breaking news
australia
-
ఎవరీ మిరాండా గిబ్సన్? ఏకంగా 449 రోజులు..
ఒంటరిగా నిరసన చేయడానికి ఎంతో గుండె నిబ్బరం కావాలి. అది ప్రజల మనసును కదిలించి..అందుకు అందరూ చేయి చేయి కలిపి ముందు వచ్చేలా చేయగలగాలి. సమస్య పరిష్కారం దిశగా నడిపించగలగాలి. అందుకు నిరసనలో ప్రత్యేకత తప్పనిసరి. ముఖ్యంగా యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసేలా ప్రేరేపించాలి. అచ్చం అలాంటి నిరసననే చేపట్టి మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. పైగా ఆ సమస్యపై ప్రతి పౌరుడు బాధ్యత వహించేలా చేసి ప్రభుత్వాన్నే చైతన్యపరిచింది.ఆ అమ్మాయే మిరాండా గిబ్సన్. ఆమె ఏమి మొదటి నుంచి పర్యావరణ కర్త కాదు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో ఇప్స్విచ్లో పెరిగిన ఆమెకు అడవులు గురించి అంతగా తెలియదు, వాటితో పరిచయం కూడా లేదు. సరిగ్గా టీనేజ్ వయసులో విశ్వవిద్యాలయ చదువుల సమయంలో అటవీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది. టాస్మానియా అడవులు ఎలా అంతరించిపోతున్నాయో తెలుసుకుంది. అలా ఆ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాల గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ అడవులు ఉండే రాష్ట్రాన్ని సందర్శించి ఆ సమస్యను కళ్లారా చూసి.. చలించిపోయింది. అక్కడ అప్పర్ ఫ్లోరెంటైన్ లోయకు ఒక పర్యటనలో అప్పటికే మొద్దుగా మారిపోయిన ఒక భారీ చెట్టు ఆమెకు ఎదురైంది. ఆ దృశ్యం రానున్న రోజుల్లో ఎంతటి నష్టాన్ని దారితీయనున్నదో తెలియజేసిందామెకు. దాంతో సెలవుల్లో నిరసనలలో చేరేందుకు టాస్మానియాకు తిరిగి రావడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రచార కార్యకర్తలతో పనిచేయడం మొదలుపెట్టడమే కాకుండా అక్కడే స్థిరపడింది. అలా ఆమె అప్పర్ ఫ్లోరెంటైన్ లోయ దిగ్బంధంలో సంవత్సరాలు గడిపింది. కానీ అడువులు కనుమరుగవుతూ ఉండటాన్ని సాంప్రదాయ నిరసనలు తగినంత ప్రభావాన్ని చూపించడం లేదని గుర్తించింది. టాస్మానియా అడవులను దాటి ఈ విధ్వంసాన్ని ప్రపంచానికి కనిపించేలా చేయడానికి ఒక మార్గం కోసం వెతికి మరి.. 'ట్రీ సిట్ నిరసన'ను ఎంచుకుందామె. అదీగాక కలప నరికివేత ఉన్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉందని తెలుసుకుందామె. ఆ కనెక్షన్ ద్వారా, ఆమె అడవిలోని చిత్రాలను నేరుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రసారం చేయగలిగితే తన పని సులువవుతుందని అనుకుంది. అలా గిబ్సన్ డిసెంబర్ 14, 2011న అడవిలోని ఒక చెట్టుని ఎంచుకుని, దానిపై సుమారు 60 కిలోమీటర్ల ఎత్తులో ఒక చిన్న వేదికపై కూర్చొని నిరసన ప్రారంభించింది. అంతేగాదు అడవికి రక్షణ లభించేంత వరకు 'ట్రీ సిట్' నిరసన కొనసాగిస్తానని ప్రకటించింది. ఆమె చెట్టుపై ఏర్పాటు చేసుకున్న ఆవాసం చాలా సాధారణమైనది. కేవలం 1.5 మీటర్ల వెడల్పుతో పరిమిత స్థలాన్ని మాత్రమే అందించింది. అలా ఆమె ఏకంగా 449 రోజులు ఒంటరిగా ఆ చెట్టుపైనే గడిపింది. టాస్మానియా అనూహ్య వాతావరణం మార్పులన్నింటిని తట్టుకుంది. తాజా సమాచారాన్ని పంచుకునేందుకు సౌరశక్తితో నడిచే కంప్యూటర్ని వినియోగించింది. చురుకుగా ఉండటానికి ఒక చిన్న వాకింగ్ మెషీన్, యోగ సాధన వంటి దినచర్యతో ఒంటరిగా ఆ చెట్టుపైనే నిరసన చేసింది. ఈ నిరసన ఫలితంగా ఆమె కనీస అవసరాలను తీర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఆ చెట్టుపైనే ఉంటూ.. పచ్చి ఆహారమే తింటూ నిరసన కొనసాగించింది. ముఖ్యంగా ఒంటరితనం, నిత్యావసరాలను సర్దుకుని మరి కొనసాగించక తప్పని స్థితి అయినా అధైర్యపడలేదు. అనుకున్నట్లుగానే నెలలు గడిచేకొద్దీ, గిబ్సన్ చెట్టుపై కూర్చోవడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ప్రజల నుంచి అమితమైన స్పందన మద్దతు లభించాయి. అలా 2013 ప్రారంభంలో టాస్మానియా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడమే గాక అడవుల విస్తరణకు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే అదంతా అధికారికంగా గుర్తింపు లభించేంత వరకు ఆ చెట్టుపైనే ఉండి నిరసన చేద్దాం అనుకుంటే ప్రకృతి కార్చిచ్చు రూపంలో వ్యతిరేకించడంతో నిరసనను విరమించక తప్పలేదు గిబ్సన్కి. ఎలాగైతేనేం ఆమె పోరాటం ఫలించింది. గిబ్సన్ గడిపిన చెట్టుతో సహా అటవీ ప్రాంతాలకు అదనపు రక్షణను ప్రపంచ వారసత్వ కమిటీ ఆమోదించింది. గిబ్సన్ 449 రోజులు గడిపిన ఆ నివాస చెట్టుకి అధికారిక గుర్తింపు లభించింది. అయితే గిబ్సన్ ఆ తర్వాత పూర్తికాల కార్యకర్తగా తన వృత్తిని విడిచిపెట్టి, మెల్బోర్న్లో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించింది. టాస్మానియా అడవులపై జరుగుతున్న విస్తృత పోరాటంలో ఆ చెట్టుపై ఆమె గడిపిన సమయం ఒక కీలక అధ్యాయంగా నిలిచింది.(చదవండి: సీతగా అలరించనున్న సాయిపల్లవి జపమాల ఎందుకు ధరిస్తుందంటే..!) -
మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా.. ఎక్కడంటే..
కాన్బెర్రా: ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ (ఏసీటీ) విద్యార్ధి సంక్షోభం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇవెట్ బెర్రీ తన పదవికి రాజీనామా చేశారు. తన శాఖలోని ఇద్దరు సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు సమగ్ర విచారణలో తేలడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కుంభకోణంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని విచారణ కమిషన్ స్పష్టం చేసినప్పటికీ, నైతిక బాధ్యత వహిస్తూ బెర్రీ కేబినెట్ నుంచి వైదొలగడం విశేషం. రూ. 18.2 మిలియన్ల విలువైన పాఠశాల కాంట్రాక్ట్ను రియల్ ఎస్టేట్ సంస్థకు కట్టబెట్టడంతో ఈ అవినీతి జరిగినట్లు ఏబీసీ నివేదిక వెల్లడించింది.భారతదేశంలో అత్యంత కీలకమైన వైద్యవిద్య ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టడంతో, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలోని బెర్రీ రాజీనామా ఉదంతంతో భారత విద్యాశాఖ మంత్రి వైదొలగిన తీరును పలువురు పోల్చి చూస్తున్నారు. ఏసీటీ రాజకీయాల్లో కీలక నేతగా, సుదీర్ఘకాలం డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన బెర్రీ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.ఇది కూడా చదవండి: జైలుపాలైన లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు! -
అక్కడే మేం గెలిచాం.. ఆసీస్ సిరీస్పై బంగ్లా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం బంగ్లాదేశ్ క్రికెట్కు గౌరవకరమైన విషయమని పేర్కొన్నాడు. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు."గతంలో మా జట్టుతో ఆడేటప్పుడు ప్రత్యర్థులు తరచూ ప్రయోగాలు చేసేవారు. కానీ ఈసారి ఆస్ట్రేలియా పూర్తి బలంతో కూడిన జట్టును పంపడం మా జట్టు సాధించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇది ప్రపంచ స్థాయి జట్టుతో మా సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశం" అని శాంటో అన్నాడు.ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, కామెరూన్ గ్రీన్, బో వెబ్స్టర్ వంటి స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.అయితే సిరీస్కు ముందు బంగ్లాదేశ్కు గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. వికెట్కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ ఇంకా కాఫ్ గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ఫాస్ట్ బౌలర్లు నహీద్ రానా (సైడ్ స్ట్రెయిన్), షోరిఫుల్ ఇస్లాం (హామ్స్ట్రింగ్ గాయం) కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు.మరో పేసర్ ఎబాదోత్ హొస్సేన్ ఇటీవలే జన్మించిన తన బిడ్డతో ఉండేందుకు ఈ సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే అవసరమైతే తిరిగి జట్టుతో చేరే అవకాశముందని సమాచారం.తొలి టెస్ట్ డార్విన్ వేదికగా ఆగస్టు 13-17 వరకు, రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్టు 22-26 మధ్య జరగనుంది. దీనికి ముందు పర్యాటక బంగ్లాదేశ్ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్తో ఓ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 6-8 వరకు డార్విన్ వేదికగా జరుగనుంది. -
నెలకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నా నచ్చడం లేదట!
నెలకు దాదాపు రూ.4 లక్షల ఆదాయం, ఖర్చులు తక్కువ, మంచి పొదుపు.. అయినప్పటికీ భారత్లో భవిష్యత్తు కనిపించడం లేదని, విదేశాలకు వెళ్లి స్థిరపడాలని కోరుకుంటున్న 26 ఏళ్ల రిమోట్ ఉద్యోగి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికతో పాటు యువతలో పెరుగుతున్న వలస ధోరణిపై మరోసారి చర్చకు దారితీసింది.'ఫిక్స్ యువర్ ఫైనాన్స్' అనే పోడ్కాస్ట్లో పర్సనల్ ఫైనాన్స్ కోచ్ అన్షుమన్ శర్మతో మాట్లాడిన డేనియల్ (మార్చిన పేరు కావచ్చని భావిస్తున్నారు) ప్రస్తుతం యూరప్కు చెందిన ఒక సంస్థలో రిమోట్గా పనిచేస్తున్నట్లు తెలిపాడు. తనకు నెలకు సుమారు 3,700 యూరోలు జీతంగా వస్తోందని, భారత కరెన్సీలో అది సుమారు రూ.4 లక్షలు ఉంటుందని వివరించాడు. తన నెలవారీ ఖర్చులు కేవలం రూ.1.20 లక్షల వరకు మాత్రమే ఉండటంతో మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తున్నానని చెప్పాడు.ఆస్ట్రేలియాకు వెళ్తాడట..ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెన్సీ (PR) కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్లు డేనియల్ వెల్లడించాడు. దీనిపై స్పందించిన అన్షుమన్ శర్మ, ప్రతి నెలా రూ.1.5 లక్షలను రికరింగ్ డిపాజిట్ (RD)లో పెట్టుబడి పెడితే, కొన్ని నెలల్లోనే పీఆర్ ప్రక్రియకు అవసరమైన నిధులు సిద్ధమవుతాయని సూచించారు."డబ్బు కాదు.. జీవన నాణ్యత ముఖ్యం"ఇంత మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఎందుకు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నావని అడగగా, డేనియల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తన నిర్ణయం పూర్తిగా జీవన నాణ్యత (Quality of Life), పాలన, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలపై ఆధారపడి ఉందని చెప్పాడు. భారత్లో దీర్ఘకాలికంగా తన కుటుంబానికి ఆశించిన స్థాయి అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయపడ్డాడు.అన్షుమన్ శర్మ కూడా యువతలో పెరుగుతున్న వలస ఆలోచనలపై మాట్లాడుతూ, అధిక పన్నులు, కాలుష్యం, విద్యా వ్యవస్థలోని సమస్యలు, ఉద్యోగాలపై అనిశ్చితి వంటి కారణాలు చాలా మందిని విదేశాల వైపు ఆకర్షిస్తున్నాయని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో భిన్న స్పందనలుఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. "ఆస్ట్రేలియాలో కూడా ఆదాయపు పన్ను చాలా ఎక్కువే" అని కొందరు గుర్తుచేశారు. మరికొందరు "అక్కడ జీవన వ్యయం కూడా భారీగా ఉంటుంది. నెలకు 3,700 యూరోలు లేదా దానికి సమానమైన ఆదాయంతో ఆస్ట్రేలియాలో పెద్దగా పొదుపు చేయడం కష్టమే" అని వ్యాఖ్యానించారు.ఇంకొందరు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మాత్రం, "విదేశాల్లో అవకాశాలు ఉన్నప్పటికీ భారత్లో కుటుంబ బంధాలు, తక్కువ జీవన వ్యయం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు" అని అభిప్రాయపడ్డారు.వాస్తవ పరిస్థితి ఏమిటి?ఇటీవలి సంవత్సరాల్లో ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు నైపుణ్యం కలిగిన వలసదారులపై ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. అలాగే అక్కడ ఇంటి అద్దెలు, ఆరోగ్య సేవలు, జీవన వ్యయం గణనీయంగా పెరిగాయి. అందువల్ల విదేశాలకు వెళ్లే ముందు ఉద్యోగ భద్రత, వీసా నిబంధనలు, పన్నులు, జీవన వ్యయం, కుటుంబ అవసరాలు వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
ఆస్ట్రేలియా జట్లలోకి మరో ఇద్దరు భారత సంతతి క్రికెటర్లు
భారత సంతతికి చెందిన మరో ఇద్దరు క్రికెటర్లు ఆస్ట్రేలియాలో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఢిల్లీలో పుట్టిన నిఖిల్ చౌదరి ఆసీస్ తరఫున అరంగేట్రం చేయగా.. తాజాగా జెర్సిస్ వాడియా, ఆర్యన్ శర్మ అనే ఇద్దరు కుర్రాళ్లు క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన వేర్వేరు జట్లకు ఎంపికయ్యారు.ముంబైలో జన్మించిన జెర్సిస్ వాడియా దక్షిణ ఆస్ట్రేలియా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో అతడికి అవకాశం లభించింది. ఇటీవల బిగ్ బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున బ్రిస్బేన్ హీట్పై తొలి మూడు బంతులకే వరుసగా మూడు సిక్సర్లు బాది సంచలనంగా మారాడు.మరోవైపు 18 ఏళ్ల ఆల్రౌండర్ ఆర్యన్ శర్మను చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీ కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా డెవలప్మెంట్ స్క్వాడ్లోకి ఎంపిక చేశారు. కుడిచేతి బ్యాటర్, ఎడమచేతి స్పిన్ బౌలర్ అయిన ఆర్యన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు, మెల్బోర్న్ స్టార్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.వలస కుటుంబంలో జన్మించిన ఆర్యన్ శర్మ చిన్నప్పటి నుంచే ఆస్ట్రేలియా తరఫున ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 10 ఏళ్ల వయసులోనే "18 ఏళ్లకు ఆస్ట్రేలియా జట్టుకు ఆడాలి" అని రాసుకున్న లక్ష్యాన్ని అండర్-19 జాతీయ జట్టులో చోటు దక్కించుకుని నిజం చేసుకున్నాడు.వీరిద్దరి ఎంట్రీతో క్రికెట్ ఆస్ట్రేలియాలో భారత సంతతి ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది. నిఖిల్ చౌదరికి ముందు గురిందర్ సంధు, తన్వీర్ సంఘా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేయగా.. తాజాగా జెర్సిస్ వాడియా, ఆర్యన్ శర్మ ఆసీస్ అరంగేట్రానికి రెడీ అయ్యారు. ఇంకా చాలామంది భారత సంతతి చెందిన క్రికెటర్లు ఆస్ట్రేలియాలో క్రికెట్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. -
హైదరాబాద్ వీరుడికి ఆస్ట్రేలియా శాశ్వత పౌరసత్వం
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియాలోని బాండీ బీచ్లో గతేడాది డిసెంబర్ 14న యూదులు లక్ష్యంగా ఐసిస్ సానుభూతిపరులైన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ మారణహోమానికి తెగబడ్డ వేళ 20 మందిని కాపాడిన హైదరాబాదీ వీరుడు రెహ్మత్ పాషాకు ఆ దేశ ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న రెహ్మత్ పాషా ప్రదర్శించిన తెగువను పరిగణనలోకి తీసుకొని అతనికి శాశ్వత పౌరసత్వం కల్పించింది. అలాగే అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించే వారికి అందించే ఓజెడ్ బ్రేవరీ అవార్డుకు సైతం నామినేట్ చేసింది. ప్రజలను కాపాడే సమయంలో పాషా వినియోగించిన టోపీని మ్యూజియంలో పెట్టింది. వీలున్నంత వరకు సహకరించాలని... బాండీ బీచ్లో హనుక్కా వేడుకలు జరుపుకుంటున్న స్థానిక యూదులు లక్ష్యంగా ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో అప్రమత్తమైన రెహ్మత్ పాషా క్షతగాత్రులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. క్షతగాత్రులను చెట్లు, బెంచీలు, స్టీల్ కిచెన్ నిర్మాణాల వెనుకకు ఈడ్చుకెళ్లారు. బాధితులను అంబులెన్సుల వరకు తరలించడంలోనూ కీలకపాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత పాషా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీడీఎస్డీ) బారినపడ్డారు. దీంతో తాత్కాలికంగా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికి సైతం దూరమయ్యారు.దీనిపై స్పందించిన ఆ్రస్టేలియా ప్రభుత్వం.. పాషాకు ఆర్థిక సాయం, వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించింది. తాజాగా ఆ్రస్టేలియా మంత్రి టోనీ బర్క్ స్వయంగా పాషాకు ఫోన్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీ మంజూరు చేస్తున్నట్లు, ‘ఓజెడ్ బ్రేవరీ అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ మారణహోమానికి పాల్పడ్డ సాజిద్, నవీద్లు సైతం హైదరాబాదీలే కావడం గమనార్హం. పోలీసుల ఎదురుకాల్పుల్లో సాజిద్ మృతిచెందగా నవీద్ జైల్లో ఉన్నాడు. -
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
ఆస్ట్రేలియాకు చెందిన 34 ఏళ్ల జెనిటార్ సా నా’అమోవానా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈమె ఇటీవల నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే నలుగురు చిన్న పిల్లలను పెంచుతున్న ఆ దంపతుల ఇల్లు ఈ నలుగురు పాపల రాకతో మొత్తం ఎనిమిది మంది సభ్యుల కుటుంబంగా మారింది. కానీ ఈ సంతోషకరమైన పరిణామం రాత్రికి రాత్రే వారికి సరికొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది.నలుగురు ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రులు తాము మర్చిపోలేని ఆశీర్వాదంగా అభివర్ణించారు. కానీ వారిని సంరక్షించేందుకు ఆర్థిక వనరులు అవసరమం. ముఖ్యంగా డైపర్లు, ఫార్ములా పాలు, బట్టలు లాంటి రోజువారీ ఖర్చులు ఊహించని భారమే. అయితే ఒకేసారి నలుగురు నవజాత శిశువులను పోషించేందుకు స్నేహితులు, అభిమానులు మొదట్లో చాలా సాయంగా నిలిచారు. మరికొంతమంది ఆ దంపతుల పట్ల ప్రశంసలు కురిపిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్వహించే క్రమంలో సమాజం నుండి లభిస్తున్న ఈ మద్దతు వారికి ఎంతో విలువైందిగా మారింది.అయితే వీరికి ఇంకో సమస్య వచ్చి పడింది. వీళ్లందరితో ప్రయాణించేందుకు ప్రస్తుతం ఉన్న కారులో అందరూ సురక్షితంగా కూర్చోవడానికి సరిపడా సీట్లు లేవు. ఆసుపత్రి పర్యటనలు, స్కూల్ డ్రాప్లు, ఇతర ప్రయాణాలు సులభంగా సాగేందుకు 10 సీట్ల వ్యాన్ (10-seater van)అవసరం ఉంటుందని ఆ కుటుంబం భావిస్తోంది. అలాంటి వ్యాన్ను కొనుగోలు చేయడానికి ఆ తల్లి ఆన్లైన్లో విరాళాల సేకరణను (fundraising) ప్రారంభించడం విశేషంగా నిలిచింది. తమ ఏడుగురు పిల్లలందరికీ సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సరైన వాహనం, వనరులు ఉన్నాయని నిర్ధారించుకోవడమే ఆ కుటుంబం తక్షణ లక్ష్యంగాపెట్టుకుంది.డాక్టర్ అలెక్సా బెండాల్ ఏమన్నారంటేమోనోజైగోటిక్ క్వాడ్రప్లెట్స్ (ఒకే ఫలదీకరణం చెందిన అండం నుండి ఏర్పడిన ఒకేలా ఉండే నలుగురు శిశువులు) ప్రపంచంలోనే అత్యంత అరుదైన గర్భధారణ రకాల్లో ఒకటి. నామోనా విషయంలో విశేషం ఏమిటంటే, ఆమెకు పుట్టిన ఈ నలుగురు శిశువులకు ఒకే మాయ (placenta) అని నామెనాకు వైద్యం చేసిన డాక్టర్, రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్కు చెందిన ఫీటల్ మెడిసిన్,ప్రసూతి వైద్యురాలు డాక్టర్ అలెక్సా బెండాల్ తెలిపారు. 1.5 కోట్ల కేసుల్లో ఒకరికి మాత్రమే జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఒకటి రెండు కేసులు ఉండి ఉండవచ్చు కానీ ఆస్ట్రేలియాలో తమకు తెలిసినంత వరకు ఇదే ఏకైక కేసు అని చెప్పారు. View this post on Instagram A post shared by Brisbane Times (@brisbane_times) ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్. -
ఆసీస్ క్రికెటర్ రిటైర్మెంట్.. ఇకపై ‘నా’ దేశానికి ఆడతా!
ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ మోజెస్ హెన్రిక్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. బిగ్ బాష్ లీగ్తో పాటు ఆసీస్ దేశవాళీ క్రికెట్కూ వీడ్కోలు పలికాడు. కాగా 2009 -2021 మధ్య హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా నాలుగు టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 164, వన్డేల్లో 117, టీ20లలో 355 పరుగులు సాధించిన మోజెస్ హెన్రిక్స్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా రెండు, ఎనిమిది, ఏడు వికెట్లు కూల్చాడు.ఐపీఎల్లోనూ..ఇక ఐపీఎల్లో 62 మ్యాచ్లు ఆడిన హెన్రిక్స్.. 1000 పరుగులు చేయడంతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా 2021లో ఆసీస్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన హెన్రిక్స్.. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), దేశీ క్రికెట్లో యాక్టివ్గా ఉన్నాడు. బీబీఎల్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున కీలకంగా వ్యవహరించిన ఈ ఆల్రౌండర్.. దేశవాళీ క్రికెట్లో న్యూ సౌత్ వేల్స్కు ఆడుతున్నాడు.పోర్చుగల్లో జన్మించి..అయితే, టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త ఫార్మాట్ రూపొందించిన తరుణంలో మోజెస్ హెన్రిక్స్ ఆసీస్ క్రికెట్ నుంచి పూర్తిస్థాయిలో తప్పుకోవడం గమనార్హం. కాగా మోజెస్ హెన్రిక్స్ పోర్చుగల్లో జన్మించాడు. ఆ తర్వాత క్రికెట్ కెరీర్ కోసం ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు.ఇక ఇప్పుడు తన సొంత దేశం పోర్చుగల్ తరఫున క్రికెట్ ఆడాలని మోజెస్ హెన్రిక్స్ నిర్ణయించుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2028లో భాగంగా యూరోపియన్ క్వాలిఫయింగ్ పోటీల్లో పోర్చుగల్ తరఫున అతడు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఈ టోర్నీపై దృష్టి సారించేందుకు 39 ఏళ్ల హెన్రిక్స్ ఆసీస్ క్రికెట్కు దూరమైనట్లు తెలుస్తోంది.పరుగుల వరద.. వికెట్ల వీరుడుఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో న్యూ సౌత్వేల్స్ జట్టు తరఫున 2006లో అరంగేట్రం చేశాడు మోజెస్ హెన్రిక్స్. అదే ఏడాది లిస్ట్-ఎ క్రికెట్లోనూ అడుగుపెట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.మొత్తంగా 131 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 141 లిస్-ఎ మ్యాచ్లు, 301 టీ20 మ్యాచ్లు ఆడిన హెన్రిక్స్.. 6830, 3812, 5747 పరుగులు సాధించాడు. మీడియం పేసర్ అయిన అతడు మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 333 వికెట్లు కూల్చాడు. ఇక బీబీఎల్లో 3324 పరుగులు సాధించడంతో పాటు.. సిడ్నీ సిక్సర్స్ కెప్టెన్గా 2019, 2020లో టైటిల్ అందించాడు.చదవండి: ఇంగ్లండ్ టెస్టు కోచ్గా అశ్విన్? -
ప్లీజ్ పట్టుచీరను ఎలా ఉతకాలో చెప్పరు..!: ఓ విదేశీ మహిళ అభ్యర్థన
మహిళామణులకు పట్టు చీర అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదివాళ్లకు ఒక వస్త్రం మాత్రమే కాదు ఒక హుందాతనాన్ని, పండుగ వాతావరణాన్ని అందించే జ్ఞాపకాల చీర. ఆ చీరలో వాళ్లకు ఏళ్ల తరబడి పదిలంగా దాచుకున్న జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి చీర భారతీయ మహిళలకే కాదు విదేశీ వనితల మనసులను సైతం గెలుచుకుంది. అలాంటి మన భారతీయ పట్టుచీరను కొనుకున్న ఓ విదేశీ మహిళ దాన్ని ఎలా ఉతకాలో తెలియక ఇబ్బందిపడుతున్నా..దయచేసి ఏదైన సలహా ఇవ్వరు అంటూ వీడియో రికార్డు చేసి మరి సోషల్ మీడియాలో షేర్ చేసింది.నెట్టింట పంచుకున్న వీడియోలో ఆ విదేశీ మహిళ భారతీయ మహిళలను ఉద్దేశించి ఒక అభ్యర్థన చేసింది. తన అందమైన పట్టు చీరను చూపిస్తూ..దాని లేబుల్పై డ్రైక్లీనింగ్ చేసి ఉతకాలని ఉంది. అయితే తాను ఉండే ఆస్ట్రేలియన్ బుష్లో డైక్లీనింగ్ సర్వీస్ సమీపంలో లేదని, అందువల్ల ఈ పట్టుచీరను ఎలా ఉతకాలో సలహా ఇవ్వరా ప్లీజ్ అని కోరింది. తాను ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉంటానని, అందువల్ల ఇది పాడవ్వకుండా ఎలా ఉతకాలో చక్కటి చిట్కా గానీ సలహా గానీ చెప్పమని అభ్యర్థించిందామె. తాను భారత పర్యటనలో ఈ అందమైన చీర కొన్నానని చెప్పింది. ఈ సున్నితమైన పట్టు వస్త్రంపై ఉన్న క్లిష్టమైన ఎంబ్రాయిడరీ కారణంగా ఉతకడానికి భయపడుతున్నట్లు పేర్కొంది. ఉతకడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా..చీర మొత్తం పాడైపోతుంది, అందువల్ల ఎలా ఉతకాలో నేర్పించరు అంటూ తన వీడియోని ముగించింది. అంతేగాదు అందుకు సంబంధించిన చిట్కాలు, సలహాలు కామెంట్ బాక్స్లో పంచుకోమని, తాను వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అలాగే ఎల్లప్పుడూ తన అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసే ఆన్లైన్ కమ్యూనిటీకి ధన్యావాదాలు కూడా చెప్పారామె. ఆమె అభ్యర్థనకు నెటిజన్లు స్పందించడమే కాదు పలు రకాల సలహాలు, సూచనలు అందించారు. చాలామంది మహిళలు కఠినమైన డిటర్జెంట్కి బదులుగా షాంపుతో ఉతికి నీడలో ఆరేసి భద్రపరచుకుంటే సరిపోతుందని సలహాలు ఇచ్చారు. అంతేగాదు బ్రష్ ఉపయోగించొద్దని, చేతులతోనే సున్నితంగా రుద్దమని కూడా సూచించారు. View this post on Instagram A post shared by Lea Murray (@lea_murray90) (చదవండి: శస్త్ర చికిత్స లేకుండా ఏఐ ఎండోమెట్రియోసిస్ను నిర్థారించగలదా? బ్రయాన్ జాన్సన్ గర్లఫ్రెండ్..) -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
అంతా ప్రపంచం మంచికే!
