికి ఎంతో సమయం పట్టదన్నారు. ప్రపంచంలో భారత్ సరికొత్త సూపర్పవర్ కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు బలమైన ప్రత్యర్థిగా, తమకు నమ్మకమైన భాగస్వామిగా భారత్ కీలక పాత్ర పోషించాలన్నారు. చైనాను ఆర్థికంగా, సైనిక పరంగా అధిగమించే క్రమంలో బారత్ మూడు అతిపెద్ద ప్రయోజాలను కల్గి ఉందన్నారు. అది భారతదేశంలో ప్రజాస్వామ్యం, చట్ట పాలన, ఇంగ్లిష్ అనే ఈ మూడు అంశాలు భారత్ వేగంగా ఎదగడానికి, చైనాను దాటిపోవడానికి కీలకం కాబోతున్నాయన్నారు.ఇదీ చదవండి:‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’ -
జోరుగా టీమిండియా సాధన
పెర్త్: దాదాపు ఏడాది క్రితం పెర్త్లోని ఆప్టస్ మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి అజేయ సెంచరీ సాధించాడు. అదే అతని టెస్టు కెరీర్లో చివరి సెంచరీ అయింది. ఇప్పుడు మళ్లీ అదే మైదానానికి వచ్చిన కోహ్లి కొత్త ఉత్సాహంతో కనిపించాడు. ఆసీస్తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధతలో భాగంగా అతను గురువారం సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ తర్వాత మొదటిసారి బరిలోకి దిగుతున్న కోహ్లి సాధనలో బాగా చురుగ్గా పాల్గొన్నాడు. ముందుగా 20 నిమిషాల పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన అతను ఆ తర్వాత 40 నిమిషాలు బ్యాటింగ్పై దృష్టి పెట్టాడు. హర్షిత్ రాణా, అర్‡్షదీప్ సింగ్లతో పాటు స్థానిక ఆటగాళ్లు బౌలింగ్ చేయగా... ఎలాంటి తడబాటు లేకుండా చక్కటి షాట్లు ఆడాడు. అతని పక్క నెట్స్లోనే మరో స్టార్ రోహిత్ శర్మ కూడా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఆరంభంలోనే కొద్దిసేపు రోహిత్ తన ఫుట్వర్క్, టైమింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే కుదురుకున్న తర్వాత అతనూ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. సెషన్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో రోహిత్ చాలాసేపు చర్చించడం కనిపించింది. గతంతో పోలిస్తే ఈసారి కోహ్లి, రోహిత్ల వ్యవహార శైలి చాలా ఆసక్తికరంగా కనిపించింది. నెట్స్ వద్దకు అనుమతించిన అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వీరిద్దరు ఆటోగ్రాఫ్లు ఇస్తూ, సెల్ఫీలు దిగుతూ సమయం గడపడం విశేషం. ఈ ఇద్దరితో పాటు కేఎల్ రాహుల్ కూడా కొద్దిసేపు ప్రాక్టీస్ చేశాడు. గురువారం ఆప్షనల్ ప్రాక్టీస్ డే కాగా... భారత్ నుంచి రెండో బృందంలో వచ్చిన సిరాజ్, కుల్దీప్, అక్షర్ తదితరులు సాధనకు దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయి జట్టుకు నేడు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంతకుముందు ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, జాయ్ రిచర్డ్సన్ కూడా నెట్స్లో సాధన చేశారు. -
సెమీఫైనల్లో ఆస్ట్రేలియా
సాక్షి, విశాఖపట్నం: నాలుగు రోజుల క్రితం భారత్తో జరిగిన మ్యాచ్లో అద్భుత సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ ఇదే మైదానంలో మరో శతకంతో అదరగొట్టింది. ఆసీస్ బౌలర్ల ప్రదర్శనతో తోడు హీలీ, ఫోబీ లిచ్ఫీల్డ్ మెరుపు భాగస్వామ్యం డిఫెండింగ్ చాంపియన్కు ఘన విజయంతోపాటు సెమీఫైనల్ బెర్త్ను కూడా అందించింది. వన్డే వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆ్రస్టేలియా 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. శోభన మొస్తరి (80 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, రుబియా హైదర్ (59 బంతుల్లో 44; 8 ఫోర్లు) రాణించింది. ఆసీస్ ఆటగాళ్లు నాలుగు క్యాచ్లు వదిలిపెట్టడంతో బంగ్లా ఈమాత్రం స్కోరు చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (2/18) ప్రత్యర్థిని కట్టడి చేయగా... వేర్హామ్, అనాబెల్ సదర్లాండ్, యాష్లే గార్డ్నర్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 24.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 202 పరుగులు సాధించి గెలిచింది. అలీసా హీలీ (77 బంతుల్లో 113 నాటౌట్; 20 ఫోర్లు) కెరీర్లో ఏడో సెంచరీ సాధించగా... లిచ్ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచింది. బంగ్లాదేశ్ ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. తాజా విజయంతో 5 మ్యాచ్ల తర్వాత 9 పాయింట్లతో ఆసీస్ తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకొని సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్కు ఇది నాలుగో పరాజయం. నేడు కొలంబోలో జరిగే మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది. -
వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్ కెప్టెన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) అరివీర భయంకరమైన ఫామ్లో ఉంది. ఈ టోర్నీలో ఆమె వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదింది.కొద్ది రోజుల కిందట విశాఖ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేసిన హీలీ.. ఇవాళ (అక్టోబర్ 16) అదే విశాఖ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మరింత రెచ్చిపోయి 77 బంతుల్లో 20 ఫోర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేసింది.రెండు మ్యాచ్ల్లో హీలీ లక్ష్య ఛేదనల్లోనే సెంచరీలు సాధించడం విశేషం. భారత్తో మ్యాచ్లో 331 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టగా.. తాజాగా బంగ్లాదేశ్పై 199 పరుగుల స్వల్ప ఛేదనలో సెంచరీ చేసింది.నేటి మ్యాచ్లో హీలీ ఒంటిచేత్తో తన జట్టును గెలుపుతీరాలు దాటించింది. ఆమెకు మరో ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) సహకరించింది. వీరిద్దరి ధాటికి ఆసీస్ సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే (24.5 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీస్కు కూడా అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్.. న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్పై విజయాలు సాధించింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్కు ఓ వికెట్ దక్కింది.చదవండి: చివరి బెర్త్ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లు ఇవే..! -
తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 16) ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ (Australia vs Bangladesh) జరుగుతుంది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆసీస్ బౌలర్ల అనుభవం ముందు బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రం కాస్త ప్రతిఘటించారు. మిగతా 9 మందిలో షర్మిన్ అక్తర్ (19), కెప్టెన్ నిగార్ సుల్తానా (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫర్జానా హాక్ (8), షోర్నా అక్తర్ (7), రితూ మోనీ (2), ఫహీమా ఖాతూన్ (4), రబేయా ఖాన్ (6), నిషిత అక్తర్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్కు ఓ వికెట్ దక్కింది.ప్రస్తుత ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ ఒకటి, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్ -
ఎలా ఉన్నావు హీరో!
న్యూఢిల్లీ: దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుతో చేరారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగలేదు. టెస్టు లేదా టి20 జట్టు సభ్యులుగా ఉన్న ఇతర ప్లేయర్లు కలిసి ఆడుతూ బిజీగా ఉండగా వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లి మాత్రం టీమ్కు దూరంగా ఉన్నారు. వన్డే, టి20ల సిరీస్ల కోసం బుధవారం భారత జట్టు రెండు బృందాలుగా ఆ్రస్టేలియాకు బయల్దేరి వెళ్లింది. మొదటి బృందంలో రోహిత్, కోహ్లి, శ్రేయస్, కెపె్టన్ శుబ్మన్ గిల్ తదితరులు ఉన్నారు. ఎలా ఉన్నావు హీరో?ఈ సందర్భంగా రోహిత్, గిల్ భేటీ ఆసక్తిని సంతరించుకుంది. తన స్థానంలోనే గిల్ను సెలక్టర్లు వన్డే కెప్టెన్ గా నియమించగా... గిల్ నాయకత్వంలో రోహిత్ తొలిసారి ఆడనున్నాడు. టూర్కు వెళ్లేందుకు ఆటగాళ్లంతా ఒకే చోటికి చేరే క్రమంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రోహిత్ను చూసిన గిల్ దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే రోహిత్ కూడా ‘ఎలా ఉన్నావు హీరో’ అంటూ ఆత్మీయంగా పలకరించాడు. టీమ్ బస్సులోకి వెళ్లాక మొదటి సీటులోనే కూర్చున్న కోహ్లికి కూడా గిల్ అభివాదం చేయగా... దానికి బదులిచ్చిన కోహ్లి కెపె్టన్ భుజం తట్టి అభినందించాడు. జట్టు సహచరుల్లో కనిపించిన చిరునవ్వులు అందరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించాయి. ఆసీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, 5 టి20లు ఆడుతుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. 𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝘿𝙤𝙬𝙣 𝙐𝙣𝙙𝙚𝙧 ✈️Of familiar faces and special reunions as #TeamIndia depart for the Australia challenge 😍#AUSvIND pic.twitter.com/ElV3OtV3Lj— BCCI (@BCCI) October 15, 2025 -
‘ప్రపంచకప్ టోర్నీకి చాలా సమయం ఉంది’
న్యూఢిల్లీ: భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 19 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సిరీస్ ఫలితంకంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ సిరీస్తోనే బరిలోకి దిగుతున్న వీరిద్దరు ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయి ఒక్క వన్డేలే ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈనేపథ్యంలో తాజా చర్చపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇప్పటికిప్పుడు వారిద్దరి భవిష్యత్తుపై తానేమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. ‘వన్డే వరల్డ్కప్కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కాబట్టి భవిష్యత్తుకంటే ప్రస్తుతంపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని నేను భావిస్తా. వారిద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు అనడంలో సందేహం లేదు. పునరాగమనం చేస్తున్న వారి అనుభవం ఆ్రస్టేలియాలో పనికొస్తుంది. వీరిద్దరు బాగా ఆడి సిరీస్ విజయంలో భాగమవుతారని ఆశిస్తున్నా’ అని గంభీర్ చెప్పాడు. గిల్కు కెప్టెన్సీ అర్హత ఉంది... భారత టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డేలకు కూడా సారథ్యం వహించే సత్తా, అర్హత శుబ్మన్ గిల్కు ఉన్నాయని, ఈ హక్కును అతను సాధించుకున్నాడని గంభీర్ ప్రశంసించాడు. ‘కెప్టెన్గా గిల్ను నియమించి ఎవరూ ఔదార్యం చూపించలేదు. అతడికి ఆ అర్హత ఉంది. కోచ్గా కూడా నేను ఈ మాట చెప్పగలను. ప్రపంచ క్రికెట్లో అతి కఠినమైన పర్యటనల్లో ఇంగ్లండ్ ఒకటి. అలాంటి చోట ఐదు టెస్టులూ గట్టిగా నిలబడి సిరీస్ను సమం చేసుకోగలగడం చిన్న విషయం కాదు. బ్యాటింగ్లోనూ అదరగొట్టడంతో పాటు జట్టును సమర్థంగా నడిపి వన్డేల్లోనూ సారథి కాగల హక్కును అతను సాధించాడు’ అని గంభీర్ అన్నాడు. 2027 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ గురించి ఇప్పుడే మాట్లాడటం అనవసరమని, వరుసగా విజయాలు సాధించడమే తమ లక్ష్యమని అతను స్పష్టం చేశాడు. భారత జట్టు నవంబర్ 9న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడనుండగా... నవంబర్ 14 నుంచి కోల్కతాలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరుగుతుంది. అయితే ప్రొఫెషనల్ క్రికెటర్లు తక్కువ సమయంలో పరిస్థితులకు తగినట్లుగా మార్చుకోగలరని విశ్వాసం వ్యక్తం చేసిన గంభీర్... టెస్టు టీమ్లో మాత్రమే సభ్యులైన ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాలని సూచించాడు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ గెలవడం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే భారత్లో కూడా పేస్ బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే విధంగా బౌన్సీ పిచ్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. హర్షిత్ రాణాపై అనవసర విమర్శలు... భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ వరుసగా అవకాశాలు పొందుతున్న పేస్ బౌలర్ హర్షిత్ రాణాపై ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిభావంతుడు కాకపోయినా... ఢిల్లీకి చెందినవాడు కావడంతో పాటు గంభీర్ ఐపీఎల్ టీమ్ కేకేఆర్కు మెంటార్గా ఉన్న సమయంలో సాన్నిహిత్యం వల్లే రాణాకు జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇటీవల ఇదే మాట అన్నాడు. తాజా విమర్శలపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఈ వివాదంలో హర్షిత్కు అతను పూర్తి మద్దతు పలికాడు. ‘యూట్యూబ్లో వ్యూస్ కోసం కొందరు ఒక 23 ఏళ్ల యువ ఆటగాడిని లక్ష్యంగా చేసుకున్నందుకు సిగ్గుపడాలి. రాణా తండ్రి మాజీ క్రికెటర్ కాదు. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కానీ ఎన్ఆర్ఐ కానీ కాదు. అతను తన ప్రతిభను నమ్ముకొనే క్రికెట్ ఆడుతున్నాడు. ఒక ఆటగాడి ప్రదర్శన బాగా లేకుండా విమర్శించవచ్చు కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తారా. కావాలంటే నన్ను విమర్శించండి. నేను దానిని భరించగలను. కానీ 23 ఏళ్ల ఆటగాడిపై ఇది మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా. భారత క్రికెట్ జట్టు ఎవరిదో సొంత ఆస్తి కాదు. మన జట్టు గెలవాలని భావించే అందరిది ఈ జట్టు అని మర్చిపోవద్దు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
330 సరిపోలేదు.. భారత్పై ఆసీస్ గ్రాండ్ విక్టరీ