జూలై నెల ఇంకా సగం కూడా గడవ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ నెలలో 31 రోజులు అయినందున మూడవ వంతే అయినట్లు లెక్క. ఈ కొద్ది కాలంలోనే జపాన్ ప్రధాని భారత రాజధానికి వచ్చి వెళ్లగా, భారత ప్రధాని మూడు ముఖ్య మైన దేశాలు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పర్యటించి స్వదేశానికి చేరుకున్నారు. ఏ కొలమానం ప్రకారం చూసినా ఇది అసాధారణమైనది. ఈ నాలుగింటిలో ఏదీ అపుడపుడు జరుగుతుండే సౌహార్ద్రపూరితమైన సందర్శన కాదు. అన్నింటికి అన్నీ వ్యూహాత్మకమైన కోణాలు గలవి. ఎందుకట్లా?కొత్త అస్థిరతలుఆ చర్చలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు అర్థం చేసుకోవటం అవసరం. లేనట్లయితే ఇన్నిన్ని పర్యటనలు, ఒప్పందాలు ఎందుకు, ఇంత వేగంగా ఎందుకు అన్నది తెలుసుకోలేము. ఈ నెల పర్యటనలకు గత ఆరుమాసాల ప్రయాణాలను కూడా జోడించి చూసిన ప్పుడు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటిది, ఒకటి రెండేళ్ల క్రితంతో పోల్చితే ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతుండటం. రెండవది, మార్పులన్నవి రాజకీయం, ఆర్థికం, సైనికం, వేర్వేరు కూటములు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉద్యోగ ఉపాధుల కోసం ఇతర దేశాలకు తరలిపోవటం, పెరుగుతున్న జాతివాదాలు, వీటితో పాటు తీవ్ర రూపం తీసుకుంటున్న వాతావరణ పరిస్థితుల న్నిటా కనిపిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచమంతటా కొత్త అస్థిరతలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి స్థితి ఎప్పుడూ లేదు.ఇటువంటి పరిణామాల మధ్య ఆసియాతోపాటు మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్లే గాక, ఉత్తర అమెరికాలో భాగమైన కెనడా వరకు కూడా కొత్త ఒత్తిడులు ఏర్పడుతూ, కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. సముద్రాలలో ఎక్కడో విసిరివేసినట్లుండే డజన్లకొద్దీ దేశాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వాటి సమస్యలు మరింత ప్రమాదకర మైనవి. పెద్ద దేశాలు తమ అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని లెక్క చేయనందువల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ, ఆ ద్వీప దేశాలు మునిగి పోగల వేగం కూడా పెరుగుతున్నది. అందుకే అటువంటి వారంతా గత నెల మొదటిసారిగా పెద్ద దేశాలు వేటినీ ఆహ్వానించకుండా, ఐక్యరాజ్యసమితితో సైతం నిమిత్తం లేకుండా, కొలంబియాలో సమావేశమయ్యారు. అన్ని ఖండాలలోని అన్ని దేశాలకూ ఆర్థికం, రక్షణలన్నవి అనిశ్చయమవుతున్నాయన్నది గమనార్హం.బహుళ ధ్రువ ప్రపంచంభారత దేశానికిగానీ, మరే దేశానికిగానీ ఆర్థికాభివృద్ధి, దేశ రక్షణ, ఇతర ప్రయోజనాల పరిరక్షణ, నిరాటంకమైన రీతిలో పురోగతి అనే నాలుగు ఆలోచనలు ఎప్పుడూ ఉండేవే. లోగడ కూడా ఇవి సజావుగా ఏమీ సాగలేదు. కానీ సమస్యలు ఇటీవల మరింత పెరుగుతున్నాయి. అందరికీ పెరగటమన్నది ఒక సామాన్య లక్షణంగా మారింది. అందువల్లనే ఇండియా వలెనే అన్ని దేశాలూ ఈ స్థితి నుంచి బయటపడేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. దక్షిణ అమెరికా మొదలు కెనడా, యూరప్, ఆఫ్రికాలపైగా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల వరకు ఆర్థిక, రక్షణ ఒప్పందాల కోసం భారత ప్రధాని పర్యటనలు చేయటమే కాదు, ఒప్పందాల అవసరాన్ని గుర్తించి వారు కూడా ఇటు వస్తున్నారు.ఇండియాను అట్లుంచి వారిలో వారు కూడా పరస్పర ప్రయాణాలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. వేర్వేరు దేశాధినేతల ఆకాశయా నాలు ఇంతగా బహుశా లోగడ ఎప్పుడూ జరిగి ఉండవు. ఆర్థిక, రక్షణ విషయాలతో ముడిపడిన ఇటువంటి మార్పులు రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలోగానీ, ఏకధ్రువ ప్రపంచావ తరణ జరిగిన తర్వాతగానీ, ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయ మంటే అతిశయోక్తి కాకపోవచ్చు.ఏ దేశమైనా అభివృద్ధి చెందాలనీ, భద్రంగా ఉండాలనీ కోరుకుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక సంస్క రణల కాలం నుంచి ఒకవైపు వస్తూత్పత్తి, వినియోగాలు చరిత్రలో ఎన్నడూ లేనట్లు పెరుగుతుండగా, మరొకవైపు అన్ని దేశాలలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అదే స్థాయిలో పెరగసాగాయి. ఈ రెండింటికి తగిన విధంగా అభివృద్ధిని సాధించి, దేశ భద్రతా ఏర్పాట్లను కూడా పెంచవలసిన బాధ్యత సహజంగానే ప్రభుత్వాలపై పడింది. ఆ బాధ్యతలను నెరవేర్చలేని ప్రభుత్వాలు ఓటింగ్ ద్వారానో, తిరుగుబాట్ల వల్లనో కూలిపోవటాన్ని చూస్తు న్నాము. ఈ విధమైన పరిణామాలు అంతర్గతమైన ఒత్తిడులు కాగా, అదే విధమైన ఒత్తిడులు వేరే రూపాలలో, బయటి పరిణామాల వల్ల ఏర్పడటం ఇటీవలి కాలంలో పెరగటం మొదలైంది. అందుకు నాంది ఆర్థిక సంస్కరణలు వర్ధమాన దేశాలకు, మరీ ముఖ్యంగా సాధారణ సామాజిక వర్గాలకు ప్రతికూలమై అసమానతలను పెంచటంతో పడింది. ఇటీవలికి వచ్చేసరికి, పాశ్చాత్య దేశాలు తాము సృష్టించి ఇతరులపై రుద్దిన పలు అంతర్జాతీయ నియమ నిబంధనలు తాము కోరుకున్న ఫలితాలనివ్వటం తగ్గటంతో వాటిని భంగపరచటం మొదలైంది. వారు కొత్త వ్యవస్థలనూ సృష్టించలేక పోతున్నారు. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా బహుళ ధ్రువ ప్రపంచ భావనలు బలపడటం, ఇండియాతో పాటు కొన్ని ప్రముఖ దేశాలు ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయ సంస్థలను ఏర్పరచటం జరిగింది. బయటకు స్పష్టంగా ప్రకటించకున్నా అమెరికన్ డాలర్కు సమాంతర కరెన్సీల వినియోగం క్రమంగా విస్తరిస్తున్నది. పులి మీద పుట్ర వలె ట్యారిఫ్లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాలు, అక్కర లేని యుద్ధాలు, అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.బద్దలవుతున్న చట్రంవీటన్నింటివల్ల వీరువారని గాక అందరికీ ఎదురవుతున్న సమస్యలు ఏమిటో ఏకరువు పెట్టనక్కరలేదు. ఆ సమస్యలలో ఆర్థిక మైనవి, రక్షణపరమైనవి, ఇతరాలు కూడా ఉన్నాయి. ఈ రెండు రంగాలకు సంబంధించి అమెరికాకు సన్నిహిత దేశాలైన యూరప్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, గల్ఫ్ రాజ్యాల వంటివి సైతం తమలో తామే గాక ఇండియా, బ్రెజిల్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలతోనూ ఇటీవలి ఆరు మాసాలలో చేసుకుంటూ వస్తున్న ఆర్థిక ఒప్పందాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కెనడా, యూరప్ల వంటివి అమెరికా వద్దన్నా... చైనాతో ఒప్పందాలను ఆర్థిక భద్రత కోసం చేసుకుంటున్నాయి. ఈ మార్పులు, మలుపులు ప్రపంచాన్ని అను కోని రీతిలో పాత చట్రం నుంచి బయటకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్వుడ్స్ సంస్థల నుంచి ఆర్థిక సంస్కరణల వరకుండిన ఒక చట్రం, అప్పటి నుంచి ఉండిన రెండవ చట్రం ఇప్పుడు భగ్నమవుతున్న దృశ్యాన్ని మనమిపుడు చూస్తున్నాము. మన జూలై ఒప్పందాలు కూడా విస్తృతార్థంలో అదే పరిధి లోకి వస్తాయి. అంతటా అందరూ క్రమంగా స్వతంత్ర నిర్ణయా లతో, పరస్పర ఒప్పందాలతో, స్వతంత్రంగా ఎదిగేందుకు,భద్రంగా జీవించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆస్ట్రేలియా వీసా ఫీజు 25 శాతం పెంపు
ఉన్నత చదువులు చదవాలన్నా, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలన్నా నేడు భారతీయుల మొదటి ఛాయిస్ల్లో ఆస్ట్రేలియా ఒకటి. అయితే, తాజాగా ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లాలనుకునే లక్షలాది మంది భారతీయుల ఆశలపై ఆర్థిక భారాన్ని మోపింది. ముందస్తు సంప్రదింపులు లేకుండానే అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక కార్మికుల వీసా దరఖాస్తు రుసుములను 25 శాతం వరకు పెంచుతూ ఆస్ట్రేలియా హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గత రెండేళ్లుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఈ వీసా ఫీజు తాజా పెంపుతో అంతర్జాతీయంగా ఆస్ట్రేలియాను అత్యంత ఖరీదైన గమ్యస్థానంగా మార్చేసింది. నేషనల్ సెక్యూరిటీ బడ్జెట్ ఖర్చులను భర్తీ చేయడానికే ఈ పెంపు అని అక్కడి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది అంతర్జాతీయ విద్యార్థులను ఒక ఆదాయ వనరులాగా వాడుకోవడమేనని నిపుణులు మండిపడుతున్నారు.కొత్తగా మారిన వీసా ధరల స్వరూపం (ఆస్ట్రేలియన్ డాలర్లలో)వీసా రకంపాత ఫీజుసవరించిన కొత్త ఫీజుపెంపు శాతంస్టూడెంట్ వీసా (సబ్క్లాస్ 500) (యూనివర్సిటీ, వొకేషనల్)2,0002,500 (సుమారు రూ.1.38 లక్షలు)25%తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసా (సబ్క్లాస్ 485) (వర్క్ పర్మిట్)4,6005,750 (సుమారు రూ.3.17 లక్షలు)25%ఇండిపెండెంట్ ELICOS (ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సులు)2,0002,0502.5%గమనిక: స్టూడెంట్ వీసా ఫీజులు 2024 జులైకి ముందు కేవలం 710 డాలర్లు మాత్రమే ఉండేవి. రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇది 710 నుంచి 1600, ఆపై 2000 డాలర్లు... ఇప్పుడు ఏకంగా 2,500 డాలర్లకు చేరింది. అంటే దాదాపు 252 శాతం పెంపు నమోదైంది!భారతీయులపై పడే ప్రభావం ఏమిటి?1. రీఫండ్ లేని భారీ రుసుము: ఆస్ట్రేలియా వీసా విధానంలో అత్యంత కఠినమైన నిబంధన ఏంటంటే.. వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైనా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. లక్షల రూపాయలు పోసి దరఖాస్తు చేసుకున్న తర్వాత వీసా రాకపోతే ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు పెద్ద రిస్క్.2. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పెంపు నుంచి ఏషియన్(ఆగ్నేయాసియా దేశాల కూటమి) దేశాలకు, పసిఫిక్ దీవుల విద్యార్థులకు మినహాయింపు ఇచ్చి పాత ఫీజులనే వర్తింపజేసింది. కానీ, ఆస్ట్రేలియాకు రెండో అతిపెద్ద విద్యార్థుల వనరుగా ఉన్న భారతదేశానికి ఎలాంటి మినహాయింపు లభించకపోవడం గమనార్హం.3. ఉపాధి వీసాలూ ఖరీదే: చదువు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియాలోనే ఉండి పని చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే ‘తాత్కాలిక గ్రాడ్యుయేట్ వర్క్ వీసా’ ఫీజు ఏకంగా 5,750 డాలర్లకు పెరగడం వల్ల అక్కడ స్థిరపడాలనుకునే యువతపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడనుంది.అంతర్జాతీయ విద్యారంగం స్పందనఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై ‘యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా’, భారతీయ విద్యా ప్రతినిధుల సంఘం (ఏఏఈఆర్ఐ) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించాలనుకుంటూ ప్రవేశ రుసుములను ఇంతలా పెంచడం ఆస్ట్రేలియా అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని హెచ్చరించాయి. వీసా ఫీజును ఒకేసారి కాకుండా అప్రూవల్ అయ్యాక రెండో విడతగా తీసుకునే ‘టూ-స్టేజ్ పేమెంట్’ విధానాన్ని తేవాలని భారతీయ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
డేవిడ్ వార్నర్ యూటర్న్?!.. పోస్ట్ వైరల్
ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటాడు. తన కెరీర్, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడు. అయితే, తాజాగా వార్నర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీ వైరల్గా మారింది.నేను సిద్ధంగా ఉన్నానుబిగ్బాష్ లీగ్లో భాగమైన సిడ్నీ థండర్ జెర్సీలో ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘ప్రపంచంలో ఎక్కడైనా.. నా దేశం కోసమైనా సరే ఆడటానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని వార్నర్ స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది.అన్ని ఫార్మాట్లకూ గుడ్బైకాగా పదిహేనేళ్ల సుదీర్ఘ కెరీర్ అనంతరం 2024లో వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత (నవంబరులో) వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 2024 జనవరిలో టెస్టు ఫార్మాట్కూ గుడ్బై చెప్పాడు.వన్డేల్లో చివరగా టీమిండియా.. టెస్టుల్లో పాకిస్తాన్తో వార్నర్ మ్యాచ్లు ఆడాడు. ఇక అదే ఏడాది జూన్లో అంతర్జాతీయ టీ20 క్రికెట్కూ వీడ్కోలు పలికాడు.ఇక తన కెరీర్లో 2009- 2024 మధ్య ఆస్ట్రేలియా తరఫున మొత్తంగా 161 వన్డేలు, 112 టెస్టులు, 110 టీ20 మ్యాచ్లు ఆడాడు వార్నర్. వన్డేల్లో 6932, టెస్టుల్లో 8786, టీ20లలో 3277 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 22 వన్డే, 26 టెస్టు, ఒక టీ20 శతకం ఉన్నాయి.టీ20 లీగ్లలో యాక్టివ్గా..ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లలో అలరిస్తున్న వార్నర్.. చివరగా బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్లలో భాగమయ్యాడు. గతంలో ఐపీఎల్లో 184 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ 6565 పరుగులు సాధించాడు. ప్రస్తుతం లీగ్ క్రికెట్తో యాక్టివ్గానే ఉన్న వార్నర్.. నిజంగానే యూటర్న్ తీసుకుని ఆస్ట్రేలియా క్రికెట్లో వస్తాడా? అంటే.. ప్రస్తుత పోటీ దృష్ట్యా అది సాధ్యం కాకపోవచ్చు. కానీ 39 ఏళ్ల వార్నర్ మాత్రం అందుకు సుముఖంగానే ఉన్నానని తన పోస్టు ద్వారా చెప్పకనే చెప్పాడు. చదవండి: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ -
ఆస్ట్రేలియా తరహా చట్టాలు భారత్లోనూ?
పిల్లలను రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా ఆంక్షలు విధించే ఆస్ట్రేలియా చట్టాలు డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ విధానాల నుంచి భారత్తో పాటు.. ప్రపంచ దేశాలు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని మోదీ పేర్కొన్నారు.మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియా-భారత్ వార్షిక నేతల సదస్సులో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో కలిసి పాల్గొన్న మోదీ, సమాచార సాంకేతికత (IT), సోషల్ మీడియా నియంత్రణ, ఆన్లైన్ భద్రత విషయంలో ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ముఖ్యంగా చిన్నారులను, సోషల్ మీడియా వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!ఆస్ట్రేలియా కొత్త నిబంధనల ప్రకారం.. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు సృష్టించకుండా ప్రముఖ ప్లాట్ఫామ్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేధింపులు, మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం వంటి సమస్యలను తగ్గించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.భారత్లో నిషేధంపై మోదీ హింట్ ఇచ్చారా?భారత్లో కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలనే చర్చలు పెరుగుతున్న వేళ మోదీ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బహుశా ఈ నియమాలు మనదేశంలో కూడా అమలవుతాయా?, మోదీ హింట్ ఇచ్చారా?, అని పలువురు అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే దిశగా అడుగులు వేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే మన దేశంలో కూడా సోషల్ మీడియా వినియోగాన్ని కఠినతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఓపెన్ఏఐలో కీలక పరిణామం.. ఏజీఐ సీఈఓ రాజీనామా! -
తరలిరానున్న భద్రకాళి, కార్తికేయుడు, నంది!
భారతీయ సంస్కృతీ వైభవం స్వదేశానికి తిరిగి వస్తోంది. దశాబ్ద కాలంలో అమెరికా, యూకే, కెనెడా సహా అనేక దేశాల్లో దశాబ్దాలుగా మగ్గిన 300కుపైగా అరుదైన, అపురూప కళాఖండాలు ఇప్పటికే భారత్కు తిరిగి రాగా తాజాగా ఆస్ట్రేలియా చోళుల కాలం నాటి మూడింటిని అప్పగించింది. దొంగల చేత చిక్కి సముద్రాలు దాటిన ఈ కళాఖండాలు ఘనమైన భారత చారిత్రక వారసత్వానికి ప్రతీకలు! భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆరు తలల కార్తికేయ విగ్రహం, నంది విగ్రహం, భద్రకాళి త్రిశూలాలను అప్పగించింది. ఇవన్నీ తమిళనాడు నుంచి అక్రమ మార్గాల్లో ఆ్రస్టేలియాలోని నేషనల్ గ్యాలరీ కలెక్షన్లోకి చేరాయి. ఇవి చోరీకి గురైనవని తమిళనాడు సీఐడీలోని ప్రత్యేక విభాగం స్పష్టమైన ఆధారాలతో నిరూపించడంతో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఒప్పందానికి అనుగుణంగా తమకు అప్పగించాలని భారత్ కోరింది. ఇందుకు ఆస్ట్రేలియ అంగీకరించడంతో త్వరలో స్వదేశానికి తిరిగి రానున్నాయి.షణ్ముఖ/కార్తికేయ విగ్రహంతమిళుల ఇష్టదైవం, తమ రక్షకుడిగా భావించే కార్తికేయుడిని సుబ్రమణ్యుడు, స్కంద, మురుగన్ అని కూడా పిలుస్తారు. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న ఆరుతలల రాతి విగ్రహం 12వ శతాబ్ధానికి చెందినది. తమిళనాడులో కుంభకోణం సమీపంలోని మనంబాడి గ్రామంలోని నాగనాథస్వామి దేవాలయం నుంచి చోరీకి గురైంది. సుమారు 130 సెం.మీ ఎత్తు ఉంటుంది. చోళుల శిల్పకళా శైలికి ప్రతిబింబంగా సౌష్టవాకారం, లెక్కకట్టినంత సైజులో ఉండే ఆభరణాలతో కూడి ఉంది. ఆరుతలలను కొందరు ఆరు దిశలుగా, మరికొందరు జ్ఞానం, బలం, కీర్తి, ఐశ్వర్యం, వైరాగ్యం, విజ్ఞానం ఆరు గుణాలుగా, ఇంకొందరు కృతికా నక్షత్ర మండలంలోని దేవతలుగా నమ్ముతారు.మీటర్ పొడవైన నంది 13–16వ శతాబ్దాల మధ్యకాలం నాటి నంది విగ్రహం తంజావూరు ప్రాంతంలోని తిరువారూర్ జిల్లా కడువంకుడి గ్రామంలోని కైలాసనాథర్ ఆలయానికి చెందినది. ఏకశిల విగ్రహం. మీటరు పొడవుతో శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడుతుంది. తమిళనాడు సీఐడీలోని విగ్రాహాల విభాగం అంచనాల ప్రకారం దీని విలువ రూ.నాలుగు కోట్లు. భద్రకాళి త్రిశూలంసాధారణంగా త్రిశూలం అనగానే శివుడు గుర్తు వస్తాడు కానీ దక్షిణాది ఆలయాల్లో అమ్మవారు కూడా త్రిశూలంతో దర్శనమిస్తూంటుంది. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న మూడో కళాఖండం చోళుల అనంతర కాలపు అరుదైన లోహ త్రిశూలం. శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయానికి చెందినది. సుమారు 46 సెం.మీ ఎత్తు, మీటర్కి పైగా వెడల్పు ఉంటుంది. పైభాగంలో భద్రకాళి దేవి ప్రతిమ కనిపిస్తూంటుంది. ఊరేగింపులు, జాతరల్లో శక్తి, రక్షణలకు చిహ్నంగా వాడేవారని అంచనా. 2016లో తమిళనాడు సీఐడీలోని విగ్రహ విభాగం ఈ విగ్రహాల చోరీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తరువాత ఆలయ రికార్డులు, పాత ఫోటోలు, ప్రభుత్వ దస్తావేజులు, మ్యూజియం క్యాటలాగులన్నీ జల్లెడ పట్టారు. ఇవి ఎక్కడి నుంచి ఎప్పుడు గల్లంతయ్యాయో ఎలా విదేశాలకు చేరాయో నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ ఆస్ట్రేలియా మిషన్.. వ్యూహాత్మక భాగస్వామ్యమే గురి!
మెల్బోర్న్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెల్బోర్న్లో ఘన స్వాగతం లభించింది. గురువారం ఆయనకు అధికారిక గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) నిర్వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కలిసి భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొన్నారు.మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, విద్య, కీలక ఖనిజాలు, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.వ్యాపార దిగ్గజాలతో మోదీ భేటీమెల్బోర్న్లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం, ఎకనామిక్ రోడ్మ్యాప్ బిజినెస్ రిసెప్షన్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం కేవలం రెండు రాజధానులకే పరిమితం కాకుండా.. రాష్ట్రాలు, నగరాలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల స్థాయిలోనూ విస్తరించాలని మోదీ సూచించారు. రాష్ట్రాల మధ్య, రంగాల మధ్య ప్రత్యేక భాగస్వామ్యాలను గుర్తించి కొత్త అవకాశాలను సృష్టించాలని పిలుపునిచ్చారు.ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఆహ్వానంఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్స్ను భారత్లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఆ దేశ పెన్షన్ ఫండ్స్ నిర్వహిస్తున్న భారీ నిధులు సురక్షితమైన, స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధికి భారత్లో అవకాశాలను పొందగలవని చెప్పారు. భారత్లో మౌలిక వసతులు, రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.గ్రీన్ ఎనర్జీపై దృష్టిభారత్ స్వచ్ఛ ఇంధన రంగంలో వేగంగా ముందుకు సాగుతోందని మోదీ తెలిపారు. హరిత హైడ్రోజన్, సౌర విద్యుత్, వాయు విద్యుత్, జల విద్యుత్ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో భారత్ పనిచేస్తోందని, ఈ ప్రయాణంలో ఆస్ట్రేలియా సాంకేతికత, పెట్టుబడులు కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు.అల్బనీస్తో కీలక భేటీ.. సెల్ఫీ వైరల్ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే మాజీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్తోనూ మోదీ సమావేశమయ్యారు.భారత ప్రవాసులతో..మెల్బోర్న్లో భారతీయ ప్రవాసులతో మోదీ సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులతో సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది.మొత్తంగా.. మోదీ ఆస్ట్రేలియా పర్యటన భారత్-ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యానికి మరింత ఊతమిస్తుందని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. రక్షణ నుంచి వాణిజ్యం వరకు పలు రంగాల్లో సహకారాన్ని విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. -
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్బర్గ్లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కెనడాలోని టొరొంటో నగరంలో వైభవంగా వైఎస్సార్ జయంతి వేడుకలు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వర్చువల్గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్బర్గ్లో భారీ కేక్ కట్ చేస్తున్న అభిమానులు ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్త్లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్ త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ అభిమానులు మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వీనర్ భరత్, విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిష్క్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలోని పెర్త్లో వైఎస్సార్ జయంతి వేడుకలు -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ప్లేయర్
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ దిగ్గజం ఎల్లిస్ పెర్రీ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో (పురుషులు, మహిళలు) తొమ్మిది ఐసీసీ టైటిళ్లు (7 టీ20 ప్రపంచకప్లు, 2 వన్డే ప్రపంచకప్లు) సాధించిన తొలి ప్లేయర్గా సరికొత్త రికార్డు నెలకొల్పింది . టీ20 ప్రపంచకప్ 2026 గెలుపుతో ఈ ఘనత సాధించింది.పెర్రీ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు సాధించిన ప్లేయర్ల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో కూడా ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లే ఉన్నారు. మాజీ వికెట్కీపర్ బ్యాటర్ అలిస్సా హీలీ (7 టీ20 ప్రపంచకప్లు, ఓ వన్డే ప్రపంచకప్), మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ (5 టీ20 వరల్డ్కప్లు, ఓ వన్డే వరల్డ్కప్, 2 మహిళల ఛాంపియన్షిప్లు) తలో ఎనిమిది ఐసీసీ టైటిళ్లు సాధించారు.ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నది కూడా ఆస్ట్రేలియనే. అయితే అతను పురుష క్రికెటర్. ఆసీస్ పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన కెరీర్లో 3 ఐసీసీ టైటిళ్లు (2 వన్డే వరల్డ్కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించాడు.ఈ జాబితాలో భారత పురుష దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లి (వన్డే ప్రపంచకప్, ఒక టీ20 ప్రపంచకప్, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు), రోహిత్ శర్మ (టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు వన్డే ప్రపంచకప్లు) తలో 4 ఐసీసీ టైటిళ్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.ఆతర్వాతి స్థానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( 3 టైటిళ్లు.. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ) ఉన్నాడు.కాగా, తాజా టీ20 ప్రపంచకప్ గెలుపుతో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్లో తమ ఏకఛత్రాధిపత్యాన్ని నిరాటంకంగా కొనసాగించింది. ఈ జట్టు ఏడో టీ20 ప్రపంచకప్ గెలుచుకోవడంతో తమ వరల్డ్కప్ల సంఖ్య 14కు చేర్చుకుంది. వన్డేల్లో కూడా ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న ఆసీస్ మహిళలు.. రెండు ఫార్మాట్లలో కలిపి ఎవరూ సాధించినన్ని టైటిళ్లు సాధించారు. పురుషుల క్రికెట్లోనూ ఆస్ట్రేలియాది ఇంచుమించు ఇలాంటి హవానే కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 6 వన్డే ప్రపంచకప్లు, ఓ టీ20 ప్రపంచకప్ సహా పలు ఐసీసీ టైటిళ్లు (2 ఛాంపియన్స్ ట్రోఫీలు, ఓ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్) సాధించింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు కామన్వెల్త్ క్రీడల్లో కూడా బంగారు పతకం సాధించింది. ఈ లెక్కన పురుషుల విభాగామైనా, మహిళల విభాగమైనా క్రికెట్పై ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. -
మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మోదీ పర్యటించనున్నారు. జులై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధాని.. బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు ఒప్పందంపై చర్చలు జరపనున్నారు. ఇండో - పసిఫిక్ రీజియన్లో వ్యూహాత్మక సమన్వయంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.ప్రధాని మోదీ.. తొలుత సోమవారం ఇండోనేసియాకు చేరుకుంటారు. 2016 తర్వాత మోదీ ఆ దేశానికి వెళ్తుండడం ఇదే మొదటిసారి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఇండోనేసియా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సముద్ర భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంటోతో మోదీ సమావేశమవుతారు. ఇరుదేశాల సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇండో–పసిఫిక్లో సము ద్ర సహకారాన్ని, సరఫరా గొలుసులను పటిష్టం చేయడం, ఆర్థిక మరియు వ్యూహాత్మక సంబంధాలు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, తయారీ రంగంలో సహకారం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై చర్చించే అవకాశం ఉంది.ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షిస్తారు. రాజధాని జకార్తాలో ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ అవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోనేసియాలోని ప్రఖ్యాత ప్రాంబనన్ ఆలయాన్ని మోదీ దర్శించుకుంటారు. మోదీ ఇండోనేసియా పర్యటన ముగించుకున్న తర్వాత వెంటనే ఆ్రస్టేలియా, న్యూజిలాండ్లో పర్యటించబోతున్నారు. ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు సుబియాంటో గత సంవత్సరం భారత్లో పర్యటించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
అదరగొట్టిన ఆసీస్.. 7వ సారి T20 వరల్డ్ కప్
-
నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఆయన తొలుత సోమవారం ఇండోనేసియాకు చేరుకుంటారు. 2016 తర్వాత మోదీ ఆ దేశానికి వెళ్తుండడం ఇదే మొదటిసారి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఇండోనేసియా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఈ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సముద్ర భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంటోతో మోదీ సమావేశమవుతారు. ఇరుదేశాల సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇండో–పసిఫిక్లో సము ద్ర సహకారాన్ని, సరఫరా గొలుసులను పటిష్టం చేయడం, ఆర్థిక మరియు వ్యూహాత్మక సంబంధాలు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, తయారీ రంగంలో సహకారం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై చర్చించే అవకాశం ఉంది.ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షిస్తారు. రాజధాని జకార్తాలో ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ అవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోనేసియాలోని ప్రఖ్యాత ప్రాంబనన్ ఆలయాన్ని మోదీ దర్శించుకుంటారు. మోదీ ఇండోనేసియా పర్యటన ముగించుకున్న తర్వాత వెంటనే ఆ్రస్టేలియా, న్యూజిలాండ్లో పర్యటించబోతున్నారు. ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు సుబియాంటో గత సంవత్సరం భారత్లో పర్యటించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
జగజ్జేత ఆస్ట్రేలియా
లండన్: ప్రతిష్టాత్మక మహిళల టి20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం అపజయం ఎరగకుండా ఫైనల్కు చేరిన ఆసీస్... తుదిపోరులోనూ అదే దూకుడు కనబర్చింది. ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన పూర్తి ఏకపక్ష ఫైనల్లో సోఫీ మోలినెక్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసి ఏడోసారి వరల్డ్కప్ ట్రోఫీని హస్తగతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటంగ్కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (53 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... ఫ్రెయా కెంప్ (28 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడింది. డానీ వ్యాట్ (8), అమీ జోన్స్ (6), హీతర్ నైట్ (2) విఫలమయ్యారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, సోఫీ మోలినెక్స్ , అనాబెల్ సదర్లాండ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం టి20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా ఆడుతూ పాడుతూ గమ్యాన్ని చేరింది. ఆసీస్ 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జార్జియా వాల్ (9) రెండో ఓవర్లోనే అవుటైనా... బెత్ మూనీ (49 బంతుల్లో 64; 10 ఫోర్లు), లిచ్ఫీల్డ్ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రెండో వికెట్కు 67 బంతుల్లోనే 100 పరుగులు జోడించి గెలుపుదిశగా నడిపించారు. బ్యాటింగ్లో ప్రభావం చేయలేకపోయిన ఇంగ్లండ్... బౌలింగ్లోనూ ఎలాంటి మ్యాజిక్ కనబర్చలేక నాలుగోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది. బెత్ మూనీకే ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’...‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు దక్కాయి. విజేత ఆస్ట్రేలియాకు 23 లక్షల 40 వేల డాలర్లు (రూ. 22 కోట్ల 34 లక్షలు)... రన్నరప్ ఇంగ్లండ్కు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 17 లక్షలు) ప్రైజ్మనీ లభించింది.7 మహిళల టి20 ప్రపంచకప్ ట్రోఫీ సాధించడం ఆస్ట్రేలియాకిది ఏడోసారి. 2010, 2012, 2013, 2018, 2020, 2023లో చాంపియన్గా నిలిచిన ఆసీస్... 2016 ఫైనల్లో ఓడింది.4 మహిళల టి20 వరల్డ్కప్ ఫైనల్లో ఓడడం ఇంగ్లండ్కు ఇది నాలుగోసారి. ఆ నాలుగుసార్లు ప్రత్యర్థి ఆస్ట్రేలియానే కావడం గమనార్హం. 2009లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు... 2012, 2014, 2018 రన్నరప్గా నిలిచింది. -
ఇంగ్లండ్ X ఆ్రస్టేలియా
లండన్: మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య... లార్డ్స్ వేదికగా నేడు తుదిపోరు జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది టి20 ప్రపంచకప్లలో ఆ్రస్టేలియా ఆరుసార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023) చాంపియన్గా నిలవగా... 2009 ఆరంభ సీజన్లో ట్రోఫీ చేజిక్కించుకున్న ఇంగ్లండ్ రెండో కప్పు కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. ఈ మధ్యలో మూడుసార్లు (2012, 2014, 2018) ఫైనల్కు చేరిన ఇంగ్లండ్... ఆసీస్ చేతిలోనే పరాజయం పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ సారి సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండటంతో అభిమానుల మద్దతుతో ముందంజ వేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. గ్రూప్–1లో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఆ్రస్టేలియా... సెమీఫైనల్లో వెస్టిండీస్ను చిత్తుచేయగా... గ్రూప్–2లో ఐదు విజయాలు సాధించిన ఇంగ్లండ్... సెమీస్లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. మూనీ, వాల్, లిచ్ఫీల్డ్, గార్డ్నర్, సదర్లాండ్తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది. బౌలింగ్లో కెప్టెన్ మొలినెక్స్, గార్త్, అలానా కింగ్ కీలకం కానున్నారు. మరోవైపు కెప్టెన్ సీవర్ బ్రంట్, వ్యాట్, జోన్స్, నైట్, కాప్సీతో ఇంగ్లండ్ బ్యాటింగ్ కూడా శత్రుదుర్బేధ్యంగా ఉంది. ఎకిల్స్టోన్, కెంప్, లిన్సే బౌలింగ్ను కంగారూలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. పిచ్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్కు సమానంగా సహకరించనుంది. మ్యాచ్కు వర్ష సూచనలేదు. -
ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు
ఆస్ట్రేలియా పర్యటన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.. ఆసీస్ పర్యటనకు ముందు మోదీకి ఆన్లైన్లో బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 9న ఆ దేశ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్న క్రమంలో.. ఆస్ట్రేలియా వస్తే చంపేస్తామంటూ వచ్చిన వార్నింగ్పై ఆ దేశ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.జులై 9న మార్వెల్ స్టేడియంలో జరగాల్సిన ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ (Melbourne Meets Modi) కమ్యూనిటీ ఈవెంట్ను ప్రకటిస్తూ ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్ కింద ఈ బెదిరింపు కామెంట్ ప్రత్యక్షమైంది. అబు ముస్తఫా అనే పేరుతో ఉన్న ఖాతా నుండి వచ్చిన ఆ కామెంట్లో ‘ఈ కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం రూఫ్ టాప్లను (పైకప్పును) మూసివేయడం మంచిది. లేదంటే ఆయన తన మరణం కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు లెక్క’’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ బెదిరింపులపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ (AFP)కి ఫిర్యాదు అందినట్లు ది ఆస్ట్రేలియా టుడే తెలిపింది.ఈ పోస్ట్కు సంబంధించిన ఐపీ (IP) అడ్రస్ను ర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై పలు కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ పర్యటనలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడంతో పాటు.. మెల్బోర్న్ సమావేశంతో సహా పలు కమ్యూనిటీ ఈవెంట్లలో కూడా పాల్గొననున్నారు. పర్యటనకు వచ్చే ఇతర దేశాల ప్రభుత్వాధినేతలకు వచ్చే బెదిరింపులను ఆస్ట్రేలియా చట్టం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుంది. హై-ప్రొఫైల్ అంతర్జాతీయ పర్యటనల భద్రతా ప్రణాళికలో ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్, స్టేట్ పోలీస్, స్పెషలిస్ట్ ప్రొటెక్టివ్ సెక్యూరిటీ యూనిట్లతో సహా పలు సంస్థలు భాగస్వామ్యమవుతాయి. -
పెనాల్టీ షూటౌట్లో విజయం.. తొలిసారి ప్రిక్వార్టర్స్కు ఈజిప్ట్
ఫిఫా ప్రపంచకప్లో ఈజిప్ట్ ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఈజిప్ట్ పెనాల్టీ షూటౌట్లో 4-2తో విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో మ్యాచ్ డ్రా అయింది. దీంతో మ్యాచ్లో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఫలితంగా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్లో ఈజిప్ట్ తరఫున ఇమామ్ అశోర్ (13వ నిమిషం) గోల్ కొట్టగా.. 55వ నిమిషంలో మొహమ్మద్ హనీ సెల్ఫ్ గోల్ కొట్టడంతో అది ఆస్ట్రేలియా ఖాతాలోకి వెళ్లిపోయింది. ఎక్స్ట్రా టైమ్లోనూ ఇరుజట్లు మరో గోల్కొట్టడంలో విఫలమయ్యాయి. అయితే పెనాల్టీ షూటౌట్లో తొలి కిక్లో ఆస్ట్రేలియా తరఫున హారి సౌట్టర్ బంతిని కిక్ చేయగా అది క్రాస్బార్ను తాకుతూ వెళ్లిపోయింది. ఈజిప్ట్ తరఫున మహ్మూద్ సాబెర్ స్కోర్ చేశాడు. ఇక రెండో కిక్లో ఆస్ట్రేలియా తరఫున జాక్సన్ ఇర్విన్, ఈజిప్ట్ తరఫున రామి రబియా స్కోర్ చేశారు. మూడో కిక్లో ఈజిప్ట్ తరఫున మహ్మద్ సాలా, ఆసీస్ తరఫున అవర్ మాబిల్ స్కోర్ చేయడంతో ఆధిక్యం 3-2కు తగ్గింది. కీలకమైన నాలుగో కిక్లో ఆస్ట్రేలియా మిస్ చేయగా, ఈజిప్ట్ తరఫున అబ్దెల్మిగుడ్ స్కోర్ చేయడంతో 4-2తో ఈజిప్ట్ జయకేతనం ఎగురవేసింది. ఆస్ట్రేలియాపై విజయంతో ఫిఫా చరిత్రలో ఈజిప్ట్ తొలిసారి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. అంతేకాదు ఆఫ్రికా నుంచి ఫిఫాలో రౌండ్-16కు అర్హత సాధించిన రెండో దేశంగా ఈజిప్ట్ నిలిచింది. ఇక రౌండ్-16లో అర్జెంటీనా, కేప్వెర్డె మధ్య విజేతతో ఈజిప్ట్ తలపడనుంది.సెల్ఫ్ గోల్స్ రికార్డుఈసారి ఫిఫా ప్రపంచకప్లో సెల్ఫ్ గోల్స్ విషయంలో ఒక చెత్త రికార్డు నమోదయ్యింది. ఈ టోర్నీలో ఈజిప్ట్ ఆటగాడు మొహ్మద్ హనీ కొట్టిన సెల్ఫ్ గోల్ 13వది కాగా.. గతంలో ఫిఫా టోర్నీలో నమోదైన 12 సెల్ఫ్ గోల్స్ రికార్డు బద్దలయ్యింది. 13 సెల్ఫ్ గోల్స్తో ఫిఫా ప్రపంచకప్ 2026 కొత్త రికార్డు సృష్టించింది. 2018లో రష్యాలో జరిగిన ఫిఫా టోర్నీలో 12 సెల్ఫ్ గోల్స్ నమోదవ్వగా, 1998లో ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఫిఫాలో ఆరు గోల్స్, 2014లో బ్రెజిల్ వేదికగా జరిగిన ఫిఫాలో ఐదు సెల్ఫ్ గోల్స్ నమోదయ్యాయి.Egypt won their first ever knockout match at worldcup, i loved their celebration. But in whole match Mo salah has been carried by mostafa ziko and Emam ashour, he showed his mediocrity today at global level. One penalty is enough to satisfy his dumbass fans😭 pic.twitter.com/Mhmraf5Vy0— shaurya nirjhar (@Shaurya_Nirjhar) July 3, 2026 -
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్కు జైలు శిక్ష..!
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆరోన్ సమ్మర్స్కు జైలు శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది. 2018లో నమోదైన ఈ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ త్వరలో రాబోతుంది. ఈ కేసులో ఆరోన్ నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసు టాస్మానియా సుప్రీం కోర్టులో శిక్ష ఖరారు దశలో కొనసాగుతోంది.2018లో ఆరోన్ హోబార్ట్లో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా బాలికతో పరిచయం ఏర్పరుచుకున్న అతడు.. ఓ పాఠశాల ప్రాంగణంలో లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు వివరాలు చెబుతున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అరోన్ బిగ్బాష్ లీగ్లో హోబార్ట్ హరికేన్స్కు ఆడుతున్నాడు.ఆరోన్పై గతంలోనూ మైనర్లపై లైంగిక దాడుల కేసుల్లో చాలా ఆరోపణలు ఉన్నాయి. చాన్నాళ్ల కాలంపాటు అతడు బెయిల్పైనే ఉన్నాడు. 2020లో ఆరోన్ పాకిస్తాన్ దేశవాలీ క్రికెట్ కూడా ఆడాడు. తద్వారా పాక్లో దేశవాలీ క్రికెట్ ఆడిన తొలి ఆస్ట్రేలియన్గా రికార్డుల్లోకెక్కాడు.30 ఏళ్ల ఆరోన్ ఒకప్పుడు ప్రతిభావంతమైన ఫాస్ట్ బౌలర్గా గుర్తింపు పొందాడు. అతడు ఆసీస్ జాతీయ జట్టులోకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. ఈ దశలో అతడు నేరాలకు పాల్పడుతూ కెరీర్ను నాశనం చేసుకున్నాడు. ఆరోన్ బిగ్బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్తో పాటు యూరో టీ20 స్లామ్ తదితర విదేశీ లీగ్ల్లో పాల్గొన్నాడు. -
ఆస్ట్రేలియాకు గుడ్ బై.. వేరే దేశానికి ఆడనున్న స్టార్ ఆల్రౌండర్
ఆస్ట్రేలియా వెటరన్ ఆల్-రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 39 ఏళ్ల హెన్రిక్స్ ఇకపై పోర్చుగల్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్లో అతడు తన సొంత దేశమైన పోర్చుగల్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరపున చివరగా 2021లో ఇంటర్ననేషనల్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం రెగ్యూలర్గా ఆడుతూ వచ్చాడు. న్యూసౌత్వేల్స్కు కెప్టెన్గా, ప్లేయర్గా తన సేవలను అందించాడు. అయితే హెన్రిక్స్ అనుహ్యంగా గతేడాది మార్చిలో ఫస్ట్క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. ఇప్పుడు ఆసీస్ జట్టులో అవకాశాలు రాకపోవడంతో తన మకాంను పోర్చుగల్కు మార్చాడు. అయినప్పటికి బిగ్బాష్ లీగ్లో మాత్రం మోయిసెస్ ఆడనున్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫుల్ మెంబర్ నేషన్ నుంచి అసోసియేట్ దేశానికి వెళ్లే ఆటగాళ్లు మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ను పూర్తి చేయాలి. అయితే హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరపున 2021లో ఆడడంతో అతడి కూలింగ్ పీరియడ్ కూడా పూర్తి అయినట్లే. పోర్చుగల్ తరపున ఆడేందుకు అతడికి ఎలాంటి చిక్కులు లేవు.కాగా హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్ ఎక్కువగా ఆడకపోయినప్పటికి, డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. 131 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లతో పాటు 141 లిస్ట్-ఎ, 301 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో కేకేఆర్, ఢిల్లీ, ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్,పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2016 విజేతగా నిలిచిన ఎస్ఆర్హెచ్ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఒక ఆస్ట్రేలియా ఆటగాడు అసోసియేట్ దేశానికి మారడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జో బర్న్స్ తన కుటుంబ నేపథ్యం కారణంగా ఇటలీకి మకాం మార్చాడు. 2025లో ఇటలీ తరపున అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.చదవండి: నేడే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ -
నేడే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్కప్ 2026లో నేడు (జూన్ 30) తొలి సెమీఫైనల్ జరుగనుంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓ సారి ఛాంపియన్ అయిన వెస్టిండీస్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్లో వెస్టిండీస్ అండర్ డాగ్ హోదాలో బరిలోకి దిగి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ దశలో అజేయ జట్టుగా ఫైనల్-4కు చేరింది. వెస్టిండీస్ తమ చివరి రెండు గ్రూప్ మ్యాచ్ల్లో (ఇంగ్లండ్, ఐర్లాండ్) చేతుల్లో ఓడినా సెమీస్కు చేరడం ఆసక్తికర పరిణామం.ఆస్ట్రేలియా విషయానికొస్తే.. ఈ జట్టు టీమిండియా సెమీస్ ఆశలను ఆవిరి చేసి ఫైనల్-4కు చేరింది. తమ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్పై విజయం సాధించడంతో సౌతాఫ్రికాకు సెమీస్ బెర్త్ దక్కింది. జులై 2న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-బి టాపర్ ఇంగ్లండ్తో సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటుంది. విండీస్-ఆసీస్ తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు ముందు విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ టోర్నీలో తాము అండర్ డాగ్స్ అని చెప్పుకుంటూ, అదే తమ బలమని పేర్కొంది."మా నుంచి ఎవరూ విజయం ఆశించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. నేటి సెమీఫైనల్లో ఒత్తిడి అంతా ఆస్ట్రేలియాపైనే ఉంటుంది. వాళ్లు గెలవాల్సిందేనని అందరూ భావిస్తున్నారు. కానీ మేం గెలిస్తే మాత్రం అది సంచలనం అవుతుంది. అందుకే మేం నిర్భయంగా ఆడగలం.వెస్టిండీస్ గతంలో ఎన్నోసార్లు అంచనాలను తలకిందులు చేసింది. ముఖ్యంగా ప్రపంచకప్లలో తమ జట్టు ప్రత్యేకంగా రాణిస్తుంది. తమను తక్కువ అంచనా వేయడం ఆటగాళ్లలో మరింత పోరాటస్ఫూర్తిని పెంచుతుంది" అని చెప్పింది.ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "ఆ మ్యాచ్లో మేం ఒత్తిడికి లోనయ్యాం. కానీ ఎవరైనా మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే, మాలో మరో రకమైన జోష్ కనిపిస్తుందని వివరించింది. -
ఊరు అమ్మబడును!
ఇల్లు అమ్మకానికి పెట్టడం చూశాం... భూమి అమ్మడం చూశాం... కానీ ఒక ఊరినే అమ్మకానికి పెట్టడం ఎప్పుడైనా విన్నారా? నిజమే! ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలోని ‘కూలాడ్డి’ అనే ఊరు ఇప్పుడు కొత్త యజమాని కోసం ఎదురుచూస్తోంది! ఒకప్పుడు 270 మంది జనాభాతో కళకళలాడిన ఈ ఊరు, రైల్వే మార్గాలు మారిపోవడంతో క్రమంగా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం కేవలం ఇద్దరు నివాసితులతోనే నడుస్తోంది. అందుకే దీనిని ‘ఆస్ట్రేలియాలోనే అతి చిన్న పట్టణం‘ అని కూడా పిలుస్తారు. ఈ ఊరిలో ఒక రోడ్హౌస్, మోటెల్, జనరల్ స్టోర్, పబ్, అంతేకాదు నాలుగు నక్షత్రాల రెస్టారెంట్ కూడా ఉన్నాయి. మరి ధర ఎంత అనుకుంటున్నారా? ఈ మొత్తం ఊరు దాదాపు నాలుగు లక్షల ఆస్ట్రేలియా డాలర్లకు, అంటే మన కరెన్సీలో సుమారు రూ. 2.67 కోట్లకు అమ్మకానికి సిద్ధంగా ఉంది! అందుకే, ఇది కొంటే, ఏకంగా ఒక చిన్న రాజ్యాన్నే కొన్నట్టే! అనుకొని చాలామంది వెళ్లారు. కాని, వెళ్లాక వాళ్లకి తెలిసింది ఏమిటంటే, ఈ క్రేజీ డీల్తో పాటు బాధ్యతలు కూడా ఫ్రీగా వస్తున్నాయని వెనక్కు వెళ్లిపోతున్నారు. కొత్త యజమాని పోస్టుమ్యాన్ గా, షాప్ యజమానిగా, పబ్ నిర్వాహకుడిగా, మోటెల్ మేనేజర్గా, అవసరమైతే వంటమనిషిగా కూడా మారాల్సి ఉంటుంది! సాధారణంగా, ఇల్లు కొంటే ఓ అడ్రస్ వస్తుంది. కానీ ఈ ఊరు కొంటే ఏకంగా మీ సొంత పోస్టల్ కోడ్ కూడా వస్తుంది! -
అదే జరిగితే హర్మన్ సేన ఇంటికే!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారంతో లీగ్ దశ మ్యాచ్లకు ఎండ్కార్డ్ పడనుంది. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ జట్టు మాత్రమే ఇప్పటివరకు నాకౌట్ దశకు చేరుకోగా, మిగిలిన మూడు బెర్తులు ఏ జట్లు ఖరారు చేసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. గ్రూప్-బి నుంచి వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొని ఉంది. ఈ రెండు జట్లలో ఎవరు సెమీస్లో అడుగుపెట్టనున్నారనేది ఇవాళ తేలిపోనుంది. మరోవైపు గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా జట్టు అనధికారికంగా నాకౌట్కు చేరుకున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా ఆ జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం డబుల్ హెడర్ పోరులో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్, సౌతాఫ్రికాతో బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా 8 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. టీమిండియా, సౌతాఫ్రికాలు చెరో 6 పాయింట్లతో సంయుక్తంగా ఉన్నాయి. అయితే రన్రేట్ విషయంలో సౌతాఫ్రికాతో (0.734) పోలిస్తే భారత్ (2.268) మెరుగైన స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో హర్మన్ సేన సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవాలంటే ఆస్ట్రేలియాపై తప్పనిసరి గెలవాల్సిందే. భారత్ సెమీస్ చేరే క్రమంలో సమీకరణాలు ఒకసారి పరిశీలిద్దాం.ఆసీస్ చేతిలో ఓడిపోతే..రేపు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో హర్మన్ సేన ఓడిపోతే మన ఖాతాలో ఆరు పాయింట్లు ఉంటాయి. అప్పుడు బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితం మనకు కీలకంగా మారనుంది. బంగ్లాదేశ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాలని కోరుకోవాలి. అప్పుడు ఆ జట్టు కూడా 6 పాయింట్లతోనే ఉంటుంది. ఇక్కడ నెట్రన్రేట్ కీలకం కానుంది. రన్రేట్ విషయంలో సౌతాఫ్రికా కంటే మనం మెరుగ్గా ఉండడంతో ఆసీస్తో కలిసి సెమీస్లో అడుగుపెడతాం. ఒకవేళ బంగ్లాపై సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం టీమిండియా ఇంటిబాట పట్టనుంది.👉ఒకవేళ ఆస్ట్రేలియాతో టీమిండియా గెలిచి, బంగ్లాపై సౌతాఫ్రికా గెలిచినా మెరుగైన రన్రేట్ కారణంగా హర్మన్ సేన సెమీస్లో అడుగుపెట్టనుంది. సౌతాఫ్రికా ఓడితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్లో అడుగుపెట్టనుంది.వర్షం పడి రద్దయితే..ఒకవేళ ఆస్ట్రేలియా, టీమిండియా మ్యాచ్ వర్షంతో రద్దయితే, అప్పుడు కూడా టీమిండియాకు అవకాశం ఉంటుంది. వర్షంతో మ్యాచ్ రద్దయితే హర్మన్ సేన ఖాతాలో 7 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు భారత్ ఏడు పాయింట్లతో నేరుగా సెమీస్లో అడుగుపెట్టనుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం సమీకరణాలతో సంబంధం లేకుండా ఆసీస్తో పాటు సఫారీలు నాకౌట్లో అడుగుపెట్టనుంది.చదవండి: అరువు తెచ్చుకున్న పోల్తో జాతీయ రికార్డు! -
ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్ ఫెయిల్?
ప్రపంచ దేశాలన్నీ ఆదర్శంగా చూసిన ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదా? 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనే ఉద్దేశం నెరవేరడం కష్టంగా ఉందా?. ప్రపంచంలోనే ఈ తరహా తొలి చట్టం అమల్లోకి తెచ్చిన ఆ దేశానికి.. ఆరు నెలలు తిరిగే సరికి పెద్ద షాక్ తగిలింది. 85 శాతం మంది పిల్లలు.. ఇప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియాను వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనం, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆన్లైన్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని 2025 డిసెంబర్ 10న చట్టం అమల్లోకి తెచ్చింది ఆంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని ప్రభుత్వం. దీని ప్రకారం.. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్ వంటి ప్రముఖ వేదికలు 16 ఏళ్లలోపు వారికి ఖాతాలు ఇవ్వకుండా ఈ చట్టం ఆదేశించింది. కాదని ముందుకు వెళ్తే.. భారీ జరిమానాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆరంభంలో మంచి ఫలితం ఇవ్వడంతో.. ఈ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయి.అయితే, ఆ చట్టం అమల్లోకి వచ్చి ఆరు నెలలు గడిచిన తర్వాత పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 12 నుంచి 15 ఏళ్ల వయసున్న ఆస్ట్రేలియా పిల్లల్లో దాదాపు 85 శాతం మంది ఇప్పటికీ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు.ఈ అధ్యయనంలో పాల్గొన్న చిన్నారుల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది.. నిబంధనల్లోని లొసుగులను వినియోగించుకున్నట్లు తేలింది. 16 ఏళ్లకు పైబడిన వారికే ఖాతాలు అనుమతించే నిబంధనను తప్పించుకునేందుకు.. తమ వయసును 16 ఏళ్లు దాటినట్లు నమోదు చేయడమో లేదంటే సెల్ఫీ ఆధారిత వయస్సు ధ్రువీకరణను దాటేయడమో చేస్తున్నారాట. తద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సోషల్ మీడియా ఖాతాలను యథావిధిగా కొనసాగించినట్లు అధ్యయనం వెల్లడించింది. దీంతో బ్యాన్ అమలులోని లోపాలు బహిర్గతమయ్యాయి.దీంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఈ మోడల్పై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో చట్టం అమలులో లోపాలను సరిదిద్దేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు వేదికలు ఈ నిర్ణయంపై కోర్టుల్ని ఆశ్రయించాయి. దీంతో న్యాయపరమైన సవాళ్లను కూడా తట్టుకునేలా చట్టాన్ని బలోపేతం చేయడమే కాకుండా.. దేశంలోని ఈ-సేఫ్టీ కమిషన్కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు పాటించని సోషల్ మీడియా సంస్థలపై.. 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల(సుమారు 322 కోట్ల రూపాయలు) వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే కొన్ని వేదికలపై చట్టపరమైన చర్యలకు సైతం అల్బనీస్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇక.. ఆస్ట్రేలియా ప్రయోగాన్ని అనుసరించేందుకు ఇప్పటికే పలు దేశాలు అడుగులు వేస్తున్నాయి. టీనేజర్లకు(16 ఏళ్లలోపు) సోషల్ మీడియాతో పాటు గేమింగ్, లైవ్-స్ట్రీమింగ్ వేదికలపైనా బ్రిటన్ ఆంక్షలు విధించే ప్రణాళికను ప్రకటించింది. ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్, నార్వే వంటి దేశాలు కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు లేదంటే నిషేధాల దిశగా కసరత్తు చేస్తున్నాయి.మొత్తానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే దీన్ని వైఫల్యంగా అంగీకరించకుండా.. చట్టంలోని లోపాలను సరిదిద్దుతూ మరింత సమర్థవంతంగా అమలు చేయడంపైనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది. -
చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. సెమీస్కు ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ గ్రూప్-ఏలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో చిత్తుగా ఓడింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 13.4 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ (32) టాప్ స్కోరర్గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ, సదర్లాండ్, ఎలిస్ పెర్రీలు తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ (79) అర్ధశతకంతో రాణించగా, జార్జియా వోల్ (39), సదర్లాండ్ (27), నికోలా కేరీ (26 నాటౌట్) రాణించారు. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, రమీన్ షమీమ్, నష్రా సంధూ తలా రెండు వికెట్లు తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఎలీస్ పెర్రీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకుంది. పాక్పై విజయంతో ఆస్ట్రేలియా నాకౌట్లో అడుగుపెట్టింది. మరో బెర్తు కోసం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గురువారం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ జట్టుతో కీలక మ్యాచ్ ఆడనుంది. -
ఆస్ట్రేలియాపై గెలుపు.. నాకౌట్కు యూఎస్ఏ
ఫిఫా వరల్డ్కప్ 2026కు సహ ఆతిథ్య దేశమైన యూఎస్ఏ గ్రూప్ దశలో (గ్రూప్-డి) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి నాకౌట్కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32కు చేరింది. గ్రూప్ దశలో మరో మ్యాచ్ (తుర్కియేతో) మిగిలి ఉండగానే ఆరు పాయింట్లు సాధించి తదుపరి దశలోకి ప్రవేశించింది.ఆసీస్తో మ్యాచ్కు స్టార్ ఆటగాడు క్రిస్టియన్ పులిసిక్ గాయంతో దూరమైనప్పటికీ అమెరికా జట్టు ఏమాత్రం తడబడలేదు. మ్యాచ్ ప్రారంభమైన 11వ నిమిషంలో ఆస్ట్రేలియా డిఫెండర్ కెమరూన్ బుర్గెస్ చేసిన సెల్ఫ్ గోల్ అమెరికాకు తొలి ఆధిక్యాన్ని అందించింది.ఆ తర్వాత తొలి అర్ధభాగం ముగియడానికి కొద్దిసేపటి ముందు అలెక్స్ ఫ్రీమన్ హెడ్డర్ ద్వారా రెండో గోల్ సాధించాడు. మొదట ఆఫ్సైడ్గా ప్రకటించిన ఈ గోల్ను వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) సమీక్ష అనంతరం చెల్లుబాటు అయ్యే గోల్గా నిర్ధారించారు. -
ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు!
ప్రభుత్వం ఉద్యోగం, అదీ ఎస్ఐ ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఢిల్లీ పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాన్ని వదిలేసి, ఆస్ట్రేలియా వలస వెళ్లి అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా సెటిల్ అయ్యాడు. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. నిశాంత్ తోమర్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్న స్ఫూర్తిదాయక ప్రయాణ వివరాలేంటో తెలుసుకుదాం.నిశాంత్ తోమర్ భారతదేశంలోఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. అది ఆయనకి తృప్తి నివ్వలేదు. రిస్క్ తీసుకుంటే తప్పజీవితంలో ఏమీ సాధించలేననున్నారు. అంతే జీవితాన్ని మలుపు తీప్పే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఏంటి ఈ నిర్ణయం పిచ్చా అని అందరూ ఖండించారు. అయినా సరే తన మనసు మాటే విన్నారు. 2023లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్ట్రేలియా విమానం ఎక్కేశారు. (రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!)అక్కడ భవిష్యత్తుపై ఎలాంటి గ్యారంటీ లేదు. అయినా రిస్క్ చేశారు. జీరో నుంచే జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ పయనంలో ఎన్నో కష్టనష్టాలు తప్పలేదు. ఒక గౌరవప్రదమైన హోదా ఉన్న ఉద్యోగం నుంచి విదేశాలలో ఎంట్రీ-లెవెల్ జాబ్స్ చేయడం, తన సొంతవాళ్లకు దూరంగా కొత్త వాతావరణం, ఒంటరితనం ఇలాంటి ఎన్నో మానసిక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నిఅడ్డంకులను అధిగమించి ఆస్ట్రేలియాలో సొంత ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా, ప్రస్తుతం అక్కడ ఒక విజయవంతమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారారు. అంతేకాదు ఆస్ట్రేలియాలో వారి మొదటి సొంత ఇంటి కలని సాకారం చేసుకోవాలనుకునే వారు నిశాంత్ను సంప్రదిస్తున్నారు. ఆయన సాయంతో తమ డ్రీమ్ హౌస్ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం.అంత ఈజీగా కాలం కలిసి రాలేదు. అవకాశాలను అందుపుచ్చుకోవడం, కొత్త ప్రదేశానికి అనుగుణంగా తనను తాను మార్చు కోవడం, కష్టాలొచ్చాయని కుంగిపోకుండా, వెనకడుగు వేయకుండా ముంకు సాగడం వల్లే ఇది సాధ్యమైంది అంటారు నిశాంత్. కొన్నిసార్లు మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టే నిర్ణయాల నుండే జీవితంలో అతిపెద్ద అవకాశాలొస్తాయి అని విదేశాల్లో కరియర్ వెతుక్కునే వారికి సలహా ఇస్తారు. View this post on Instagram A post shared by Nishant Tomar Realtor (@nishant.in.australia) నిశాంత్ చేసిన వీడియో నెట్టింట పలువుర్ని ఆకర్షిస్తోంది.విదేశాల్లో స్థిరపడాలని కలలుకుంటున్న ఎంతో మంది భారతీయులకు ఈ కథ బాగా కనెక్ట్ అయింది. నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ, "ఆస్ట్రేలియా వెళ్లాక రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి ఎలాంటి కోర్సులు లేదా ఉద్యోగాలు చేశారు?" అని కామెంట్ల రూపంలో ఆసక్తిగా అడుగుతున్నారు. ఈ వీడియోకి వేలాది లైక్స్ వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి : అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్ డ్రైవర్గా ఇపుడు లక్ష -
మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్
డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ అస్ట్రేలియా బంగ్లాదేశ్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 14) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో అతికష్టం మీద వికెట్ తేడాతో గెలుపొందింది. ఫలితంగా బంగ్లాదేశ్ ఆధిపత్యాన్ని 1-2కు తగ్గించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇదివరకే సిరీస్ను చేజార్చుకున్న ఆసీస్.. నేటి మ్యాచ్లోనూ మరో ఘోర పరాభవాన్ని తృటిలో తప్పించుకుంది.275 పరుగుల లక్ష్య ఛేదనలో కూపర్ కన్నోల్లీ (149) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే గెలుపుకు అతి చేరువలో 5 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి, మరో ఘోర ఓటమికి చేరువైంది. నానా కష్టాలు పడ్డ అనంతరం చివరి ఓవర్ మూడో బంతికి ఆడమ్ జంపా (4 నాటౌట్) బౌండరీ సాధించి, ఆసీస్ను మరో ఘోర పరాభం నుంచి తప్పించడంతో సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యే అవమానం నుంచి కూడా గట్టెక్కించాడు. చివర్లో జంపాకు మెరిడిత్ (2 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా ఆసీస్ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీ అనంతరం కన్నోల్లీ గెలుపు వాకిట ఔటై ఆసీస్ శిబిరంలో ఉత్కంఠ రేపాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ .. తౌహిద్ హృదోయ్ (83), లిటన్ దాస్ (58 నాటౌట్), మొసద్దెక్ హొసేన్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో బార్ట్లెట్, రెన్షా తలో 2 వికెట్లతో రాణించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో కన్నోల్లీ ఒంటరిపోరాటం చేశాడు. అతడికి లబూషేన్ (29), గ్రీన్ (27), పీక్ (27) కాసేపు అండగా నిలబడ్డారు. గెలుపు ఖరారయ్యాక బంగ్లా బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో ఆసీస్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. కాస్త అటుఇటు అయ్యుంటే ఈ మ్యాచ్ కూడా ఆసీస్ చేజారేది. షోరిఫుల్ ఇస్లాం (10-1-48-6) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్ శిబిరంలో రైళ్లు పరిగెట్టించాడు. ఈ పర్యటనలో ఆసీస్ తదుపరి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ చట్టోగ్రామ్ వేదికగా జూన్ 17న జరుగనుంది. -
మళ్లీ కెప్టెన్గా స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఫ్రాంచైజీ అయిన వాషింగ్టన్ ఫ్రీడం 2026 సీజన్ కోసం స్టీవ్ను కెప్టెన్గా నియమించింది. స్టీవ్ గతంలోనూ ఈ ఫ్రాంచైజీ కెప్టెన్గా వ్యవహరించాడు. 2024 సీజన్లో వ్యక్తిగతంగానూ సత్తా చాటి టైటిల్ గెలిపించాడు.గత సీజన్లో ఆస్ట్రేలియాకే చెందిన గ్లెన్ మ్యాక్స్వెల్ వాషింగ్టన్కు కెప్టెన్గా వ్యవహరించగా, ఈసారి ఆ బాధ్యతలు స్మిత్కు అప్పగించారు. వాషింగ్టన్ బృందం ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో నిండిపోయి ఉంది. ఈ జట్టుకు రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.టోర్నీ విషయానికొస్తే.. 2026 సీజన్ జూన్ 18న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో టెక్సాస్ కింగ్స్, సీయాటిల్ ఓర్కాస్ తలపడనున్నాయి. వాషింగ్టన్ తమ తొలి మ్యాచ్ను జూన్ 20న సియాటిల్తో ఆడనుంది. కాగా, ఈ టోర్నీ 2023లో ప్రారంభం కాగా.. ఎంఐ న్యూయార్క్ రెండు సార్లు, వాషింగ్టన్ ఓసారి టైటిల్ సాధించాయి. గత ఎడిషన్లో ఎంఐ న్యూయార్క్ విజేతగా నిలువగా.. వాషింగ్టన్ ఫ్రీడం రన్నరప్గా నిలిచింది. -
24 ఏళ్ల తర్వాత బరిలోకి.. టర్కీకి షాక్ ఇచ్చిన ఆసీస్!
ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. కెనడాలోని వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-డి ఆరంభ మ్యాచ్లో టర్కీపై 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ బరిలోకి దిగిన టర్కీ జట్టుకు ఆస్ట్రేలియా యువ ఆటగాళ్లు గట్టి షాక్ ఇచ్చారు. మ్యాచ్ ప్రారంభమైన 27వ నిమిషంలోనే ఆస్ట్రేలియా ఫార్వర్డ్ ఆటగాడు నెస్టోరీ ఇరాన్కుందా అద్భుతమైన కౌంటర్ ఎటాకింగ్ గోల్తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్తో ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున గోల్ చేసిన అతి పిన్న వయస్కుడిగా ఇరాన్కుందా సరికొత్త రికార్డు సృష్టించాడు.ఆ తర్వాత టర్కీ ఆటగాళ్లు మ్యాచ్ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆస్ట్రేలియా డిఫెన్స్ దాన్ని తిప్పికొట్టింది. ముఖ్యంగా 75వ నిమిషంలో మిడ్ఫీల్డర్ కానర్ మెట్కాఫ్ బాక్స్ వెలుపల నుంచి ఒక అద్భుతమైన లో-షాట్తో రెండో గోల్ కొట్టి ఆస్ట్రేలియా విజయాన్ని పూర్తిగా ఖాయం చేశాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 22 ఏళ్ల యువ గోల్కీపర్ పాట్రిక్ బీచ్ అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. టర్కీ జట్టు చేసిన పలు ప్రమాదకరమైన గోల్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుని క్లీన్ షీట్ సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ప్రస్తుతం ఈ గ్రూప్లో పరాగ్వేపై 4-1తో గెలిచిన అమెరికా జట్టు అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది.🔥METCALFE PUSO EL SEGUNDO PARA #Australia Ahora se lo ganan 2-0 al #Turquía de Arda Güler y compañía. pic.twitter.com/urOXI5u65W— Facundo Aquino 🎙️ (@FFacundoAquino) June 14, 2026చదవండి: న్యూజిలాండ్కు షాకిచ్చిన వెస్టిండీస్! -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ వన్డే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్, ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్లో విజయం సాధించింది. స్వదేశంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 11) జరిగిన రెండో మ్యాచ్లో విజయం సాధించడంతో ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్లోనూ ఆసీస్ను చిత్తు చేసిన బంగ్లా జట్టు, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ను హస్తగతం చేసుకుంది. 2005లో తొలిసారి ఆస్ట్రేలియాపై ఓ వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్.. తాజాగా రెండు వరుస విజయాలు సాధించి సంచలనం సృష్టించింది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడు అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 41 ఓవర్లలో 192 పరుగులకు మార్చారు. లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు రెండో బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తౌహిద్ హృదోయ్ (40), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (22) అజేయమైన ఇన్నింగ్స్లతో బంగ్లాను గెలుపుతీరాలకు చేర్చారు. అంతకుముందు సౌమ్య సర్కార్ (42), నజ్ముల్ షాంటో (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. మిగతా ఆటగాళ్లలో తంజిద్ హసన్ డకౌట్ కాగా.. లిటన్ దాస్ 21, తొలి వన్డే హీరో మొసద్దెక్ హొసేన్ 15 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బార్ట్లెట్, మెరిడిత్, జంపా, రెన్షా, గ్రీన్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆసీస్ ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేని అపవాదును మూటగట్టుకుంది. లబూషేన్ (55 నాటౌట్), బార్ట్లెట్ (52) అర్ద సెంచరీలతో రాణించి, ఈ మాత్రం స్కోరైనా అందించారు. మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ ఇంగ్లిస్ (34), గ్రీన్ (25), అలెక్స్ క్యారీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. షార్ట్, కన్నోల్లీ, రెన్షాతో పాటు జంపా డకౌటయ్యారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (7-2-27-3), తస్కిన్ అహ్మద్ (8-1-33-3), తన్వీర్ ఇస్తాం (10-0-45-2) చెలరేగి బౌలింగ్ చేశారు. ఈ సిరీస్లోని నామమాత్రపు మూడో వన్డే జూన్ 14న జరుగనుంది. కాగా, ఆసీస్కు ఇది వరుసగా రెండో ద్వైపాక్షిక సిరీస్ ఓటమి. ఈ సిరీస్కు ముందు ఆ జట్టు పాకిస్తాన్ చేతిలో 1-2 తేడాతో సిరీస్ను కోల్పోయింది. -
ఐదేళ్ల తర్వాత హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో ఇవాళ (జూన్ 11) జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టులో ఓ ఆశ్చర్యం చోటు చేసుకుంది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ ముందుగా ప్రకటించిన జట్టులో లేకపోయినా, అనూహ్యంగా తుది జట్టులో ప్రత్యక్షమయ్యాడు. మరో ఆశ్చర్యం ఏంటంటే, మెరిడిత్ దాదాపుగా ఐదేళ్లుగా వన్డే జట్టులో లేడు. అలాంటి ఆటగాడు హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం కావడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.ముందుగా జట్టులో లేని మెరిడిత్ను తుది జట్టులో తీసుకోవడం ఆసీస్ వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. తొలి వన్డేలో భారీ ఓటమి తర్వాత సిరీస్ను కాపాడుకోవాలన్న ఒత్తిడిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెరిడిత్ చివరిగా 2021 జులైలో వెస్టిండీస్పై ఓ వన్డే ఆడాడు. ఇదే అతని కెరీర్లో చివరిది, మొదటది. ఆ మ్యాచ్లో 5 ఓవర్లు వేసిన మెరిడిత్ 36 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత అతను వన్డేల్లో అవకాశాలు రాక, టీ20 ఫార్మాట్కు మాత్రమే పరిమితం అయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్ బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో ఆ జట్టు మరింత దారుణంగా ఖాతా తెరవకుండానే ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. ఆ దేశ వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత మూడు వన్డేల్లోనూ ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. తాజా ఉదంతంలో ఓపెనర్లు షార్ట్, కన్నోల్లీ, నాలుగో నంబర్ ఆటగాడు రెన్షా డకౌట్లయ్యారు.లబూషేన్ (55 నాటౌట్), బార్ట్లెట్ (52) బాధ్యతాయుతంగా ఆడటంతో ఆసీస్ అతికష్టం మీద 42 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతానికి మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్, బార్ట్లెట్తో పాటు కెప్టెన్ ఇంగ్లిస్ (34), గ్రీన్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మరో బ్యాటర్ (జంపా) కూడా డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (7-2-27-3), తస్కిన్ అహ్మద్ (8-1-33-3) చెలరేగి బౌలింగ్ చేశారు. ఆసీస్ ఈ మ్యాచ్ కూడా కోల్పోతే, వరుసగా రెండో సిరీస్ను చేజార్చుకున్నట్లవుతుంది. ఈ సిరీస్కు ముందు పాక్ చేతిలోనూ ఆసీస్ 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆసీస్ నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. -
ఆస్ట్రేలియాకు ఘోర అవమానం
ఆరు సార్లు విశ్వవిజేత, ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ కూడా అయిన ఆస్ట్రేలియా వన్డే జట్టుకు ఘోర అవమానం జరిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న (జూన్ 9) జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయంపాలైన ఆ జట్టు.. మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో వరుసగా మూడో ఇన్నింగ్స్లోనూ ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ ఖాతా తెరవకుండానే కుప్పకూలింది.ఇటీవల పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లోనూ ఆస్ట్రేలియా ఓపెనర్లు రెండుసార్లు (చివరి రెండు వన్డేలు) ఒక్క పరుగు కూడా జోడించలేకపోయారు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ అదే పరిస్థితి పునరావృతం కావడంతో, వన్డే చరిత్రలో వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ వికెట్కు ఖాతా తెరవని జట్ల జాబితాలో ఆస్ట్రేలియా చేరింది.ఈ అవాంఛనీయ జాబితాలో ఇప్పటికే న్యూజిలాండ్ (2015) ఉండగా, తాజాగా ఆస్ట్రేలియా వారి సరసన నిలిచింది. అయితే అత్యంత చెత్త రికార్డు మాత్రం పసికూన పపువా న్యూ గినియా పేరిట ఉంది. 2022లో పపువా న్యూ గినియా వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ వికెట్కు ఒక్క పరుగు కూడా నమోదు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కుదేలైపోయారు.బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది. -
బిగ్ అనౌన్స్మెంట్..!
భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చని భావిస్తున్న ఓ ప్రతిపాదన ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫ్రాంచైజీ టి20 లీగ్ అయిన బిగ్బాష్ లీగ్ మ్యాచ్లను తొలిసారిగా భారత్లో నిర్వహించే దిశగా ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన నిజమైతే, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఓ కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.ఈ ప్రణాళికలో భాగంగా చెన్నై నగరం ప్రధాన వేదికగా పరిశీలనలో ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఐకానిక్ క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన చిదంబరం స్టేడియంను ఓ ప్రత్యేక బీబీఎల్ రెగ్యులర్ మ్యాచ్కు ఆతిథ్యమివ్వడానికి అనుకూలమైన వేదికగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా , బీసీసీఐ మరియు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.తాజాగా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత లభించడానికి కారణం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారని వస్తున్న వార్తలు. ఆ పర్యటనలో మోదీ బిగ్బాష్ లీగ్ భారత ఎంట్రీపై "గ్రౌండ్ బ్రేకింగ్" ప్రకటన చేస్తారని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాలపై పలు సానుకూల ప్రకటనలు చేస్తారని సమాచారం.ఒకవేళ బిగ్బాష్ లీగ్ భారత ఎంట్రీ ప్రాజెక్ట్ సాకారమైతే, అంతర్జాతీయ టీ20 లీగ్లు పరస్పర దేశాల్లో మ్యాచ్లు నిర్వహించే కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్లలో పాల్గొనడంపై ఉన్న పరిమితులు, ఐపీఎల్ షెడ్యూల్తో సర్దుబాటు, ప్రసార హక్కుల పంపకం, లాజిస్టిక్స్ వంటి అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం
ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 9) జరిగిన తొలి మ్యాచ్లో 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది.ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన తాజా మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. తౌహిద్ హృదోయ్ (31), తస్కిన్ అహ్మద్ (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ (10-1-38-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రెన్షా తలో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు. బార్ట్లెట్కు ఓ వికెట్ దక్కింది.లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (5.2-0-24-2), తస్కిన్ (5-0-28-1) కూడా రాణించారు. -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
3 మ్యాచ్ల వన్డే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. జూన్ 9 నుంచి మొదలుకానున్న ఈ పర్యటనలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. వన్డే సిరీస్లోని తొలి 2 మ్యాచ్ల కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జూన్ 3) ప్రకటించారు.స్టార్ ఆల్రౌండర్ మొసద్దెక్ హొసేన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2022 ఆగస్టులో చివరిసారిగా వన్డే ఆడిన మొసద్దెక్, ప్రస్తుతం జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అబాహని లిమిటెడ్ తరఫున ఆడుతున్న అతడు ఆరు ఇన్నింగ్స్ల్లో 77.50 సగటుతో 310 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఏడు ఇన్నింగ్స్ల్లో 12 వికెట్లు కూడా పడగొట్టాడు.మొసద్దెక్తో పాటు నురుల్ హసన్ కూడా గ్యాప్ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. లిట్టన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, తౌహిద్ హృదోయ్, కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ తదితర బ్యాటర్లు జట్టులో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, నహిద్ రాణా వంటి పేసర్లు జట్టులో స్థానం తిరిగి పొందారు.ఈ సిరీస్లోని వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో ఢాకాలోని షేరే బంగ్లా స్టేడియంలో జరుగనున్నాయి. అనంతరం మూడు టీ20లు జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్లో జరుగనున్నాయి.ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు బంగ్లాదేశ్ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, నహిద్ రాణా -
హెడ్కోచ్గా ఆండ్రూ ఫ్లింటాఫ్
ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తొలిసారి విదేశీ లీగ్లో కోచ్గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) ఫ్రాంఛైజీ సిడ్నీ థండర్ తమ హెడ్కోచ్గా ఫ్లింటాఫ్ను నియమించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఒకసారి ఫైనల్.. కానీ రెండుసార్లు..కాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ట్రెవర్ బేలిస్ గత ఐదేళ్లుగా సిడ్నీ థండర్కు హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలోనే 2024-2025లో జట్టు ఫైనల్కు చేరింది. అయితే, 2023-24, 2025-26 సీజన్లలో మాత్రం దారుణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.ఈ నేపథ్యంలో సిడ్నీ థండర్ బేలిస్పై వేటు వేసి అతడి స్థానంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ను తీసుకువచ్చింది. కాగా ఫ్లింటాఫ్ గతంలో ది హండ్రెడ్ లీగ్లో నార్తర్న్ సూపర్చార్జర్స్కు కోచ్గా పనిచేశాడు.అత్యుత్తమ ఆల్రౌండర్అంతేకాదు.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్లకు 2023-24 సీజన్కు గానూ కన్సల్టెంట్గా ఫ్లింటాఫ్ వ్యవహరించాడు. అదే విధంగా ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు మార్గదర్శనం చేశాడు. కాగా ఇంగ్లండ్ అందించిన అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఆండ్రూ ఫ్లింటాఫ్ ఒకడు.అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున 1998- 2010 వరకు ఫ్లింటాఫ్ 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. వన్డేల్లో 3845 పరుగులు చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. 226 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 3394 పరుగులు చేయడంతో పాటు 169 వికెట్లు కూల్చాడు.ఇక ఏడు టీ20లలో కలిపి 76 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ . కాగా సిడ్నీ థండర్ తొలుత డాన్ క్రిస్టియన్, షేన్ వాట్సన్లను సంప్రదించినట్లు సమాచారం. అయితే, వారి కంటే 48 ఏళ్ల ఫ్లింటాఫే తమ జట్టుకు సరైన కోచ్ అని భావించి.. అతడితో రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది.చదవండి: ODI WC: రోహిత్ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు? -
చైనాకు చెక్.. AUKUS కూటమి భారీ వ్యూహం!
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లకు ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి అత్యాధునిక అండర్వాటర్ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాయి. AUKUS రక్షణ కూటమి కింద చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సముద్ర గర్భంలో పనిచేసే మానవరహిత అత్యాధునిక అండర్వాటర్ డ్రోన్లను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా తొలి దశ సామర్థ్యాలను 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రకటించారు.సింగపూర్లో జరిగిన ప్రతిష్ఠాత్మక షాంగ్రి-లా డైలాగ్ సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. AUKUS “పిల్లర్-2” కింద ప్రకటించిన తొలి ప్రధాన ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. కాగా, ఈ అండర్వాటర్ డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా.. శత్రు జలాంతర్గాములను గుర్తించడం, సముద్ర గర్భంలోని మైన్లను నిర్వీర్యం చేయడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సముద్ర యుద్ధ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. అవసరమైతే లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యాన్ని కూడా వీటికి కల్పించనున్నారు.2021లో ఏర్పడిన AUKUS కూటమి రెండు ప్రధాన భాగాలుగా పనిచేస్తోంది. “పిల్లర్-1” కింద ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాముల సాంకేతికత అందిస్తుండగా, “పిల్లర్-2” కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ, అండర్సీ వార్ఫేర్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.⚡️ US, UK and Australia ANNOUNCE UNDERWATER DRONES projectDeveloped under their military alliance known as AUKUS, technology is expected to be ready by next year pic.twitter.com/yW4pmf3RKc— RT (@RT_com) May 30, 2026ప్రస్తుతం ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 95 శాతం సముద్ర గర్భంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే జరుగుతోంది. అలాగే అనేక దేశాల గ్యాస్, ఇంధన సరఫరా వ్యవస్థలు కూడా సముద్ర అడుగునే ఉన్నాయి. ఇటీవల బాల్టిక్ సముద్రం, తైవాన్ సముద్ర జలసంధి ప్రాంతాల్లో అండర్సీ కేబుళ్లు దెబ్బతిన్న ఘటనలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో కీలక మౌలిక వసతుల రక్షణ కోసం అండర్వాటర్ డ్రోన్లను ఉపయోగించాలని AUKUS దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర గర్భం ఇప్పుడు కొత్త యుద్ధ రంగంగా మారుతోందని, అక్కడి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ టెక్నాలజీ కీలకమని వారు పేర్కొన్నారు.అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్లలో ఉపయోగించే సెన్సర్లు, నావిగేషన్ వ్యవస్థలు, AI ఆధారిత నిర్ణయ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు వంటి కీలక టెక్నాలజీలను కూడా మూడు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. జీపీఎస్ అందుబాటులో లేని సముద్ర గర్భంలో కూడా స్వతంత్రంగా ప్రయాణించే సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం వ్యూహం వెనుక ప్రధాన కారణం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న నౌకాదళ శక్తి. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ పరిసర ప్రాంతాల్లో బీజింగ్ దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని మిత్రదేశాలు సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రాజెక్ట్ను వేగవంతం చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, ఇది ప్రాంతీయ ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. -
క్వాడ్లో మళ్లీ చలనం
ఉందో, ముగిసిపోయిందో తెలియని స్థితిలో ఏడాదిగా దారీతెన్నూ లేకుండా ఉండిపోయిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో ఎందుకనో కొంత చలనం వచ్చింది. మంగళవారం సభ్య దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల సమావేశం జరగటం, చివరిలో ఒక ఉమ్మడి ప్రకటన వెలువడటం ఆర్నెల్ల ముందు కూడా ఊహకందనిది. ఎందుకంటే నిరుడు జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రులు, శత్రువులన్న విచక్షణ మరిచి అందరితో గిల్లికజ్జాలకు దిగడం మొదలెట్టారు. నిర్విచక్షణగా సుంకాలు విధిస్తూ అందరినీ సమానంగా ఇబ్బందిపెట్టారు. ఇలాంటి స్థితిలో అమెరికా చొరవతో ఏర్పడ్డ క్వాడ్ ఇక ముగిసిన అధ్యాయమని అందరూ అనుకున్నారు. నిజానికి ఆరంభంనుంచి క్వాడ్ ఏదో కారణంతో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనేవుంది. చైనాకు వ్యతిరేకంగా 2007లో తొలి సమావేశం జరుపుకోగా ఆ మరుసటి ఏడాదికే జపాన్, ఆస్ట్రేలియాలు వైదొలగాయి. ఆ రెండుచోట్లా పాలకులు మారటం ఇందుకొక కారణం. 2008లో అప్పటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ ‘చైనాను కట్టడిచేసే ఎలాంటి కూటమిలోనూ భాగస్వాములం కాదల్చుకోలేదు’ అని కుండబద్దలుకొట్టారు. దాంతో దాదాపు పదేళ్లపాటు అది అచేతనావస్థలో పడింది. 2017 నాటికి దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం ప్రాంతాల్లో చైనా పెత్తనం పెరగటంతో ట్రంప్ చొరవ తీసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అయినా కోవిడ్ కారణంగా తొలి శిఖరాగ్ర సమావేశం జరగటానికి నాలుగేళ్లు పట్టింది. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, సముద్రజలాల్లో ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు, టెలికాం సాంకేతికత తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని విదేశాంగ మంత్రుల సదస్సు నిర్ణయించటం తాజా ప్రపంచ పరిణామాల పర్యవసానమే. హార్మూజ్ జలసంధి ప్రతిష్ఠంభన... ఇంధన సరఫరా నిలిచిపోవటం, ఆ ప్రాంతంవైపు నుంచి వచ్చే అండర్ సీ కేబుల్స్ సైతం ప్రమాదంలో పడటం వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో నౌకలను అడ్డగిస్తున్న ఇరాన్ వైఖరిని, వచ్చే పోయే నౌకలవద్ద సుంకాలు వసూలు చేసే ఆలోచనను క్వాడ్ సమావేశం తప్పుబట్టింది. అనవసర యుద్ధంతో ఇంత వివాదానికి కారణమై, తాను సైతం హార్మూజ్ను దిగ్బంధించిన అమెరికాకు జనాంతికంగానైనా మిగిలిన దేశాలు హితవు పలికాయా అన్నది తెలియదు.చైనాను నిరోధించి, ఇండో–పసిఫిక్ దేశాల భద్రతకు కృషిచేయాలని గతంలో చెప్పుకున్న సంకల్పం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కిపోయింది. ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి, ఎప్పటికప్పుడు క్వాడ్ దేశాలమధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవాలని నిర్ణయించినా దీనర్థం క్వాడ్ను సైనికీకరణ చేయటం కాదని మన విదేశాంగ శాఖ వివరణనిచ్చింది. క్వాడ్ ఇంధన వేదికను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించ బోతున్నామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ప్రకటించారు. కానీ ఈ సంస్థ శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడో చెప్పకపోవటం సందేహాలకు తావిచ్చింది. విదే శాంగ మంత్రుల సమావేశంలోనే శిఖరాగ్ర తేదీలు ప్రకటించటం ఆనవాయితీ. వాస్తవా నికి అది 2024లోనే భారత్లో నిర్వహించాలి. కానీ వాయిదా పడింది. ఈలోగా సుంకాల వివాదం నేపథ్యంలో ట్రంప్ మన దేశం రావటానికి చొరవ చూపటం లేదు. క్వాడ్ మొదలయ్యే నాటికి చైనా దూకుడు మీదుంది. ముఖ్యంగా హిందూ సముద్ర ప్రాంత దేశాలమీదుగా అది ప్రారంభించదల్చుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు భారత్ భద్రతకు ముప్పు తెస్తుందన్న సందేహం ఉంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల్లో ఆ దేశం తరచు సృష్టించే వివాదాలు సరేసరి. ఇలాంటి నేపథ్యంలో క్వాడ్లో భాగస్వామ్యం కావటానికి మన దేశం ముందుకొచ్చింది. ఆనాటి పరిస్థితుల మాటెలావున్నా ఎవరికీ అంతుచిక్కని ట్రంప్ వంటి అధినేతను నమ్మి ముందుకెళ్లటం ఇప్పుడు సాధ్యమేనా? ఆయన చైనాతో సాన్నిహిత్యం కోసం తహతహలాడుతున్నారు. అది ఒక రూపం తీసుకుంటే క్వాడ్ కాడిపడేయరన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే రక్షణేతర రంగాల్లో భాగస్వామ్యం వరకూ ఫర్వాలేకున్నా, ఇతర విషయాల్లో మన దేశం ఆచితూచి అడుగేయక తప్పదు. -
పాకిస్తాన్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు ఉగ్రముప్పు
ఈ నెల 30వ తేదీ నుంచి పాకిస్తాన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ఉగ్రముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎప్పుడూ చూడని స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మే 30న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగనున్న తొలి వన్డే కోసం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది.ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం ఆస్ట్రేలియా జట్టుకే కాదు, భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందికి సైతం రక్షణ కల్పించేందుకు ప్రత్యేక "సెక్యూరిటీ అండ్ డిసిప్లిన్ యూనిట్"ను ఏర్పాటు చేశారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు.కాగా, రావల్పిండి, లాహోర్ వేదికలుగా మే 30, జూన్ 2, 4 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మూడు మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. ఐపీఎల్ కారణంగా చాలామంది ఆసీస్ ఆటగాళ్లు ఈ సిరీస్కు అందుబాటులో లేరు.జట్ల వివరాలు..పాకిస్తాన్: అబ్దుల్ సమద్, బాబర్ ఆజం, సాహిబ్జాదా ఫర్హాన్, షమిల్ హుసేన్, సల్మాన్ అఘా, మాజ్ సదాకత్, షాదాబ్ ఖాన్, ఘాజీ ఘోరీ, రోహైల్ నజీర్, షాహీన్ అఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ దనియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రౌఫ్, నసీం షా, సూఫియాన్ ముఖీమ్ఆస్ట్రేలియా: మార్నస్ లబూషేన్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, మిచెల్ మార్ష్ (కెప్టెన్), కెమరూన్ గ్రీన్, లియామ్ స్కాట్, ఒలివర్ పీక్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, రిలే మెరిడిత్, తన్వీర్ సంఘా, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపా -
న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ ఘనంగా బోణీ కొట్టింది. డెర్బీ వేదికగా నిన్న (మే 20) జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (45) ఓ మోస్తరు స్కోర్తో రాణించింది. మిగతా ప్లేయర్లలో ఇజ్జీ షార్ప్ 26 (నాటౌట్), మ్యాడీ గ్రీన్ 23, ఇసబెల్లా గేజ్ 12, బ్రూక్ హ్యాలిడే 14, కెప్టెన్ అమేలియా కెర్ 8, జెస్ కెర్ 5, జార్జియా ప్లిమ్మర్ డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, ఛార్లోట్ డీన్ తలో 2 వికెట్లు తీయగా.. లిన్సే స్మిత్, డేనియెలా గిబ్సన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అలైస్ క్యాప్సీ (74 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ను గెలిపించింది. ఆమెకుయ ఫ్రేయా కెంప్ (31 నాటౌట్) సహకరించింది. మిగతా ప్లేయర్లలో హీథర్ నైట్ 19, సోఫీ డంక్లీ 8, మియా బౌచర్ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్ 2, జెస్ కెర్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో రెండో టీ20 మే 23న జరుగనుంది. -
భారతీయ నర్స్ కుటుంబాన్ని గెంటేస్తున్న ఆస్ట్రేలియా
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో స్థిరపడాలనే ఆశతో వెళ్లిన ఓ భారతీయ కుటుంబానికి అక్కడ తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. తమ ఆరేళ్ల కుమారుడికి ఉన్న శారీరక ఎదుగుదల లోపాన్ని కారణంగా చూపిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ కుటుంబానికి పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) నిరాకరించింది. అంతటితో ఆగకుండా, వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమైంది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఈ కుటుంబం ప్రస్తుతం విక్టోరియాలోని బెండిగో నగరంలో తీవ్ర ఆందోళనతో కాలం వెళ్లదీస్తోంది.కన్నీరు పెట్టిస్తున్న విసా తిరస్కరణ ఈ కుటుంబానికి చెందిన క్రిస్టిన్ దాస్ విక్టోరియాలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో రిజిస్టర్డ్ నర్సుగా సేవలందిస్తున్నారు. ఆమె భర్త జినీష్ జోసెఫ్ క్వాలిఫైడ్ చెఫ్, అలాగే కొడుకు బాగోగులు చూసుకునే పూర్తి స్థాయి కేర్గివర్గా ఉన్నారు. వీరికి జాజియల్ (6), హేజెల్ (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విక్టోరియాలో ఎమర్జెన్సీ కేర్, హాస్పిటాలిటీ రంగాలలో సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ, కొడుకు అనారోగ్యాన్ని సాకుగా చూపి వీసా నిరాకరించడంపై వారు తీవ్రంగా కలత చెందుతున్నారు.ఐర్లాండ్ వదిలి వస్తే నడిరోడ్డుపైనేనా? గతంలో ఈ కుటుంబం ఐర్లాండ్లో ఉండేది. ఆస్ట్రేలియా వీసా లభించడంతోనే వారు అక్కడి నుంచి ఇక్కడికి తరలివచ్చారు. వీసా దరఖాస్తు ప్రక్రియలోనే తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తాము స్పష్టంగా తెలియజేశామని వారు చెబుతున్నారు. ఒకవేళ అప్పుడే వీసా తిరస్కరించి ఉంటే, తాము ఐర్లాండ్లోనే ఉండేవారమని, ఇప్పుడు ఇక్కడ అన్నీ సెట్ చేసుకున్నాక నడిరోడ్డుపై వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తమ కుమారునికి అందుతున్న వైద్య సహాయం ఆగిపోతే, వాడి భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.న్యాయం కోసం డిజిటల్ పోరాటం తమకు జరుగుతున్న అన్యాయంపై ఈ కేరళ కుటుంబం 'Change.org' వేదికగా డిజిటల్ పిటిషన్ వేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమను దేశం నుంచి బహిష్కరించకుండా నిలిపివేయాలని, మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని వారు ప్రజల మద్దతు కోరుతున్నారు. ఈ పిటిషన్కు ఆస్ట్రేలియా ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే 7,000 మందికి పైగా దీనిపై సంతకాలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ‘మా పిల్లలు ఇక్కడే పెరుగుతున్నారు. ఇదే వారి ఇల్లు... మమ్మల్ని వెళ్లగొడితే మా బాబుకు భవిష్యత్తు ఉండదు’ అంటూ ఆ తల్లిదండ్రులు చేస్తున్న అభ్యర్థన నెటిజన్లను కదిలిస్తోంది.ఇది కూడా చదవండి: ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు -
మసాజ్ పేరుతో 61 మందిపై లైంగిక దాడి.. భారత సంతతి అరెస్ట్
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సుమిత్ అనే వ్యక్తి 61మందిని మసాజ్ పేరుతో వేధించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నేరం రుజువు కావడంతో అతనికి 13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అనంతరం దేశబహిష్కరణ చేసింది.అక్కడి అధికారులు వివరాల ప్రకారం 39 ఏళ్ల సుమిత్ అనే వ్యక్తి 2011లో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అతను అక్టోబర్ 2021 నుంచి జూలై 2022 మధ్య ఒక మసాజ్ పార్లర్లో పని చేశారు. కాగా ఆ సమయంలో మసాజ్ పేరుతో మహిళలను లైంగికంగా వేధించాడు. మహిళల రహస్య వీడియోలు తీసి వారని లైంగికంగా వేదించాడు.కాగా ఈ కేసులో అతనిపై 97 అభియోగాలను నమోదు కాగా అన్నింటిని కోర్టులో అంగీకరించాడు.అయితే ఈ కోసును విచారించిన కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. 61 మంది మహిళలపై లైంగిక దాడి చేసినందుకు గాను సుమిత్కు 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించింది. అతను మహిళల నమ్మకాన్ని ఉల్లంఘించి, మసాజ్ల సమయంలో అనుచితమైన చర్యలకు పాల్పడ్డాడని కోర్టు వ్యాఖ్యానించింది. చికిత్స కోసం వచ్చని మహిళలను వారి నమ్మకాన్ని, భద్రతను దుర్వినియోగం చేశాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే సుమిత్కు సుమిత్కు మసాజ్ థెరపీలో ఎలాంటి అధికారిక అర్హతలు లేనప్పటికీ అక్రమంగా మసాజ్ సెంటర్లో విధులు నిర్వహస్తున్నారని శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడిని ఆస్ట్రేలియా బహిష్కరించవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. -
ప్రపంచకప్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ఇంగ్లండ్ అండ్ వేల్స్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల పటిష్టమైన జట్టును ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ సోఫీ మోలినెక్స్ ఎంపిక కాగా.. ఆష్లే గార్డ్నర్ ఆమెకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వ్యవహరించనుంది.ఈ జట్టులో ఎల్లిస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా మెక్గ్రాత్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా చోటు దక్కించుకున్నారు. ఈసారి సెలెక్టర్లు స్పిన్ బౌలింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా జార్జియా వేర్హమ్, అలానా కింగ్ వంటి లెగ్ స్పిన్నర్లను ఎంపిక చేశారు. అయితే ఫాస్ట్ బౌలర్ డార్సీ బ్రౌన్కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆమె స్థానంలో 20 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లూసీ హ్యామిల్టన్కు అవకాశం దక్కింది.ఇక భారత అభిమానులకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి చెందిన ముగ్గురు కీలక ప్లేయర్లకు ఈ ఆసీస్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. గ్రేస్ హ్యారిస్, ఎల్లిస్ పెర్రీ, సోఫీ మోలినెక్స్ డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ ఆడతారు. తమ ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు ప్లేయర్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం ఆర్సీబీ అభిమానుల్లో ఆనందం నింపింది.జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరిగే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా.. భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి పటిష్టమైన జట్లతో కలిసి గ్రూప్-1లో ఉంది. ఆసీస్.. జూన్ 13న మాంచెస్టర్లో దక్షిణాఫ్రికాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, భారత్తో గ్రూప్ దశ పోరాటాలు ఉంటాయి. ముఖ్యంగా జూన్ 28న లార్డ్స్ మైదానంలో భారత్తో జరిగే మ్యాచ్పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆస్ట్రేలియా మహిళల T20 ప్రపంచ కప్ 2026 జట్టుసోఫీ మోలినెక్స్ (కెప్టెన్), ఆష్లే గార్డ్నర్ (వైస్ కెప్టెన్), తహ్లియా మెక్గ్రాత్ (వైస్ కెప్టెన్), నికోలా క్యారీ, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, బెత్ మూనీ (వికెట్ కీపర్), ఎలిస్ పెర్రీ, మేగన్ షుట్, అన్నబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్. రిజర్వ్: తాలియా విల్సన్ (వికెట్ కీపర్). -
ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత!
ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మాల్ అండర్సన్ (91) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో సోమవారం తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియా తరఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ నెగ్గిన తొలి అన్సీడెడ్ ప్లేయర్గా మాల్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. వ్యవసాయక్షేత్రంలోని మట్టికోర్టుపై ప్రాక్టీస్ను ఆరంభించిన అండర్సన్ ఆ తర్వాత టెన్నిస్లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 1957లో యూఎస్ క్రౌన్ టైటిల్ నెగ్గిన అండర్సన్, మూడు డబుల్స్ టైటిల్స్ కూడా సాదించాడు. యునైటెడ్ స్టేట్స్ చాంపియన్షిప్ సాధించిన అన్సీడెడ్ క్రీడాకారుడిగా అండర్సన్ నిలిచాడు. ఇక ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ను కూడా అండర్సన్ రెండుసార్లు సాధించి చరిత్ర సృష్టించాడు.ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అండర్సన్, ప్రపంచ నంబర్ వన్గా ఎదిగిన పాట్ రాఫ్టర్ సహా ఎంతోమంది యువ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. మాల్ అండర్సన్ మరణంపై పాట్ రాఫ్టర్ స్పందించాడు. మాల్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. నా కెరీర్ ప్రారంభంలో టెన్నిస్లో మెళుకువలు తీర్చిదిద్దడంలో మాల్ అండర్సన్ ఎంతగానో సహాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని పాట్ రాఫ్టర్ పేర్కొన్నాడు. -
జాతీయ విధులకు ఆసీస్ స్టార్లు డుమ్మా
ఐపీఎల్ 2026 కారణంగా పలువురు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు జాతీయ విధులకు డుమ్మా కొట్టారు. త్వరలో జరుగబోయే పాక్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్లకు జట్లను ప్రకటించగా.. అందులో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ తదితరుల పేర్లు కనిపించలేదు.అండర్-19 జట్టు సారధి ఓల్లీ పీక్ తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. ఇతను పాకిస్తాన్తో జరిగే వన్డే సిరీస్కు మాత్రమే ఎంపికయ్యాడు. ఐపీఎల్ స్టార్లు రిటర్న్ రావడంతో బంగ్లాదేశ్ సిరీస్కు పీక్ను ఎంపిక చేయలేదు.కమిన్స్ గైర్హాజరీలో మిచెల్ మార్ష్ రెండు సిరీస్లకు (పాక్, బంగ్లాదేశ్) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అలాగే ఇంగ్లిస్, గ్రీన్లకు మూడు జట్లలో చోటు దక్కింది. స్టోయినిస్, మ్యాక్స్వెల్ బంగ్లాదేశ్ సిరీస్కు అందుబాటులో ఉన్నా సెలెక్టర్లు పట్టించుకోలేదు. వెటరన్ స్టార్ స్టీవ్ స్మిత్కు కూడా మూడు జట్లలో చోటు దక్కలేదు. ట్రవిస్ హెడ్ బంగ్లాదేశ్ వన్డే, టీ20 సిరీస్లకు మాత్రమే ఎంపికయ్యాడు.ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు చేరే జట్లతో ఉన్న కూపర్ కన్నోల్లీ, డ్వార్షుయిస్, బార్ట్లెట్ను కూడా పాక్ వన్డే సిరీస్కు ఎంపిక చేయలేదు. కాగా, ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాక్ పర్యటనకు వెళ్తుంది. ఆ పర్యటనలో మే 30, జూన్ 2, 4 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.పాకిస్తాన్ వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, రైలీ మెరెడిత్, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపాఅనంతరం ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్కు వెళ్తుంది. ఈ పర్యటనలో వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో.. టీ20లు 17, 19, 21 తేదీల్లో జరుగన్నాయి.బంగ్లాదేశ్ వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపాబంగ్లాదేశ్ టీ20ల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా -
నిజంగానే వచ్చేస్తున్నాయా?