స్టార్ బ్యాటర్ స్మృతి ఫామ్లోకి వచ్చింది. ప్రతీక, జెమీమా కూడా రాణించారు. 330 పరుగుల భారీ స్కోరు నమోదైంది. పిచ్ బ్యాటింగ్కు కాస్త అనుకూలంగానే ఉన్నా... ఈ భారీ స్కోరును కాపాడుకోవచ్చని భారత మహిళలు భావించారు. కానీ అటువైపు ఉన్నది ఆస్ట్రేలియా... కెప్టెన్ అలీసా హీలీ నేతృత్వంలో డిఫెండింగ్ చాంపియన్ జట్టు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. చివర్లో కొన్ని అవకాశాలు సృష్టించుకొని భారత్ పట్టు బిగించినట్లు కనిపించినా... ప్రత్యర్థి విజయాన్ని ఆపడానికి అవి సరిపోలేదు. దాంతో గత మ్యాచ్ తరహాలోనే గెలుపునకు చేరువైనట్లు కనిపించినా... మరో ఓటమితో టీమిండియాకు నిరాశ తప్పలేదు. సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: సొంతగడ్డపై మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్కు మరో నిరాశజనక ఫలితం ఎదురైంది. ఆదివారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో హోరాహోరీగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. అన్ని వరల్డ్కప్లలో కలిపి భారత్కు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు స్మృతి మంధాన (66 బంతుల్లో 80; 9 ఫోర్లు, 3 సిక్స్లు), ప్రతీక రావల్ (96 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు తొలి వికెట్కు 24.3 ఓవర్లలో 155 పరుగులు జోడించారు. ఆ్రస్టేలియా బౌలర్ అనాబెల్ సదర్లాండ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం ఆ్రస్టేలియా 49 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు సాధించి గెలిచింది. మహిళల వన్డేల చరిత్రలో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (107 బంతుల్లో 142; 21 ఫోర్లు, 3 సిక్స్లు) అద్భుత సెంచరీతో చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. భారత్ తమ తర్వాతి పోరులో ఈ నెల 19న ఇంగ్లండ్తో ఇండోర్లో తలపడుతుంది. నేడు విశాఖపట్నంలో జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. భారత ఓపెనర్లు ప్రతీక, స్మృతి ఇన్నింగ్స్ను జాగ్రత్తగా మొదలు పెట్టారు. ఫలితంగా తొలి 7 ఓవర్లలో 26 పరుగులే వచ్చాయి. పవర్ప్లే తర్వాత 11–15 ఓవర్లలో భారత్ 15 పరుగులే చేసింది. ఓపెనర్లు ధాటిని పెంచడంతో 21–24 మధ్య 4 ఓవర్లలోనే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46 పరుగులు రావడం విశేషం. ఎట్టకేలకు స్మృతిని అవుట్ చేసి మోలినే ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకోగా, 30 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 192/1కు చేరింది. అయితే తర్వాతి బంతికే ప్రతీక వెనుదిరగ్గా, హర్మన్ప్రీత్ (22; 3 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగింది. అయితే జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు), రిచా ఘోష్ (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు ప్రదర్శిస్తూ స్కోరును 300 దాటించారు.వీరిద్దరు ఐదో వికెట్కు 34 బంతుల్లో 54 పరుగులు జత చేశారు. అయితే ఆఖర్లో భారీ షాట్లకు యత్నించి భారత బ్యాటర్లు వరుసగా వెనుదిరిగారు. 36 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ మరో 7 బంతుల ముందే ముగిసింది. ఓపెనర్ల దూకుడు... భారీ ఛేదనలో ఆసీస్కు ఓపెనర్లు హీలీ, లిచ్ఫీల్డ్ ఘనమైన ఆరంభం అందించారు. క్రాంతి ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్తో హీలీ దూకుడు కనబర్చగా, అమన్జోత్ ఓవర్లో లిచ్ఫీల్డ్ 4 ఫోర్లు బాదింది. తొలి వికెట్కు వీరిద్దరు 68 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. అయితే లిచ్ఫీల్డ్తో పాటు తక్కువ వ్యవధిలో బెత్ మూనీ (4), అనాబెల్ సదర్లాండ్ (0) అవుటయ్యారు. కానీ మరోవైపు హీలీ ఎక్కడా తగ్గకుండా ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ను నడిపించింది. ఈ క్రమంలోనే 84 బంతుల్లో ఆమె శతకం పూర్తి చేసుకుంది. ఆసీస్ విజయానికి చేరువవుతున్న దశలో ఒక్కసారిగా భారత బౌలర్లు పైచేయి సాధించారు. ఫలితంగా 38 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే ఒత్తిడిని అధిగమించి ఆసీస్ ఒక ఓవర్ ముందే గెలిచింది.112 స్మృతి 5 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు పట్టిన ఇన్నింగ్స్ల సంఖ్య. మహిళల వన్డేల్లో అందరికంటే వేగంగా ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే ఇన్నింగ్స్లో ఒకే ఏడాది 1000 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా కూడా స్మృతి గుర్తింపు పొందింది.331 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. శ్రీలంక జట్టు (302 దక్షిణాఫ్రికాపై 2024లో) పేరిట ఉన్న రికార్డును ఆస్ట్రేలియా అధిగమించింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) పెరీ (బి) సదర్లాండ్ 75; స్మృతి (సి) లిచ్ఫీల్డ్ (బి) మోలినే 80; హర్లీన్ (సి) సదర్లాండ్ (బి) మోలినే 38; హర్మన్ప్రీత్ (సి) మోలినే (బి) షుట్ 22; జెమీమా (సి) మూనీ (బి) సదర్లాండ్ 33; రిచా (సి) (సబ్) వేర్హమ్ (బి) సదర్లాండ్ 32; అమన్జోత్ (సి) మోలినే (బి) గార్డ్నర్ 16; దీప్తి (సి) మూనీ (బి) మోలినే 1; స్నేహ్ (నాటౌట్) 8; క్రాంతి (సి) (సబ్) వేర్హమ్ (బి) సదర్లాండ్ 1; శ్రీచరణి (బి) సదర్లాండ్ 0; ఎక్స్ట్రాలు 24; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 330. వికెట్ల పతనం: 1–155, 2–192, 3–234, 4–240, 5–294, 6–309, 7–320, 8–327, 9–330, 10–330. బౌలింగ్: గార్త్ 5–0–35–0, షుట్ 6.1–0–37–1, యాష్లే గార్డ్నర్ 7–0–40–1, మోలినే 10–1–75–3, సదర్లాండ్ 9.5–0–40–5, తాలియా మెక్గ్రాత్ 4.5–0–43–0, అలానా కింగ్ 6–0–49–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) స్నేహ్ (బి) శ్రీచరణి 142; లిచ్ఫీల్డ్ (సి) స్నేహ్ (బి) శ్రీచరణి 40; ఎలీస్ పెరీ (నాటౌట్) 47; మూనీ (సి) రోడ్రిగ్స్ (బి) దీప్తి 4; సదర్లాండ్ (బి) శ్రీచరణి 0; యాష్లే గార్డ్నర్ (బి) అమన్జోత్ 45; తాలియా మెక్గ్రాత్ (ఎల్బీ) (బి) దీప్తి 12; మోలినే (ఎల్బీ) (బి) అమన్జోత్ 18; కిమ్ గార్త్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో 7 వికెట్లకు) 331. వికెట్ల పతనం: 1–85, 2–168, 3–170, 4–265, 5–279, 6–299, 7–303. బౌలింగ్: అమన్జోత్ 9–0–68–2, క్రాంతి 9–1–73–0, స్నేహ్ రాణా 10–0–85–0, శ్రీచరణి 10–1–41–3, దీప్తి 10–0–52–2, హర్మన్ప్రీత్ 1–0–10–0. -
CWC 2025: ఆస్ట్రేలియాతో సమరం.. టీమిండియా బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 12) ఆసక్తికర సమరం జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు వైజాగ్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత మహిళల జట్టు (Team India) వన్డేల్లో టాస్ కోల్పోవడం ఇది వరుసగా ఆరోసారి. తుది జట్లు..ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్/వికెట్కీపర్), ఫోబ్ లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణికాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్లోనూ భారత్కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్లో ఆసీస్ పాక్పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
భారత్కు కాస్త 'కంగారు'
మహిళల క్రికెట్లో భారత జట్టు స్థాయిని చూపించే మ్యాచ్కు నేడు విశాఖ వేదిక అవుతోంది. దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమి తర్వాత అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు భారత్ సై అంటోంది. ఇటీవల ఇదే జట్టుతో జరిగిన వన్డే సిరీస్ను కోల్పోయినా... పోరు హోరాహోరీగా సాగింది. అయితే వరల్డ్ కప్కు ముందు అసాధారణంగా కనిపించిన హర్మన్ సేన మెగా టోర్నీలో ఒక్కసారిగా ఫామ్ కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికే సఫారీల చేతిలో ఓడిన నేపథ్యంలో సెమీస్ రేసులో నిలవాలంటే పెద్ద జట్టుపై గెలుపు తప్పనిసరి. మరో వైపు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్ తమ ఎనిమిదో టైటిల్ వేటలో భారీ విజయాన్ని ఆశిస్తోంది. విశాఖపట్నం, సాక్షి క్రీడా ప్రతినిధి: వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు నేడు కీలక మ్యాచ్కు సన్నద్ధమైంది. వైజాగ్లోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నేడు జరిగే లీగ్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత మహిళల బృందం తలపడుతుంది. రెండు విజయాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవి చూడగా...రెండు మ్యాచ్లు గెలిచిన కంగారూలు శ్రీలంకతో మ్యాచ్ రద్దు కావడంతో కీలకమైన రెండు పాయింట్లు సాధించే అవకాశం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్కు ముందు ఒక స్టాండ్కు మిథాలీ రాజ్ పేరు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ముగ్గురు చెలరేగితేనే...వరల్డ్ కప్లో ఆడిన మూడు మ్యాచ్లలో స్మృతి చేసిన స్కోర్లు 8, 23, 23...హర్మన్ ప్రీత్ వరుసగా 21,19, 9 పరుగులు చేయగా...ఒక మ్యాచ్లో 32 పరుగులు చేసిన జెమీమా మరో రెండు సార్లు డకౌటైంది. మన జట్టులోని ముగ్గురు స్టార్ బ్యాటర్ల స్కోర్లను కలిపి చూస్తే 9 ఇన్నింగ్స్లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు. వరల్డ్ కప్ టైటిల్పై భారీ ఆశలు పెట్టుకున్న భారత జట్టుకు ఈ స్థితి ఆందోళనకరంగా మారింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో పూర్తిగా తడబడ్డ హర్మన్ 9 పరుగుల కోసం 23 బంతులు ఆడగా, స్మృతి తొలి బౌండరీ కొట్టేందుకు 21 బంతులు తీసుకుంది. జెమీమా 3 సార్లూ లెఫ్టార్మ్ స్పిన్నర్ బౌలింగ్లోనే అవుట్ కావడం ఆమె బలహీనతను చూపిస్తోంది. ఈ ముగ్గురితో పాటు ప్రతీక, హర్లీన్ కూడా అంతంతమాత్రం ప్రదర్శనే చేశారు. ప్రతీసారి లోయర్ ఆర్డర్ జట్టును ఆదుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దక్షిణాఫ్రికాతో ఇన్నింగ్స్ రిచాలో ఆత్మవిశ్వాసం పెంచగా... దీప్తి, అమన్జోత్ కూడా కీలకం కానున్నారు. గత మ్యాచ్ చివర్లో డి క్లెర్క్ చెలరేగే వరకు మన బౌలర్లంతా చక్కటి బౌలింగ్ చేశారు. ఐదుగురు రెగ్యులర్ బౌలర్లతో పాటు హర్మన్ కూడా నాలుగు ఓవర్లు వేసింది. అందుకే ప్రత్యా మ్నాయంగా ఆరో బౌలర్ అవసరం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసిన ఆంధ్ర బౌలర్ శ్రీచరణి నిరూపించుకునేందుకు ఇది మరో మంచి అవకాశం.ఒకరిని మించి మరొకరు...ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్ అందుకు ఉదాహరణ. పాక్ బలహీన జట్టే అయినా 76 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా 200పైగా పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో చెలరేగి భారీ విజయం సాధించడం ఆసీస్కే చెల్లింది. కివీస్పై 326 పరుగులు చేసిన ఆ జట్టు...అంతకు ముందు భారత్పై చివరి వన్డేలో ఏకంగా 412 పరుగులు నమోదు చేసిన విషయం మరచిపోవద్దు. టోర్నీలో ఇప్పటికే మూనీ, గార్డ్నర్ శతకాలు నమోదు చేశారు. మిగతా ప్రధాన బ్యాటర్లు ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. హీలీ, పెరీ తమ స్థాయికి తగినట్లుగా చెలరేగితే భారత్కు కష్టాలు తప్పవు. సదర్లాండ్ రూపంలో చక్కటి ఆల్రౌండర్ జట్టులో ఉంది. పిచ్, వాతావరణంగత మ్యాచ్ తరహాలోనే బ్యాటింగ్కు అనుకూలం. మంచి బౌన్స్ కూడా ఉండటంతో షాట్లకు అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. ఆదివారం కూడా కావడంతో స్టేడియం పూర్తి సామర్థ్యం మేరకు నిండే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి, ప్రతీక, హర్లీన్, జెమీమా, దీప్తి, అమన్జోత్, రిచా ఘోష్, స్నేహ్, క్రాంతి, శ్రీచరణి.ఆస్ట్రేలియా: అలీసా హీలీ (కెప్టెన్), లిచ్ఫీల్డ్, ఎలైస్ పెరీ, మూనీ, సదర్లాండ్, గార్డ్నర్, తాహిలా, వేర్హామ్, గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్. -
టీమిండియాకు షాక్ ఇవ్వనున్న మ్యాక్స్వెల్..!
త్వరలో భారత్తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో (తొలి రెండు మ్యాచ్లు) విధ్వంకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు (Glenn Maxwell) చోటు దక్కని విషయం తెలిసిందే. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడటంతో మ్యాక్సీని ఎంపిక చేయలేదు. గాయం తీవ్రతగా అధికంగా ఉండటంతో మ్యాక్స్వెల్ ఈ సిరీస్ మొత్తానికే దూరమవుతాడనే ప్రచారం జరిగింది.మ్యాక్స్వెల్ లాంటి ప్రమాదకర ఆటగాడు లేకపోవడం ఈ సిరీస్లో తమ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని టీమిండియా భావించింది. అయితే తాజాగా మ్యాక్సీ చేసిన ఓ ప్రకటన టీమిండియా ధీమాను దెబ్బతీసేలా కనిపిస్తుంది.చివరి మూడు మ్యాచ్లకు తాను సిద్దమంటూ మ్యాక్సీ సంకేతాలు పంపాడు. ఒకవేళ ఇదే జరిగితే టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి. ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాక్సీ పూర్తిగా పొట్టి ఫార్మాట్పైనే ఫోకస్ పెట్టాడు. భారత్తో సిరీస్లో అతను చెలరేగే అవకాశం ఉంది. చివరి మూడు మ్యాచ్లకు అందుబాటులోకి వస్తే చేయాల్సిన డ్యామేజ్ చేస్తాడు.ఈఎస్పీఎన్ కథనం ప్రకారం.. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న మ్యాక్సీ భారత్తో మూడో వన్డే సమయానికి పూర్తిగా కోలుకుంటాడు. శస్త్ర చికిత్సకు ముందు డాక్టర్లు అతనికి రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి.. సహజంగా కోలుకోవాలంటే భారత్తో సిరీస్ మొత్తానికే దూరం కావాలి. ఒకవేళ పాక్షికంగా అయినా ఆ సిరీస్లో పాల్గొనాలనుకుంటే శస్త్ర చికిత్సకు వెళ్లాలి. దీంట్లో మ్యాక్సీ రెండో ఆప్షన్ను చూస్ చేసుకొని శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. మరికొద్ది రోజుల్లో అతను పూర్తి ఫిట్గా ఉంటాడు. కాగా, న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు ప్రాక్టీస్ సమయంలో మిచెల్ ఓవెన్ కొట్టిన బలమైన షాట్ కారణంగా మ్యాక్స్వెల్ చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతను ఆ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు.ఇకపై అలాంటి వారికి బౌలింగ్ చేయను.. మ్యాక్సీమిచెల్ ఓవెన్ కొట్టిన బలమైన షాట్ కారణంగా తీవ్ర గాయానికి గురైన మ్యాక్స్వెల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై ప్రాక్టీస్ సమయంలో స్టోయినిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్ లాంటి హిట్టర్లకు బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్తో తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపాటీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: విండీస్తో రెండో టెస్ట్కు భారత తుది జట్టు ఇదే.. యువ ఆటగాడికి వార్నింగ్..! -
వరుసగా రెండో మ్యాచ్లో శతక్కొట్టిన ఆసీస్ ప్లేయర్
గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న ఆస్ట్రేలియా (Australia) మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీలు చేశాడు. తొలుత షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో (రెడ్ బాల్) సెంచరీ చేసిన లబూషేన్.. తాజాగా ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే కప్లో శతక్కొట్టాడు. వన్డే కప్లో లబూషేన్ కొద్ది రోజుల కిందట కూడా ఓ సెంచరీ చేశాడు. మొత్తంగా 20 రోజుల వ్యవధిలో లబూషేన్ మూడు సెంచరీలు చేసి, యాషెస్ సిరీస్కు ముందు ఆసీస్ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు.లబూషేన్ను తాజాగా ఆసీస్ వన్డే జట్టు నుంచి తప్పించారు. త్వరలో భారత్తో జరుగబోయే సిరీస్ను ఎంపిక చేయలేదు. లబూషేన్ ఇటీవలికాలంలో వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. మూడు నెలల కిందటే అతన్ని టెస్ట్ జట్టు నుంచి తప్పించారు. లబూషేన్ చివరిగా సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ ఆడాడు. ఆ మ్యాచ్లో ఓపెనర్ ప్రమోషన్ పొందినా, పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గత డబ్ల్యూటీసీ సీజన్ మొత్తం లబూషేన్ ప్రదర్శన ఇలాగే ఉండింది. ఆ సైకిల్లో 20 మ్యాచ్ల్లో ఒకే ఒక సెంచరీ చేశాడు. అందులో కేవలం 27తో పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్ తొలినాళ్లలో ప్రదర్శనలతో పోలిస్తే చాలా తక్కువ. లబూషేన్ కెరీర్ ఆరంభంలో 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు.ఇప్పటివరకు 58 టెస్ట్లు ఆడిన లబూషేన్.. 46.2 సగటున 12 సెంచరీల సాయంతో 4435 పరుగులు చేశాడు.తాజా సెంచరీ విషయానికొస్తే.. వన్డే కప్లో క్వీన్స్లాండ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న లబూషేన్.. ఇవాళ (అక్టోబర్ 9) టస్మానియాతో జరుగుతున్న మ్యాచ్లో 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో లబూషేన్తో పాటు జాక్ క్లేటన్ (64) కూడా రాణించాడు. 44.4 ఓవర్ల తర్వాత క్వీన్స్లాండ్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 307 పరుగులుగా ఉంది. జేవియర్ బార్ట్లెట్ (11), జేమ్స్ బాజ్లీ (1) క్రీజ్లో ఉన్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్ -
దేశం కోసం భారీ డీల్ను వదులుకున్న కమిన్స్, హెడ్..?