ఈసారైనా వర్షాలు టైంకి పడతాయా? అనే కోట్లాది దేశ ప్రజలకు మదిలో మెదిలే ప్రశ్న. ప్రతీసారి అంచనాలు వేయడం.. అవి తప్పడం.. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా చూస్తున్నది. అయితే ఈసారి కచ్చితమైన సమాచారం ఉందని.. ఆన్ టైంకే వర్షాలు పడతాయని బల్ల గుద్ది మరీ చెబుతోంది భారత వాతావరణ శాఖ. మునుపెన్నంతగా.. ఈ మే నెలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో తీర రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ.. పుదుచ్చేరిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. అయితే దీనిని రుతుపవనాల రాకకు సంకేతంగానే భావిస్తున్నారు వాతావరణ నిపుణులు. వాళ్ల అంచనా ప్రకారం.. మరో రెండు వారాల్లోనే అండమాన్, నికోబార్ దీవులకు వర్షాలు మొదలవుతాయి. కాబట్టి.. జూన్ 1వ తేదీనాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయన్నమాట. ఇందుకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా.. తమ దేశంలో వర్షాకాలం ముగిసిందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణ ప్రజలకు అది మరో దేశపు వెదర్ బులిటెన్ మాత్రమే కావొచ్చు. భారత రుతుపవనాల కదలికలను గమనించే వాతావరణ శాస్త్రజ్ఞులకు మాత్రం ఈ ప్రకటన ఎంతో కీలకం. ఈ ప్రకటన ఆధారంగానే భారత్కు రుతుపవనాల రాకను అంచనా వేస్తారు.భారత మాన్సూన్ను అర్థం చేసుకోవాలంటే.. భూమధ్యరేఖ చుట్టూ తిరుగుతూ ఉండే ఒక అజ్ఞాత మేఘాల బెల్ట్ను ఊహించుకోవాలి. భూమధ్యరేఖ వద్ద ఉన్న ఈ మేఘాల బెల్ట్ ప్రతి సంవత్సరం సూర్యుడి కదలికను అనుసరిస్తూ దిశ మార్చుకుంటుంది. అంటే.. ఉత్తరార్థగోళం వేసవిలో ఉత్తర దిశగా, దక్షిణార్థగోళం వేసవిలో దక్షిణ దిశగా కదులుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వర్షాలను మోసుకెళ్తుంది. ఆస్ట్రేలియాలో రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడంతో దక్షిణ భాగం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అప్పుడది కచ్చితంగా ఉత్తర దిశగా కదిలి, సముద్రం నుంచి తేమతో నిండిన గాలులను దక్షిణ ఆసియాకు లాగి వర్షాలు కురిపిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో రుతుపవనాలు సమయానికి రావడానికి మార్గం సుగమం చేస్తుంది. ఆస్ట్రేలియాలో వర్షాకాలం ముగిసిన వెంటనే ఈ బెల్ట్ ఉత్తర దిశగా భూమధ్యరేఖ దాటి మాల్దీవులు, శ్రీలంక వైపు కదిలి, భారతదేశంలోని అండమాన్–నికోబార్ దీవులకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇది కేరళ తీరానికి చేరి, దేశమంతా వర్షాలను విస్తరింపజేస్తుంది. అందువల్ల ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటన.. భారత్కు రుతుపవనాలు సకాలంలో వస్తాయన్న స్పష్టమైన సంకేతంగా భావించబడుతోంది. ఈ సహజ చక్రం వల్ల.. మే–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల రాకతో భారత్లో వర్షాలు పడతాయి. సెప్టెంబర్ చివరికి ఈ బెల్ట్ తిరిగి దక్షిణ దిశగా కదిలి, ఆస్ట్రేలియాలో వర్షాకాలం మొదలవుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితులు కనిపిస్తుండడం.. సరైన దిశలో మేఘాల బెల్ట్ కదలికలు ఉండడంతో.. రుతుపవనాల రాక సమీపిస్తోందని వాతావరణ శాఖ ధీమాగా చెబుతోంది. అయితే.. ఈసారైనా ఆ అంచనా ఫలిస్తుందో చూడాలి. -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2027 సిరీస్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. వచ్చే ఏడాది జనవరి 21న తొలి టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగనుంది.అనంతరం జనవరి 29 నుండి చెన్నై వేదికగా రెండో టెస్ట్.. ఫిబ్రవరి 11 నుండి గౌహతి వేదికగా మూడో టెస్ట్.. ఫిబ్రవరి 19 నుండి రాంచీ వేదికగా నాలుగో టెస్ట్.. ఫిబ్రవరి 27 నుండి అహ్మదాబాద్ వేదికగా ఐదో టెస్ట్ ఆడనుంది.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2027 తేదీల ప్రకటనతో పాటు భారత పర్యటనలోని మరిన్ని సిరీస్ల వివరాలను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. బీజీటీ 2027కు ముందు ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత ఏ జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది.అలాగే ఆస్ట్రేలియా మహిళల ఏ జట్టు, పురుషుల అండర్-19 జట్టు కూడా సంబంధిత జట్లతో మల్టీ ఫార్మాట్ సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది.ఆస్ట్రేలియా-ఏతో సిరీస్సెప్టెంబర్ 22- తొలి మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)సెప్టెంబర్ 29- రెండో మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)అండర్-19 జట్టుతో సిరీస్భారత అండర్-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్లు ఆడనుంది.సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 27- తొలి మల్టీ డే మ్యాచ్ (రాజ్కోట్)అక్టోబర్ 5- రెండో మల్టీ డే మ్యాచ్ (అహ్మదాబాద్)మహిళల ఏ జట్టుతో సిరీస్ఆస్ట్రేలియా జట్టుతో భారత మహిళల ఏ జట్టు సెప్టెంబర్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (సెప్టెంబర్ 12, 15, 17-మొహాలి), 3 వన్డేలు (20, 23, 25- ధర్మశాల), ఓ మల్టీ డే మ్యాచ్ (29- ధర్మశాల) జరుగనున్నాయి. -
పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా.. షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరోసారి పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమైంది. మే-జూన్ నెలల్లో జరిగే ఈ పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ విడుదలైంది.తొలి వన్డే మే 30న రావల్సిండిలో జరుగనుండగా.. మిగతా వన్డేలు జూన్ 2, 4 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా మే 23న ఇస్లామాబాద్ చేరుకోనుంది.స్టార్ ఆటగాళ్లపై సందేహాలుపాక్ సిరీస్ ఐపీఎల్ ముగింపు సమయానికి ప్రారంభమవుతుండటంతో ఆసీస్ ఆటగాళ్ల లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్ పాట్ కమిన్స్ సహా పలువురు సీనియర్ ఆటగాళ్ల అందుబాటుపై స్పష్టత లేదు.ప్రపంచకప్కు ముందు టీ20 సిరీస్ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది జనవరిలో, టీ20 ప్రపంచకప్కు ముందు కూడా పాకిస్తాన్లో పర్యటించింది. ఆ పర్యటనలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్ను పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం విశేషం.బంగ్లాదేశ్ చేతిలో ఓటమిఇటీవల పాక్ బంగ్లాదేశ్ చేతిలో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్ కోసం పాక్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది.రేపటి నుంచి టెస్ట్ సిరీస్ప్రస్తుతం పాక్ జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్ ఢాకా వేదికగా రేపటి నుండి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ సిల్హెట్ వేదికగా మే 16 నుండి మొదలవుతుంది.తర్వాత బంగ్లాదేశ్ టూర్పాకిస్తాన్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు జూన్ 9 నుంచి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ల సిరీస్లు జరుగనున్నాయి. -
గూగుల్, మెటాలకు షాక్.. ఆస్ట్రేలియా కొత్త పన్ను
సోషల్ మీడియా దిగ్గజాలు మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), గూగుల్, టిక్టాక్లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. జర్నలిజం మనుగడ కోసం, వార్తా సంస్థలకు చెల్లింపులు చేయని పక్షంలో భారీగా పన్ను వసూలు చేసేలా రూపొందించిన కొత్త ముసాయిదా చట్టాన్ని విడుదల చేసింది.వార్తలకు విలువివ్వాల్సిందేజర్నలిస్టుల కష్టానికి తగిన ద్రవ్య విలువ ఉండాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సృజనాత్మకమైన వార్తా కంటెంట్ను ఉపయోగించుకుని బహుళజాతి సంస్థలు లాభాలు గడించడం తగదు. ఆ కంటెంట్ను ఉత్పత్తి చేసే వారికి తగిన పరిహారం అందాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నాణ్యమైన జర్నలిజం వెన్నెముక వంటిది’ అని పేర్కొన్నారు.ప్రతిపాదిత చట్టం ముఖ్యాంశాలువార్తా సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిరాకరించే ప్లాట్ఫారమ్లపై ఈ చట్టం కొరడా ఝుళిపించనుంది.వార్తా ప్రచురణకర్తలతో ఒప్పందాలు చేసుకోని పక్షంలో, సదరు కంపెనీల వార్షిక ఆదాయంపై 2.25 శాతం పన్ను విధిస్తారు.వార్తా సంస్థలకు చెల్లింపులు చేసే ప్లాట్ఫారమ్లకు పన్ను మినహాయింపులు (ఆఫ్సెట్లు) లభిస్తాయి.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని (సుమారు 200 - 250 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు), ఆయా వార్తా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.పాత చట్టంలో లొసుగులు 2021లో తెచ్చిన 'న్యూస్ మీడియా బేరసారాల కోడ్' నుండి తప్పుకోవడానికి కొన్ని సంస్థలు తమ ప్లాట్ఫారమ్ల నుంచి వార్తలను తొలగించాయి. తాజా చట్టాన్ని అటువంటి లొసుగులను అరికట్టేలా రూపొందించారు.భగ్గుమంటున్న టెక్ దిగ్గజాలుప్రభుత్వ నిర్ణయంపై మెటా, గూగుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ‘వార్తా సంస్థలు తమ ప్రయోజనం కోసమే మా ప్లాట్ఫారమ్లపై కంటెంట్ను పోస్ట్ చేస్తాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు సంపదను బదిలీ చేసే పన్ను మాత్రమే’ అని మెటా విమర్శించింది. ఇప్పటికే తాము వార్తా సంస్థలతో ఒప్పందాలు కలిగి ఉన్నామని, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫారమ్లను మినహాయించి కేవలం తమనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని గూగుల్ పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్తల ప్రాముఖ్యతను కాపాడటమే లక్ష్యమని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చెబుతుండగా, ఇది డిజిటల్ రంగంపై అనవసరపు భారమని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇదే బాట పడతాయేమో చూడాలి. -
థామస్ కప్లో సంచలనం.. క్వార్టర్స్కు భారత్
ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 5-0తో విజయం సాధించింది. ఇప్పటికే కెనడాను 4-1తో మట్టికరిపించిన భారత్ గ్రూప్-ఏలో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్కు భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ స్థానంలో హెచ్ఎస్ ప్రణయ్ ఆడాడు.తొలుత సింగిల్స్లో లక్ష్యసేన్ 21-14, 21-16తో స్టీఫెన్ సామ్పై విజయం సాధించాడు. ఆ తర్వాత మరో సింగిల్స్లో ఆయుశ్ శెట్టి 21-8, 21-6తో శ్రేయ్ ధండ్పై విజయం సాధించడంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడి 21-14, 21-16తో రిజ్కీ హిదయత్-జాక్ యూ జంటపై గెలుపొందింది. ఆ తర్వాత రివర్స్ సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 21-11, 21-17తో రిషి హొండా భూపతిని, డబుల్స్లో హరిహరన్-అర్జున్ జోడి 21-12, 21-10తో అండికా రమడియన్-సామ్ జంటపై విజయం సాధించడంతో భారత్ 5-0తో స్పష్టమైన ఆధిక్యంతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక బుధవారం భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో టాప్ సీడ్ చైనాతో తలపడనుంది. గత థామస్ కప్లో చైనా చేతిలో ఓడిన భారత్ క్వార్టర్స్కే పరిమితమైంది. అయితే ఈసారి మాత్రం టైటిల్ సాధించాలనే ధృడ నిశ్చయంతో ఉంది.Thomas Cup: India march into QF with 5-0 win over Australia in their 2nd group stage tie. India will take on powerhouse China in their final group stage clash. #ThomasCup2026 pic.twitter.com/DCeqYEeXZq— India_AllSports (@India_AllSports) April 27, 2026చదవండి: వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా? -
సంచలన విషయాలను వెల్లడించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన విషయాలను వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించినట్లు తెలిపాడు. ఈ విషయాలను తన రాబోయే పుస్తకం "Rashid Khan: From Streets to Stardom"లో ప్రస్తావించాడు. 2023 ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఈ ఆఫర్లు వచ్చినట్లు పేర్కొన్నాడు. భారత్, ఆస్ట్రేలియా నుండి పౌరసత్వంతో పాటు వారి జట్లకు ఆడే అవకాశం ఇచ్చినా, తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు. నేను నా దేశానికి ఆడకపోతే, మరే దేశానికి ఆడనని స్పష్టం చేసినట్లు పుస్తకంలో చెప్పాడు.భారత్ నుంచి వచ్చిన ఆఫర్ గురించి రషీద్ విపులంగా వివరించాడు. ఐపీఎల్ 2023 సమయంలో భారత క్రికెట్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు తనను కలిశారని తెలిపాడు. ఆ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని, భారత్లోనే స్థిరపడాలని, పౌరసత్వం ఇవ్వడంతో పాటు క్రికెట్ అవకాశాలు కూడా కల్పిస్తామని సూచించారని పేర్కొన్నాడు. అయితే ఆ ఆఫర్కు కృతజ్ఞతలు తెలుపుతూ, తాను ఆఫ్ఘనిస్తాన్కే ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పినట్లు వివరించాడు.కాగా, రషీద్ ఖాన్ దేశభక్తి గతంలో కూడా వార్తల్లో నిలిచింది. 2018 ఐపీఎల్ సమయంలో భారత అభిమానులు ఆయనకు పౌరసత్వం ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ అంశంపై అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, పౌరసత్వ నిర్ణయాలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయని తెలిపారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ రషీద్ను దేశ గర్వంగా అభివర్ణిస్తూ, అతన్ని కోల్పోమని స్పష్టం చేశారు.ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అగ్రస్థానానికి ఎదిగిన రషీద్ ఖాన్ ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటుంది. తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, 2020లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్గా కూడా నిలిచాడు. అయినప్పటికీ, ఎన్ని అవకాశాలు వచ్చినా తన దేశం పట్ల ఉన్న నిబద్ధతను విడువకపోవడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా నిలబెడుతోంది. మొత్తంగా రషీద్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం దేశభక్తి, విలువలపై నిలబడే ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. -
చారిత్రక నిర్ణయం.. మొట్టమొదటిసారి ఆర్మీ చీఫ్గా మహిళ
కాన్బెర్రా: ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారి ఆర్మీ చీఫ్గా ఓ మహిళను నియమించింది. దేశ రక్షణ దళ నాయకత్వంలో మార్పుల్లో భాగంగా ఆర్మీకి ఒక మహిళ నాయకత్వం వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జాయింట్ కెపాబిలిటీస్ చీఫ్గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సుసాన్ కాయిల్ జూలై నుంచి ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం తెలిపింది. ఆమె లెఫ్టినెంట్ జనరల్ సైమన్ ఆండ్రూ స్టువర్ట్ స్థానంలోకి ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆస్ట్రేలియా సైన్యంలో మహిళా అధికారుల సంఖ్యను పెంచే ప్రయత్నాల మధ్య కోయిల్ నియామకం జరిగింది. సైన్యంలో వ్యవస్థాపరమైన లైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణలు ఎదురవుతున్నాయి.ఆస్ట్రేలియా ఆర్మీ 125 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ఆర్మీ చీఫ్గా ఉండనున్నారని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ అన్నారు. రక్షణ మంత్రి రిచర్డ్ మాట్లాడుతూ.. కోయిల్ నియామకాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. “ప్రస్తుతం ఆస్ట్రేలియా రక్షణ దళంలో సేవ చేస్తున్న మహిళలకు, భవిష్యత్తులో చేరాలని ఆలోచిస్తున్న మహిళలకు ఇది ప్రేరణగా ఉంటుంది” అని తెలిపారు.కోయిల్కు 55 ఏళ్లు. 1987లో సైన్యంలో చేరి అనేక ఉన్నత కమాండ్ బాధ్యతలు నిర్వహించారు. సైన్యంలో ఏ శాఖకైనా నాయకత్వం వహించే తొలి మహిళగా నిలుస్తారని మార్లెస్ చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రక్షణ దళంలో మహిళలు సుమారు 21% మంది ఉండగా, ఉన్నత నాయకత్వ స్థానాల్లో 18.5% మంది ఉన్నారు. 2030 నాటికి మొత్తం 25% మహిళలు ఉండాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది. మహిళను ఆర్మీ చీఫ్గా నియమించడానికి ప్రధాన కారణాలుసైన్యంలో మహిళల ప్రాతినిధ్యం పెంచడంమహిళా అధికారుల సంఖ్య తక్కువగా ఉండడంతో, నాయకత్వ స్థాయిలో మహిళను నియమించి ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంలైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణల నేపథ్యంలో మార్పు అవసరంసైన్యంలో వ్యవస్థపరమైన లైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణలు రావడంతో, నాయకత్వంలో మార్పు ద్వారా సానుకూల సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంసుసాన్ కోయిల్కు దీర్ఘకాల సైనిక అనుభవం, ఉన్నత కమాండ్ బాధ్యతలు నిర్వహించిన నేపథ్యం ఉందిమహిళలు కూడా ఉన్నత స్థాయికి చేరగలరని చూపించడం. ఇది ప్రస్తుత సైనిక మహిళలకు, భవిష్యత్తులో చేరే వారికి ప్రేరణ.దేశంలో 2030 నాటికి సైన్యంలో మహిళల భాగస్వామ్యం 25%కి పెంచాలనే లక్ష్యానికి ఇది ఒక వ్యూహాత్మక అడుగు -
అథ్లెటిక్స్లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు!
ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే రేసింగ్ ట్రాక్ మీద చిరుతలా పరుగులు పెట్టిన స్ప్రింటర్ గుర్తుకువస్తాడు. పరుగుపందెంలో మిగిలిన వారికీ, ఉసేన్ బోల్ట్కి మధ్య ఉన్న దూరం చూసి, ప్రపంచం విస్తుపోయింది. 100, 200, 400 మీటర్ల ఈవెంట్స్లో బోల్ట్ ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. తాజాగా 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్లో బోల్ట్ నెలకొల్పిన రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు గౌట్ బద్దలుకొట్టడం విశేషం. ఆస్ట్రేలియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆదివారం ఈ అద్భుతం చోటుచేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసులో గౌట్ 19.67 సెకన్లలో గమ్యాన్ని చేరి సరికొత్త సృష్టించాడు. ఇంతకముందు ఉసేన్ బోల్ట్ 200 మీటర్ల రేసును 19.93 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో గౌట్ ఇదే 200 మీటర్ల రేసును 20.02 సెకన్లలో పూర్తి చేశాడు. తాజాగా తన రికార్డును మరింత సవరించడమే గాకుండా ఏకంగా జమైకా చిరుత బోల్ట్ రికార్డుకు ఎసరు పెట్టి నయా చిరుతగా ఆవిర్భవించాడు. ఇక ఫైనల్లో తన ప్రత్యర్థుల నుంచి గౌట్కు పోటీ ఎదురైంది. ఐడాన్ మర్ఫీ 19.88 సెకన్లతో రెండో స్థానంలో, కాలబ్ లా 20.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఫైనల్కు ముందే లాచ్లెన్ కెన్నెడీ వైదొలగడం కూడా గౌట్కు కలిసొచ్చింది.ఎవరీ గౌట్?గౌట్ పేరెంట్స్ అతడు పుట్టకముందే దక్షిణ సుడాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. క్వీన్స్లాండ్లో నివాసం ఏర్పరచుకున్న మోనికా, బోనా దంపతులకు ఏడుగురు సంతానం. అయితే గౌట్ పూర్వీకులది ఈజిప్ట్ కావడంతో అతడికి ఆ పేరు పెట్టారు. సౌత్ఈస్ట్ క్వీన్స్లాండ్లోని ఇప్స్విచ్ గ్రామర్ స్కూల్లో చదువుకున్న గౌట్ చిన్నప్పటి నుంచి సాకర్ ఆడడం నేర్చుకున్నాడు. అలా అథ్లెటిక్స్పై ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత పూర్తి అథ్లెటిక్స్లోకి మారిన గౌట్ అండర్ 16 విభాగంలో 100, 200 మీటర్ల పలు రికార్డులు నెలకొల్పాడు. 14 ఏళ్ల వయసులో గౌట్ 100 మీటర్ల రేసును 10.57 సెకన్లలో పూర్తి చేసిస సరికొత్త చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల వయసులో గౌట్ అండర్-18 విభాగంలో 200 మీటర్ల రేసును 20.87 సెకన్లలో పూర్తి చేసి దేశవాలీలో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ అథ్లెటిక్స్ టోర్నీల్లోనూ సత్త చాటిన గౌట్ ఓషినియా అండర్ 18 అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో 200 మీటర్లు, 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. ఇక ఉసేన్ బోల్ట్, 2009లో 100 మీటర్ల పరుగు పందెన్ని 9.58 సెకన్లలో పూర్తి చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే 150 మీటర్లను 14.35 సెకన్లు, 200 మీటర్లను 19.19 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 2, 2012 లండన్ ఒలింపిక్స్లో 3, 2016 రియో ఒలింపిక్స్లో 3 స్వర్ణాలు సాధించిన ఉసేన్ బోల్ట్, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో 11 స్వర్ణాలు సాధించాడు. 18-year-old GOUT GOUT 🇦🇺 19.67s (1.7) over 200m at Australian Championships in Sydney!!🤯🤯A new U20 World Record ☑️National Record ☑️ First Australian man under 20 seconds ☑️A star is born!pic.twitter.com/1GTfFJ4gst— Track & Field Gazette (@TrackGazette) April 12, 2026 చదవండి: దేశ ప్రజలను అవమానించిన పాక్ క్రికెటర్! -
పాకిస్తాన్ లీగ్ ఆడుతుండగానే మరో లీగ్తో ఒప్పందం చేసుకున్న స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఆడుతుండగానే మరో లీగ్తో ఒప్పందం చేసుకున్నాడు. అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లోని వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీతో అతను డీల్ కుదుర్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీకి స్టీవ్ 2024 ఎడిషన్లోనూ ఆడాడు. ఆ సీజన్లో ఫ్రీడంకు కెప్టెన్గానూ వ్యవహరించి టైటిల్ గెలిపించాడు. ఆ సీజన్లో ఫ్రీడం టైటిల్ గెలవడంలో స్టీవ్ది కీలకపాత్ర (9 ఇన్నింగ్స్ల్లో 56 సగటున, 148.67 స్ట్రయిక్రేట్తో 336 పరుగులు). ఇతరత్రా కారణాల వల్ల గత సీజన్ మిస్ అయిన స్టీవ్, ఇప్పుడు (2026) మళ్లీ ఫ్రీడంతో జతకట్టాడు.ఈ జనరేషన్లో అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్గా పేరు తెచ్చుకున్న స్టీవ్, ఇప్పుడిప్పుడే టీ20ల్లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. బిగ్బాష్ లీగ్ గత రెండు ఎడిషన్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిన స్టీవ్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్కు ఆడుతున్న స్టీవ్.. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 154కు పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించాడు. ఈ సీజన్లో స్టీవ్ సాహిబ్జాదా ఫర్హాన్తో కలిసి ముల్తాన్కు మెరుపు ఆరంభాలు అందిస్తున్నాడు. స్టీవ్ రాణిస్తుండటంతో పీఎస్ఎల్ 2026లో ముల్తాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టీ20 లీగ్ల్లో ఆడటం మొదలుపెట్టిన స్టీవ్కు ఐపీఎల్లో మాత్రం అవకాశం దక్కలేదు. ఈ సీజన్ వేలంలో పాల్గొన్నా స్టీవ్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. -
ఆస్ట్రేలియా ప్లేయర్ షాకింగ్ నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మోసస్ హెన్రిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో అతను ఆస్ట్రేలియాను వదిలి పోర్చుగల్కు వలస వెళ్లనున్నాడని సమాచారం. ఈ విషయాన్ని పోర్చుగల్ క్రికెటర్ సిరాజ్ ఉల్లా ఖదెమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా లీక్ చేశాడు. త్వరలో మన జట్టులో ఓ బిగ్బాష్ లీగ్ ప్లేయర్ జాయిన్ కాబోతున్నాడని హింట్ ఇచ్చాడు.హెన్రిక్స్ పోర్చుగల్కు మకాం మార్చడానికి ఓ ప్రధాన కారణముంది. అతనికి ఆస్ట్రేలియా జట్టు తరఫున అవకాశాలు రావడం లేదు. స్టోయినిస్, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్ల వల్ల అతని అవకాశాలు కనుమరుగయ్యాయి. పైగా అతని వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. వయసు కూడా అతనికి అడ్డంకిగా మారింది. దీంతో అతను తన స్వస్థలమైన పోర్చుగల్కు మారాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. హెన్రిక్స్కు ఆస్ట్రేలియాతో పాటు పోర్చగల్ పౌరసత్వం కూడా ఉంది.హెన్రిక్స్ 1989లో పోర్చుగల్లో జన్మించాడు. అతడి తండ్రి ఆల్వారో ఓ ప్రొఫెషనల్ ఫుట్బాలర్. చిన్న వయసులోనే హెన్రిక్స్ కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. 2013లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన హెన్రిక్స్ 4 టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హెన్రిక్స్ అంతర్జాతీయ కెరీర్లో 636 పరుగులు చేసి, 17 వికెట్లు సాధించాడు. బిగ్బాష్ లీగ్లో హెన్రిక్స్కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. సిడ్నీ సిక్సర్స్ తరఫున 3324 పరుగులు చేసి, రెండు టైటిల్స్ (2019/20, 2020/21) గెలిపించాడు. అసోసియేట్ దేశాలు అంతర్జాతీయ క్రికెట్లో బలంగా ఎదుగుతున్న తరుణంలో హెన్రిక్స్ లాంటి ఆటగాడు పోర్చుగల్కు వలస వెళ్లడం ఆ దేశ క్రికెట్ తలరాతనే మార్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లో ఇటలీ లాంటి చిన్న జట్టు అద్భుతాలు చేసి, ప్రపంచ దృష్టిని ఆకర్శించిన విషయం విధితమే.అసోసియేట్ జట్లలో చేరిన ప్రముఖ క్రికెటర్లు- ఉన్ముక్త్ చంద్ (భారత్) – యూఎస్ఏ - రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే – నెదర్లాండ్స్ - కోరె ఆండర్సన్ – యూఎస్ఏ - డేవిడ్ వీస్ – నమీబియా - వేన్ మాడ్సన్ – ఇటలీ - రాస్ టేలర్ – సమోవా -
ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ అరెస్టు
ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు. సిడ్నీలోని మారుబ్రాలో మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం న్యూ సౌత్ వేల్స్ పోలీసులు మరూబ్రాలోని మలబార్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు.ఆ సమయంలో అటుగా వస్తున్న వార్నర్ చెకింగ్ పాయింట్ను చూసి తన కారును రోడ్డు పక్కన పార్క్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన పోలీసులు అనుమానంతో అక్కడి వెళ్లి వార్నర్ను బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. ఈ టెస్టులో అతడు పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలింది.వెంటనే అతడిని మరూబ్రా పోలీస్ స్టేషన్కు తరలించి రెండో సారీ పరీక్షలు నిర్వహించారు. అతడి రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా ఉన్నట్లు తేలింది. ఇది ఆస్ట్రేలియాలోని అనుమతించిన పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దీంతో వార్నర్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. అనంతరం అతడిని విడుదల చేస్తూ.. 2026, మే 7వ తేదీన సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో కరాచీ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ టోర్నీలో వారి తదుపరి మ్యాచ్కు వారం రోజుల గ్యాప్ రావడంతో తన ఫ్యామిలీతో గడిపేందుకు వార్నర్ తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అయితే అతడు తిరిగి ఏప్రిల్ 7న పాకిస్తాన్కు చేరుకోనున్నట్లు సమాచారం.చదవండి: నోటితో కాదు.. ఆటతో సమాధానం చెప్పు: సెహ్వాగ్ ఫైర్ -
ఇరాన్లో ఇంకేం సాధించాల్సి ఉంది?: ఆస్ట్రేలియా ప్రధాని
కాన్బెర్రా: ఇరాన్లో సాధించాల్సింది ఇంకేముందంటూ అమెరికాను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ప్రశ్నించారు. ‘‘ఇరాన్ సంఘర్షణలో నిర్దేశించుకున్న ప్రాథమిక లక్ష్యాలు నెరవేరాయని.. ఇకపై అక్కడ సాధించాల్సింది ఏముందో స్పష్టంగా తెలియడం లేదు. యుద్ధం ముగింపు ఎలా ఉంటుంది’ అంటూ అల్బనీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, సైనిక పారిశ్రామిక కేంద్రాలు దెబ్బతిన్నాయన్నారు. ఉద్రిక్తతలను తగ్గించాలని అల్బనీస్ పిలుపునిచ్చారు.రాజధాని కాన్బెర్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఒకటి మాత్రం స్పష్టం.. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంత తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై మరో రెండు మూడు వారాల పాటు అత్యంత కఠినమైన దాడులు కొనసాగుతాయని ప్రకటించిన నేపథ్యంలో అల్బనీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు. -
ఆస్ట్రేలియా ఆజానుబాహుడికి బంపరాఫర్
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్లో (CSK) కీలక మార్పు చోటు చేసుకుంది. నాథన్ ఇల్లిస్ గాయంతో సీజన్ మొత్తానికి దూరం కావడంతో, అతని స్థానంలో మరో ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ జట్టులో చేరాడు. ఎడమ చేతి వాటం పేసర్ అయిన జాన్సన్ను సీఎస్కే రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది.జాన్సన్కు ఇదివరకే ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. 2024లో గుజరాత్ టైటాన్స్ అతన్ని రూ. 10 కోట్ల భారీ బిడ్తో దక్కించుకుంది. ఆ తర్వాత 2025లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున నాలుగు మ్యాచ్లు ఆడాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన జాన్సన్.. ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేట్ (10.39) చాలా దారుణంగా ఉంది. అయినా, సీఎస్కే అతన్ని తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.జాన్సన్కు ఐపీఎల్లో మంచి రికార్డు లేకపోయినా, ఆస్ట్రేలియా తరఫున ఓ మోస్తరు రికార్డు ఉంది. ఆసీస్ తరఫున అతను 8 టీ20ల్లో 14 వికెట్లు, 5 వన్డేల్లో 4 వికెట్లు తీశాడు. ఈ ఐపీఎల్ ఆఫర్కు ముందు జాన్సన్కు పాకిస్తాన్ సూపర్ లీగ్లో క్వెట్టా గ్లాడియేటర్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. గ్లాడియేటర్స్ ఇతన్ని నేరుగా సంతకం చేసుకున్నా, వ్యక్తిగత కారణాలతో అతను ఆ లీగ్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో అన్నీ పక్కకు పెట్టి ఓకే చెప్పేశాడు. ఆజానుబాహుడైన జాన్సన్ బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగలడు.కాగా, ఐపీఎల్ 2026లో సీఎస్కే ప్రయాణం మార్చి 30 నుంచి మొదలవుతుంది. గౌహతిలొ జరిగే మ్యాచ్లో సీఎస్కే రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 28న ఆర్సీబీ-సన్రైజర్స్ మ్యాచ్తో మొదలవుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. ఐపీఎల్-2026లో సీఎస్కే జట్టుఎంఎస్ ధోని (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్ ద్వారా, వికెట్ కీపర్), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, స్పెన్సర్ జాన్సన్ , శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), ఖలీల్ అహ్మద్, అకీల్ హొసేన్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చహర్, మ్యాట్ హెన్రీ. -