క్రికెట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో సంచలన టాపిక్గా మారింది. ఇద్దరు స్టార్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు దేశం కోసం భారీ డీల్ను కాదనుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవాస్తవాలు ఎంత వరకో తెలీదు కానీ, సదరు ఆటగాళ్లను మాత్రం వారి స్వదేశ మీడియా ఆకాశానికెత్తేస్తుంది. మా ఆటగాళ్లకు దేశం కంటే డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదంటూ డబ్బా కొట్టుకుంటుంది. ఇది కదా నిజమైన దేశభక్తి అంటే అంటూ గొప్పలకు పోతుంది.ఆస్ట్రేలియాకు చెందిన ద ఏజ్ (The Age) అనే వార్తా సంస్థ కధనం ప్రకారం.. వారి దేశ స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ (Pat Cummins), ట్రవిస్ హెడ్కు (Travis Head) ఓ ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏడాదికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 58.2 కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. షరతేమిటంటే.. వారిద్దరు ఆస్ట్రేలియా తరఫున ఆడటం మానేసి, ఆ ఫ్రాంచైజీకి చెందిన గ్లోబల్ టీ20 లీగ్ల్లో మాత్రమే ఆడాలి. ఈ ఆఫర్ను కమిన్స్, హెడ్ ఇద్దరూ తిరస్కరించారు. దేశం కంటే తమకు డబ్బు ముఖ్యం కాదని సదరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆసీస్ మీడియా గత కొన్ని రోజులుగా హైలైట్ చేస్తుంది. సోషల్మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. వాస్తవాస్తవాలు తెలియని క్రికెట్ అభిమానులు దేశం పట్ల కమిన్స్, హెడ్కు ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దేశం తరఫున ఆడితే ఏడాదికి 1.5 మిలియన్ డాలర్లకు మించి రావు. అలాంటిది కమిన్స్, హెడ్ ఇంత భారీ ఆఫర్ను ఎలా కాదనుకున్నారని కొందరనుకుంటున్నారు.ఇతర దేశాల ఆటగాళ్లు ఇలా లేరు..!కమిన్స్, హెడ్ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం భారత్ మినహా ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెటర్లంతా లీగ్ క్రికెట్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ జట్ల కెరీర్లను పూర్తి వదులుకొని లీగ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవలే వెస్టిండీస్కు చెందిన నికోలస్ పూరన్, దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ తమ అంతర్జాతీయ కెరీర్లు అర్దంతరంగా వదిలేసి లీగ్ల పంచన చేరారు. వీరే కాక చాలా మంది స్టార్ క్రికెటర్లు లీగ్ల్లో లభించే అధిక డబ్బు కోసం దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని వద్దనుకుంటున్నారు. వాస్తవానికి ఇందులో ఆటగాళ్ల తప్పేమీ లేదు. ఫ్రాంచైజీలు అధిక డబ్బును ఆశగా చూపిస్తూ వారిని బుట్టలో వేసుకుంటున్నాయి.తిరిగి కమిన్స్, హెడ్ విషయానికొస్తే.. ప్రస్తుతం వీరు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీతో ఒప్పందంలో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 2025 సీజన్ వేలానికి ముందు కమిన్స్ను రూ. 18 కోట్లకు, హెడ్ను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో ఈ ఇద్దరు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. కెప్టెన్గా, ఆటగాడిగా కమిన్స్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకుముందు సీజన్లో చెలరేగిపోయిన హెడ్ గత సీజన్లో తస్సుమన్నాడు.చదవండి: వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన -
రెండో ఇన్నింగ్స్లోనూ రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ మ్యాచ్లో భారత యువ బౌలర్లు రెండో ఇన్నింగ్స్లోనూ చెలరేగిపోయారు. హెనిల్ పటేల్ (8-3-23-3), నమన్ పుష్పక్ (7-1-19-3), ఉధవ్ మోహన్ (8-4-17-2), దీపేశ్ దేవేంద్రన్ (6-2-15-1), ఖిలన్ పటేల్ (11.1-2-36-1) ధాటికి ఆసీస్ 116 పరుగులకు చాపచుట్టేసింది. తద్వారా భారత్ ముందు 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.ఆసీస్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన అలెక్స్ లీ యంగ్ టాప్ స్కోరర్ కాగా.. మరో ముగ్గురు (కేసీ బార్టోన్ (19), జేడన్ డ్రేపర్ (15), అలెక్స్ టర్నర్ (10)) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్ డకౌట్లు కాగా.. కెప్టెన్ విల్ మలాజ్చుక్, యశ్ దేశ్ముఖ్ తలో 5, ఛార్లెస్ లచ్మండ్ 9, విల్ బైరోమ్ 8 పరుగులు చేశారు.అంతకుముందు ఆసీస్ బౌలర్లు భారత్ను 171 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్గా నిలువగా.. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా వరుసగా 26, 25, 22, 20, 11 పరుగులు స్కోర్ చేశారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లు సైతం మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 171 పరుగులకే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) ధాటికి 135 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. మళ్లీ కెప్టెన్గా స్టీవ్ స్మిత్..? -
ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. మళ్లీ కెప్టెన్గా స్టీవ్ స్మిత్..?
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26కు (Ashes Series) ముందు ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. గాయం కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. కమిన్స్ జులైలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వెన్ను సంబంధిత గాయానికి గురయ్యాడు. ఈ గాయమే అతన్ని యాషెస్ సిరీస్కు దూరం చేసేలా కనిపిస్తుంది.సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. కమిన్స్ ఇటీవల గాయానికి సంబంధించి స్కానింగ్ చేయించుకున్నాడు. ఇందులో అతని గాయం తీవ్రత తగ్గలేదని తేలింది. దీంతో నవంబర్ 21న పెర్త్లో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ సమయానికి కమిన్స్ అందుబాటులో ఉండలేడు. పరిస్థితి చూస్తుంటే కమిన్స్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యేలా ఉన్నాడన్నది సదరు నివేదిక సారాంశం.వాస్తవానికి కమిన్స్ ఈ సిరీస్ కోసమే గతకొంతకాలంగా క్రికెట్ మొత్తానికే దూరంగా ఉన్నాడు. ఇటీవల ఆసీస్ ఆడిన ఏ ఫార్మాట్లోనూ అతను ఆడలేదు. త్వరలో భారత్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా అతన్ని ఎంపిక చేయలేదు.యాషెస్ సమయానికి పూర్తిగా ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో కమిన్స్ ఈ మధ్యలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. తీరా చూస్తే అతని గాయం పూర్తిగా మానలేదని తెలుస్తుంది.ఒకవేళ కమిన్స్ యాషెస్కు పూర్తిగా దూరమైతే ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకుంది. సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కమిన్స్ స్థానాన్ని స్కాట్ బోలాండ్తో భర్తీ చేయనున్నట్లు సమాచారం. యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకు ప్రకటించారు. నవంబర్ 21-25 వరకు పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. అనంతరం డిసెంబర్ 4న రెండో టెస్ట్ (బ్రిస్బేన్), డిసెంబర్ 17న మూడో టెస్ట్ (అడిలైడ్), డిసెంబర్ 26న నాలుగో టెస్ట్ (మెల్బోర్న్), వచ్చే ఏడాది జనవరి 4న ఐదో టెస్ట్ (సిడ్నీ) మొదలవుతాయి.చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం -
స్టార్క్ పునరాగమనం
మెల్బోర్న్: ఆ్రస్టేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్... టీమిండియాతో జరిగే వన్డే సిరీస్ బరిలో దిగనున్నాడు. ఇటీవల అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్క్... దాదాపు ఏడాది తర్వాత వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. గతేడాది నవంబర్లో పాకిస్తాన్తో చివరిసారి వన్డే ఆడిన స్టార్క్... తిరిగి ఇప్పుడు టీమిండియాతో సిరీస్లో పాల్గొననున్నాడు. యాషెస్ సిరీస్కు ముందు వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్క్ పలు అప్ర«దాన్య మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఈ నెల 19 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభంకానుండగా... దీంతో పాటు టి20 సిరీస్లోని మొదటి రెండు మ్యాచ్ల కోసం మంగళవారం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. గత పది ఇన్నింగ్స్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని లబుషేన్పై వేటు పడగా... అతని స్థానంలో రెన్షాకు తొలిసారి చోటు దక్కింది. 29 ఏళ్ల రెన్షా 14 టెస్టుల్లో ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని కలిసొస్తే భారత్పై రెన్షా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశముంది. మరోవైపు రెగ్యులర్ సారథి ప్యాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో మిచెల్ మార్ష్ సారథిగా కొనసాగనున్నాడు. ఈ నెల 19న జరగనున్న తొలి వన్డేకు పెర్త్ ఆతిథ్యమిస్తుండగా... ఆ తర్వాత 23న అడిలైడ్లో, 25న సిడ్నీలో రెండో, మూడో మ్యాచ్లు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 మధ్య టి20 సిరీస్ జరుగుతుంది. ఆ్రస్టేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), బార్ట్లెట్, కేరీ, కొనొల్లీ, డ్వార్షుయ్, ఎలీస్, గ్రీన్, జోష్ హాజల్వుడ్, హెడ్, ఇన్గ్లిస్, ఓవెన్, రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. టి20 జట్టు (తొలి రెండు మ్యాచ్లకు): మిచెల్ మార్ష్ (కెప్టెన్), అబాట్, బార్ట్లెట్, టిమ్ డేవిడ్, డ్వార్షుయ్, ఎలీస్, హాజల్వుడ్, హెడ్, ఇన్గ్లిస్, కూనెమన్, ఓవెన్, షార్ట్, స్టొయినిస్, జంపా. -
భారత్తో వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. నిప్పులు చెరిగే బౌలర్ వచ్చేశాడు..!
అక్టోబర్ 19 నుంచి స్వదేశంలో భారత్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును (Australia) ఇవాళ (అక్టోబర్ 7) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ మార్ష్ (Mitchell March) ఎంపిక కాగా.. పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చారు.ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఈ సిరీస్లో బరిలోకి దిగనుండగా.. గాయాల నుంచి కోలుకొని మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్ రీఎంట్రీ ఇచ్చారు. ఓపెనింగ్ బ్యాటర్ మ్యాట్ రెన్షా 2022 తర్వాత తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.నవంబర్లో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్కు సన్నద్దమయ్యేందుకు పాట్ కమిన్స్ ఈ సిరీస్కు దూరంగా ఉండగా.. సౌతాఫ్రికాతో ఇటీవల ఆడిన సిరీస్లో భాగమైన లబూషేన్, కుహ్నేమన్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్పై వేటు పడింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ దేశవాలీ కమిట్మెంట్స్ కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉండి, చివరి రెండు వన్డేలకు అందుబాటులోకి వస్తాడు.భారత్తో సిరీస్కు ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోల్లీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, అడమ్ జాంపావన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే- అక్టోబర్ 19 (పెర్త్)రెండో వన్డే- అక్టోబర్ 23 (అడిలైడ్)మూడో వన్డే- అక్టోబర్ 25 (సిడ్నీ)వన్డే సిరీస్తో పాటు 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్తో జరిగే తొలి రెండు టీ20లకు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు కూడా మిచెల్ మార్షే కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. గాయాల నుంచి కోలుకొని ఇంగ్లిస్, ఎల్లిస్ రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో గాయపడిన మ్యాక్స్వెల్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు.న్యూజిలాండ్ సిరీస్లో ఆడిన జోష్ ఫిలిప్, అలెక్స్ క్యారీకి ఈ జట్టులో చోటు దక్కలేదు. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగింది.భారత్తో తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపాటీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్.. ప్రపంచంలో తొలి ప్లేయర్ -
పాక్పై రికార్డు విజయం.. ఆసీస్ దిగ్గజాన్ని అధిగమించిన టీమిండియా కెప్టెన్
మహిళల వన్డే వరల్డ్కప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా పాకిస్తాన్తో నిన్న (అక్టోబర్ 5) జరిగిన మ్యాచ్లో (India vs Pakistan) టీమిండియా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్కే (247) పరిమితమైనప్పటికీ.. ఆతర్వాత ఆ స్కోర్ను విజయవంతంగా కాపాడుకుంది. క్రాంతి గౌడ్ (10-3-20-3) అద్భుతమైన బౌలింగ్తో పాక్ పతనాన్ని శాశించింది. క్రాంతితో పాటు దీప్తి శర్మ (9-0-45-3), స్నేహ్ రాణా (8-0-38-2) కూడా సత్తా చాటడంతో పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున సిద్రా అమీన్ (81) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్ డయానా బేగ్ (10-1-69-4) ధాటికి తడబడింది. టాపార్డర్ మొత్తానికి మంచి ఆరంభాలు లభించినా, ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.ఈ గెలుపుతో భారత్ వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్కప్ టోర్నీల్లోనూ పాక్పై ఆధిపత్యాన్ని (5-0) కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించాయి. దీనికి ముందు భారత పురుషుల జట్టు ఆసియా కప్లో పాక్ను వరుసగా మూడు ఆదివారాల్లో ఓడించి ఆసియా ఛాంపియన్గా అవతరించింది.ఇదిలా ఉంటే, నిన్నటి గెలుపుతో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet kaur) ఓ అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ఆమె ప్లేయర్గా 90వ విజయాన్ని నమోదు చేసి, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ ప్లేయర్, ఆ జట్టు మాజీ కెప్టెన్, రెండు సార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ మెగ్ లాన్నింగ్ను (Meg Lanning) అధిగమించింది. లాన్నింగ్ తన కెరీర్లో ప్లేయర్గా 89 విజయాలు సాధించగా.. హర్మన్ నిన్నటి మ్యాచ్తో ఆమెను దాటేసింది. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉంది. మిథాలీ తన వన్డే కెరీర్లో 129 విజయాలు సాధించింది.మహిళల వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్లుమిథాలీ రాజ్- 129ఎల్లిస్ పెర్రీ- 125అలైస్సా హీలీ- 103బెలిండ క్లార్క్- 94కేట్ సీవర్ బ్రంట్- 93కేట్ ఫిజ్ప్యాట్రిక్- 91హర్మన్ప్రీత్ కౌర్- 90మెగ్ లాన్నింగ్- 89 చదవండి: లంక ప్రీమియర్ లీగ్లో భారత ఆటగాళ్లు.. చరిత్రలో తొలిసారి..! -
భారీ శతకంతో కదంతొక్కిన ఆసీస్ ప్లేయర్
ఆస్ట్రేలియా దేశవాలీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్లో (Sheffield Shield-2025) ఆసీస్ జాతీయ జట్టు ఆటగాడు, క్వీన్స్ల్యాండ్ కెప్టెన్ మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) భారీ శతకంతో కదంతొక్కాడు. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్లోనే అతను ఈ ఘనత సాధించాడు. టాస్మానియాతో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 206 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 160 పరుగులు చేశాడు.గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్న లబూషేన్ ఈ సెంచరీతో తిరిగి ఫామ్ను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో రెడ్ బాల్ క్రికెట్లో తన క్లాస్ను మరోసారి చాటుకున్నాడు. 14 నెలల తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో లబూషేన్ చేసిన తొలి సెంచరీ ఇది. అతను చివరిగా 2024 జులైలో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో గ్లామోర్గన్పై మూడంకెల స్కోర్ను చేశాడు. ఓవరాల్గా లబూషేన్కు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 33 శతకం.ఈ సెంచరీతో అతను యాషెస్ సిరీస్కు ముందు ఆసీస్ సెలెక్టర్లకు గట్టి సవాల్ విసిరాడు. ఈ సెంచరీ చేయకపోయుంటే యాషెస్ జట్టులో అతనికి స్థానం ఖచ్చితంగా దక్కేది కాదు. గత కొంతకాలంగా లబూషేన్ ఆసీస్ తరఫున దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. గత డబ్ల్యూటీసీ సైకిల్లో (2023-25) అతని ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉండింది. ఆ సైకిల్లో 20 మ్యాచ్ల్లో కేవలం 27 సగటున, ఒకే ఒక సెంచరీ సాయంతో పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్ తొలినాళ్లలో ప్రదర్శనలతో పోలిస్తే చాలా తక్కువ. లబూషేన్ కెరీర్ ఆరంభంలో 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఇప్పటివరకు 58 టెస్ట్లు ఆడిన లబూషేన్.. 46.2 సగటున 12 సెంచరీల సాయంతో 4435 పరుగులు చేశాడు.తాజా సెంచరీతో లబూషేన్ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో 167 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 33 సెంచరీలు, 60 అర్ద సెంచరీల సాయంతో 12000 ప్లస్ పరుగులు చేశాడు. కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: అష్టకష్టాలు పడుతున్న బాబర్ ఆజమ్ -
భారత్తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్
కాన్పూర్ వేదికగా భారత్-ఏతో (India-A) ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ (Australia-A) భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఇన్నింగ్స్కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్కు 152 పరుగులు జోడించి, భారత్కు కఠిన సవాల్ విసిరారు. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (5) వరుసగా మూడో మ్యాచ్లో నిరాశపరిచాడు.ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించాడు. వీరిలో అర్షదీప్ సింగ్ (10-2-38-3) ఒక్కడే సామర్థ్యం మేరకు రాణించగా.. హర్షిత్ రాణా (9.1-0-61-3) వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2 వికెట్లు తీయగా.. గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్కు (6-0-60-0) ఆసీస్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. అభిషేక్ శర్మ (4-0-19-0) పర్వాలేదనిపించాడు.కాగా, ఈ మ్యాచ్ మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. ఆ సిరీస్కు భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ముందు టాస్ గందరగోళం -
మిచెల్ మార్ష్ మెరుపులు
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): కెప్టెన్ మిచెల్ మార్ష్(43 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించడంతో... న్యూజిలాండ్తో తొలి టి20 మ్యాచ్లో ఆ్రస్టేలియా ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్ల చాపెల్–హ్యాడ్లీ సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ (66 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు)కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగగా... డారిల్ మిచెల్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), బెవాన్ జాకబ్స్ (20) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టిమ్ సీఫెర్ట్ (4), డెవాన్ కాన్వే (1), మార్క్ చాప్మన్ (0) విఫలమవడంతో రెండు ఓవర్లు కూడా ముగియక ముందే న్యూజిలాండ్ జట్టు 6/3తో నిలిచింది. ఈ దశలో మిచెల్ అండగా... రాబిన్సన్ విజృంభించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన అతడు క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రాబిన్సన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. స్పిన్నర్ల రంగప్రవేశంతో స్కోరు వేగం మందగించగా... నాలుగో వికెట్కు మిచెల్తో కలిసి రాబిన్సన్ 55 బంతుల్లో 92 పరుగులు జోడించాడు. ఆ తర్వాత జాకబ్స్తో ఐదో వికెట్కు 47 బంతుల్లో 64 పరుగులు జతచేశాడు. చివరి ఓవర్లో సిక్స్తో రాబిన్సన్ తన కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆ్రస్టేలియా 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్ష్ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి రెండు బంతులకు బౌండరీలు బాదిన అతడు... ఆఖరి వరకు అదే ఊపు కొనసాగించాడు. మరో ఎండ్ నుంచి ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో 31; 6 ఫోర్లు) కూడా ఎడెపెడా బౌండరీలు బాదడు. ఈ జంట తొలి వికెట్కు 5.3 ఓవర్లలోనే 67 పరుగులు జోడించడంతో ఆసీస్కు శుభారంభం దక్కింది. హెడ్ అవుటైనా... మాథ్యూ షార్ట్ (18 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్స్లు) దంచికొట్టడంతో ఆసీస్ వేగం కొనసాగింది. 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మార్ష్రెండో వికెట్కు షార్ట్తో కలిసి 68 పరుగులు జోడించాడు. దీంతో ఛేదన సులువు కాగా... మొత్తంగా ఈ మ్యాచ్లో ఆసీస్ 20 ఫోర్లు, 9 సిక్స్లతో 21 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టి20 జరగనుంది. -
ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్
న్యూజిలాండ్తో (New Zealand) రేపటి నుంచి (అక్టోబర్ 1) ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. నిన్న నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా మిచ్ ఓవెన్ కొట్టిన షాట్ మ్యాక్స్వెల్ చేతికి బలంగా తాకింది. స్కాన్లో ఫ్రాక్చర్ నిర్ధారణ కావడంతో మ్యాక్సీ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో జోష్ ఫిలిప్ జట్టులోకి వచ్చాడు. మ్యాక్స్వెల్కు ఇలాంటి గాయాలు కొత్త కాదు. అతని కెరీర్ మొత్తం గాయలమయంగా ఉంది.కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా రేపు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (New Zealand vs Australia) జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. ఇదే వేదికగా 3, 4 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. మూడు మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం ఉదయం 11:45 నిమిషాలకు ప్రారంభమవుతాయి.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, మ్యాట్ కుహ్నెమన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాన్యూజిలాండ్: మార్క్ చాప్మన్, టిమ్ రాబిన్సన్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, టిమ్ సీఫర్ట్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, బెన్ సియర్స్, ఐష్ సోధిచదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్ను మట్టికరిపించిన పసికూన -
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని గ్రేటర్ స్ప్రింగ్ ఫీల్డ్లో బతుకమ్మ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలను పేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీ మాత పూజను నిర్వహించారు. ‘బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో స్థానిక స్ప్రింగ్ ఫీల్డ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు చిన్నపిల్లలు పాల్గొని తెలంగాణ సాంప్రదాయ నృత్యాలను కనుల విందుగా ప్రదర్శించారు.కాగా, దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ వేడకలు భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. అంటే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. అప్పుడే ఈ బతుకమ్మ వేడుకలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ వెన్నముద్ద బతుకమ్మని ఆరాదిస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.;(చదవండి: మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
వరుసగా రెండో పరాజయం
కాన్బెర్రా: ఆ్రస్టేలియా పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 0–5 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా అండర్–21 జట్టు చేతిలో ఓడింది. గత మ్యాచ్లో గట్టి పోటీనిచ్చి పరాజయం పాలైన భారత అమ్మాయిలు... ఈ పోరులో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ప్రత్యర్థికి కనీసం పోటీనివ్వలేక వెనుకబడింది. భారత్ ఒక్క గోల్ కూడా చేయలేకపోగా... ఆ్రస్టేలియా జట్టు తరఫున మకేలా జోన్స్ (10వ, 11వ, 52వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించింది. సమీ లవ్ (38వ నిమిషంలో), మిగాలియా హవెల్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గత మ్యాచ్లో కేవలం ఒక్క గోల్ తేడాతో ఓడిన భారత్... ఈ మ్యాచ్లో ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడులు చేయడంలో విఫలమైంది. మ్యాచ్ ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడిన ఆ్రస్టేలియా అమ్మాయిలు... పదేపదే భారత గోల్పోస్ట్పై దాడులు చేస్తూ ఒత్తిడి కొనసాగించారు. ఈ ఏడాది డిసెంబర్లో చిలీ వేదికగా ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ సిరీస్ను సన్నాహకంగా వినియోగించుకోవాలనుకున్న భారత్కు నిరాశ ఎదురవుతోంది. ఇరు జట్ల మధ్య సోమవారం ఇక్కడే మూడో మ్యాచ్ జరగనుంది. -
సూర్య వంశీ దెబ్బ.. వణికిన ఆస్ట్రేలియా.. సిరీస్ భారత్ కైవసం
-
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్.. చెలరేగిన టీమిండియా యువ ప్లేయర్
భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ (India A vs Australia A) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇవాళ (సెప్టెంబర్ 23) నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్కు కొన్ని గంటల ముందు భారత-ఏ కెప్టెన్సీ నుంచి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తప్పుకున్నాడు. ఆటగాడిగానూ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో భారత మేనేజ్మెంట్ వికెట్కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ను (Dhruv Jurel) కెప్టెన్గా నియమించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జురెల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.రాణించిన మెక్స్వీనీ, జాక్ ఎడ్వర్డ్స్తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. కెప్టెన్ నాథన్ మెక్స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88) అర్ద సెంచరీలతో రాణించారు. స్టార్ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. వికెట్కీపర్ జోష్ ఫిలిప్ (39) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి టాడ్ మర్ఫీ (29), హెన్రీ థార్న్టన్ (10) క్రీజ్లో ఉన్నారు.ఐదేసిన యువ స్పిన్నర్భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 28 ఓవర్లలో 93 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సుతార్తో పాటు గుర్నూర్ బ్రార్ (13-0-71-2), ప్రసిద్ద్ కృష్ణ (13-3-63-1), మొహమ్మద్ సిరాజ్ (13-1-73-1) వికెట్లు తీశారు. నితీశ్ కుమార్ రెడ్డి, ఆయుశ్ బదోనికి వికెట్లు దక్కలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి భారత్-ఏ తరఫున బరిలోకి దిగారు.చదవండి: దిగ్గజ క్రికెట్ అంపైర్ హెరాల్డ్ డికీ బర్డ్ కన్నుమూత -
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం
లండన్: పరమకిరాతకంగా వందల కొద్దీ బాంబులేస్తూ, భూతల దాడులుచేస్తూ పాలస్తీనియన్ల మరణశాసన రాస్తున్న ఇజ్రాయెల్పై ధర్మాగ్రహంతో బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గాజావాసులున్న భూభాగాన్ని స్వతంత్ర పాలస్తీనా దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఈ మూడు దేశాలు ఆదివారం ప్రకటించాయి. పాలస్తీనాను దేశంగా అధికారికంగా గుర్తించొద్దని అమెరికా, ఇజ్రాయెల్ల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ బ్రిటన్ తన స్వీయనిర్ణయానికే కట్టుబడి ఉంటుందని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆదివారం వ్యాఖ్యానించారు. తామూ పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం ఒక పోస్ట్చేశారు. తాము సైతం పాలస్తీనాకే మద్దతు పలుకుతున్నట్లు ఆ్రస్టేలియా ఆదివారం ప్రకటించింది. కామన్వెల్త్ దేశాల మధ్య సమన్వయాన్ని పెంచే చర్యల్లో భాగంగా కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాజాలో మరణమృదంగం మోగిస్తున్న ఇజ్రాయెల్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని సొంత లేబర్ పార్టీ నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో బ్రిటన్లో స్టార్మర్ సర్కార్ ఈ ప్రకటన వెలువరిచింది. కాల్పుల విరమణ, గాజాలో ఐరాస మానవతా సాయం అనుమతి, శాంతి స్థాపనకు ఇజ్రాయెల్ అడ్డు తగిలితే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని జూలైలోనే స్టార్మర్ ప్రకటించారు. ద్విదేశ పరిష్కారం ఉత్తమం ఈ మేరకు లండన్లోని ప్రధాని కార్యాలయం నుంచి స్టార్మర్ పేరిట ఒక వీడియో సందేశం వెలువడింది. ‘‘ పాలస్తీనియన్లకు అనుకూలంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నాం. ఇది హమాస్ సాయుధ సంస్థకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాదు. భవిష్యత్తులో పాలస్తీనియన్ల ప్రభుత్వ పాలనలో బ్రిటన్ పాత్ర ఏమాత్రం ఉండదు. పాలస్తీనాలో శాంతియుత భవిత కోసం మనందరం కలసినడుద్దాం. హమాస్ చెరలోని బందీలను విడిపించుకుందాం. ఘర్షణలకు చరమగీతం పాడదాం. శాంతి, భద్రతలకు ద్విదేశ పరిష్కారం ఉత్తమం’’ అని స్టార్మర్ స్పష్టంచేశారు. 1917లో నాటి పాలస్తీనా భూభాగంపై ఏలిన బ్రిటన్ తదనంతరకాలంలో ఇజ్రాయెల్ ఆవిర్భావానికి పునాది రాయి వేసింది. అదే బ్రిటన్ ఇన్నాళ్ల తర్వాత పాలస్తానాను స్వతంత్ర దేశంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే భారత్ సహా 140కిపైగా దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానంచేసి ఐరాసతో స్వతంత్రదేశంగా ప్రకటన చేయించడంలో విఫలమయ్యాయి. అయితే ఈసారి ఆ దిశగా అడుగులుపడే అవకాశముందని తెలుస్తోంది. తప్పుబట్టిన నెతన్యాహూ ఆ్రస్టేలియా, యూకే, కెనడాల నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తప్పుబట్టారు. ‘‘మీరంతా పాలస్తీనాను దేశంగా గుర్తించినంతమాత్రాన సరిపోదు. దానిని వాస్తవరూపంలోకి తీసుకురావాలి. అది అసాధ్యం. పాలస్తీనాను గుర్తించడం అంటే 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ సాయుధుల మెరుపుదాడి, వందల మంది ఊచకోతను ఈ దేశాలన్నీ సమరి్థంచినట్లే. ఈ తాజా గుర్తింపు హమాస్కు మీరంతా ఇచ్చే బహుమతితో సమానం. జోర్డాన్ నదీ పశ్చిమాన పాలస్తీనా ఆవిర్భావాన్ని నేను సాధ్యంకానివ్వను. వచ్చే వారం అమెరికాలో పర్యటన, ట్రంప్తో భేటీ తర్వాత నా తదుపరి కార్యాచరణ వెల్లడిస్తా’’ అని నెతన్యాహూ అన్నారు. మొదటి ప్రపంచయుద్ధంలో ఓడిపోయాక ఓట్టొమన్ రాజ్యపతనం ఆరంభమైంది. అప్పటి నుంచి వందేళ్లపాటు పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయాలపై ఫ్రాన్స్, బ్రిటన్ల ఆధిపత్యం కొనసాగింది. యూదుల కోసం ఒక దేశం అవసరమని చేసిన 1917లో చేసిన బాల్ఫోర్ తీర్మానాన్ని బ్రిటనే రచించింది. తీర్మానం మొదటిభాగాన్ని సవ్యంగా అమలుచేసిన బ్రిటన్ ఆ తర్వాత రెండో భాగాన్ని గాలికొదిలేసింది. పాలస్తీనియన్ల పౌర, మత హక్కులకు ఎలాంటి అవరోధాలు సృష్టించకూడదని రెండోభాగంలో తీర్మానించినా అది ఇజ్రాయెల్ కారణంగా అమలుకు నోచుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత బ్రిటన్ పాలస్తీనాను గుర్తించి గతంలో తాను చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిచేసిందని రాయల్ యునైటెడ్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూట్లో పరిశోధకుడు బెర్కూ ఒజ్సేలిక్ వ్యాఖ్యానించారు. -
‘లక్ష డాలర్ల’ అమెరికా కన్నా లక్షణమైన దేశాలు
అమెరికా తన వర్క్ వీసా విధానంలో విప్లవాత్మక మార్పును ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుండి కంపెనీలు ప్రతి హెచ్-1బి వీసా హోల్డర్కు వన్టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు లక్ష డాలర్లు (రూ.88 లక్షలుపైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మరి అమెరికా లాంటి వర్కింగ్కు అనువైన మరో ఐదు దేశాల్లో వర్కింగ్ వీసాల రిజిస్ట్రీషన్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. -