చంపేస్తమంటూ వార్నింగ్.. అయినా పాక్కు వచ్చిన స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో ఆడేందుకు లహోర్కు చేరుకున్నాడు. ఓ వైపు పాకిస్థాన్ వ్యతిరేక సాయుధ దళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినప్పటికి.. స్మిత్ మాత్రం పాక్ గడ్డపై అడుగుపెట్టాడు. లహోర్ ఎయిర్పోర్ట్లో స్మిత్కు ఘన స్వాగతం లభించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అతడు ముల్తాన్ సుల్తాన్ టీమ్ బస చేసే హోటల్కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చంపేస్తమంటూ వార్నింగ్!కాగా నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ విభాగం విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లు వెంటనే టోర్నీ నుండి తప్పుకోవాలని, లేదంటే వారి భద్రతకు తాము బాధ్యులం కాదని ఓ ప్రకటనలో జమాత్-ఉల్-అహ్రార్ పేర్కొంది. అయినప్పటికి విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పాక్కు చేరుకుంటున్నారు.పీసీబీ కీలక నిర్ణయం..ఈ హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రత, ఇంధన సంక్షోభం దృష్ట్యా ఈసారి మ్యాచ్లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అంతేకాకుండా కేవలం రెండు వేదికలలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఇక పీఎస్ఎల్ 11వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు -
యుద్ధ నౌకలను ఇవ్వం ట్రంప్ కు ఆస్ట్రేలియా బిగ్ షాక్
-
యూఏఈ కాన్సులేట్పై డ్రోన్ దాడి
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న దాడులు గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఇరాక్ పరిధిలోని కుర్దిస్థాన్ రీజియన్లో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కాన్సులేట్పై డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో యూఏఈకి ఆస్ట్రేలియా అండగా నిలిచింది. అత్యాధునిక గగనతల క్షిపణులను సరఫరా చేయడంతో పాటు నిఘా విమానాలను రంగంలోకి దించుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది.ఇరాక్లోని ఎర్బిల్లో ఉన్న యూఏఈ కాన్సులేట్ జనరల్ భవనంపై మంగళవారం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదు. ఈ దాడిని యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ దౌత్య నిబంధనలను ఉల్లంఘిస్తూ, సాగుతున్న ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులెవరో తేల్చేందుకు దర్యాప్తు జరపాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టేందుకు యూఏఈకి ఆస్ట్రేలియా సైనిక సాయాన్ని ప్రకటించింది. అత్యాధునిక ‘అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్’ క్షిపణులను యూఏఈకి పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న తమ దేశ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి గగనతలం సురక్షితంగా ఉండటం అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు యూఏఈ సుమారు 1,500కు పైగా క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుందని, పౌర భద్రత దృష్ట్యా ఈ సాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.మరోవైపు ఇరాన్ తన దాడులను ఇంధన కేంద్రాల వైపు మళ్లించింది. బహ్రెయిన్లోని అల్ మామీర్ చమురు శుద్ధి కర్మాగారంపై జరిగిన దాడితో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వ ఇంధన సంస్థ ‘బాప్కో’ ఫోర్స్ మెజ్యూర్ ప్రకటించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో భారత్ నుంచి వెళ్లే బియ్యం, ఇండోనేషియా కాఫీ రవాణాపై తీవ్ర ప్రభావం పడింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్తతలపై స్పందిస్తూ ఇరాన్తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాయి. యుద్ధం ఎప్పుడు ముగియాలో అమెరికా కాదు.. తామే నిర్ణయిస్తామని సవాల్ విసిరాయి. కాగా నిత్యావసరాల ధరలు పెరగకుండా దుబాయ్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. వచ్చే కొన్ని నెలల వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొంది. -
టీమిండియాకు ఘోర పరాభవం
మల్టీ ఫార్మాట్ సిరీస్ (3 టీ20, 3 వన్డేలు, ఏకైక టెస్ట్) కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పెర్త్లోని వాకా స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్లో క్వీన్ స్వీప్ అయ్యింది. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో కూడా ఓడి, సిరీస్ మొత్తాన్ని కోల్పోయింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అన్నాబెల్ సదర్ల్యాండ్ (17-5-46-4), లూసీ హ్యామిల్టన్ (11-3-31-3), డార్సీ బ్రౌన్ (12.4-0-41-2) ధాటికి 62.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో జమీమా రోడ్రిగ్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించారు. షఫాలీ వర్మ (35), ఆఖర్లో కశ్వీ గౌతమ్ (34 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 323 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంతితో సత్తా చాటిన సదర్ల్యాండ్ బ్యాట్తోనూ చెలరేగి సూపర్ సెంచరీ (129) చేసింది. ఎల్లిస్ పెర్రీ (76) అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా ప్లేయర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లలో సయాలీ సత్ఘరే 4, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 2, స్నేహ్ రాణా, షఫాలీ వర్మ చెరో వికెట్ తీశారు.125 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆసీస్ బౌలర్ల ధాటికి మరోసారి దారుణంగా పతనమైంది. హ్యామిల్టన్ (8-1-32-3), అలానా కింగ్ (10-2-23-2), ఆష్లే గార్డ్నర్ (4.2-1-8-2), సదర్ల్యాండ్ (6-2-15-2), డార్సీ బ్రౌన్ (14-2-45-1) దెబ్బకు 149 పరుగులకే ఆలౌటైంది. ప్రతీక రావల్ (63) ఒంటరిపోరాటం చేయగా.. స్టార్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. కెప్టెన్ హర్మన్(11), జెమీమా (14) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. ఆఖర్లో స్నేహ్ రాణా (30) ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించింది.అనంతరం 25 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కేవలం 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. జార్జియా వాల్ 16, లిచ్ఫీల్డ్ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్లోనే ముగిసింది. -
నలుగురి అరంగేట్రం
పెర్త్: భారత్, ఆ్రస్టేలియా మహిళల మధ్య శుక్రవారం మొదలైన ఏకైక టెస్టు మ్యాచ్ (డే అండ్ నైట్)లో తొలి రోజు బౌలర్ల హవా సాగింది. పింక్ బంతితో జరుగుతున్న ఈ టెస్టులో ఇరు జట్లు కలిపి మొదటి రోజు 13 వికెట్లు చేజార్చుకున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్లో 62.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. దాదాపు 20 నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోలేక తడబడింది. జెమీమా రోడ్రిగ్స్ (84 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (48 బంతుల్లో 35; 6 ఫోర్లు), కాశ్వీ గౌతమ్ (54 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలేసి భారత్కు కొంత మేలు చేశారు. అనాబెల్ సదర్లాండ్ 4 వికెట్లు పడగొట్టగా, తొలి టెస్టు ఆడుతున్న లూసీ హామిల్టన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా మహిళల జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 27 ఓవర్లలో 3 వికెట్లకు 96 పరుగులు చేసింది. ఎలైస్ పెరీ (62 బంతుల్లో 43 బ్యాటింగ్; 7 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (20 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న అలీసా హీలీ (13) విఫలమైంది. సయాలీ సత్గరేకు 2 వికెట్లు లభించాయి. ప్రస్తుతం ఆ్రస్టేలియా మరో 102 పరుగులు వెనుకబడి ఉంది. నలుగురి అరంగేట్రం... భారత జట్టు తరఫున ఒకేసారి నలుగురు ప్లేయర్లు టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా వరుసగా కాశ్వీ గౌతమ్, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్, సయాలీ సత్గరే టెస్టుల్లో అరంగేట్రం చేశారు. భారత్ తరఫున టెస్టు ఆడిన 95, 96, 97, 98వ ప్లేయర్లుగా వీరు నిలిచారు. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: స్మృతి (బి) హామిల్టన్ 4; షఫాలీ (సి) మూనీ (బి) సదర్లాండ్ 35; ప్రతీక (సి) హామిల్టన్ (బి) సదర్లాండ్ 18; జెమీమా (సి) గార్డ్నర్ (బి) హామిల్టన్ 52; హర్మన్ప్రీత్ (బి) బ్రౌన్ 19; దీప్తి (సి) మూనీ (బి) సదర్లాండ్ 7; రిచా (సి) అలానా కింగ్ (బి) గార్డ్నర్ 11; స్నేహ్ రాణా (సి) తాలియా (బి) హామిల్టన్ 5; కాశ్వీ (నాటౌట్) 34; సయాలీ (సి) మూనీ (బి) సదర్లాండ్ 7; క్రాంతి (సి) సదర్లాండ్ (బి) బ్రౌన్ 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (62.4 ఓవర్లలో ఆలౌట్) 198. వికెట్ల పతనం: 1–18, 2–54, 3–61, 4–84, 5–107, 6–150, 7–150, 8–157, 9–195, 10–198. బౌలింగ్: డార్సీ బ్రౌన్ 12.4–0–41–2, హామిల్టన్ 11–3–31–3, అనాబెల్ సదర్లాండ్ 17–5–46–4, తాలియా 4–2–15–0, యాష్లీ గార్డ్నర్ 15–3–39–1, అలానా కింగ్ 3–0–23–0. ఆ్రస్టేలియా మహిళల తొలి ఇన్నింగ్స్: జార్జియా వోల్ (బి) సయాలీ 2; ఫోబీ లిచ్ఫీల్డ్ (సి) జెమీమా (బి) క్రాంతి 9; పెరీ (బ్యాటింగ్) 43; అలీసా హీలీ (సి) జెమీమా (బి) సయాలీ 13; అనాబెల్ సదర్లాండ్ (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 9; మొత్తం (27 ఓవర్లలో 3 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–2, 2–31, 3–58. బౌలింగ్: సయాలీ 8–1–24–2, క్రాంతి 11–2–28–1, కాశ్వీ 7–1–29–0, స్నేహ్ రాణా 1–0–9–0. -
T20 WC 2026: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న (మార్చి 5) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఎడిషన్లో (2024, 2026), ఓవరాల్గా నాలుగోసారి (2007, 2014, 2024, 2026) ఫైనల్కు చేరింది.ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్కు చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తాజా ఫైనల్స్తో భారత్ ఐసీసీ టోర్నీల ఫైనల్స్ సంఖ్య 15కు చేరింది. గతంలో ఈ వరల్డ్ రికార్డు భారత్, ఆస్ట్రేలియా పేరిట సంయుక్తంగా ఉండేది. తాజాగా భారత్ ఆసీస్ ఆధిపత్యానికి తెరదించి, హోల్ అండ్ సోల్గా ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది.టీమిండియా ఫైనల్స్కు చేరిన ఐసీసీ టోర్నీలు.. భారత్ ఇప్పటివరకు 14 ఫైనల్స్లో 6 గెలిచింది, 7 ఓడింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా రద్దవగా, భారత్..శ్రీలంకతో పాటు సంయుక్తంగా ట్రోఫీని పంచుకుంది. - వన్డే వరల్డ్ కప్: 1983, 2011 విజయాలు, 2003, 2023 (రన్నరప్) - టీ20 వరల్డ్ కప్: 2007, 2024 విజయాలు, 2026 (లోడింగ్) - ఛాంపియన్స్ ట్రోఫీ: 2002 (సంయుక్త విజేత), 2013, 2025 విజయాలు, 2002, 2017 (రన్నరప్) - వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: 2021, 2023 (రన్నరప్) ఐసీసీ టోర్నీల్లోఅత్యధిక సార్లు ఫైనల్స్కు చేరిన జట్లు 1. భారత్ – 15 2. ఆస్ట్రేలియా – 14 3. ఇంగ్లాండ్ – 9 4. న్యూజిలాండ్ – 8 5. వెస్టిండీస్ – 8 6. శ్రీలంక – 8 7. పాకిస్తాన్ – 7 8. దక్షిణాఫ్రికా – 3ఫైనల్లో న్యూజిలాండ్తో ఢీ2026 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న జరుగనుంది. న్యూజిలాండ్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరింది. ఫిన్ అలెన్ 33 బంతుల్లో విధ్వంసకర సెంచరీ చేసి కివీస్ను ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు.చరిత్రాత్మక అవకాశం టీ20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఏ జట్టు టైటిల్ను రక్షించుకోలేదు. భారత్కు ఈసారి ఆ అవకాశం వచ్చింది. గత ఎడిషన్లో ఛాంపియన్గా నిలిచిన భారత్.. చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, న్యూజిలాండ్ తమ తొలి టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతుంది. -
ఏకైక ‘టెస్టు’కు భారత్ రె‘ఢీ’
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనను టి20 సిరీస్ విజయంతో మొదలుపెట్టిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్ మొదలవడంతోనే కంగారు పడింది. అన్నీ ఓడి వైట్వాష్ అయ్యింది. ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్కు మిగిలిందల్లా ఈ ‘టెస్టే’. నాలుగు రోజులపాటు జరిగే ఏకైక డే అండ్ నైట్ పింక్బాల్ టెస్టును గెలుచుకొని అత్యంత సంతృప్తికరంగా స్వదేశం చేరవచ్చు. ఓవరాల్ చాంపియన్షిప్లో ఇరు జట్లు చెరో సిరీస్ గెలుచుకున్నాయి. అయితే పాయింట్ల పరంగా చూస్తే భారత అమ్మాయిలు బాగా వెనుకబడి ఉన్నారు. పరిమిత ఓవర్ల మ్యాచ్ విజేతకు 2 పాయింట్లు లభించడంతో ఒక టి20, అన్నీ వన్డేలు గెలుపొందిన ఆ్రస్టేలియా 8 పాయింట్లతో పైచేయిగా ఉంది. రెండు టి20 విజయాలతో భారత్ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. ఇప్పుడు టెస్టు గెలిస్తేనే 4 పాయింట్లు వస్తాయి. అప్పుడే భారత్ 8–8 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్షిప్ను పంచుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’ చేసుకున్నా... ఆతిథ్య జట్టుకే ట్రోఫీ దక్కుతుంది. అజేయమే కానీ... ఇక్కడి వన్డే సిరీస్ను పక్కనబెడితే సంప్రదాయ ఫార్మాట్లో హర్మన్ బృందం అజేయంగా ఉంది. 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై వరుసగా గెలిచింది. అయితే ఈ మూడు సొంతగడ్డపై జరిగాయి. బ్యాటింగ్లో స్మృతి మంధాన ఫామ్లో ఉంది. ప్రతీకతో కలిసి చక్కని ఆరంభం ఇవ్వగలిగితే జెమీమా, హర్మన్, షఫాలీ వర్మ మిగతా బ్యాటింగ్ భారాన్ని పంచుకుంటారు. దీప్తి, రిచా ఘోష్లు కూడా ఆతిథ్య బౌలింగ్ను దీటుగా ఎదుర్కొంటే బ్యాటింగ్లో ఏ బెంగా ఉండదు. బౌలింగే మెరుగు పడాల్సి ఉంది. క్రాంతి, స్నేహ్ రాణా, సయాలీ, కాశీ్వలు సమష్టిగా రాణించాలి. ఆత్మవిశ్వాసంతో ఆసీస్ ఓడినా, గెలిచినా... సొంతగడ్డపై ఆ్రస్టేలియా దుర్బేధ్యమైన ప్రత్యర్థి. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఇప్పటివరకు జరిగిన మూడు ‘పింక్ బాల్’ టెస్టులు ఇక్కడే జరిగాయి. డేనైట్ టెస్టులో ఈ జట్టుకున్నంత అనుభవం ఇంకే జట్టుకు లేదు. ఫోబీ లిచ్ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్ పెరీ, కెప్టెన్ అలీసా హీలీ సొంతగడ్డపై తప్పకుండా రాణిస్తారు. తాలియా, ల్యూసీ హామిల్టన్, అలనా కింగ్, డార్సీ బ్రౌన్లతో కూడిన బౌలింగ్ దళమైతే మనకంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ తర్వాత అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్న అలీసా హీలీకి గెలుపు బహుమతి అందించాలని ఆసీస్ బృందం భావిస్తోంది. పిచ్, వాతావరణం ఇది పోటాపోటీ పిచ్. నాణ్యమైన బౌలింగ్కు... పాతుకుపోతే బ్యాటింగ్కు సమాన అవకాశముంది. దేశవాళీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో సీజన్ అంతా అదే జరిగింది. పచ్చికతో తొలిరోజు బౌలింగ్కు బాగా అనుకూలించడంతో బ్యాటర్లకు కష్టాలు తప్పవు. పిచ్ పాతబడే కొద్దీ స్పిన్నర్లు మాయ చేస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, ప్రతీక, షఫాలీ, జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జోత్/సయాలీ, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్. ఆ్రస్టేలియా: అలీసా హీలీ (కెప్టెన్ ), ఫోబీ లిచ్ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్ పెరీ, అనాబెల్ సదర్లాండ్, బెత్ మూనీ, యాష్లీ గార్డ్నర్, తాలియా, అలానా కింగ్, ల్యూసీ హామిల్టన్, డార్సీ బ్రౌన్. -
ఓ పెంపుడు కుక్క కథ..
ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నగరవాసులు దివ్య, జాన్ రాజేష్ సొంతింటి కల నెరవేర్చుకునేందుకు రూ.16లక్షలు కూడబెట్టారు. ఈలోపు వీరికి ఆ్రస్టేలియాలో స్థిరపడే అవకాశం వచి్చంది. దీంతో పెంపుడు శునకం ‘స్కై’ని తమ వెంట తీసుకెళ్లాలని సంకల్పించి.. ఇంటికోసం దాచుకున్న మొత్తాన్ని దాని కోసం వెచి్చంచారు. ఈ జంతు ప్రేమికుల కథ ప్రస్తుతం ఇన్స్టాలో డాక్యుమెంటరీగా వైరల్ అయ్యింది. ‘స్కై ది మేజికల్ డాగ్’ పేరుతో ఏకంగా ఓ పేజీ ఏర్పడింది. దీనిపై అనూహ్యంగా స్పందిస్తున్న నెటిజనులు తమ పెట్స్తో ఉన్న అనుబంధాన్ని, అనుభవాలను పంచుకుంటున్నారు. నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసిన టెక్కీలు దివ్య, జాన్లకు గతేడాది ఉద్యోగరీత్యా ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్ వెళ్లి స్థిరపడే అవకాశం వచి్చంది. ఏళ్లుగా తాము పెంచుకుంటున్న జాగిలం స్కై దగ్గరకు వచ్చేసరికి వారికి ఇబ్బంది అనిపించింది. తమ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రేమగా పెంచుకుంటున్న దానిని ఇక్కడ వదిలి వెళ్లడానికి మనసొప్పలేదు. దాన్నీ తమతోపాటు ఆ్రస్టేలియా తీసుకెళ్లాలని భావించారు. అందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు ఆ దేశ యంత్రాంగాన్ని సంప్రదించారు. ఒక్క రేబిస్ కేసు కూడా నమోదుకాని కంట్రీగా ఉన్న తమ దేశానికి పెట్స్ను నేరుగా తీసుకురావడం సాధ్యం కాదని వాళ్లు స్పష్టం చేశారు.సన్నిహితులు వద్దన్నా.. తాహతకు మించిన ఖర్చే అయినా.. స్కై మీద ప్రేమ ఇంటి కోసం దాచుకున్న మొత్తాన్ని వెచి్చంచేలా చేసింది. విషయం తెలిసిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు వీరి నిర్ణయాన్ని వారించారు. అవసరమైతే మరో మేలి జాతి జాగిలాన్ని ఖరీదు చేసుకోవాలని సూచించారు. స్కై మీద ప్రేమతో అంత పెద్ద మొత్తాన్ని ఖర్చుచేయవద్దని వారించారు. ఏమాత్రం వెనుకాడక.. ఎలాగైనా స్కైని తెసుకెళ్లాలని భావించి అనేక మార్గాలను అన్వేషించారు. మరో రేబిస్ ఫ్రీ దేశంలో ఆరు నెలలు పెట్ను ఉంచినట్లు, వైద్య పరీక్షలతో ధ్రువీకరణ పొందితే ఆ్రస్టేలియాలో అడుగుపెట్టొచ్చని తెలిసింది. అంతే క్షణం ఆలోచించకుండా ఆ పనులకు శ్రీకారం చుట్టారు. స్కైని తొలుత దుబాయ్ తీసుకెళ్లి ఆరు మాసాలు ఉంచాలని నిర్ణయించుకున్నారు. రవాణా, పెట్ కేర్, షెల్డర్ హోమ్, ఇతర వైద్య పరీక్షలకు ఏజెన్సీలకు సంప్రదించారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా ఆస్ట్రేలియాకు చేరేందుకు రూ.15 లక్షలు అవుతుందని లెక్కతేలింది.కథ సుఖాంతం.. తొలుత స్కైని హైదరాబాద్ నుంచి దుబాయ్ తీసుకెళ్లారు. తక్కువ ఖర్చుతో ఆరు నెలలు ఉంచే రేబిస్ ఫ్రీ దేశాలు మరికొన్ని ఉన్నా.. స్కైకితో హిందీలో సంప్రదింపులు జరపాల్సి ఉండటంతో దుబాయ్నే ఎంచుకున్నారు. అక్కడి పెట్ కేర్ సెంటర్లో ఆరు మాసాలు ఉంచి తాము ఆ్రస్టేలియా వెళ్లిపోవాలని భావించారు. కొత్త ప్రాంతం, వాతావరణం కావడంతో నెల రోజులు దాంతో పాటే దుబాయ్లో ఉన్నారు. ఆపై మెల్బోర్న్ వెళ్లిపోయారు.. ఐదు నెలల రోజూ ఉదయం, సాయంత్రం వీడియో కాల్స్ ద్వారా స్కైని పలుకరించారు. చివరికి 180 రోజుల అనంతరం స్కై మెల్బోర్న్ చేరింది. అక్కడి క్వారంటైన్ సెంటర్లో మరో పది రోజులు ఉంచిన తర్వాత వారి ఇంటికి తీసుకువెళ్లారు. దీని ఆధారంగా ‘కహానీ ఆఫ్ టేల్స్’ అనే హ్యాండిల్ డాక్యుమెంటరీ చేయడంతో వైరల్ అయ్యింది. -
ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ దూరం
పెర్త్లోని ప్రసిద్ధ WACA మైదానం వేదికగా మార్చి 6 నుంచి 9 వరకు భారత్తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 13 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును నిన్న (మార్చి 2) ప్రకటించారు. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్లో పింక్ బాల్తో జరుగుతుంది. పేసర్ కిమ్ గార్త్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరం కాగా.. రాచెల్ ట్రెనమన్, మైట్లాన్ బ్రౌన్ జట్టులోకి వచ్చారు. వీరిద్దరు గాయాల బారిన పడిన స్టార్ ఆల్రౌండర్ ఎల్లిస్ పెర్రీ, స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ ప్రత్యామ్నాయంగా ఎంపికయ్యారు.24 ఏళ్ల ట్రెనమన్కు సీనియర్ జట్టు తరఫున ఇది తొలి అవకాశం. ఇటీవలికాలంలో ఆమె అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ సీజన్ విమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్లో టస్మానియా తరఫున ఓపెనింగ్ చేస్తూ 81 సగటున 648 పరుగులు చేసి సెలెక్టర్లను ఆకట్టుకుంది. బ్రౌన్ విషయానికొస్తే.. ఈ 28 ఏళ్ల పేసర్ 2021 తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఆమె న్యూ సౌత్ వేల్స్ తరఫున 10 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉంది. గత ఆగస్టులో ఇండియా-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో ఆస్ట్రేలియా A తరఫున ఆడి 4 వికెట్లతో సత్తా చాటింది. చివరి మ్యాచ్ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీకి అంతర్జాతీయ క్రికెట్లో చివరి మ్యాచ్. హీలీ చాలా రోజుల ముందే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. హీలీ.. తాజాగా ఆడిన తన చివరి వన్డేలో అద్భుత శతకంతో (158) చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత జట్టు ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.భారత్తో ఏకైక టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు.. - అలీస్సా హీలీ (కెప్టెన్) - డార్సీ బ్రౌన్ - మైట్లాన్ బ్రౌన్ - అశ్లే గార్డ్నర్ - లూసీ హామిల్టన్ - అలానా కింగ్ - ఫీబీ లిచ్ఫీల్డ్ - బెత్ మూనీ - తాలియా మెక్గ్రాత్ - ఎలీస్ పెర్రీ - అన్నాబెల్ సతర్లాండ్ - జార్జియా వోల్ - జార్జియా వారెహామ్ -
ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్’
హోబర్ట్: ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా టి20 సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు... వన్డే సిరీస్లో ‘వైట్వాష్’కు గురైంది. ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు... చివరి మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో వన్డే ప్రపంచ చాంపియన్ టీమిండియాపై 185 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా విజయం సాధించి 3–0తో సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. కెరీర్లో చివరి వన్డే ఆడిన ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు శతకం చేసింది. బెత్ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... జార్జియా వోల్ (52 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ సాధించింది. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షాట్లతో స్కోరును నాలుగొందలు దాటించింది. భారత బౌలర్లలో శ్రీచరణి, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టారు. తెలుగమ్మాయి శ్రీచరణి 10 ఓవర్లలో 106 పరుగులిచ్చింది. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న భారత బౌలర్గా చెత్త రికార్డును ఆమె మూటగట్టుకుంది. వరుస వికెట్లు కోల్పోయి... అనంతరం భారీ లక్ష్యఛేదనలో టీమిండియా తడబడింది. 45.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. కొండంత లక్ష్యఛేదనలో టీమిండియా ఏ దశలోనూ పోటీలో కనిపించలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన హర్మన్ బృందం లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (0) డకౌట్ కాగా... ప్రతీక రావల్ (27; 6 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 42; 9 ఫోర్లు) కాస్త పోరాడారు. వీరిద్దరూ రెండో వికెట్కు 35 బంతుల్లో 54 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చినవాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (25; 2 ఫోర్లు), హర్లీన్ డియోల్ (14), దీప్తి శర్మ (29; 2 ఫోర్లు), రిచా ఘోష్ (18; 2 ఫోర్లు, 1 సిక్స్) విఫలమయ్యారు. స్నేహ్ రాణా (74 బంతుల్లో 44; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ 4 వికెట్లు పడగొట్టింది. అలీసా హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 6 నుంచి పెర్త్లో ఏకైక టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ వన్డేలకు గుడ్బై చెప్పిన అలీసా తన కెరీర్లో 126 వన్డేలు ఆడి 3777 పరుగులు చేసింది. ఇందులో 8 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. -
ఆఖరి వన్డే గెలుస్తారా!
హోబర్ట్: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్ను కోల్పోయింది. ఇప్పుడు క్లీన్స్వీప్ నుంచి తప్పించుకునేందుకు, గెలుపు తృప్తితో ముగించేందుకు ఆఖరి వన్డే బరిలోకి దిగుతోంది. ఒత్తిడిలో ఉన్న హర్మన్ప్రీత్ సేన జోరు మీదున్న ఆసీస్ను సొంతగడ్డపై ఎలా నిలువరిస్తుందో చూడాలి. వన్డే సిరీస్కు వచ్చేసరికి భారత బ్యాటింగ్ తడబడుతోంది. టాపార్డర్లో స్మృతి మంధాన, మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ మెరుగ్గా ఆడుతున్నప్పటికీ సహచరులంతా ఆసీస్ బౌలింగ్కు దాసోహం కావడం జట్టుకు ప్రతికూలంగా పరిణమిస్తోంది. బ్యాటింగ్లో షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మలు రాణించాలి. అలాగే బౌలింగ్ విభాగం కూడా మెరుగవ్వాలి. రేణుక, క్రాంతి, కాశ్వీ గౌతమ్లు ఆరంభంలో వికెట్లు తీయగలిగితే పటిష్టమైన ఆ్రస్టేలియాపై వన్డే సిరీస్ను సంతృప్తికరంగా ముగిస్తుంది. లేదంటే వైట్వాష్ ఖాయమవుతుంది. గత రెండు మ్యాచ్ల్లోనూ కంగారూ జట్టు అద్భుతంగా ఆడింది. బౌలింగ్తో కట్టడి చేసి... బ్యాటింగ్లో అదరగొట్టింది. ఇప్పుడు ఇదే జోరుతో ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేసింది. ఇదే జరిగితే ఓవరాల్ చాంపియన్షిప్ (టి20, వన్డే, ఏకైక టెస్టు సిరీస్)లోనూ ఆ్రస్టేలియా పైచేయి సాధిస్తుంది. ఒకే ఒక టెస్టును డ్రా చేసుకున్నా... ఆసీసే ఓవరాల్ చాంప్గా నిలుస్తుంది. ఉ. గం. 9:20 నుంచి ‘స్టార్స్పోర్ట్స్’లో ప్రసారం -
‘షూటౌట్’లో గెలిచాం
స్వదేశంలో గెలుపు ఖాతా తెరవడంలో విఫలమైన భారత పురుషుల హాకీ జట్టు విదేశీ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రెండో అంచె చివరి లీగ్ మ్యాచ్లో నిర్ణీత సమయంలో నేరుగా కాకపోయినా ‘షూటౌట్’లో విజయాన్ని అందుకుంది. ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆ్రస్టేలియాను వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించిన భారత జట్టు మూడో అంచె మ్యాచ్లను జూన్లో నెదర్లాండ్స్లో ఆడనుంది. హోబర్ట్: మొదటి ఐదు మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో పరాజయం... ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లో ‘షూటౌట్’లో ఓటమి... ఎలాగైతేనేం వరుసగా ఏడు పరాజయాలు... కానీ ఎనిమిదో ప్రయత్నంలో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు రుచి చూడటంలో సఫలమైంది. ఆ్రస్టేలియాలాంటి పటిష్ట జట్టును వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించి రెండో అంచె లీగ్ను భారత జట్టు ముగించింది. బుధవారం జరిగిన ప్రొ లీగ్ ఎనిమిదో మ్యాచ్లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–1 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియాపై జట్టుపై గెలిచింది. భారత్కు రెండు పాయింట్లు, ఆ్రస్టేలియాకు ఒక పాయింట్ లభించాయి. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా... భారత్ తరఫున గోల్కీపర్ శశికుమార్ మోహిత్ హొన్నేణహళ్లి హీరోగా అవతరించాడు. ముగ్గురు ఆ్రస్టేలియా ఆటగాళ్ల షాట్లను మోహిత్ అడ్డుకొని భారత్ను గెలిపించాడు. భారత్ తరఫున ‘షూటౌట్’లో శిలానంద్ లాక్రా, మణీందర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్ సఫలంకాగా... అభిషేక్ విఫలమయ్యాడు. ఆ్రస్టేలియా తరఫున మొదటి మూడు షాట్లు తీసుకున్న టిమ్ బ్రాండ్, లియామ్ హెండర్సన్, కూపర్ బర్న్స్ విఫలమవ్వగా... నాలుగో షాట్లో జెరెమీ హేవార్డ్ సఫలమయ్యాడు. అంతకుముందు రెగ్యులర్ సమయంలోని మూడు క్వార్టర్స్లో రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. చివరి క్వార్టర్లోని 49వ నిమిషంలో జెరెమీ హేవార్డ్ పెనాల్టీ కార్నర్ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం రెండు నిమిషాల్లో ఆవిరైంది. 51వ నిమిషంలో భారత ఫార్వర్డ్ శిలానంద్ లాక్రా గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చివరి తొమ్మిది నిమిషాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు మరో గోల్ చేయడానికి ప్రయత్నించి సఫలం కాలేకపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టు తమకు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్లను వృథా చేసింది. ఆ్రస్టేలియా తమకు దక్కిన ఏడు పెనాల్టీ కార్నర్లలో ఒక దానిని సద్వినియోగం చేసుంది. జూన్ 14 నుంచి 21 వరకు రోటర్డామ్లో మూడో అంచె మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 14న నెదర్లాండ్స్తో... 17న జర్మనీతో... 18న మళ్లీ జర్మనీతో... 21న మళ్లీ నెదర్లాండ్స్తో ఆడుతుంది. అనంతరం 23 నుంచి 28 వరకు లండన్లో నాలుగో అంచె మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 23న పాకిస్తాన్తో... 25న ఇంగ్లండ్తో... 26న మళ్లీ పాకిస్తాన్తో... 28న మళ్లీ ఇంగ్లండ్తో తలపడుతుంది. -