జ్యోతి సింగ్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహళల హాకీ జట్టుకు జ్యోతి సింగ్ సారథిగా ఎంపికైంది. ఈ నెలాఖరులో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. కాన్బెర్రా జాతీయ హాకీ సెంటర్ వేదికగా జరిగే ఈ సిరీస్ కోసం హాకీ ఇండియా శనివారం 23 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్లో చిలీ వేదికగా ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ సందర్భంగా భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డిఫెండర్ జ్యోతి సింగ్ జట్టుకు కెపె్టన్గా వ్యవహరించనుంది. నిధి, హర్ష రాణి గోల్ కీపింగ్ బాధ్యతలు మోయనుండగా... జ్యోతి, మనీషా, మమిత ఓరమ్, సాక్షి శుక్ల, పూజ సాహు, నందినితో డిఫెన్స్ బలంగా ఉంది. మిడ్ఫీల్డ్లో ప్రియాంక యాదవ్, సాక్షి రాణా, శైలిమా చాను, రజని, ఇషిక, సునేలితా టొప్పో, అనిషా సాహు కీలకం కానున్నారు. లాల్రిన్పుయి, నిషా మింజ్, పూర్ణిమ యాదవ్, సోనమ్, కనిక సివాచ్, సుఖ్వీర్ కౌర్ ఫార్వర్డ్లుగా వ్యవహరించనున్నారు. ‘ఇది మంచి బృందం. జట్టులో ప్రతి ఒక్కరూ శిక్షణ శిబిరంలో కఠోర సాధన చేశారు. అన్నీ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. పరిస్థితులను అర్థం చేసుకొని బాధ్యతలు నిర్వర్తించే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ఆ్రస్టేలియా పర్యటన ద్వారా తగిన అనుభవం వస్తుంది. అది ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్లో ఉపయోగపడుతుంది. వరల్డ్కప్నకు ముందు ప్రపంచ అత్యుత్తమ జట్టుతో తలపడే అవకాశం దక్కింది. ఈ సిరీస్ మన ప్లేయర్లకు చాలా ఉపయోగ పడుతుంది. ఈ మ్యాచ్ల ద్వారా మెరుగవ్వాల్సిన అంశాలను గుర్తిస్తాం. వాటి ఆధారంగా జూనియర్ ప్రపంచకప్ వరకు జట్టును మరింత బలంగా తీర్చిదిద్దుతాం’ అని భారత కోచ్ తుషార్ ఖండేకర్ అన్నాడు. -
IND VS AUS: మంధన వీరోచిత శతకం వృధా.. పోరాడి ఓడిన టీమిండియా
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఆసీస్ గెలువగా.. రెండో మ్యాచ్లో టీమిండియా గెలిచింది. ఇవాళ (సెప్టెంబర్ 20) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్ మరోసారి గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ అతి భారీ స్కోర్ చేసింది. బెత్ మూనీ (75 బంతుల్లో 138; 23 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసి ఆలౌటైంది. మూనీతో పాటు జార్జియా వాల్ (81), ఎల్లిస్ పెర్రీ (68) సత్తా చాటారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. స్మృతి మంధన (63 బంతుల్లో 125; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత శతకంతో విజృంభించినా, లక్ష్యానికి 44 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మంధనతో పాటు హర్మన్ప్రీత్ కౌర్ (52), దీప్తి శర్మ (72) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో భారత్ 47 ఓవర్లలో 369 పరుగులు చేసి ఆలౌటైంది. మంధన, హర్మన్ క్రీజ్లో ఉన్నంత సేపు భారత్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. వీరిద్దరూ ఔటైన తర్వాత కూడా దీప్తి శర్మ కాసేపు ఆశలు రేకెత్తించింది. అయితే భారత చివరి వరుస బ్యాటర్లు త్వరితగతిన ఔట్ కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. -
ఆసీస్ ప్లేయర్ ఊచకోత.. వన్డేల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 20) జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ చెలరేగిపోయింది. కేవలం 57 బంతుల్లో శతకం పూర్తి చేసి, వన్డేల్లో రెండో వేగవంతమైన శతకాన్ని సమం చేసింది. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 75 బంతులు ఎదుర్కొని 23 ఫోర్లు, సిక్స్ సాయంతో 138 పరుగులు చేసింది.మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు (టాప-5)మెగ్ లాన్నింగ్ (ఆస్ట్రేలియా)- 2012లో న్యూజిలాండ్పై 45 బంతుల్లోబెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 2025లో భారత్పై 57 బంతుల్లోకరెన్ రోల్టన్ (ఆస్ట్రేలియా)- 2000లో సౌతాఫ్రికాపై 57 బంతుల్లోసోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 2018లో ఐర్లాండ్పై 59 బంతుల్లోస్మృతి మంధన (భారత్)- 2025లో ఐర్లాండ్పై 70 బంతుల్లోమూనీ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ రికార్డు స్కోర్ చేసింది. 47.5 ఓవర్లలో ఆ జట్టు 412 పరుగులు చేసి ఆలౌటైంది. మూనీతో పాటు జార్జియా వాల్ (81), ఎల్లిస్ పెర్రీ (68) సత్తా చాటారు. ఈ మ్యాచ్లో ఆసీస్ చేసిన స్కోర్ మహిళల వన్డే క్రికెట్లో ఆరో అత్యధికం. అత్యధిక స్కోర్ రికార్డు న్యూజిలాండ్ (491/4) పేరిట ఉంది.ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు (50) ఆడి ఉంటే మరింత భారీ స్కోర్ చేసేది. ఓ దశలో స్కోర్ ఈజీగా 450 పరుగులు దాటుతుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు చివర్లో మేల్కోవడంతో అది కుదరలేదు. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్లో ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత 47వ ఓవర్లో ఒకటి, 48వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ కోటా ఓవర్లు ఆడకుండానే ఇన్నింగ్స్ను ముగించింది. ఈ మ్యాచ్లో భారత్ 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే చరిత్రే అవుతుంది.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరొకటి గెలిచాయి. ప్రస్తుతం జరుగుతున్నది నిర్ణయాత్మకమైన మూడో వన్డే. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. -
తొలిసారి సిరీస్ సాధించే లక్ష్యంతో...
న్యూఢిల్లీ: మహిళల వన్డే క్రికెట్లో భారత జట్టు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆ్రస్టేలియా మహిళలపై సిరీస్ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు అలాంటి అవకాశం మన జట్టు ముందు నిలిచింది. ఆసీస్తో జరిగిన రెండో వన్డేలో చెలరేగి భారీ విజయాన్ని అందుకున్న హర్మన్ప్రీత్ బృందం అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. గత మ్యాచ్లాగే సత్తా చాటితే తొలిసారి టీమిండియా సిరీస్ మన ఖాతాలో పడుతుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య నేడు నిర్ణయాత్మక మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్కు సన్నాహకంగా ఈ సిరీస్లో ఆడిన ఇరు జట్లు విజయంతో ముగించి మెగా ఈవెంట్లో అడుగు పెట్టాలని భావిస్తున్నాయి. రెండో వన్డేలో స్మృతి మంధాన మెరుపు బ్యాటింగ్తో పాటు పదునైన బౌలింగ్తో ఆసీస్ను భారత్ కట్టడి చేసింది. ఫలితంగా ఆసీస్ వన్డే చరిత్రలో అతి పెద్ద పరాజయాన్ని చవిచూసింది. అయితే మన జట్టులో కూడా ఫీల్డింగ్ రూపంలో ప్రధాన లోపం కనిపిస్తోంది. రెండు వన్డేల్లో కలిపి మన ప్లేయర్లు ఏకంగా 10 క్యాచ్లు వదిలేశారు. దీనిని సరిదిద్దుకోవాల్సి ఉంది. భారత తమ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. మరో వైపు గత మ్యాచ్లో ఓడినా...ఆ్రస్టేలియాను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అలీసా హీలీ టీమ్ రెండో వన్డే పరాజయాన్ని మరచి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని, సిరీస్ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. -
కమిన్స్, గ్రీన్.. తాజాగా మరో ఆటగాడు.. ఆసీస్కు వరుస ఎదురుదెబ్బలు
అక్టోబర్ 1 నుంచి న్యూజిలాండ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పాట్ కమిన్స్, కెమరూన్ గ్రీన్, నాథన్ ఇల్లిస్ సేవలు కోల్పోయిన ఆ జట్టు.. తాజాగా వికెట్కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ సేవలను కూడా మిస్ అయ్యింది. వీరంతా లేకుండానే ఆసీస్ న్యూజిలాండ్తో తలపడనుంది.ఈ వారం ప్రారంభంలో గాయపడ్డ ఇంగ్లిస్ న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికంతా కోలుకుంటాడని భావించారు. అయితే అతని గాయం తీవ్రత అధికంగా ఉండటం చేత సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆసీస్ సెలెక్టర్లు ఇంగ్లిస్కు ప్రత్యామ్నాయంగా అలెక్స్ క్యారీ పేరును ప్రకటించారు.ఇంగ్లిస్ భారత్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని ఆసీస్ మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్తో సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ల కోసం భారత జట్టు నవంబర్ 8 వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ నాయకత్వం వహిస్తాడు. ట్రవిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్, మ్యాట్ కుహ్నేమన్ సభ్యులుగా ఉన్నారు. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు మైఖేల్ బ్రేస్వెల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.ఆసీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు..మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి. -
ఆస్ట్రేలియాకు మరో షాక్.. పుండు మీద కారం చల్లినట్లుగా..!
తాజాగా (సెప్టెంబర్ 17) భారత మహిళల జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో (మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన రెండో వన్డే) చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు మరో షాక్ తగిలింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్లో 10 శాతం కోత విధించబడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆసీస్ జట్టు మొత్తానికి ఈ ఫైన్ వర్తిస్తుంది. ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్లు నిర్దేశిత సమయంలోపు 2 ఓవర్లు వెనుకపడి ఉన్నారు.ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం నిర్దేశిత సమయంలోగా వెనుకపడిన ప్రతి ఓవర్కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్లో 5 శాతం కోత విధిస్తారు. ఈ లెక్కన ఆసీస్ ప్లేయర్లకు రెండు ఓవర్లకు గానూ 10 శాతం జరిమానాగా విధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ ఆస్ట్రేలియాపై 102 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో సదర్ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో భారత్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది. -
మంధన విధ్వంసకర శతకం.. ఆసీస్ను చిత్తుగా ఓడించిన టీమిండియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది.ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. భారత ఇన్నింగ్స్లో మంధన మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29), ప్రతిక రావల్ (25), స్నేహ్ రాణా (24) పర్వాలేదనిపించారు.హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో సదర్ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో భారత్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది. -
మ్యాక్స్వెల్ కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు చాలా ముందు నుంచే అతను దేశవాలీ వన్డేలు (లిస్ట్-ఏ, 50 ఓవర్ల ఫార్మాట్) కూడా ఆడటం లేదు. తాజాగా మ్యాక్సీ 50 ఓవర్ల ఫార్మాట్లో మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.దేశవాలీ వన్డే టోర్నీ డీన్ జోన్స్ ట్రోఫీ కోసం విక్టోరియా తరఫున బరిలోకి దిగనున్నాడు. మ్యాక్సీ 2022 తర్వాత ఒకే ఒక లిస్ట్-ఏ మ్యాచ్ ఆడాడు. త్వరలో న్యూజిలాండ్తో జరుగుబోయే టీ20 సిరీస్కు ముందు ఫిట్నెస్ సాధించేందుకు మ్యాక్సీ డీన్ జోన్స్ ట్రోఫీ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మ్యాక్సీ సెప్టెంబర్ 17న క్వీన్స్ల్యాండ్తో, సెప్టెంబర్ 19న టస్మానియాతో జరుగబోయే మ్యాచ్ల్లో ఆడతాడు.మ్యాక్స్వెల్ జట్టులో (విక్టోరియా) మ్యాట్ షార్ట్, పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ హ్యారిస్, విల్ సదర్ల్యాండ్ లాంటి పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. విక్టోరియా ఈ టోర్నీ గత సీజన్లో ఫైనల్కు చేరినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది. మ్యాక్స్వెల్ లాంటి అనుభవజ్ఞుడు ఈ సీజన్లో విక్టోరియా తరఫున బరిలోకి దిగుతుండటం ఆ జట్టుకు మానసిక బలాన్ని చేకూరుస్తుంది.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ఇటీవలికాలంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లు ఆడింది. వీటిలో విండీస్ సిరీస్ను 5-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన ఆసీస్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ను 2-1 తేడాతో దక్కించుకుంది. సౌతాఫ్రికా సిరీస్లోని నిర్ణయాత్మక చివరి మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో (0/15 (2), 62* (36)) ఆకట్టుకుని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 1 నుంచి మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ 3 టీ20లు ఆడుతుంది. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా ఈ మూడు మ్యాచ్లు జరుగుతాయి. -
భారత గడ్డపై తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన ఆస్ట్రేలియా యువ సంచలనం
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్స్టాస్ భారత గడ్డపై తన తొలి మ్యాచ్లోనే మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. 19 ఏళ్ల ఈ ఆసీస్ యువ ఓపెనర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏ జట్టులో భాగంగా భారత్లో పర్యటిస్తున్నాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తనుశ్ కోటియన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది మూడంకెల మార్కును తాకాడు. మొత్తంగా 126 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 101 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. కొన్స్టాస్కు జతగా మరో ఓపెనర్ క్యాంప్బెల్ కెల్లావే (88) కూడా సెంచరీని సమీపించాడు. కెల్లావే 73 పరుగుల వద్ద ఉండగా.. 56 పరుగుల వద్ద ఉండిన కొన్స్టాస్ వేగంగా సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. తొలి రోజు టీ విరామం సమయానికి ఆసీస్-ఏ స్కోర్ 198/0గా ఉంది. భారత బౌలర్లు 37 ఓవర్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ను కూడా పడగొట్టలేకపోయారు. టీమిండియాకు ఆడిన అనుభవం ఉన్న బౌలర్లు ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ కూడా ఈ మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. తనుశ్ కోటియన్, హర్ష్ దూబే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఒక్కడే ఆసీస్-ఏ ఓపెనర్లను కాస్త నిలువరించగలిగాడు.ఈ మ్యాచ్లో ఆసీస్-ఏ జట్టుకు నాథన్ మెక్స్వీని కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. కొన్స్టాస్, జోష్ ఫిలిప్, కూపర్ కన్నోలీ, జేవియర్ బార్ట్లెట్, టాడ్ మర్ఫీ లాంటి గుర్తించదగ్గ ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు. భారత-ఏ జట్టు విషయానికొస్తే.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, ఎన్ జగదీషన్, దేవ్దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్ తుది జట్టులో ఉన్నారు.ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు (నాలుగు రోజుల మ్యాచ్లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే తొలి టెస్ట్ మొదలైంది. రెండో టెస్ట్ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్లో వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ల కోసం భారత-ఏ జట్లను ఇదివరకే ప్రకటించారు. బుమ్రాతో గొడవతో హైలైటైన కొన్స్టాస్కొన్స్టాస్ గతేడాది భారత్తో జరిగిన మెల్బోర్న్ టెస్ట్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లోనే అర్ద సెంచరీతో సత్తా చాటిన కొన్స్టాస్.. తన రెండో టెస్ట్లోనే (సిడ్నీ) టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో గొడవపడి మరింత హైలైట్ అయ్యాడు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్లో టాపార్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు ప్రతీక రావల్ (96 బంతుల్లో 64; 6 ఫోర్లు), స్మృతి మంధాన (63 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్స్లు), హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు.ఆ్రస్టేలియా బౌలర్లలో మేగన్ షుట్ 2 వికెట్లు తీయగా, కిమ్ గార్త్, అనాబెల్, అలానా కింగ్, తాలియా తలా ఒక వికెట్ సాధించారు. అనంతరం ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ 44.1 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. . ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫోబ్ లిచ్ఫీల్డ్ (80 బంతుల్లో 88; 14 ఫోర్లు), బెత్ మూనీ (74 బంతుల్లో 77 నాటౌట్; 9 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (51 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో వికెట్ తీశారు. 17న రెండో వన్డే కూడా ఇదే వేదికపై జరుగుతుంది.చరిత్ర సృష్టించిన ప్రతీక రావల్..ఇక ఈ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైనప్పటికి స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ మాత్రం వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్తో తొలి 15 మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ప్రతీక చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు భారత తరపున 15 వన్డేలు ఆడి 767 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉండేది. లానింగ్ తన వన్డే కెరీర్లో తొలి మ్యాచ్లలో 707 పరుగులలు చేసింది. తాజా మ్యాచ్తో లానింగ్ ఆల్టైమ్ రికార్డును రావల్ బ్రేక్ చేసింది. వీరిద్దరి తర్వాత స్ధానంలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ షార్లెట్ ఎడ్వర్డ్స్(655) మూడో స్ధానంలో ఉంది.చదవండి: ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ -
టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన
ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత-ఎ జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. అంత ఊహించనట్టుగానే ఆసీస్-ఎ సిరీస్లో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడడం లేదు. తొలుతు ఆసీస్ పర్యటనకు ముందు సన్నాహాల్లో భాగంగా ఈ అనాధికారిక సిరీస్లో రో-కో ద్వయం ఆడనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ సిరీస్ కోసం సెలక్టర్లు ప్రకటించిన తాజా స్క్వాడ్లో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో అవన్నీ వట్టి రూమర్సే అని రుజువైంది. ఈ సిరీస్ కోసం రెండు వెర్వేరు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తొలి వన్డే కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును మాత్రమే బీసీసీఐ సెలక్ట్ చేసింది.ఆస్ట్రేలియా-ఎతో జరిగే తొలి వన్డేలో భారత-ఎ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వ్యవహరించనున్నాడు. అతడితో పాటు ఈ జట్టులో ఐపీఎల్ స్టార్లు ప్రియాన్ష్ ఆర్య, ఆయూష్ బదోని, ప్రభుసిమ్రాన్ సింగ్, సిమర్జీత్ సింగ్, విప్రజ్ నిగమ్లకు చోటు దక్కింది.కెప్టెన్గా తిలక్ వర్మ..ఇక ఆఖరి రెండు మ్యాచ్లకు భారత-ఎ జట్టు కెప్టెన్గా హైదరాబాదీ తిలక్ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. తిలక్తో పాటు ఆసియాకప్ భారత జట్టులో భాగమైన అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లకు కూడా ఈ అనాధికరిక వన్డే సిరీస్లో ఆడనున్నారు. ఆసియాకప్ ముగిశాక వీరి నలుగురు నేరుగా ఇండియా-ఎ జట్టుతో కలవనున్నారు.తొలి వన్డే జట్టులో భాగంగా ఉన్న ప్రియాన్ష్ ఆర్య, సిమర్జీత్ సింగ్లకు ఆఖరి రెండు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఇండియా-ఎ వర్సెస్ ఆసీస్-ఎ మధ్య మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 5 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్లు కాన్పూర్ వేదికగానే జరగనున్నాయి.తొలి వన్డే కోసం భారత-ఎ జట్టురజత్ పాటిదార్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, సిమర్జీత్ సింగ్.రెండు, మూడు వన్డేల కోసం భారత- జట్టుతిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా -
వరుసగా 5 సిక్సర్లు.. విధ్వంసకర శతరం.. చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్
టీ20 బ్లాస్ట్ 2025లో హ్యాంప్షైర్ ఆటగాడు (ఆసీస్) క్రిస్ లిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ఫైనల్స్ డే (టీ20 బ్లాస్ట్లో సెమీస్, ఫైనల్స్ ఒకే రోజు జరుగుతాయి) చరిత్రలో శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (సెప్టెంబర్ 13) నాటింగ్హమ్షైర్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్లో 50 బంతుల్లో శతకం పూర్తి చేసిన లిన్.. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. తద్వారా తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్స్కు చేర్చాడు. 159 పరుగుల లక్ష్య ఛేదనలో లిన్ ఒక్కడే 90 శాతం పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసే క్రమంలో ఓ ఓవర్లో (లాయిడ్ పోప్) వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు.లిన్ రికార్డు శతకంతో హ్యాంప్షైర్ను ఫైనల్స్కు చేర్చినా.. ఆ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. తొలి సెమీఫైనల్ (ఇది కూడా నిన్ననే జరిగింది) విజేత సోమర్సెట్తో జరిగిన ఫైనల్లో హ్యాంప్షైర్ ఓటమిపాలైంది. సెమీస్లో విధ్వంసకర శతకంతో చెలరేగిన లిన్ ఫైనల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 7 బంతుల్లో సిక్స్, ఫోర్ సాయంతో 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఫైనల్లో లిన్ విఫలమైనా హ్యాంప్షైర్ భారీ స్కోరే (194/6) చేసింది. అయితే దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. విల్ స్మీడ్ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్) విధ్వంసం సృష్టించి సోమర్సెట్ను ఛాంపియన్గా నిలిపాడు. సోమర్సెట్కు ఇది మూడో టీ20 బ్లాస్ట్ టైటిల్. ఫైనల్లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్ ఛేదనల చరిత్రలో అత్యధికం. -
భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్
సెప్టెంబర్ 16 నుంచి ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఆసీస్ భారత-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్లకు ముందు ఆసీస్-ఏ టీమ్కు భారీ షాక్ తగిలింది.ఆల్రౌండర్ ఆరోన్ హార్డీ భుజం గాయం కారణంగా తప్పుకున్నాడు. హార్డీ స్థానాన్ని విల్ సదర్లాండ్ భర్తీ చేయనున్నాడు. ఇదివరకే వన్డే జట్టులో సభ్యుడైన సదర్లాండ్ రెండో టెస్ట్ సమయానికి జట్టుతో కలుస్తాడు. వన్డేల్లో హార్డీకి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు.హార్డీ ఇటీవల వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20, వన్డే సిరీస్ల్లో పాల్గొన్నాడు. అయితే, ఆ సిరీస్ల్లో పేలవ ప్రదర్శన కారణంగా త్వరలో జరుగనున్న న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. హార్డీ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు భారత్-ఏ సిరీస్తో అవకాశం కల్పించగా, గాయం బారిన పడ్డాడు. గాయం తీవ్రం కాకపోతే, వన్డే సిరీస్ ఆడవచ్చు.భారత్లో ఆస్ట్రేలియా ఏ జట్టు పర్యటన వివరాలు..సెప్టెంబర్ 16-23: తొలి టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 23-26: రెండో టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 30: తొలి వన్డే (కాన్పూర్)అక్టోబర్ 3: రెండో వన్డే (కాన్పూర్)అక్టోబర్ 5: మూడో వన్డే (కాన్పూర్)ఆస్ట్రేలియా-ఏ టెస్ట్ జట్టు..జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోల్లీ, జాక్ ఎడ్వర్డ్స్, కాంప్బెల్ కెల్లావే, సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్స్వీనీ, టాడ్ మర్ఫీ, ఫెర్గస్ ఓ'నీల్, ఆలివర్ పీక్, జోష్ ఫిలిప్, కోరీ రోచిసియోలి, లియామ్ స్కాట్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్వన్డే జట్టు..కూపర్ కొన్నోల్లీ, హ్యారీ డిక్సన్, జాక్ ఎడ్వర్డ్స్, సామ్ ఎలియట్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, మెకెంజీ హార్వే, టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘ, లియామ్ స్కాట్, లాచీ షా, టామ్ స్ట్రాకర్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్ఈ సిరీస్ల కోసం భారత-ఏ టెస్ట్ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అభిమన్యు ఈశ్వరన్ ఉంటాడు.శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీశన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బడోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్ -
మూరెడు పూల మూల్యం లక్షకు పైగానే!
మీరు ఆస్ట్రేలియా వెళుతున్నారా? అయితే అక్కడి చట్టాలు, నియమ నిబంధనల గురించి కాస్తంత తెలుసుకుని ఆ తర్వాతే వెళ్లండి. ఎందుకంటే అక్కడ బ్యాగులో పూలు పెట్టుకోవడం కూడా తప్పే! మరీ ముఖ్యంగా బయటి నుంచి పూలు తీసుకువెళ్లామా... భారీ జరిమానా చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. ఇదెక్కడి చోద్యం... అంటారా? చోద్యం కాదు.. నిజం. ఎందుకంటే మలయాళ నటి నవ్యా నాయర్ విషయంలో అదే జరిగింది. ఓనమ్ పండుగ వేడుకలలో పాల్గొనేందుకు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన నవ్య నాయర్, తండ్రి ప్రేమతో ఇచ్చిన మల్లెచెండులో కొంత తలలో పెట్టుకుని మిగిలింది తర్వాత పెట్టుకుందాం లే అని బ్యాగ్లో పెట్టుకుందట. మెల్బోర్న్ విమానాశ్రయంలో ‘కష్టమ్స్’ అధికారులు ఆమె బ్యాగ్ను చెక్ చేసేటప్పుడు ఈ పూలమాల బయట పడిందట. అంతే! వారు ఆమె ఏదో ఘోర నేరం చేసినట్లు చూసింది చాలక, 1980 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించారట. (మన రూపాయలలో అది దాదాపు లక్షా పద్నాలుగు వేలు) ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం బయటి నుంచి పూలు, మొక్కలు, విత్తనాల వంటివి తీసుకు రావడం నేరమట. ఎందుకంటే బయటినుంచి వచ్చే ఇటువంటి వాటివల్ల అంటువ్యాధులు, వాతావరణ కాలుష్యం ప్రబలే ప్రమాదం ఉందట. అందుకే అలాంటి వాటి విషయంలో చాలా కఠినంగా ఉంటారట. ఈ విషయాన్ని నటి నవ్య సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ‘‘మా నాన్న ఇచ్చిన మూరెడు పూల చెండు మూల్యం అక్షరాలా లక్షా పద్నాలుగు వేల పైమాటే’’ అని కామెంట్ చేసింది. ఆమె పోస్ట్ చేయడం మంచిదే అయింది.. లేకపోతే అది తెలియని మన వాళ్లు తలనిండా పూలు తురుముకుని బ్యాగులో మరికాసిని పెట్టుకుని ఆస్ట్రేలియా వెళితే మన కరెన్సీలో సంచెడు రూపాయలు చలానాగా కట్టాల్సి వస్తుంది! -
మూరెడు మల్లెపూలే కాదు.. వీటితోనూ తంటాలే!
మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. మలయాళ నటి నవ్య నాయర్కి ఆస్ట్రేలియాలో రూ.1.14 లక్షల జరిమానా విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూరెడు మల్లెపూలు.. అదీ బ్యాగులో ఉన్నందుకే ఆమెకు ఆ ఫైన్ పడింది. ఈ చేదు అనుభవంపై ఆమె సైటైర్లు వేసుకుంటోంది కూడా. అయితే.. ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎయిర్పోర్టుకు ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయాంగా పేరుంది. కేవలం మల్లపూలే కాదు.. మరికొన్ని వస్తువులను కూడా అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని మీకు తెలుసా?.. ఓనం ఈవెంట్కు హాజరయ్యేందుకు వెళ్లిన మల్లూ బ్యూటీ నవ్య నాయర్కు చేదు అనుభవం ఎదురైంది. తన తండ్రి తచ్చిన మల్లెపూల మూరను ఆమె బ్యాగులో ఉంచుకుని ఎయిర్పోర్టులో దిగారు. అయితే.. మెల్బోర్న్ ఎయిర్పోర్టులో వాటిని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడి అధికారులు ఆమెకు రూ.1.14లక్షల జరిమానా వేశారు. 28 రోజుల్లో ఆ జరిమానా కట్టాలని ఆమెకు స్పష్టం చేశారు. మల్లెపూల తరహాలో మూరెడున్న వంద కేటగిరీల వస్తువులపై అక్కడ నిషేధం అమల్లో ఉంది. అందులో.. తాజా, ఎండిన పూలు, తాజా పండ్లు, కూరగాయలు, మూలికలు, మసాలా దినుసులు, గింజలు, పాల సంబంధిత ఉత్పత్తులు, బర్ఫీ.. రసగుల్లా, రసమలై, గులాజ్జామూన్, మైసూర్ పాక్, సోన్పాపిడి ఇలా.. స్వీట్లు, బియ్యం, టీ, ఇంటి భోజనం, తేనే, పెంపుడు జంతువుల ఆహారం.. ఈకలు, ఎముకలు, చర్మం (సంబంధిత వస్తువులు కూడా!), చెట్లు.. జంతువుల నుంచి తయారు చేసిన మందులు, చివరకు.. విమాన, నౌకల ప్రయాణాల నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా అనుమతించరంతే. ప్రయాణికులు వీటిని తీసుకెళ్లడం అక్కడ నిషిద్ధం. వాటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. పైగా వాటి వల్ల పర్యావరణానికి హాని అని భావిస్తున్నారు. చివరకు.. మన పండుగలు పబ్బాలు ఉన్నాయని విజ్ఞప్తులు చేసుకున్నా కూడా వాళ్లు వినరు. అయితే మాపుల్ చెట్ల నుంచి తయారు చేసిన షుగర్ సిరప్కు మాత్రం ఎందుకనో అనుమతిస్తారు!. నవ్య మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్లో మల్లెపూలును తీసుకువచ్చినందుకు జరిమానా విధించారు. అనంతరం మెల్బోర్న్లో జరిగిన ఓనం కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటి నవ్య తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను తీసుకువచ్చిన పూలు లక్ష రూపాయలు ఖరీదైనవని జరిమానా విధించేవరకు తనకు తెలియదని చమత్కరించింది. కానీ, ఆస్ట్రేలియా సరిహద్దుల్లో నిషేధిత వస్తువులపై కఠిన నియమాలు అమలవుతున్నాయి. ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాల ప్రకారం.. నిషేధిత/ప్రకటించని వస్తువులు (ఆహారం, మొక్కలు, జంతు ఉత్పత్తులు, ఔషధాలు) సరిహద్దులో పట్టుబడితే.. వెంటనే వాటిని ధ్వంసం చేస్తారు. ప్రయాణికులకు తక్షణ జరిమానాలు విధిస్తారు. విషయం తీవ్రమైందిగా భావిస్తే.. వీసా రద్దు చేస్తారు. మరింత తీవ్రమైందిగా అనుకుంటే.. తీవ్ర ఉల్లంఘనల కింద పరిగణించి జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందుకే ప్యాసింజర్ కార్డులో వాటి గురించి తప్పనిసరిగా పేర్కొనాలి. అప్పుడు.. అనుమతించని వస్తువులు తీసేసినా జరిమానా ఉండదు. లేకుంటే.. నవ్య నాయర్లా 15 సెం.మీ. మల్లెపూలకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నవ్యా నాయర్(ధన్య వీణ) 1985 అక్టోబర్ 14న కేరళలోని అలప్పుశా జిల్లాలో జన్మించారు. 2001లో ఇష్టం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు, ప్రధానంగా మలయాళ సినిమాల్లో.. ఆడపా దడపా తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్తో జంటగా నటించిన నందనం అనే సినిమాలో నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె క్లాసికల్ డాన్స్లో శిక్షణ పొందిన నర్తకి, పలు స్టేజ్ షోలు కూడా చేశారు. 2010లో వ్యాపారవేత్త సంతోష్ మెనన్ను వివాహం చేసుకున్నారు.. ఈ జంటకు ఓ కుమారుడు. యాక్టింగ్తో పాటు టీవీ షోలు, రచనల ద్వారా కూడా ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంటున్నారు. -
బంతితో చెలరేగిన లబూషేన్.. హ్యాట్రిక్ నమోదు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ దేశవాలీ టీ20 టోర్నీలో చెలరేగిపోయాడు. అతను చెలరేగింది బ్యాట్తోకాదు. నాణ్యమైన లెగ్ స్పిన్నర్ కూడా అయిన అతను..బ్రిస్బేన్లో జరిగిన కేఎఫ్సీ మ్యాక్స్ టీ20 టోర్నీలో బంతితో రఫ్ఫాడించాడు. ఫైనల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి తన జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.Marnus Labuschagne took a a hattrick in the KFC T20 Max Final. 🤯pic.twitter.com/8ye7U7udVu— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2025ఈ టోర్నీలో రెడ్ల్యాండ్స్ టైగర్స్కు ప్రాతినిథ్యం వహించిన లబూషేన్.. వ్యాలీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో లబూషేన్ బౌలర్గా మాత్రమే కాకుండా ఫీల్డర్గానూ సత్తా చాటాడు. 3 క్యాచ్లు పట్టుకుని రెడ్ల్యాండ్స్ గెలుపుకు మరో రకంగానూ దోహదపడ్డాడు. ఈ మ్యాచ్లో లబూషేన్ బ్యాటర్గా నిరాశపరిచాడు. 10 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెడ్ల్యాండ్స్.. జిమ్మీ పీర్సన్ (50 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సులు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వ్యాలీ జట్టు 150 పరుగులకే ఆలౌటై 41 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. లబుషేన్ చివర్లో వరుసగా మూడు వికెట్లు తీసి రెడ్ల్యాండ్స్ విజయం ఖాయం చేశాడు. వ్యాలీ తరఫున మాక్స్ బ్రయంట్ 76 (38 బంతులు) పరుగులతో పోరాడినా, తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ టోర్నీ మహిళల విభాగంలో విన్నమ్-మాన్లీ జట్టు టైటిల్ గెలిచింది.కాగా, పేలవ ఫామ్ కారణంగా లబూషేన్ కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు నుంచి తప్పించబడ్డాడు. ప్రస్తుతం అతను యాషెస్ సిరీస్ కోసం జట్టులోకి తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
టార్గెట్ ఇండియా భారతీయులపై ఆస్ట్రేలియా విషం?