శిఖర్ ధావన్ మాజీ భార్యకు షాకిచ్చిన కోర్టు.. గబ్బర్కు రిలీఫ్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్కు ఊరట లభించింది. పాటియాలా హౌజ్ కోర్టు అతడికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా నివాసి ఆయేషా ముఖర్జీతో ధావన్కు సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారితీశాయి.ఆయేషాతో విడాకులుడివోర్సీ, ఇద్దరు ఆడపిల్లల తల్లి అయిన ఆయేషా (Ayesha)ను ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమారుడు జొరావర్ జన్మించాడు. అయితే, కొంతకాలం తర్వాత ధావన్- ఆయేషా మధ్య తలెత్తిన విభేదాలు విడాకులకు దారితీశాయి. ఢిల్లీ కోర్టు 2023లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.సోఫీతో ఇటీవలే వివాహం ఈ క్రమంలో చాన్నాళ్లు ఒంటరిగా ఉన్న శిఖర్ ధావన్.. ఐర్లాండ్కు చెందిన సోఫీ షైన్తో ప్రేమలో పడ్డాడు. ఇటీవలే (ఫిబ్రవరి 22) అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇలా శిఖర్ ధావన్ కొత్త జీవితం ఆరంభించిన సమయంలో.. మాజీ భార్య విషయంలో న్యాయస్థానం నుంచి అతడికి గొప్ప ఊరట లభించింది.రూ. 5.7 కోట్లు తిరిగి చెల్లించాలిశిఖర్ ధావన్ నుంచి ఆయేషా తీసుకున్న రూ. 5.7 కోట్లను అతడికి తిరిగి చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కాగా ఆయేషా- ధావన్ల ఆస్తులకు సంబంధించి ఆస్ట్రేలియా కోర్టు ఆయేషాకు 15 శాతం కేటాయించింది. దీని ప్రకారం.. రూ. 7.46 కోట్లతో పాటు ధావన్ నుంచి అదనంగా రూ. 15.95 కోట్లు, దీనితో పాటు కొంత ఆస్తి ఆయేషా పేరిట రాయాలని ఆదేశించింది.ఈ మేరకు ఆస్తులకు సంబంధించి 2021-2024 మధ్య ఆస్ట్రేలియా కోర్టు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసింది. అయితే, భారత వివాహ చట్టాల ప్రకారం తాను ఆస్ట్రేలియా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పనిలేదని ధావన్ వాదించాడు. ఇందుకు సంబంధించి పాటియాలా హౌజ్ కోర్టులో వివరాలు సమర్పించాడు.కట్టుకథలు అల్లిపెళ్తైన కొన్ని నెలల తర్వాత నుంచే ఆయేషా.. కట్టుకథలు అల్లి తన కెరీర్ను దెబ్బతీస్తానని బెదిరించిందని ధావన్ కోర్టుకు చెప్పాడు. అంతేకాదు.. తన కష్టార్జితంతో కొనుగోలు చేసే ప్రతి ఆస్తిని ఇద్దరి పేరిట లేదంటే.. ఆయేషా ఒక్కదాని పేరిటే కొనాలని ఆమె ఒత్తిడి చేసేదని వాపోయాడు.ఇందుకు తగ్గట్లుగానే ఒకానొక సమయంలో ధావన్ కొన్న ఆస్తులలో దాదాపు 99 శాతం ఆయేషా పేరిటే ఉన్నట్లుగా కోర్టుకు ఆధారాలు సమర్పించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పాటియాలా హౌజ్ కోర్టు జడ్జి జస్టిస్ దేవేందర్ కుమార్ గార్గ్.. ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ధావన్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.బెదిరించి డబ్బు గుంజాలనే యత్నంసెటిల్మెంట్ సమయంలో ధావన్ను బెదిరింపులకు గురిచేసి డబ్బు గుంజాలనే ప్రయత్నం జరిగినట్లు గుర్తించామన్నారు. కాబట్టి ఆయేషా ధావన్ నుంచి పొందిన రూ. 5.7 కోట్లను తిరిగి ఇచ్చేయాలని గార్గ్ ఆదేశించారు.అంతేకాదు.. ధావన్ ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన నాటి నుంచి ఏడాదికి 9 శాతం చొప్పున వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆయేషాను న్యాయస్థానం ఆదేశించింది. మాజీ దంపతుల వివాదంలో ఆస్ట్రేలియా కోర్టుకు ఎలాంటి అధికారం లేదని.. ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఇక్కడ విలువలేదని కొట్టిపారేసింది. దీంతో ధావన్కు ఉపశమనం దక్కింది.కుమారుడికి దూరంకాగా కుమారుడు జొరావర్ కస్టడీ తనకు కావాలని ధావన్ కోరగా.. న్యాయస్థానం అతడికి శాశ్వత ప్రాతిపదికన కుమారుడిని అప్పగించలేమని తెలిపింది. అయితే, ఇండియా, ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో వీడియో కాల్స్ ద్వారా కుమారుడిని చూడవచ్చని పేర్కొంది. అయితే, ఆయేషా మాత్రం కుమారుడితో తనకు ఎలాంటి సంబంధం లేకుండా చేసేందుకు సోషల్ మీడియాతో సహా అన్ని కనెక్షన్లను కట్ చేసిందని ధావన్ వాపోయాడు. కుమారుడిని ఎంతగానో మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా ధావన్ తరచూ వెల్లడిస్తూ ఉంటాడు.చదవండి: T20 WC 2026: రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్ -
23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించనున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 23 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆ జట్టు రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. తొలి టెస్ట్ మ్యాచ్ డార్విన్ వేదికగా ఆగస్ట్ 13-17 మధ్య తేదీల్లో జరుగుతుంది. రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్ట్ 22-26 మధ్య జరుగనుంది. బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా మధ్య ఇది నాలుగో టెస్ట్ సిరీస్ ఆవుతుంది. ఇందులో ఆరు మ్యాచ్లు జరగ్గా ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్ల్లో గెలిచింది. 2017లో మీర్పూర్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆసీస్పై సంచలన విజయం సాధించింది.కాగా, బంగ్లాతో హోం సిరీస్తోనే 2026-27 సీజన్ ఆసీస్ టెస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ సిరీస్ తర్వాత ఆసీస్ మూడు టెస్ట్ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఆతర్వాత నవంబర్ నుంచి 2027 జనవరి మధ్యలో న్యూజిలాండ్ జట్టు నాలుగు టెస్ట్ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో భారత్లో 5 మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగనుంది. అనంతరం మార్చిలో ఇంగ్లండ్తో ఎంసీజీలో 150వ వార్షికోత్సవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్అక్టోబర్ 9-13: తొలి టెస్ట్, డర్బన్అక్టోబర్ 18-22: రెండో టెస్ట్, గ్వెబెర్హాఅక్టోబర్ 27-31: మూడో టెస్ట్, కేప్టౌన్ఈ పర్యటనలో ఆసీస్ మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆ మ్యాచ్లు సెప్టెంబర్ 24 (డర్బన్), 27 (జోహనెస్బర్గ్), 30 (పోచెఫ్స్ట్రూమ్) తేదీల్లో జరుగుతాయి.ఇంగ్లండ్తో 150వ వార్షికోత్సవ టెస్ట్ 2027, మార్చి 11-15: ఏకైక టెస్ట్, ఎంసీజీఆసీస్లో న్యూజిలాండ్ పర్యటన.. భారత్లో ఆసీస్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ దశలోనే వైదొలిగిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆ జట్టు పునఃదర్శనం స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్తోనే ఉంటుంది. ఈ మధ్యలో ఆ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్, పాకిస్తాన్ లీగ్ తదితర ప్రైవేట్ లీగ్లతో పాటు దేశవాలీ టోర్నీల్లో ఆడతారు. -
సచిన్ను ఎల్బీగా ప్రకటించడం తప్పే
న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను ఎల్బీడబ్ల్యూగా అవుటివ్వడం ముమ్మాటికీ తప్పేనని వెస్టిండీస్ దిగ్గజ అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించారు. అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం కలిగిన ఆయన 2009లో అంపైరింగ్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 1989 నుంచి 2009 వరకు వరుసగా జరిగిన ఐదు వన్డే ప్రపంచకప్లకు ఫీల్డ్ అంపైర్గా పనిచేశారు. తాజాగా 79 ఏళ్ల బక్నర్ రెండు దశాబ్దాల తర్వాత విండీస్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్ ఇంటర్వ్యూలో తన పొరపాటును అంగీకరించారు. అంపైరింగ్ కెరీర్లోనే అది అత్యంత పేలవమైన నిర్ణయంగా చెప్పుకొచ్చారు. 2003–04లో ఆ్రస్టేలియా పర్యటనలో భారత్ ఆడిన టెస్టు సిరీస్లో సచిన్ను వికెట్ల ముందు దొరికిపోయినట్లు (ఎల్బీడబ్ల్యూ)గా బక్నర్ ప్రకటించారు. కానీ రిప్లేలో బంతి వికెట్లకు దూరంగా పైనుంచి వెళుతున్నట్లు స్పష్టమైంది. దీనిపై అప్పటి మేటి టీవీ వ్యాఖ్యాత టోనీ గ్రెగ్ అంపైరింగ్లోనే అత్యంత చెత్త నిర్ణయమని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు ఏమైందంటే... ఇది 22 ఏళ్ల క్రితం సంగతి. బ్రిస్బేన్లో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్లో జాసన్ గిలెస్పీ వేసిన బంతిని సచిన్ డిఫెండ్ చేయబోగా అది అతని ప్యాడ్లను తగిలింది. వెంటనే బౌలర్, జట్టు సహచరులంతా ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అరుస్తూ అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ బక్నర్ అప్పీలుకు బదులుగా తన చేతి వేలు పైకెత్తాడు. ఎంతో అనుభవజ్ఞుడైన సచిన్కు బంతి గమనం బాగా గుర్తు. అది ఎల్బీడబ్ల్యూ కానేకాదని అతని గట్టి నమ్మకం అందుకే నిరాశగా వెనుదిరిగాడు. మరుసటి ఏడాది (2005) పాక్తో కోల్కతాలో జరిగిన మ్యాచ్లోనూ సచిన్ను తప్పుడు నిర్ణయంతో బక్నర్ పెవిలియన్కు పంపించారు. రజాక్ సంధించిన బంతి టెండూల్కర్ బ్యాట్ తగలకుండా ఫీల్డర్ చేతుల్లో పడింది. అప్పుడు క్యాచ్ అవుట్గా ప్రకటించారు. -
ఈసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: వేదిక మారినా... ప్రత్యర్థులు మారినా... కెప్టెన్సీ మారినా... తాజా సీజన్లో భారత పురుషుల హాకీ జట్టు ఆటతీరు మాత్రం మారడంలేదు. ప్రొ లీగ్ రెండో అంచె పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియాకు వచ్చిన భారత హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. భారత్ వేదికగా జరిగిన తొలి అంచె పోటీల్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయిన టీమిండియా... ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన సీజన్ ఆరో మ్యాచ్లో హార్దిక్ సింగ్ సారథ్యంలోని టీమిండియా ‘షూటౌట్’లో 4–5 గోల్స్ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో ఆ్రస్టేలియా తరఫున టిమ్ బ్రాండ్, లియామ్ హెండర్సన్, టిమ్ హోవర్డ్, జాక్ వెల్్చ, టామ్ క్రెయిగ్ గోల్స్ చేశారు. భారత్ తరఫున శిలానంద్ లాక్రా, మణీందర్ సింగ్, రాజ్కుమార్ పాల్, జుగ్రాజ్ సింగ్ గోల్స్ సాధించగా... ఆదిత్య అర్జున్ తీసుకున్న చివరిదైన ఐదో షాట్ను ఆస్ట్రేలియా గోల్కీపర్ జేడ్ స్నోడెన్ అడ్డుకోవడంతో భారత్కు ఓటమి తప్పలేదు. అంతకుముందు నిర్ణీత సమయంలో భారత్ తరఫున అమిత్ రోహిదాస్ (15వ నిమిషంలో), జుగ్రాజ్ సింగ్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఆ్రస్టేలియా జట్టుకు జోయెల్ రింటాలా (47వ, 56వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. స్పెయిన్తో శనివారం జరిగిన మ్యాచ్లో 0–2తో ఓడిన భారత్ ఈ మ్యాచ్లో మెరుగైన ఆటతీరు కనబరిచింది. ఒకదశలో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లి తొలి విజయం దిశగా సాగిపోయింది. అయితే చివర్లో తప్పిదాలు చేసి తొమ్మిది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సమర్పించుకుంది. మ్యాచ్లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను భారత్ సది్వనియోగం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఏకంగా 14 పెనాల్టీ కార్నర్లు సంపాదించినా... రెండింటిని మాత్రమే లక్ష్యానికి చేర్చింది. ‘షూటౌట్’లో ఓడినందుకు భారత జట్టుకు ఒక్క పాయింట్... ఆ్రస్టేలియాకు రెండు పాయింట్లు లభించాయి. నిర్ణీత సమయంలో విజయం సాధిస్తే మూడు పాయింట్లు దక్కుతాయి. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్లో స్పెయిన్ జట్టుతో భారత్ ఆడుతుంది. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు ఆరు మ్యాచ్లు ఆడి ఒక్క పాయింట్తో ఎనిమిదో స్థానంలో ఉంది. -
మన మహిళలదే సిరీస్
అడిలైడ్: ఆస్ట్రేలియా గడ్డపై దశాబ్దం తర్వాత భారత మహిళల జట్టు టి20 సిరీస్ గెలిచింది. శనివారం జరిగిన ఆఖరి మూడో టి20లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 17 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలిచింది. తద్వారా ఓవరాల్ చాంపియన్షిప్లో పైచేయి సాధించింది. టాస్ నెగ్గిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (55 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఆటతో ఆసీస్ బౌలర్లపై చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 59; 4 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. ఆతిథ్య బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఓడింది. ఒక్క యాష్లే గార్డ్నర్ (45 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే పోరాడింది. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (3/22), శ్రీచరణి (3/32) ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశారు. చివరిసారిగా భారత అమ్మాయిల జట్టు 2016లో కంగారూ గడ్డపై టి20 సిరీస్ నెగ్గింది. ఇప్పుడు మూడు ఫార్మాట్ల (టి20, వన్డే, టెస్టు)లకు కలిపి ఓవరాల్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు, ఏకైక టెస్టు నెగ్గితే 4 పాయింట్ల ఆధారంగా ఓవరాల్ విజేతను ఖరారు చేస్తారు. దీంతో ఈ టి20ల్లో భారత్ 4–2 పాయింట్లతో పైచేయి సాధించింది. చెలరేగిన మంధాన ఆట మొదలైన మూడో ఓవర్లోనే షఫాలీ వర్మ (7) అవుటైంది. క్రీజులోకి వచి్చన జెమీమాతో కలిసి స్మృతి మంధాన కంగారూ బౌలర్ల భరతం పట్టింది. దీంతో పవర్ ప్లేలో భారత్ 54/1 స్కోరు చేసింది. స్మృతి జోరు కొనసాగడంతో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఆమెకిది 33వ అర్ధసెంచరీ కావడం విశేషం.మరోవైపు జెమీమా సైతం ధాటిగా పరుగులు సాధించడంతో ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఆతిథ్య బౌలర్లు ఎంతోసేపు శ్రమించాల్సివచ్చింది. ఎట్టకేలకు 17వ ఓవర్లో స్టార్ ఓపెనర్ మంధాన దూకుడుకు అనాబెల్ బ్రేకులేసింది. దీంతో రెండో వికెట్కు 121 పరుగుల భారీభాగస్వామ్యం ముగిసింది. చివర్లో హిట్టర్ రిచా ఘోష్ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా పరుగులు రాబట్టింది. గార్డ్నర్ పోరాటం వృథా భారత బౌలర్ల పవర్కు ఆసీస్ బ్యాటింగ్ ‘పవర్ ప్లే’ టాపార్డర్ కుదేలైంది. రెండో ఓవర్లోనే బౌలింగ్కు దిగిన శ్రేయాంక తన వరుస ఓవర్లలో జార్జియా వోల్ (10), ఎలైస్ పెరి (1)లను అవుట్ చేసింది. రేణుక... బెత్ మూని (6) పనిపట్టడంతో ఆస్ట్రేలియా ఒక దశలో టాపార్డర్ వికెట్లను కోల్పోయి 32/3 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఫోబ్ లిచ్ఫీల్డ్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), యాష్లే గార్డ్నర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఆంధ్ర లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి రెడ్డి (3/32), హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి (2/35)లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆసీస్ లక్ష్యానికి దూరమైంది. జట్టును గెలిపించేందుకు గార్డ్నర్ చేసిన పోరాటానికి అరుంధతి చెక్ పెట్టడంతోనే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. -
మార్ష్ విధ్వంసం.. పసికూనను చిత్తు చేసిన ఆసీస్
టీ20 ప్రపంచకప్ 2026 చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా పసికూన ఒమన్పై ప్రతాపం చూపింది. తొలుత బౌలింగ్లో 104 పరుగులకే (16.2 ఓవర్లలో) ఒమన్ను ఆలౌట్ చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని 9.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ ఇదివరకే సూపర్-8కి చేరాయి. సూపర్-8 మ్యాచ్లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.ఒమన్ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్ జంపా (3.2-0-21-4), గ్లెన్ మ్యాక్స్వెల్ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్ బార్ట్లెట్ (4-0-27-2), నాథన్ ఇల్లిస్ (2-0-14-1), మార్కస్ స్టోయినిస్ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్ బౌలర్ల ధాటికి ఒమన్ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. కెప్టెన్ జతిందర్ సింగ్ (17), హమ్మద్ మీర్జా (16), కరణ్ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ చెలరేగిపోయాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 64 పరుగులు చేసి ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి ట్రవిస్ హెడ్(32), ఇంగ్లిస్ (12 నాటౌట్) సహకరించారు. హెడ్ వికెట్ షకీల్ అహ్మద్కు దక్కింది. -
అంతా అయిపోయాక లైన్లోకి వచ్చిన ఆసీస్.. పసికూనపై ప్రతాపం
టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు అంతా అయిపోయాక లైన్లోకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో ఇదివరకే నిష్క్రమించిన ఈ మాజీ ఛాంపియన్.. ఇవాళ (ఫిబ్రవరి 20) పసికూన ఒమన్తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో సామర్థ్యం మేరకు సత్తా చాటింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆసీస్.. ఒమన్ను 104 పరుగులకే (16.2 ఓవర్లలో) కుప్పకూల్చింది.ఒమన్ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్ జంపా (3.2-0-21-4), గ్లెన్ మ్యాక్స్వెల్ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్ బార్ట్లెట్ (4-0-27-2), నాథన్ ఇల్లిస్ (2-0-14-1), మార్కస్ స్టోయినిస్ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్ బౌలర్ల ధాటికి ఒమన్ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. కెప్టెన్ జతిందర్ సింగ్ (17), హమ్మద్ మీర్జా (16), కరణ్ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్కు ముందు ఒమన్ కెప్టెన్ జతిందర్ ఆసీస్కు చుక్కలు చూపిస్తామని బీరాలు పలికి ఏమీ చేయలేకపోయాడు. ఈ టోర్నీ నుంచి ఆసీస్తో పాటు ఒమన్ కూడా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ మ్యాచ్ గ్రూప్ దశ మొత్తంలో చివరిది. ఈ టోర్నీలో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ ఇదివరకే సూపర్-8కి చేరాయి. -
గ్రూప్ దశలోనే ఆసీస్ ఔట్.. పాక్కు మంచి జరుగబోతుందా..?
టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీలోనే నిష్క్రమించిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తెగ హడావుడి చేస్తున్నారు. సోషల్మీడియా వేదికగా ఓ రేంజ్లో బీరాలు పలుకుతున్నారు. ఆసీస్ వైదొలిగితే పాక్కు కలిగే లాభమేమిటి అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.పేరుకు జెంటిల్మెన్ క్రీడనే అయినా, క్రికెట్ లాంటి రియలిస్టిక్ గేమ్లోనూ సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. తాజాగా పాక్ అభిమానులు హడావుడి చేయడానికి ఈ సెంటిమెంటే కారణం. ఏంటా సెంటిమెంట్ అంటే..?ఐసీసీ మెగా టోర్నీల్లో, మరి ముఖ్యంగా ప్రపంచకప్ టోర్నీల్లో ఆసీస్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సందర్భాల్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. 1992 వన్డే వరల్డ్కప్లో ఆసీస్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నీలో పాక్ విజేతగా నిలిచి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. 2009 టీ20 ప్రపంచకప్లోనూ ఆసీస్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నీలోనూ పాకే విజేతగా నిలిచి, తొలిసారి పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్గా ఆవిర్భవించింది.2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆసీస్ గ్రూప్ దశలోనే వైదొలగగా.. ఆ టోర్నీలోనూ పాక్ ఛాంపియన్గా నిలిచింది.తాజాగా ఆసీస్ టీ20 ప్రపంచకప్ 2026లోనూ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో పాక్ అభిమానులు సెంటిమెంట్ రిపీట్ అవుతుందని తెగ సంబరపడిపోతున్నారు. ఈ సెంటిమెంట్ను ఆసరాగా చేసుకొని సంకలు గుద్దుకుంటున్నారు. వాస్తవానికి పాక్ సూపర్-8కు చేరడమే అతికష్టం మీద జరిగింది. ఇలాంటి దుర్బర పరిస్థితుల్లోనూ పాక్ అభిమానులు తాము ప్రపంచకప్ గెలుస్తామని బీరాలు పలకడం హాస్యాస్పదంగా ఉంది. ఏ జట్టైనా ఛాంపియన్గా నిలవాలంటే కనీస అర్హతలు ఉండాలి.ప్రస్తుత పాక్ జట్టుకు ఆ అర్హతలు లేవనే విషయం అందరికీ తెలుసు. గ్రూప్ దశలో నెదర్లాండ్స్, యూఎస్ఏ లాంటి చిన్న జట్లపై అతికష్టం మీద గెలిచిన పాక్.. సూపర్-8లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లను దాటుకొని ముందుకెళ్లాలి. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే ఇది ముమ్మాటికి అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే పాక్ జట్టు ప్రపంచకప్ గెలిచేంత గొప్పగా ఏమీ లేదు. ఆ జట్టులో మ్యాచ్ విన్నర్ వెతికితే కూడా కనపడడు. పైగా ఆ జట్టు స్టార్లుగా చెప్పుకేనే వారంతా ఫామ్లో లేక మడతమంచం ఎక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ప్రపంచకప్ గెలవడం జరిగే పని కాదు. పాక్ అభిమానులు సెంటిమెంట్లను నమ్ముకొని గాల్లో మేడలు కడుతుంటే, జింబాబ్వే లాంటి చిన్న జట్టు టాలెంట్ను నమ్ముకొని ముందుకు సాగుతుంది. -
ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు
-
మ్యాక్స్వెల్కు బంపరాఫర్.. హైదరాబాద్ ఫ్రాంచైజీతో ఒప్పందం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో తొలిసారి కనిపించబోతున్నాడు. ఆ లీగ్లో కొత్త ఫ్రాంచైజీ 'హైదరాబాద్ హ్యూస్టన్ కింగ్స్మన్ బోల్స్టర్' 2026 ఎడిషన్ కోసం మ్యాక్సీతో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.తమతో జతకట్టిన సందర్భంగా హైదరాబాద్ ఫ్రాంచైజీ మ్యాక్స్వెల్పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇంగ్లీష్లో పెద్దపెద్ద పదాలు (విధ్వంసకర బ్యాటింగ్కు సంబంధించి) ఉపయోగించి ఆకాశానికెత్తింది. అసాధ్యం అనే పదం మ్యాక్సీ నిఘంటువులో లేదు. అతని ప్రవేశంతో పీఎస్ఎల్లో అతిపెద్ద షో మొదలవుతోందంటూ తమ సోషల్మీడియా అకౌంట్లో డప్పు కొట్టింది.వాస్తవానికి సదరు ఫ్రాంచైజీ ఇస్తున్న హైప్కు ప్రస్తుత మ్యాక్సీ ఫామ్కు అస్సలు పొంతన లేదు. మ్యాక్స్వెల్ ఇటీవలికాలంలో కెరీర్లో ఎన్నడూ లేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ ఆడుతున్న అతను.. అక్కడ కూడా పేలవమైన ప్రదర్శనలు కొనసాగించాడు. ఈ మెగా టోర్నీ నుంచి ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. జట్టు పరంగా, వ్యక్తిగతంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో మ్యాక్స్వెల్కు హైదరాబాద్ ఫ్రాంచైజీ బంపరాఫర్ ఇచ్చింది.ఐపీఎల్లో పట్టించుకునే నాథుడే లేడుఎటూ ఏ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకునే ఆవకాశం లేకపోవడంతో మ్యాక్స్వెల్ ఐపీఎల్ 2026 వేలంలో పాల్గొనలేదు. గత కొన్ని ఎడిషన్లుగా అతను ఐపీఎల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్ని ఫ్రాంచైజీలు మారినా అదే పరిస్థితి. పేలవ ఫామ్, వయసు మీద పడటంతో అంతర్జాతీయ క్రికెట్లో మ్యాక్స్వెల్ శకం ముగిసిందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇటీవల వ్యాఖ్యానించాడు. కెరీర్లో అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న మ్యాక్సీ.. పీఎస్ఎల్లోనైనా రాణిస్తాడో లేక కెరీర్కు ముగింపు పలుకుతాడో వేచి చూడాలి. కాగా, పీఎస్ఎల్ 2026 ఎడిషన్ మార్చి 26 నుంచి మే 3 వరకు జరుగుతుంది. -
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
-
భారత్పై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా
మహిళల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్వదేశంలో టీమిండియాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. ఇందులో తొలుత 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కాగా.. భారత్ తొలి మ్యాచ్లోనే ఆతిథ్య జట్టుకు షాకిచ్చి తమ ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో ఎదురైన పరాభవానికి ఆసీస్ రెండో మ్యాచ్లోనే ప్రతీకారం తీర్చుకుంది.కాన్బెర్రా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన రెండో టీ20లో ఆసీస్ 19 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత వాల్-మూనీ ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.వాల్-మూనీ తొలి వికెట్కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. వాల్, మూనీ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్ఫీల్డ్ 6, ఎల్లిస్ పెర్రీ 7, గార్డ్నర్ 10 (నాటౌట్), జార్జియా వేర్హమ్ డకౌటయ్యారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ను ఆసీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఓడించారు. ఆష్లే గార్డ్నర్ (4-0-22-3), కిమ్ గార్త్ (3-0-16-2), అన్నాబెల్ సదర్ల్యాండ్ (4-0-18-2), సోఫీ మోలినెక్స్ (4-0-37-2) ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. భారత ఇన్నింగ్స్కు షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (31) శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన వారు ఆ ఊపును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్ (36) కాసేపు పోరాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. భారత ఇన్నింగ్స్లో పై ముగ్గురితో పాటు రిచా ఘోష్ (19), క్రాంతి గౌడ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (4), అమన్జోత్ (3), అరుంధతి రెడ్డి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. దీప్తి శర్మ, శ్రీచరణి ఖాతా కూడా తెరవలేకపోయారు.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఫిబ్రవరి 21న అడిలైడ్ వేదికగా జరుగనుంది. ఈ ఆసీస్ పర్యటనలో భారత్ టీ20ల తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది. -
ఆసీస్తో రెండో టీ20.. అనూహ్యంగా పుంజుకున్న భారత బౌలర్లు
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు ఇవాళ (ఫిబ్రవరి 19) రెండో టీ20 ఆడుతుంది. కాన్బెర్రా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆసీస్ను 163 పరుగులకే (5 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.తొలుత ఆసీస్ ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.వాల్-మూనీ తొలి వికెట్కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. వాల్, మూనీ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్ఫీల్డ్ 6, ఎల్లిస్ పెర్రీ 7, గార్డ్నర్ 10 (నాటౌట్), జార్జియా వేర్హమ్ డకౌటయ్యారు. స్కోర్ను 170 పరుగులైనా దాటించాలనే ఆతృతతో ఆసీస్ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు కోల్పోయింది. వేర్హమ్, పెర్రీ రనౌట్లయ్యారు. ఈ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. శ్రీచరణి ఆసీస్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేసింది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించి, ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఆసీస్ పర్యటనలో భారత్ టీ20ల తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది. -
‘నేషనల్ ఏఐ ప్లాన్’తో దూకుడు..
సోషల్ మీడియా వినియోగానికి పలు నిబంధనలు విధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఏఐ సాయంతో మరో ప్రయోగానికి సిద్ధం అయ్యింది. నిన్నటి వరకు 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేసిన ఆ కంగారూ గడ్డ.. కృత్రిమ మేధతో అత్యాదునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం చేసింది. ఆస్ట్రేలియా వేస్తున్న ఈ అడుగులు ప్రపంచ టెక్ దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏఐ కారణంగా ముంచుకొస్తున్న ముప్పును ముందే పసిగట్టి, దేశాన్ని డిజిటల్ గాడిలో పెట్టేందుకు సిద్ధమైన ఆస్ట్రేలియా వ్యూహం ఏమిటి?సోషల్ మీడియా బ్యాన్ తర్వాత..16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా, ఇప్పుడు టెక్ ప్రపంచంలో మరో కీలక ముందడుగు వేసింది. కేవలం నిషేధాలతోనే సరిపెట్టకుండా, భవిష్యత్తు సాంకేతికత అయిన కృత్రిమ మేధను (ఏఐ)ఒక క్రమపద్ధతిలో గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా ఆస్ట్రేలియా తన ‘నేషనల్ ఏఐ ప్లాన్’ను అధికారికంగా ప్రకటించి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.కొత్త చట్టాలు లేవు.. పాతవే పక్కాగా..సాధారణంగా ఏవైనా నూతన సాంకేతికతలు వచ్చినప్పుడు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుంది. కానీ ఆస్ట్రేలియా ఒక భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. ఏఐ నియంత్రణ కోసం ప్రత్యేకంగా కొత్త చట్టాలు తీసుకురావడానికి బదులుగా, ప్రస్తుతం ఉన్న వాటినే ఉపయోగించి కొత్త రిస్క్లను అరికట్టాలని నిర్ణయించింది. దీనివల్ల అనవసరమైన జాప్యం లేకుండా తక్షణమే నియంత్రణ సాధ్యమవుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది.ప్రభుత్వ సంస్థలకే బాధ్యతఈ ప్రణాళికలో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాలు, రెగ్యులేటరీ సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించారు. తమ పరిధిలోని రంగాల్లో ఏఐ వల్ల ఎలాంటి హాని కలుగుతుందో గుర్తించి, వాటిని అడ్డుకోవడంలో ఆయా సంస్థలే ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే, ప్రజల భద్రతను పణంగా పెట్టకుండా, సమతుల్యం పాటించడం ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా తెలుస్తోంది.మూడు అంశాల వ్యూహంఆస్ట్రేలియా ప్రకటించిన ఈ జాతీయ ఏఐ ప్రణాళిక ప్రధానంగా మూడు అంశాల చుట్టూ తిరుగుతుంది. మొదటిది అత్యాధునిక డేటా సెంటర్ల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. రెండవది ఏఐ వల్ల ఉద్యోగాలు పోకుండా చూస్తూనే, పౌరుల్లో ఏఐ నైపుణ్యాలను పెంచడం. మూడవది ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం. ఈ మూడు లక్ష్యాలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ఈ ప్రణాళికలో అత్యంత ఆసక్తికరమైన అంశం 'ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్' ఏర్పాటు. 2026 నాటికి ఈ ప్రత్యేక సంస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది ఏఐ వల్ల ఎదురయ్యే ముప్పులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. సాంకేతికత ఎంత వేగంగా పెరిగినా, దానికి తగినట్లుగా ప్రభుత్వ స్పందనను సిద్ధం చేయడంలో ఈ ఇన్స్టిట్యూట్ కీలక పాత్ర పోషించనుంది.చాట్ జిపిటి, జెమినిపై నిఘాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతున్న జనరేటివ్ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ, జెమిని వల్ల కలిగే ప్రమాదాలను అంచనా వేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కొత్త ప్రణాళికను వాడుకోనుంది. వీటి ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, భద్రతా పరమైన లొసుగులు తలెత్తకుండా నిరంతరం నిఘా ఉంచడం ఈ వ్యూహంలో భాగం.భద్రతతో కూడిన సాంకేతిక ప్రగతి‘సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మా ప్రణాళికను మరింత బలోపేతం చేస్తాం’ అని ఫెడరల్ ఇండస్ట్రీ మినిస్టర్ టిమ్ ఐర్స్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియన్లందరికీ సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అటు సాంకేతిక పురోగతిని, ఇటు సామాజిక భద్రతను ఒకేసారి సాధించే దిశగా ఆస్ట్రేలియా వేస్తున్న అడుగులు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’కు సహకరిస్తాం.. భారత్కు రండి’ -
భారత మహిళల వన్డే జట్టులోకి ప్రతీక
న్యూఢిల్లీ: ఆ్రస్టేలియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాల్గొనే భారత మహిళల జట్టులో అదనంగా మరో ప్లేయర్ను జోడించారు. చీలమండ గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ ప్రతీక రావల్ ఈనెల 24 నుంచి బ్రిస్బేన్లో ఆ్రస్టేలియాతో మొదలయ్యే వన్డే సిరీస్లో భారత జట్టులోకి వచ్చింది. గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ సందర్భంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ ప్రతీక గాయపడింది. ఆ తర్వాత ప్రతీక మిగతా టోర్నీకి దూరం కాగా...ఆమె స్థానంలో షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. ఈనెల 24న బ్రిస్బేన్లో తొలి వన్డే తర్వాత... 27న హోబర్ట్లో రెండో వన్డే, అదే వేదికగా మార్చి 1న మూడో వన్డే జరుగుతాయి. మార్చి 6 నుంచి భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఏకైక టెస్టు పెర్త్లో జరుగుతుంది. 25 ఏళ్ల ప్రతీక భారత్ తరఫున 24 వన్డేలు ఆడి 1110 పరుగులు సాధించింది. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలున్నాయి. భారత వన్డే జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్ ), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్ ), షఫాలీ వర్మ, రేణుక సింగ్ ఠాకూర్, నల్లపురెడ్డి శ్రీచరణి, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, కాశ్వీ గౌతమ్, అమన్జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, ప్రతీక రావల్. -
ఆస్ట్రేలియా ఇంటికి... జింబాబ్వే ముందుకు...