-
న్యూజిలాండ్ సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
అక్టోబర్ తొలి వారంలో న్యూజిలాండ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రకటించారు. దాదాపు ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న విధ్వంసకర బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగనున్న వరల్డ్కప్ దృష్ట్యా స్టోయినిస్ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. 36 ఏళ్ల స్టోయినిస్ గతకొంతకాలంగా జాతీయ జట్టు పరిధిలో లేడు. అతనికి సెంట్రల్ కానీ, స్టేట్ కాంట్రాక్ కానీ లేవు. అతడు చివరిగా 2024 నవంబర్లో ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. ఈ ఏడాది ఫ్రిబవరిలో అతడు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్లతో బిజీగా ఉన్నాడు. స్టోయినిస్ తాజా ఐపీఎల్ (పంజాబ్ కింగ్స్), హండ్రెడ్ లీగ్ల్లో (ట్రెంట్ రాకెట్స్) రన్నరప్ జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.వరల్డ్కప్ దృష్ట్యా స్టోయినిస్ను తీసుకున్నట్లు తెలుస్తున్నా, ఆ జట్టుకు ఎంపిక కావడం అతనికి అంత ఈజీ కాదు. స్టోయినిస్ సిమిలర్ ప్రొఫైల్ (ఆల్రౌండర్) ఉన్న కెమరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.స్టోయినిస్తో పాటు మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్లెట్ కూడా స్వల్ప విరామం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఓవెన్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా, షార్ట్ విండీస్ సిరీస్ సందర్భంగా గాయపడి కోలుకున్నారు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ స్వచ్చందంగా తప్పుకున్నాడు. యాషెస్ ప్రిపరేషన్ దృష్ట్యా అతను షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడేందుకు సిద్దమయ్యాడు. సౌతాఫ్రికా సిరీస్లో ఇంజ్యూరీ రీప్లేస్మెంట్లుగా వచ్చిన అలెక్స్ క్యారీ, ఆరోన్ హార్డీ ఈ సిరీస్కు ఎంపిక కాలేదు. పితృత్వ సెలవు కారణంగా నాథన్ ఎల్లిస్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ జట్టు ప్రకటనకు ముందే టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్తో పాటు స్వదేశంలో భారత్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా దూరమయ్యాడు. మిచెల్ మార్ష్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఈ సిరీస్ అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది.న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మిచ్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా. -
స్టార్క్ సంచలన ప్రకటన తర్వాత ఆస్ట్రేలియాకు మరో భారీ ఎదురుదెబ్బ
వచ్చే నెలలో న్యూజిలాండ్, భారత్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్లు తగిలాయి. స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది సేపట్లోనే టెస్ట్ జట్టు కెప్టెన్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కీలక ప్లేయర్ అయిన పాట్ కమిన్స్ గాయం కారణంగా రెండు సిరీస్లకు దూరమైనట్లు ప్రకటన వెలువడింది. కమిన్స్ న్యూజిలాండ్, భారత్ సిరీస్లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక ప్రకటన చేసింది.కమిన్స్కు వెన్నెముక కింది భాగంలో సమస్య ఉన్నట్లు వెల్లడించింది. దీంతో కమిన్స్ను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (నవంబర్ 21) వరకు ఆటకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యలో కమిన్స్ దేశవాలీ టోర్నీల్లో (వన్డే కప్, షెఫీల్డ్ షీల్డ్) కూడా పాల్గొనడని తెలిపింది.కాగా, ఆస్ట్రేలియా వచ్చే నెలలో తొలుత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా మూడు టీ20లు ఆడుతుంది. ఆతర్వాత అదే నెల 19 నుంచి భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు (19, 23, 25), ఐదు టీ20లు (29, 31, నవంబర్ 2, 6, 8) జరుగుతాయి. దీని తర్వాత ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ నవంబర్ 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు జరుగనుంది. యాషెస్ సిరీస్ కోసం ఫిట్గా ఉండడం కోసమే క్రికెట్ ఆస్ట్రేలియా కమిన్స్ను చాలాకాలం ఆటకు దూరంగా ఉంచనుంది. -
షాకింగ్ నిర్ణయం తీసుకున్న మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇకపై టెస్ట్లు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ సహా దేశవాలీ టీ20 లీగ్లకు కూడా అందుబాటులో ఉంటానని తెలిపాడు.35 ఏళ్ల స్టార్క్ 2024 టీ20 వరల్డ్కప్ నుంచి పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉంటున్నాడు. స్టార్క్ ఆస్ట్రేలియా తరఫున పేసర్లలో (టీ20లు) లీడింగ్ వికెట్ టేకర్గా (79) ఉన్నాడు. ఓవరాల్గా ఆడమ్ జంపా (130) తర్వాత ఆస్ట్రేలియా తరఫున రెండో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు.అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో స్టార్క్ 2021 వరల్డ్కప్లో అత్యుత్తమ దశను అనుభవించాడు. ఆ టోర్నీలో ఆసీస్ విజేతగా నిలిచింది. టీ20ల్లో ఆసీస్కు అదే తొలి వరల్డ్కప్.టీ20 కెరీర్లో ప్రతి మ్యాచ్ను, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని స్టార్క్ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. ఇందులో 2021 వరల్డ్కప్ హైలైట్గా ఉంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున పొట్టి ఫార్మాట్ను ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెబుతూనే, టెస్ట్లకే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చాడు.భారత పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే వరల్డ్కప్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు. పై టోర్నీలకు ఫిట్గా, ఫ్రెష్గా ఉండేందుకు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించక తప్పలేదని తెలిపాడు. 2012లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన స్టార్క్ ఈ ఫార్మాట్లో 65 మ్యాచ్లు ఆడి 7.74 ఎకానమీతో పరుగులు సమర్పించుకుని 79 వికెట్లు తీశాడు.కాగా, ఈ ఏడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు సంబంధించి ఆస్ట్రేలియాకు వరుస షాక్లు తగులుతున్నాయి. స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా స్టార్క్ టీ20ల నుంచి తప్పుకున్నాడు. -
ఆస్ట్రేలియాలో నిరసనలు
కాన్బెర్రా: ఆ్రస్టేలియాలో వలసదారులపై వ్యతిరేకత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది ఆ్రస్టేలియన్లు ఆదివారం వలసలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ప్రత్యేకించి భారతీయుల వలసలపై నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’పేరుతో ర్యాలీలు నిర్వహించారు. వందేళ్లలో వచ్చిన గ్రీకులు, ఇటాలియన్ల కంటే ఐదేళ్లలో ఎక్కువ మంది భారతీయులు వచ్చారని, ఈ వలసలు తమ దేశంలోని సంస్కృతిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 నుంచి 2023 వరకు 845,800 మంది భారతీయులు ఆస్ట్రేలియాకు వలస వచ్చారని వారు పంచిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఇది తాత్కాలిక సాంస్కృతిక మార్పు కాదని, ప్రత్యామ్నాయంగా ఏర్పడుతోందని వారు ఆరోపించారు. ఖండించిన ప్రభుత్వం.. ఈ ర్యాలీలను ఆ్రస్టేలియా ప్రభుత్వం ఖండించింది. జాత్యహంకారం, జాతికేంద్రీకరణపై ఆధారపడిన తీవ్రవాదానికి దేశంలో స్థానం లేదని పేర్కొంది. వారసత్వం ఏదైనా సరే, ఆ్రస్టేలియన్లందరూ సురక్షితంగా ఉండే హక్కును కలిగి ఉన్నారని పేర్కొంది. సామాజిక ఐక్యతను దెబ్బతీయాలని చూసే వ్యక్తులకు దేశంలో చోటు లేదని హోం వ్యవమారాల మంత్రి టోనీ బర్క్ అన్నారు. ద్వేషాన్ని వ్యాప్తి చేసే, సమాజాన్ని విభజించే ఇలాంటి ర్యాలీలకు తాము మద్దతు ఇవ్వబోమని ఫెడరల్ లేబర్ మంత్రి ముర్రే వాట్ స్పష్టం చేశారు. ఈ ర్యాలీలను ఆ్రస్టేలియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సరీ్వసెస్ కూడా ఖండించింది. వైవిధ్యమే ఆ్రస్టేలియాకు గొప్ప బలమని సంస్థ సీఈఓ కసాండ్రా గోల్డీ అన్నారు. ఫెడరల్ ప్రతిపక్ష నాయకుడు సుస్సాన్ లే సైతం ర్యాలీలపై స్పందించారు. ‘ప్రజల జాతీయత, మతం ఆధారంగా లక్ష్యంగా భావజాలానికి ఆ్రస్టేలియాలో స్థానం లేదు. హింస, జాత్యహంకారం లేదా బెదిరింపులకు ఇక్కడ చోటు లేదు. సామాజిక ఐక్యతను చీల్చే ద్వేషాన్ని, భయాన్ని అనుమతించలేం’అని స్పష్టం చేశారు. ప్రధాన నగరాల్లో ర్యాలీలు..సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రాతోపాటు ఇతర నగరాల్లో పెద్ద ర్యాలీలు జరిగాయి. సిడ్నీలో దాదాపు పదివేల మంది రోడ్డెక్కారు. నగర మారథాన్ కోర్సు దగ్గరకు చేరి జాతీయ జెండాలతో ప్రదర్శించారు. మెల్బోర్న్లో, నిరసనకారులు ఫ్లిండర్స్ స్ట్రీట్ స్టేషన్ వెలుపల ఆ్రస్టేలియన్ జెండాలు, వలస వ్యతిరేక ప్లకార్డులతో రాష్ట్ర పార్లమెంటుకు కవాతు చేశారు. ర్యాలీని ఉద్దేశించి నియో–నాజీ వ్యక్తి థామస్ సెవెల్ మాట్లాడుతూ వలసలను ఆపకపోతే, మన మరణం ఖాయమన్నారు. ఇక్కడ నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఆరుగురిని అరెస్టు చేశారు. కాన్బెర్రాలో, పార్లమెంట్ హౌస్కు ఎదురుగా ఉన్న సరస్సు వద్ద జరిగిన నిరసనలో వేలాది మంది పాల్గొన్నారు. క్వీన్స్ల్యాండ్లో, ఫెడరల్ ఎంపీ బాబ్ కట్టర్ టౌన్స్విల్లేలో జరిగిన ర్యాలీకి హాజరయ్యారు. -
విదేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళి
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో జనరంజక పాలన అందించిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రవాసాంధ్రులు కొనియాడారు. సెప్టెంబర్ 2న ఆయన వర్ధంతి సందర్భంగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్లోని సాండ్రింగ్హామ్ కమ్యూనిటీ సెంటర్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు.సంక్షేమాభివృద్ధిలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ ఎద్దుల, సుమంత్ డేగపూడి, కృష్ణారెడ్డి, విజయ్ అల్లా, రాజారెడ్డి, బాలశౌర్య, గీతారెడ్డి, రమేష్ పానాటి, సంకీర్త్ రెడ్డి, రఘునాథ్రెడ్డి, సుస్మిత, రేఖ, గౌతమి, సింధు, ప్రియాంక, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంఆ్రస్టేలియాలో రక్తదాన శిబిరం డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆడిలైడ్ నగరంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాయకులు వంశీ బొంతు, రామ్మోహన్రెడ్డి మునగల తదితరులతో పాటు వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మెల్బోర్న్ నగరంలో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి తదితరులు పాల్గొన్నారు. -
NRI News: వైఎస్సార్.. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం
సాక్షి, మెల్బోర్న్: దివంగత మహానేత, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్ధంతి నేపథ్యంతో ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం.. వైఎస్సార్ అని ఈ సందర్బంగా సభకు హాజరైన వాళ్లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా నాయకులు నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి, విష్ణు రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. -
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. చరిత్ర సృష్టించిన యువ బౌలర్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ కూపర్ కన్నోలీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతడు.. ఆసీస్ తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. కన్నోలీ కేవలం 22 ఏళ్ల 2 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో కన్నోలీ మాజీ ఫాస్ట్ బౌలర్ క్రెయిగ్ మెక్డెర్మాట్, ప్రస్తుత స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్లను వెనక్కు నెట్టాడు.మెక్డెర్మాట్ 22 ఏళ్ల 204 రోజుల వయసులో (1987) వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించగా.. స్టార్క్ 22 ఏళ్ల 211 రోజుల వయసులో (2012) ఈ ఘనత సాధించాడు. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనలతో కన్నోలీ మరో రికార్డు కూడా సాధించాడు. మైఖేల్ క్లార్క్ తర్వాత ఆసీస్ తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా రికార్డుల్లోకెక్కాడు. మైఖేల్ క్లార్క్ 2004లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 35 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. కన్నోలీ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో ఆసీస్ సౌతాఫ్రికాను 276 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 432 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో కన్నోలీతో పాటు (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) సత్తా చాటడంతో సౌతాఫ్రికా 155 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. -
కుప్పకూలిన సౌతాఫ్రికా.. చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా జట్టు తమ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించింది. ఇవాళ (ఆగస్ట్ 24) సౌతాఫ్రికాతో జరిగిన నామమాత్రపు వన్డేలో 276 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా ఆసీస్కు అతి భారీ విజయం నెదర్లాండ్స్పై (2023 వన్డే వరల్డ్కప్లో 309 పరుగుల తేడాతో) దక్కింది.యాదృచ్చికంగా ఈ మ్యాచ్లో ఆసీస్ చేసిన స్కోర్ కూడా వారి వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ స్కోర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. వన్డేల్లో ఆసీస్ తమ అతి భారీ స్కోర్ను కూడా సౌతాఫ్రికాపైనే చేసింది. 2006లో జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఆ జట్టుకు పరుగుల పరంగా వన్డేల్లో ఇదే అతి భారీ పరాజయంగా నిలిచింది. దీనికి ముందు 2023 వరల్డ్కప్లో భారత్ చేతిలో ఎదురైన 243 పరుగుల పరాజయం వారికి వన్డేల్లో అతి భారీ పరాజయంగా ఉండింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 432 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 24.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూపర్ కన్నోలీ (5/22) అద్బుత ప్రదర్శనతో చెలరేగి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. కూపర్ కన్నోలీ (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) ధాటికి 155 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. -
ప్రభావం చూపని బౌలర్లు.. టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం
బ్రిస్బేన్ వేదికగా భారత ఏ మహిళల జట్టుతో జరిగిన ఏకైక అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు సమాంతంరంగా నిలిచినా, రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించి, గెలుపు సొంతం చేసుకుంది.భారత్ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 305 పరుగులు చేసింది. 6 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 286 పరుగులకు ఆలౌటై, ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో బ్యాటర్లంతా తలో చేయడంతో ఆసీస్ 85.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రేచల్ ట్రెనామన్ (64), మ్యాడీ డ్రేక్ (68), అనిక లియారాయ్డ్ (72) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ తహిల విల్సన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేసింది. నికోల్ ఫాల్టుమ్ (16 నాటౌట్), ఎల్లా హేవర్డ్ (4) ఆసీస్కు విన్నింగ్స్ రన్స్ అందించారు.281 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ రాధా యాదవ్ 8 మంది బౌలర్లు మార్చిమార్చి ప్రయోగించినా ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. సైమా ఠాకోర్ 2, జోషిత, తనుశ్రీ తలో వికెట్ తీశారు.అంతకుముందు యామీ ఎడ్గర్ (19-6-57-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో, ప్రెస్ట్విడ్జ్ (13.4-2-47-3) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులకే పరిమితమైంది. రాఘ్వి బిస్త్ (86) రెండో ఇన్నింగ్స్లోనూ భారత్ను ఆదుకుంది. షఫాలీ వర్మ (52) అర్ద సెంచరీతో రాణించింది. తేజల్ (39), తనుశ్రీ (25), టైటాస్ సాధు (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.శతక్కొట్టిన జింజర్లోయర్ ఆర్డర్ బ్యాటర్ సియన్నా జింజర్ (103) సెంచరీతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో భారత్ స్కోర్కు ధీటుగా బదులిచ్చింది. జింజర్కు నికోల్ ఫాల్టుమ్ (54), తహిల విల్సన్ (49) సహకరించారు. భారత బౌలర్లలో సైమా ఠాకోర్ 3, రాధా యాదవ్, మిన్నూ మణి తలో 2 వికెట్లు పడగొట్టారు.ఆదుకున్న రాఘ్వితొలి ఇన్నింగ్స్లో రాఘ్వి బిస్త్ (93), జోషిత (51) ఆదుకోవడంతో భారత్ 299 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో బ్రౌన్, ప్రెస్ట్విడ్జ్ తలో 3 వికెట్లు తీశారుకాగా, భారత ఏ మహిళల జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ సిరీస్లో తొలుత టీ20 సిరీస్ జరగగా.. ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం భారత్ వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ఏకైక అనధికారిక టెస్ట్ మ్యాచ్లో గెలిచి ఆసీస్ సిరీస్ను చేజిక్కించుకుంది. -
మెరిసిన రాఘ్వి, షఫాలీ
బ్రిస్బేన్: తొలి ఇన్నింగ్స్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన రాఘ్వి బిస్త్ (119 బంతుల్లో 86; 13 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్లోనూ రాణించడంతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రాధా యాదవ్ సారథ్యంలోని భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రాఘ్వి బిస్త్, షఫాలీ వర్మ (58 బంతుల్లో 52; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకాలు సాధించగా... తేజల్ హస్నబిస్ (52 బంతుల్లో 39; 7 ఫోర్లు) రాణించింది. ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో అమీ ఎడ్గర్ 4 వికెట్లు పడగొట్టగా... జార్జియా 2 వికెట్లు తీసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 158/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టు... చివరకు 76.2 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. సియానా జింజర్ (138 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కగా... నికోల్ ఫాల్టుమ్ (91 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకుంది. భారత మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో సైమా ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా... రాధా యాదవ్, మిన్ను మణి చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులు చేసింది. ప్రస్తుతం చేతిలో రెండు వికెట్లు ఉన్న భారత జట్టు... ఓవరాల్గా 254 పరుగుల ఆధిక్యంలో ఉంది. జోషిత (9 బ్యాటింగ్), టిటాస్ సాధు (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఆమె బొమ్మలు గీస్తే డబ్బే డబ్బు.. ఒక్కోటి రూ. 40లక్షలకు పైమాటే..
ఖాళీ కాగితాలు కనిపిస్తే చిన్నపిల్లల వాటిపై బొమ్మలు గీస్తూ ఉంటారు. పెద్దలు వాటిని చూసి మురిసి΄ోతూ ఉంటారు. ఇదంతా చిన్నారులకు ఆనందం, పెద్దలకు మురిపెం. అయితే చిన్నారి గీసిన చిత్రాలకు రూ.కోట్లలో ధర పలికితే? అది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలిటా ఆండ్రీ (Aelita Andre). రెండేళ్లకే చిత్రలేఖనం మొదలుపెట్టిన ఈ అమ్మాయి గీసిన చిత్రాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. ఎలిటా ఆండ్రీ 2007లో జన్మించింది. ఆమెది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్. రెండేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. అందరు చిన్నారులు వేసేలాంటి చిత్రాలు కాకుండా కొత్త రకమైన చిత్రకళను సాధన చేసింది. అబ్స్స్ట్రాక్ట్ ఆర్ట్ (నైరూప్య కళ) ద్వారా తాను అనుకున్న భావాలను చిత్రాలుగా గీసేది. అందుకోసం తను ఎంచుకునే థీమ్స్, తీసుకునే రంగులు విభిన్నంగా ఉండేవి. దీంతో అతి చిన్నవయసులో అబ్స్స్ట్రాక్ట్ ఆర్ట్లో కృషి చేస్తున్న కళాకారిణిగా తన గురించి అందరికీ తెలిసింది. మెల్లగా తన చిత్రాలు అందరికీ పరిచయమయ్యాయి. ఎలిటా గీసే ఒక్కో చిత్రం సుమారు 50,000 యూఎస్ డాలర్ల (దాదాపు రూ.43 లక్షల) వరకు అమ్ముడవుతాయి. సెయింట్ పీటర్స్బర్గ్లోని రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం, మయామిలోని ఆర్ట్ బాసెల్తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అనేక మ్యూజియంలలో ఎలిటా తన చిత్రాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఎలిటాకు 18 ఏళ్లు. చిత్రకళను మరింత సాధన చేస్తూ, తన సొంత వెబ్సైట్ ద్వారా చిత్రాలను అమ్ముతోంది. చిత్రకారిణిగా మరింత పేరు తెచ్చుకోవడమే తన ధ్యేయం అని వివరిస్తోంది. View this post on Instagram A post shared by Aelita Andre (@aelitaandre) -
విజృంభించిన ఎంగిడి.. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన సౌతాఫ్రికా
వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా భారీ షాకిచ్చింది. ఆసీస్ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఐదో ద్వైపాక్షిక సిరీస్ విజయం. దీనికి ముందు 2016 (5-0), 2018 (2-1), 2019 (3-0), 2023 (3-2)లో కూడా సౌతాఫ్రికా ఆసీస్ను మట్టి కరిపించింది. ఆస్ట్రేలియాకు వరుసగా ఇది మూడో వన్డే సిరీస్ పరాజయం. సౌతాఫ్రికాకు ముందు ఆస్ట్రేలియా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి చిన్న జట్ల చేతుల్లో కూడా సిరీస్ కోల్పోయింది.మెక్కే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 22) జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాపై 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. లుంగి ఎంగిడి (8.4-1-42-5) ధాటికి 37.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. ఎంగిడికి బర్గర్ (6-0-23-2), ముత్తుసామి (8-0-30-2), ముల్దర్ (5-0-31-1) కూడా జత కలవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మధ్యలో జోష్ ఇంగ్లిస్ (87) ఆసీస్ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఒక్కరి నుంచి కూడా సహకారం లభించలేదు. ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్తో అడ్డుతగలడంతో ఆసీస్ పతనం కాస్త లేట్ అయ్యింది. ఆ జట్టు తరఫున ఇంగ్లిస్తో పాటు కెమరూన్ గ్రీన్ (35) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. హెడ్ (6), మార్ష్ (18), లబూషేన్ (1), క్యారీ (13), హార్డీ (10), బార్ట్లెట్ (8), ఎల్లిస్ (3), జంపా (3) దారుణంగా నిరాశపరిచారు. ఈ సిరీస్లో తొలి వన్డేలో కూడా ఆసీస్ ఇలాగే ఘోర పరాజయాన్ని చవి చూసింది. మిగిలిన నామమాత్రపు వన్డేలో అయిన ఆసీస్ రాణిస్తుందేమో చూడాలి. ఈ మ్యాచ్ ఆగస్ట్ 24న ఇదే వేదికగా జరునుంది. కాగా, ఈ వన్డే సిరీస్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
ఆల్ టైమ్ రికార్డు సమం చేసిన కెమరూన్ గ్రీన్
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ ఓ ఆల్టైమ్ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఓ వన్డేలో అత్యధిక ఔట్ ఫీల్డ్ క్యాచ్లు పట్టుకున్న ఆటగాడిగా మార్క్ టేలర్ (1992), మైఖేల్ క్లార్క్ (2004), ఆండ్రూ సైమండ్స్ (2006), గ్లెన్ మ్యాక్స్వెల్ (2015), మిచెల్ మార్ష్ (2016), గ్లెన్ మ్యాక్స్వెల్ (2017), లబూషేన్ (2024) సరసన చేరాడు. వీరంతా ఓ వన్డేలో తలో నాలుగు ఔట్ ఫీల్డ్ క్యాచ్లు పట్టారు.ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో గ్రీన్ ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, వియాన్ ముల్దర్, నండ్రే బర్గర్ క్యాచ్లు పట్టాడు. గ్రీన్తో పాటు మిగతా ఆసీస్ ఆటగాళ్లు కూడా మైదానంలో పాదరసంలా కదలి సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఆ జట్టు 31 ఓవర్లలో 163 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ట్రవిస్ హెడ్ (6), మిచెల్ మార్ష్ (18), లబూషేన్ (1), గ్రీన్ (35), క్యారీ (13) ఔట్ కాగా.. జోస్ ఇంగ్లిస్ (78), ఆరోన్ హార్డీ (6) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్ 2, ఎంగిడి, ముల్దర్, ముత్తుసామి తలో వికెట్ తీశారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో పర్యాటక సౌతాఫ్రికా తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
అల్బనీస్ బలహీనమైన నాయకుడు
జెరూసలేం: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతోనీ అల్బనీస్ ఇజ్రాయెల్కు ద్రోహం చేశారని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఆ్రస్టేలియాలోని యూదు సమాజాన్ని ఆ దేశం వదిలేసిందన్నారు. బలహీనమైన రాజకీయ నాయకుడిగా ఆయనను చరిత్ర గుర్తుంచుకుంటుందని విమర్శించారు. ఆ్రస్టేలియన్ యూదు సంఘం (ఏజేఏ) నిర్వహించిన కార్యక్రమానికి హాజరవ్వాలన్సిన ఇజ్రాయెల్ నేత సిమ్చా రోత్మన్ వీసాను ఆస్ట్రేలియా రద్దు చేసింది.విభజన రాజకీయాలు చేస్తున్నవారిపై తమ ప్రభుత్వం కఠినమైన వైఖరి తీసుకుంటుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి టోనీ బర్క్ ప్రకటించారు. ‘మీరు ద్వేషం, విభజన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆస్ట్రేలియాకు వస్తున్నట్లయితే.. మీరు ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు’అని బర్క్ స్పష్టం చేశారు. దీంతో రోత్మన్ సమావేశంలో వర్చువల్గా పాల్గొని, ప్రసంగిస్తారని ఏజేఏ తెలిపింది. యూదు సమాజం టోనీ బర్క్కు, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్కు తలవంచదని ప్రకటించింది. ఈ పరిణామాల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తీసుకోనుఅయితే.. నెతన్యాహు వ్యాఖ్యలపై బర్క్ బుధవారం స్పందించారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ఆ్రస్టేలియా ప్రకటించినందుకే ఆయనకు ఆగ్రహం వస్తోందన్నారు. ఇక.. బలమైన నాయకుడంటే.. ఇతర దేశాలపై దాడులు చేసేవారు, ఇతర దేశాల్లో ప్రజలను ఆకలితో చంపేవారు కాదని, దాడులు, హత్యలతో ఒక దేశాధ్యక్షుడి బలాన్ని అంచనా వేయలేమని ఎద్దేవా చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలపై ప్రధాని అల్బనీస్ సైతం స్పందించారు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోనన్నారు. తాను ఇతర దేశాల నాయకులను గౌరవంగా చూస్తానని, దౌత్యపరంగా వారితో సంభాíÙస్తానని హుందాగా చెప్పుకొచ్చారు. అయితే ఇజ్రాయెల్ మితవాద నేతల వీసాలను ఆ్రస్టేలియా రద్దు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో పార్లమెంటును విడిచిపెట్టిన నాయకురాలు, ఇజ్రాయెల్ మాజీ న్యాయ మంత్రి అయెలెట్ షేక్డ్కు కూడా వీసా నిరాకరించారు. నెతన్యాహుతో ఘర్షణ పడేవారే అసలైన నాయకుడు నెతన్యాహు వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ విమర్శించారు. అంతేకాదు.. ఆయన వ్యాఖ్యలను ఆ్రస్టేలియా నాయకునికి బహుమతిగా అభివరి్ణంచారు. ‘రాజకీయంగా అత్యంత విషపూరిత నాయకుడైన నెతన్యాహుతో ఘర్షణ పడేవారే ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రపంచంలో అసలైన నాయకుడు. ఆ్రస్టేలియా ప్రధానమంత్రికి ఈ బహుమతిని ఇచ్చారు’అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.పాలస్తీనాకు మద్దతు ఇవ్వడంతో.. పాలస్తీనా దేశాన్ని యూఎన్లో ఉన్న 193 సభ్య దేశాల్లో 147 దేశాలు గుర్తించాయి. యూకే, ఫ్రాన్స్, కెనడాలు కూడా ఆ దేశాల జాబితాలో చేరాయి. ఆ తర్వాత ఆ్రస్టేలియా సైతం పాలస్తీనాకు మద్దతు ఇచి్చంది. ఆ సమయంలో ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ ‘అమాయక ప్రజలపై యుద్ధ చూపుతున్న ప్రభావాన్ని నెతన్యాహు పట్టించుకోవడం లేదు. సహాయ పంపిణీ కేంద్రాల చుట్టూ ప్రజలు ఆహారం, నీటి కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు’అన్నారు. అప్పటినుంచి ఆయా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ప్రతిస్పందనగా, నెతన్యాహు మూడు దేశాల నాయకులపై దాడిని ప్రారంభించారు. కెయిర్ స్టార్మర్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మార్క్ కారీ్నలు.. సామూహిక హంతకులు, రేపిస్టులు, శిశువుల హంతకులు, కిడ్నాపర్ల పక్షాన నిలుస్తున్నారని ఆరోపించారు.