పల్లెకెలె: ఆ్రస్టేలియాకు షాక్. అప్పుడు జింబాబ్వే సంచలనంతో షాక్ ఇస్తే, ఇప్పుడు వానొచ్చి మరో షాక్ ఇచ్చింది. జింబాబ్వే–ఐర్లాండ్ల మ్యాచ్ జరగకుండా వరుణుడు అడ్డుపడటంతో ఈ లీగ్ మ్యాచ్ రద్దయ్యింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. ఫలితంగా సికందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే 5 పాయింట్లతో తాజా టి20 ప్రపంచకప్లో సూపర్–8కు అర్హత సంపాదించింది. ఆఖరి మ్యాచ్ మిగిలుండగానే ఆ్రస్టేలియా మెగా ఈవెంట్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. 2009 తర్వాత టి20 ప్రపంచకప్లో తదుపరి దశకు అర్హత పొందకుండా గ్రూప్ దశలోనే ఆ్రస్టేలియా వెనుదిరగడం ఇదే ప్రథమం. గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్, జింబాబ్వేల మధ్య మ్యాచ్ జరగాల్సింది. భారీ వర్షం వల్ల మ్యాచ్ ఎంతకీ మొదలవలేదు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మ్యాచ్ జరిగే అవకాశమే లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నట్లు... టీమిండియాకు సూపర్–8లో ముందుగా ఎదురుపడే ప్రత్యర్థి కూడా జింబాబ్వేనే! ఈ నెల 26న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. పరాభవాల ప్రభావంతో... ప్రపంచ క్రికెట్ను శాసించిన ఆ్రస్టేలియా ఈ ప్రపంచకప్లో మాత్రం సూపర్–8 చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై అధారపడాల్సిన స్థితికి వచ్చింది. జింబాబ్వే, శ్రీలంక చేతుల్లో ఓడిన కంగారూ ఒక్క ఐర్లాండ్పై గెలిచి 2 పాయింట్లతో ఉంది. శుక్రవారం ఒమన్తో జరిగే నామమాత్రమైన మ్యాచ్లో గెలిస్తే 4 పాయింట్లతో ఆసీస్ ఇంటికి పయనమవుతుంది. పది టి20 ప్రపంచ కప్లలోనూ ఆడిన ఆస్ట్రేలియా లీగ్ దశలో నిష్క్ర మించడం ఇది రెండోసారి మాత్రమే. 2007లో సెమీఫైనల్ చేరిన ఆసీస్... 2009లో గ్రూప్ దశలో వెనుదిరిగింది. 2010లో రన్నరప్గా నిలిచింది. 2012లో సెమీఫైనల్లో ఓడింది. 2014, 2016లలో సూపర్–10లో ఓyì.... 2021లో తొలిసారి విజేతగా అవతరించింది. 2022లో సూపర్–12లో, 2024లో సూపర్–8లో వెనుదిరిగింది. -
ఐసీసీ టోర్నీల్లో దారుణంగా పతనమవుతున్న ఆసీస్ గ్రాఫ్
ప్రపంచ మేటి క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆ జట్టు వరుసగా నాలుగు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. 2024 టీ20 ప్రపంచకప్లో సూపర్-8 దశలో నిష్క్రమించిన ఈ 2021 ఎడిషన్ జగజ్జేత.. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్లోనే ఇంటిముఖం పట్టింది.ఆతర్వాత జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో మట్టికరిచిన ఈ 2021-23 ఎడిషన్ ఛాంపియన్.. ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్ నుంచి గ్రూప్ దశలోనే పలాయనం చిత్తగించింది.పలు దశాబ్దాలుగా ప్రపంచ క్రికెట్ను మకుటంలేని మారాజుగా శాశిస్తున్న ఆస్ట్రేలియాకు ఉన్నట్టుండి ఈ దుస్థితి ఏంటని పరిశీలిస్తే.. పలు ఆసక్తికర విషయాలు బయటకి వస్తాయి. ఇందులో మొదటిది, అతి ముఖ్యమైనది ఆ జట్టుకు వెన్నతో పెట్టిన తలపొగరు. అనాదిగా ఆసీస్ ఆటగాళ్లు ఇదే తలపొగరుతో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లను తక్కువ చేస్తూ వచ్చారు.ఇటీవలికాలంలో వారికి ఆ తల పొగరు మరీ ఎక్కువైంది. ఎంతలా అంటే, ప్రతి క్రికెటర్ జీవితంలో ఒక్కసారైనా తన చేతులతో పైకెత్కుకోవాలని భావించే ప్రపంచకప్పై కాళ్లు పెట్టి, కెమెరాలకు ఫోజులిచ్చేంతలా. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిని తర్వాత ప్రస్తుత ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ బీరు తాగుతూ ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టాడు. ఆ క్షణమే ఆసీస్ పతనం ప్రారంభమైనట్లుంది.విజయగర్వం తలకెక్కి మార్ష్ చేసిన ఆ పనికి ఆసీస్ క్రమంగా మూల్యం చెల్లించుకుంటూ వస్తుంది. తాజాగా అదే మార్ష్ సారథ్యంలోని ఆసీస్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026లో పసికూన అయిన జింబాబ్వే చేతిలో దారుణంగా ఓడి, గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఆసీస్ జట్టు ఐసీసీ టోర్నీల్లో ఇటీవలికాలంలో పలచన పడటానికి మరో కారణం ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు. ప్రపంచ మేటి ఆటగాళ్లుగా చెప్పుకోబడే ఆ స్టార్ ఆటగాళ్లకు ఐసీసీ టోర్నీలంటే చులకన భావం. వారు యాషెస్ సిరీస్ లాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కానీ, ప్రపంచ దేశాలనీ పాల్గొనే మెగా టోర్నీలకు ఇవ్వరు. కారణం ఎంటో వారికే తెలియాలి. గాయాలు చిన్నవైనా వారు ఇటీవలికాలంలో వాటి బూచిని చూపించి ఐసీసీ టోర్నీల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్కు ముందు కూడా ఇదే జరిగింది. ప్రస్తుత ఆసీస్ జట్టులోని స్టార్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ గాయాల పేరు చెప్పి, పొట్టి ప్రపంచకప్కు డుమ్మా కొట్టారు. వీరు లేని లోటు ఆసీస్ జట్టులో సుస్పష్టంగా కనిపించింది.ఇటీవలికాలంలో ఆసీస్ పతనానికి మరో కారణంగా ఆ జట్టు ఆటగాళ్లకు భారత ఉపఖండంపై ఉన్న చిన్నచూపు. మొదటి నుంచి వారు ఉపఖండంలో పర్యటించాలంటే ఎక్కువగా ఇష్టపడే వారు కాదు. ఇటీవలికాలంలో అది కాస్త ఎక్కువైంది. ఐపీఎల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత లీగ్ల్లో దండిగా డబ్బులు ముట్టజెప్పినా, ఎందుకో వారు ఉపఖండంలో ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ ఐపీఎల్లో ఆడినా కేవలం కొన్ని మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటారు. తాజాగా ముగిసిన ఐపీఎల్లో ఇది చాలా స్పష్టంగా బయటపడింది. ఈ విషయంలో వారి సమస్య ఏమిటో వారు స్వయంగా నోరు విప్పితే కానీ తెలీదు.పై విషయాల్లో వాస్తవాస్తవాలు పక్కన పెడితే.. ఆసీస్ జట్టు 2026 టీ20 ప్రపంచకప్ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించడానికి మాత్రం వారి తలపొగరే కారణమని మెజారిటీ శాతం క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.కాగా, ఆస్ట్రేలియా జట్టు ఓసారి (2021-23) వరల్ట్ టెస్ట్ ఛాంపియన్గా.. ఆరు సార్లు (1987, 1999, 2003, 2007, 2015, 2023) వన్డే ప్రపంచకప్ విజేతగా.. ఓసారి (2021) పొట్టి ప్రపంచకప్ జగజ్జేతగా నిలిచి ప్రపంచ క్రికెట్పై ఏకఛత్రధిపత్యం చలాయించిన విషయం తెలిసిందే. -
ఆస్ట్రేలియాకు 27 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో అధికార మార్పిడి సంఘర్షణ ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల మధ్య నెలకొన్న నాయకత్వ పోరు కొత్త మలుపు తిరిగింది. రాష్ట్రంలో టూర్ పాలిటిక్స్కు తెరలేచింది. సీఎం సిద్ధరామయ్య వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విదేశీ టూర్కు పయనమవుతుండడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మంగళవారం రాత్రి పాతిక మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు నుంచి ఆ్రస్టేలియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా సీఎం సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారేనని సమాచారం. వీసా లభించని కారణంగా కొందరు ఎమ్మెల్యేలు పర్యటనను రద్దుచేసుకున్నారు. హైకమాండ్ ఆగ్రహానికి గురికాకూడదనే ఉద్దేశంతో పలువురు టూర్కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరికొందరు డైలమాలో ఉన్నారు. ఇంకొందరు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ రాజకీయంగా అపోహలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో తమ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గందరగోళం మధ్య మంగళవారం రాత్రి సుమారు 27 మంది పయనమవుతున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. మార్చి 1న బెంగళూరుకు తిరిగి రానున్నారు. కాగా కొందరు ఎమ్మెల్యేలు వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు బయల్దేరుతున్నట్లు చెబుతున్నారు. అయితే, పశుసంవర్ధక శాఖ నుంచి ఈ పర్యటన ఖరారైనట్లు వార్తలు రాగా.. ఆ శాఖ మంత్రి కె. వెంకటేశ్ వీటిని తోసిపుచ్చారు. కొంతమంది ఇదొక ప్రైవేటు టూర్ అని, వ్యక్తిగత ఖర్చులతో విదేశీ టూర్కు వెళ్తే తప్పేంటని ప్రశి్నస్తున్నారు. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం.. ఇదిలా ఉంటే.. సీఎం కుర్చీ పోరులో అభిప్రాయభేదాలు విడిచి కలసికట్టుగా సాగాలని ఆదివారం రాష్ట్ర నాయకులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. అయితే, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే అని ఆయన కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గం నుంచి కౌంటర్లు వస్తున్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని, ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని ఎమ్మెల్యే గణిగ రవికుమార్ మద్దతు పలికారు. -
‘శత’క్కొట్టిన నిసాంక
పల్లెకెలె: పాథుమ్ నిసాంక (52 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్లు) ‘శతక’ విధ్వంసంతో ఆ్రస్టేలియా గల్లంతైంది. ఈ టి20 ప్రపంచ కప్లో తొలి సెంచరీని ఆతిథ్య శ్రీలంక బ్యాటర్ నిసాంక అజేయంగా లిఖించాడు. దీంతో ‘హ్యాట్రిక్’ విజయాలతో లంక జట్టు ‘సూపర్–8’కు అర్హత సాధించింది. కీలకమైన మ్యాచ్లో ఓటమి పాలైన ఆ్రస్టేలియా ముందుకెళ్లే అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. ఇప్పుడు జింబాబ్వే ‘వరుస ఓటమి’లపైనే ఆసీస్ ‘సూపర్–8’ భవితవ్యం ఆధార పడింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్లో దాసున్ షనక నేతృత్వంలోని లంక 8 వికెట్ల తేడాతో ఆసీస్పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కెపె్టన్ మిచెల్ మార్‡్ష (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్లు), ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 56; 7 ఫోర్లు, 3 సిక్స్లు) తొలి వికెట్కు 104 పరుగులు జోడించారు. 8.2 ఓవర్ల వరకు వికెట్ కోల్పోలేదు. ఇంతవరకు జోరుగా సాగిన ఆసీస్ అనూహ్యంగా మిగతా 11.4 ఓవర్లలో మరో 77 పరుగులే చేసి 10 వికెట్లను కోల్పోయింది. ఇన్గ్లిస్ (27; 3 ఫోర్లు), మ్యాక్స్వెల్ (22; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండు పదుల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. మ్యాక్స్వెల్ రివర్స్ స్వీప్తో బౌండరీకి యత్నించగా... బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద నిసాంక కళ్లు చెదిరే క్యాచ్తో అబ్బురపరిచాడు. లంక బౌలర్లలో హేమంత 3, చమీర 2 వికెట్లు తీశాడు. అనంతరం లంక 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి గెలిచింది. నిసాంక రెండో వికెట్కు కుశాల్ మెండిస్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్)తో 97 పరుగులు, తర్వాత పవన్ రత్నాయకే (28 నాటౌట్; 6 ఫోర్లు)తో అబేధ్యమైన మూడో వికెట్కు 79 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. ఆ్రస్టేలియా తమ చివరి లీగ్ మ్యాచ్లో 20న ఒమన్ జట్టుతో ఆడుతుంది. ఆసీస్ కంటే ముందే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్లు (నేడు ఐర్లాండ్తో; 19న శ్రీలంకతో) ఆడుతుంది. ఈ రెండింటిలో జింబాబ్వే ఒక్కటి గెలిచినా ‘సూపర్–8’కు అర్హత పొందుతుంది. ఒకవేళ జింబాబ్వే రెండింటిలో ఓడిపోయినా... రన్రేట్లో ఆ్రస్టేలియాకంటే మెరుగ్గా ఉంటేచాలు ‘సూపర్–8’ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. -
ఐసిస్ క్యాంప్ నుంచి ఆస్ట్రేలియన్లు విడుదల.. కొన్ని గంటల్లోనే మళ్ళీ వెనక్కి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లకు (ఐసిస్) చెందిన రోజ్ నిర్బంధ శిబిరంలో చిక్కుకున్న ఆస్ట్రేలియన్ల స్వదేశీ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. వాస్తవానికి 11 కుటుంబాలకు చెందిన 34 మంది ఆస్ట్రేలియన్లు సోమవారం తమ స్వదేశానికి చేరుకోవాల్సి ఉండేది. అయితే ఆఖరి నిమిషంలో వారి ప్రయాణం వాయిదా పడింది.బిరం నుంచి కాన్వయ్ బయలు దేరినప్పటికి..సాంకేతిక కారణాల వల్ల కొద్ది గంటల్లోనే తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. రోజ్ క్యాంప్ కో-డైరెక్టర్ హుక్మియా మహమ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే ఈ 34 మందిని తమతో పాటు తీసుకువెళ్లడానికి సిరియా వచ్చిన వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరిని సిరియా నుంచి పంపించే క్రమంలో భాగంగా, మిలిటరీ ఎస్కార్ట్తో కూడిన చిన్న బస్సులలో డమాస్కస్ వైపు తరలించారు. కానీ సిరియా అధికారులతో కుదుర్చుకున్న ఏర్పాట్లలో తలెత్తిన కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల వారు వెనక్కి తిరిగి వచ్చేశారు. అయితే ఇది కేవలం ఒక రోజులో పరిష్కారమయ్యే సమస్య మాత్రమే అని సిరియా అధికారి ఒకరు స్పష్టం చేశారు.కాగా సిరియాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న రోజ్ శిబిరం.. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల కుటుంబ సభ్యులను ఉంచే ఒక నిర్బంధ కేంద్రం. ఈ శిబిరంలో ప్రస్తుతం 40 దేశాలకు చెందిన 2,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. 2019లో సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల పట్టు కోల్పోవడంతో అక్కడి ప్రభుత్వం బందీలను విడిచిపెట్టేందుకు సిద్దమైంది. కానీ చాలా దేశాలు భద్రతా కారణాలతో తమ పౌరులను వెనక్కి తీసుకోవడానికి వెనుకాడుతున్నాయి. ఈ శిబిరంలో బ్రిటన్ పౌరసత్వం రద్దయిన షమీమా బేగం వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. -
ప్రపంచకప్ జట్టులో స్టీవ్ స్మిత్
ఆసీస్ దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోకి లేటుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ముందుగా అనుకున్నట్లు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్కు ప్రత్యామ్నాంగా కాదు. స్మిత్ ఆసీస్ వరల్డ్కప్ టీమ్లోకి పేసర్ జోష్ హాజిల్వుడ్కు రీప్లేస్మెంట్గా వచ్చాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.కాలి గాయంతో బాధపడుతున్న హాజిల్వుడ్ సూపర్-8 సమయానికంతా కోలుకుంటాడని ముందుగా భావించారు. అయితే ఇలా జరగకపోగా.. హాజిల్వుడ్ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. హాజిల్వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడం వల్లనే ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించినట్లు సీఏ తెలిపింది.ఆసీస్ సెలెక్టర్లు స్పెషలిస్ట్ పేసర్ అయిన హాజిల్వుడ్ స్థానాన్ని స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన స్టీవ్తో భర్తీ చేయడం ఆసక్తికరంగా మారింది. పైగా స్టీవ్ అంతర్జాతీయ టీ20 ఆడక ఏడాదైపోయింది. టీ20 ప్రపంచకప్లో అతని చివరి ప్రదర్శన 2022లో వచ్చింది. స్టీవ్కు టీ20 ప్రపంచకప్తో పాటు యావత్ టీ20 ఫార్మాట్లోనే పెద్ద ట్రాక్ రికార్డు లేదు. అయితే స్టీవ్ ఎంపిక గత రికార్డులను చూసి కాకుండా, అతని తాజా బీబీఎల్ ప్రదర్శన ఆధారంగా జరిగింది. స్టీవ్ ఇటీవల ముగిసిన బీబీఎల్లో 59.80 సగటున, 167.97 స్ట్రయిక్రేట్తో 299 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే, ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొని సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టీవ్ ఎంట్రీ ఆసీస్కు ఏమేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి. మరోపక్క ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ సేవలను కూడా తొలి రెండు మ్యాచ్లకు కోల్పోయింది. మార్ష్ గాయం కారణంగా ఐర్లాండ్, జింబాబ్వే మ్యాచ్లకు అందుబాటులో లేడు. తొలుత స్టీవ్ను మార్ష్కు బ్యాకప్గా ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం, మార్ష్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తర్వాతి మ్యాచ్కు అందుబాటులోకి రానున్నాడు. ఆసీస్ తమ తదుపరి మ్యాచ్లో (ఫిబ్రవరి 16) శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆసీస్కు చాలా కీలకం. ఈ మ్యాచ్లో ఓడితే ఆ జట్టు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గ్రూప్-బిలో ఆసీస్ ప్రస్తుతం శ్రీలంక, జింబాబ్వే తర్వాత మూడో స్థానంలో ఉంది. శ్రీలంక మ్యాచ్ తర్వాత ఆసీస్ గ్రూప్ దశలో ఒమన్తో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 20న జరుగనుంది.అప్డేటెడ్ ఆసీస్ జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కనెల్లీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎలిస్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా గడ్డపై తొలి మ్యాచ్లోనే భారత మహిళా బౌలర్లు చెలరేగిపోయారు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆసీస్ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చింది.పేసర్లు రేణుకా సింగ్ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ప్లేయర్ల భరతం పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.ఆసీస్ ఇన్నింగ్స్లో జార్జియా వేర్హమ్ (30) టాప్ స్కోరర్ కాగా.. ఫోబ్ లిచ్ఫీల్డ్ (26), ఎల్లిస్ పెర్రీ (20), జార్జియా వాల్ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్ మూనీ (5), ఆష్లే గార్డ్నర్ (4), అన్నాబెల్ సదర్ల్యాండ్ (3), కిమ్ గార్త్ (2), డార్సీ బ్రౌన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్ సోఫీ మోలినెక్స్ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.కాగా, మల్లీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో తొలుత మూడు టీ20లు, ఆతర్వాత మూడు వన్డేలో, చివరిగా ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో భారత పర్యటన షెడ్యూల్ఫిబ్రవరి 15- తొలి టీ20 (సిడ్నీ)ఫిబ్రవరి 19- రెండో టీ20 (కాన్బెర్రా)ఫిబ్రవరి 21- మూడో టీ20 (అడిలైడ్)ఫిబ్రవరి 24- తొలి వన్డే (బ్రిస్బేన్)ఫిబ్రవరి 27- రెండో వన్డే (హోబర్ట్)మార్చి 1- మూడో వన్డే (హోబర్ట్)మార్చి 6- ఏకైక టెస్ట్ (పెర్త్) -
మహిళల పోరులో పైచేయి ఎవరిదో!
సిడ్నీ: భారత మహిళల క్రికెట్ జట్టు కూడా కీలకమైన టి20 పోరుకు సిద్ధమైంది. భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు తొలి సమరం జరుగుతుంది. వన్డే వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టి20 సిరీస్ ఆడి క్లీన్స్వీప్ చేసిన హర్మన్ప్రీత్ సేన ఇప్పుడు ఒక పెద్ద జట్టుతో ప్రత్యర్థి గడ్డపై తలపడుతోంది. కెపె్టన్ హర్మన్తో పాటు రెగ్యులర్ ఆటగాళ్లు స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్లో చెలరేగితే భారత్ పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్ల్యూపీఎల్లో టాప్స్కోరర్గా నిలిచి అద్భుతమైన ఫామ్తో స్మృతి ఈ సిరీస్కు సిద్ధమైంది. గత టి20 వరల్డ్ కప్ తర్వాతి నుంచి 143.54 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధిస్తున్న స్మృతికి ఆసీస్ గడ్డపై కూడా మంచి రికార్డు ఉంది. క్రాంతి, అరుంధతి, శ్రీచరణి, శ్రేయాంక, రేణుకా సింగ్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటారు. మరో వైపు కొత్త కెప్టెన్ సోఫీ మోలినే నాయకత్వంలో ఆసీస్ బరిలోకి దిగుతోంది. గత 19 టి20 సిరీస్లలో ఆ్రస్టేలియా ఒక్కటి మాత్రమే ఓడింది. అలీసా హీలీ ఈ ఫార్మాట్నుంచి రిటైరైనా... ఇతర స్టార్లు ఎలైస్ పెరీ, సదర్లాండ్, మూనీ, లిచ్ఫీల్డ్, వోల్, వేర్హామ్లకు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉంది. ఆ్రస్టేలియాలో భారత పర్యటనను ప్రతీ ఫార్మాట్కు వేర్వేరుగా కాకుండా తొలిసారి మూడు ఫార్మాట్లలో ప్రదర్శనను బట్టి సిరీస్ విజేతను నిర్ణయిస్తారు. 3 టి20, 3 వన్డేలు, ఒక టెస్టు తర్వాత ఇది తేలుతుంది. పరిమిత ఓవర్లలో ఒక విజయానికి 2 పాయింట్లు, టెస్టులో విజయానికి 4 పాయింట్లు...టెస్టు డ్రా అయితే చెరో 2 పాయింట్లు కేటాయిస్తారు. -
వారెవ్వా జింబాబ్వే
ఆ్రస్టేలియా సొంతగడ్డపై ఆడినా... గడప దాటినా... ఫార్మాట్ ఏదైనా... చాంపియన్ జట్టు. ప్రొఫెషనలిజానికిమారుపేరు. అలాంటి జట్టు జింబాబ్వేలాంటి చిన్న జట్టుతో ఓడటం ఎవరి అంచనాలకూ అందని సంచలనమే! ఓ దుర్బేధ్యమైన జట్టు మళ్లీ అదే ప్రత్యర్థి చేతిలో రెండోసారి ఓడితే సంచలనానికి సీక్వెలే కదా! అవును... దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టి20 ప్రపంచకప్లో జింబాబ్వే... ఆస్ట్రేలియాపై సీక్వెల్ బొమ్మ చూపించింది. 2007లో మొదలైన టి20 వరల్డ్కప్లో అప్పటి వన్డే వరల్డ్ చాంపియన్ను కంగుతినిపించి ఔరా అనిపించిన జింబాబ్వే... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రస్తుత వన్డే విశ్వవిజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించి తాజా టి20 ప్రపంచకప్లో పెను సంచలనం నమోదు చేసింది. కొలంబో: జింబాబ్వే జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో టి20 ప్రపంచకప్లో ఆ్రస్టేలియాను మరోసారి ‘0’ను చేసింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జింబాబ్వే తమ ఆధిక్యాన్ని ‘2’తో రెట్టింపు చేసుకుంది. 2007 టి20 ప్రపంచకప్లో కంగారూ జట్టుపై సాధించిన సంచలన విజయాన్ని 19 ఏళ్ల తర్వాత జింబాబ్వే తాజాగా రిపీట్ చేసింది. అప్పుడు మొదటి ప్రపంచకప్ అయితే ఇది పదోది. మధ్యలో 8 మెగా ఈవెంట్లు జరిగినా... ఇరుజట్లు తలపడలేదు. శుక్రవారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (56 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన ముగ్గురు బ్యాటర్లు తదివనషె మరుమని (21 బంతుల్లో 35; 7 ఫోర్లు), రియాన్ బర్ల్ (30 బంతుల్లో 35; 4 ఫోర్లు), కెప్టెన్ సికందర్ రజా (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు. ఆసీస్ ఈ 120 బంతులు ఆడలేదా? జింబాబ్వే లాంటి కూన జట్టు బ్యాటర్లు 120 బంతులెదుర్కొని ఇద్దరే అవుటైతే... జగజ్జేత కంగారు పడటమేంటి? పది మంది బ్యాటర్లు 117 బంతులకే అవుట్ కావడమేంటి? హెడ్ బృందానికి 170 లక్ష్యఛేదన ఏమాత్రం కష్టమైంది కాదు. కఠినమైంది కాదు. కానీ 19.3 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్లెసింగ్ ముజరబాని (4/19), బ్రాడ్ ఇవాన్స్ (3/23) ధాటికి ఓపెనర్లు ఇన్గ్లిస్ (8), కెప్టెన్ హెడ్ (17) గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0)... ఇలా టాప్–4 స్పెషలిస్టు బ్యాటర్లంతా పవర్ప్లేలో 29 పరుగులకే పెవిలియన్కు వెళ్లి ప్రేక్షకులైపోయారు.ఒకే ఒక్కడు మ్యాట్ రెన్షా (44 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్వెల్ (32 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) ఐదో వికెట్కు 77 పరుగులు జోడించడంతో 100 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే తర్వాతి బ్యాటర్లు స్టొయినిస్ (6), డ్వార్షుయిస్ (6), ఎలిస్ (7 నాటౌట్), జంపా (2), కునెమన్ (0)ల స్కోర్లు చూస్తే ఏ అత్యల్ప స్కోరుకో పరిమితమయ్యేదేమో! ఔరా మన్యొంగా... జింబాబ్వే ఫీల్డర్ మన్యొంగా కళ్లు చెదిరే క్యాచ్తో ఆకట్టుకున్నాడు. ఇవాన్స్ వేసిన 18వ ఓవర్లో డ్వార్షుయిస్ మిడ్వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. మున్యొంగా దూరంగానే ఉన్నప్పటికీ డీప్ మిడ్వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో డైవ్ చేసి అందుకున్న క్యాచ్ ఔరా అనిపించింది. టేలర్ స్థానంలో బెన్ కరన్... జింబాబ్వే సీనియర్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ గాయం కారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఒమన్తో మ్యాచ్లో గాయపడిన అతను ఆసీస్తో పోరులో బరిలోకి దిగలేదు. టేలర్ స్థానంలో ఐసీసీ అనుమతితో బెన్ కరన్కు జింబాబ్వే చోటు కల్పించింది. బెన్ కరన్ తమ్ముడు స్యామ్ కరన్ ఇప్పటికే వరల్డ్ కప్లో ఇంగ్లండ్ తరఫున ఆడుతున్నాడు.2 ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టుతో జింబాబ్వే నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడింది. ఇందులో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. ఆసీస్పై జింబాబ్వే సాధించిన రెండు విజయాలు ప్రపంచకప్లోనే రావడం విశేషం.టి20 ప్రపంచకప్లో నేడుఐర్లాండ్ X ఒమన్వేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి ఇంగ్లండ్ X స్కాట్లాండ్వేదిక: కోల్కతా; మ.గం. 3 నుంచి దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన స్టోయినిస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో స్టోయినిస్ ఓ వికెట్ సహా 6 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అస్ట్రేలియా తరఫున 50 వికెట్లు సహా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఆసీస్కు షాకిచ్చిన జింబాబ్వేటీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి, మైటి ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి, ఆతర్వాత ఆ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. బ్యాటింగ్లో బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), బౌలింగ్లో బ్లెస్సింగ్ ముజరబానీ (4-0-17-4) చెలరేగిపోయారు. బ్యాటింగ్లో బెన్నెట్తో పాటు మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) కూడా రాణించారు.బౌలింగ్లో ముజరబానీతో పాటు బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) కూడా సత్తా చాటారు.ఆసీస్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆసీస్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్లో ఎల్లిస్ (4-0-34-0), జంపా (4-0-31-0) పరుగులు నియంత్రించినా వికెట్లు తీయలేకపోయారు. డ్వార్షుయిస్ (4-0-40-0)ను జింబాబ్వే బ్యాటర్లు ఉతికి ఆరేశారు. కుహ్నేమన్ (3-0-24-0) ప్రభావం చూపలేకపోయాడు. పార్ట్టైమ్ బౌలర్ మ్యాక్స్వెల్ ఒక్క ఓవర్కే (1-0-14-0) పరిమితమయ్యాడు. గ్రీన్ (1.1-0-6-1), స్టోయినిస్ (2.5-0-17-1) తలో వికెట్ తీశారు. స్టోయినిస్ బౌలింగ్ చేస్తుండగా తీవ్రంగా గాయపడి, ఓవర్ ముగియకుండానే మైదానాన్ని వీడాడు.అనంతరం బ్యాటింగ్లో ఆసీస్ దారుణంగా తేలిపోయింది. ఓపెనర్లు ఇంగ్లిస్ 8, హెడ్ 17 పరుగులు చేయగా.. ఆతర్వాత వచ్చిన గ్రీన్, టిమ్ డేవిడ్ డకౌట్లయ్యారు. ఈ దశలో మ్యాక్స్వెల్ (31), రెన్షా (65) ఆసీస్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జింబాబ్వే బౌలర్ల ధాటికి వీరు కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో స్టోయినిస్ (6), డ్వార్షుయిస్ (6), జంపా (2), కుహ్నేమన్ (0) ఇలా వచ్చి, అలా పెవిలియన్కు వెళ్లడంతో ఆసీస్ ఘోర పరాజయంపాలైంది. జింబాబ్వే టీ20 ప్రపంచకప్లో ఆసీస్ను ఓడించడం ఇదే మొదటిసారి కాదు. 2007 ఎడిషన్లోనూ ఆ జట్టు ఆసీస్ను మట్టికరిపించింది. -
పాఠం నుంచి పాకం దాకా
ఆమె ఎంబీఏ చేసింది. ముంబాయిలో ఓ పేరున్న కార్పొరేట్ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పెద్ద జీతం మీద పాఠాలు చెబుతూ మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి ఆమె పాఠాలు చెప్పే ఉద్యోగాన్ని మానేసి ఇంటి దగ్గరే హెల్దీ శ్నాక్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. రుచిగా, శుచిగా ఉండే చిరుతిళ్లను చాలా తక్కువ ధరకే అమ్మడం మొదలు పెట్టింది. ఇప్పుడామె తయారు చేసే శ్నాక్స్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా దాదాపు పదిహేను దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆమే జైపూర్కు చెందిన రిచాశర్మ. ఇంతకీ ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో... ఎంటర్ప్రెన్యూర్గా ఎలా ఎదిగిందో చూద్దాం...రిచాశర్మది జైపూర్. ఫైనాన్స్లో ఎంబీఏ చేసింది. అక్కడే ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేసింది. అయితే అది ఆమెకు చాలా దూరం కావడంతో ప్రయాణాలు చేయలేక వడోదరలోని పరుల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరింది. అక్కడ నాలుగైదేళ్ల పాటు పని చేసింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ముంబాయి మహానగరంలో కాలు పెట్టింది. అప్పుడే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడం, వారి ఆలనా పాలనా చూసుకోవడం తో ఇక ఉద్యోగం ఊసులేకుండా వారితోటే పూర్తికాలం గడిచి పోయింది. మెల్లగా ఆ పిల్లలు రెండు, ఆరు తరగతులకొచ్చారు. వాళ్లకోసం రకరకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారు చేసి పెట్టేది. ఈ క్రమంలో ఆమె చేసే తినుబండారాలను పిల్లల ద్వారా వారి స్నేహితులు, వాళ్ల వాళ్ల ఇళ్లలోనిÐ éళ్లూ రుచి చూశారు. అవి వారికి బాగా నచ్చడంతో వారిలో కొందరు ‘మీ పిల్లలకోసం తయారు చేసేటప్పుడే... మరికొద్ది మొత్తంలో మా పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు కదండీ’ అని అడగడంతో రిచాశర్మ గ్లుటెన్, మైదా, డాల్డా లాంటివి లేకుండా రుచికరమైన కమ్మటి శ్నాక్స్ తయారు చేయడం మొదలు పెట్టింది. చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో లడ్డూలు, ధోక్లా, కచోరీలు, సబ్జీలు తయారు చేసేది. అవి అక్కడివాళ్లకు అమితంగా నచ్చేవి. మాకు కావాలంటే మాకు కావాలని అందరూ పోటీపడేవాళ్లు. దాంతో ఆమె ‘రిచా ప్లేటర్’ పేరుతో శ్నాక్స్ సప్లై చేసేది. కోవిడ్ మార్చేసిన జీవితంఅలా సాగుతున్న ఆమె జీవితంలో కోవిడ్ పెను మార్పు తెచ్చింది. ఇక్కడ మార్పు అనగానే ఆమె చేసే శ్నాక్స్ బిజినెస్ కాస్తా దెబ్బ తిందేమో అని జాలిపడితే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే కోవిడ్ సమయం లో రిచాశర్మ రుచిగా శుచిగా శుభ్రంగా చేసే హోమ్ మేడ్ ఫుడ్ కోసం జ నాలు ఎగబడ్డారు. దాంతో ఆమె బిజినెస్ ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయింది. అప్పుడే ఆమె తన బిజినెస్ స్కిల్స్ను మరింత అభివృద్ధి చేసుకుంది. ఆర్డర్లకు తగ్గట్టే ప్రిపేర్ చేయడం వల్ల మిగిలి పోవడం కానీ, తక్కువ కావడం కానీ ఎప్పుడూ జరగలేదామెకి. దాంతో అప్పటివరకు మామూలు చిన్న చిన్న తినుబండారాల తయారీ నుంచి రకరకాల స్వీట్స్ తయారీకీ శ్రీకారం చుట్టింది రిచా. మొదట్లో నెలకు 20 ఆర్డర్లతో సరిపెట్టుకున్న రిచా శర్మ చూస్తుండగానే నెలకు 500 ఆర్డర్లకు సప్లై చేసేంతగా అభివృద్ధి చెందిందామె వ్యా పారం. ఖర్, బోరివలి, అంధేరిలకే పరిమితమైన ఆమె కష్టమర్లు కోయంబత్తూరు, బెంగళూరు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ల వరకు విస్తరించారు. తన బిజినెస్కు ‘హంబుల్ ఫ్లేవర్స్’ అనే పేరు పెట్టి దానిని ఇంకా ఇంకా పెంచింది రిచా. వచ్చిన లాభాలలో ఐదుశాతం వాటాను ఎన్జీవోలకు డొనేట్ చేస్తుంది రిచా. మరో ఐదుశాతం లాభాలను తనతో పని చేసే వారికి ఇస్తుంది రిచా. వ్యా పారం ద్వారా లాభాలను గడించడం తన లక్ష్యం కాదని, అందరికీ హెల్దీ, టేస్టీ శ్నాక్స్ అందించడంలోనే తనకు సంతృప్తి లభిస్తుందని చెప్పే రిచాను ఇండియన్ ఇన్స్పైరింగ్ హోమ్ బిజినెస్ ఉమన్ అవార్డు వరించింది. -
T20 WC 2026: పసికూనపై ఆస్ట్రేలియా ప్రతాపం
టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పసికూన ఐర్లాండ్పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. 45 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. జోష్ ఇంగ్లిస్, మ్యాట్ రెన్షా తలో 37 పరుగులు.. కూపర్ కన్నోలీ, జేవియర్ బార్ట్లెట్ చెరో అజేయమైన 11 పరుగులు.. తాత్కాలిక కెప్టెన్ ట్రవిస్ హెడ్ , గ్లెన్ మ్యాక్స్వెల్ 9 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్, జార్జ్ డాక్రెల్, హ్యారీ టెక్టార్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. ఆడమ్ జంపా (4-0-23-4), నాథన్ ఎల్లిస్ (3.5-1-12-4) ధాటికి 16.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. మిగతా ఆసీస్ బౌలర్లలో కుహ్నేమన్ (4-0-29-1) కూడా రాణించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన జార్జ్ డాక్రెల్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు. డాక్రెల్ ఈ స్కోర్ చేయకపోయుంటే ఐర్లాండ్ 100 పరుగుల మార్కును కూడా దాటలేకపోయేది. మిగతా ఐరిష్ బ్యాటర్లలో లోర్కన్ టక్కర్ (24), రాస్ అదైర్ (12), గెరాత్ డెలానీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. -
వరల్డ్కప్ జట్టులోకి స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 11) జరుగనున్న మ్యాచ్కు ముందు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయపడటంతో స్టీవ్ను హుటాహుటిన శ్రీలంకకు పిలిపించారు. స్టీవ్కు తొలుత ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.బిగ్బాష్లో అద్భుత ఫామ్లో ఉన్నా, స్టీవ్ను ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడంపై ముందు నుంచే విమర్శలు ఉన్నాయి. మార్ష్ అనూహ్యంగా గాయపడటంతో స్టీవ్కు అవకాశం లభించింది. స్టీవ్ ఫిబ్రవరి 13న జింబాబ్వేతో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది.కాగా, ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. తద్వారా అతను ఐర్లాండ్ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రవిస్ హెడ్ ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి మార్ష్కు టెస్టిక్యులర్ బ్లీడింగ్ సమస్య తలెత్తిందని వైద్యులు తెలిపారు.క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన ప్రకారం.. మార్ష్కు విశ్రాంతి అవసరం. వైద్యుల సూచనల ఆధారంగా తిరిగి ఆడే సమయం నిర్ణయించబడుతుంది. ఈ గాయం వల్ల ఆయన కదలికలు పరిమితం కావడంతో తక్షణమే జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసీస్ వేధిస్తున్న గాయాలుప్రస్తుత ప్రపంచకప్లో ఆసీస్ ఇప్పటికే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి సీనియర్ బౌలర్ల సేవలను కోల్పోయింది. ఇప్పుడు కెప్టెన్ మార్ష్ కూడా గాయపడటంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. అయితే అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్ చేరిక, బ్యాటింగ్ లైనప్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.ప్రపంచకప్ గ్రూప్ దశలో ఆసీస్ షెడ్యూల్ - ఐర్లాండ్తో తొలి మ్యాచ్ – ఫిబ్రవరి 11 - జింబాబ్వేతో – ఫిబ్రవరి 13 - శ్రీలంకతో – ఫిబ్రవరి 16 - ఒమాన్తో – ఫిబ్రవరి 20 ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా ఐర్లాండ్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు.. ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), కర్టిస్ కాంఫర్, బెంజమిన్ కాలిట్జ్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, మాట్ రెన్షా, కూపర్ కోనోలీ, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్లెట్, మాథ్యూ కుహ్నెమాన్, ఆడమ్ జంపా -
పాకిస్తాన్ సూపర్ లీగ్లో స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో వైరలవుతుంది. స్టీవ్ను రానున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎడిషన్ కోసం సియాల్కోట్ స్టాలియన్జ్ అనే ఫ్రాంచైజీ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. స్టాలియన్జ్ స్టీవ్ను డైరెక్ట్ సైనింగ్ ద్వారా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.ఈ వార్త పాక్ అభిమానుల సోషల్మీడియా గ్రూప్ల్లో హల్చల్ చేస్తుంది. పాక్ ఫ్యాన్స్ స్టీవ్కు స్వాగతం పలుకుతున్నారు. స్టీవ్ ఇప్పటివరకు పీఎస్ఎల్లో ఆడలేదు. స్టీవ్ రాక పీఎస్ఎల్కు కల తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం స్టీవ్ మంచి ఫామ్లో ఉన్నాడు.తాజాగా ముగిసిన బిగ్ బాష్ లీగ్ (BBL) 15వ సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతూ 6 మ్యాచ్ల్లో 299 పరుగులు (సగటు 59.80, స్ట్రైక్ రేట్ 167.97) చేశాడు. ఇందులో 42 బంతుల్లో శతకం కూడా ఉంది. మొత్తం టీ20 కెరీర్లో 272 మ్యాచ్లు ఆడిన స్టీవ్.. 6,242 పరుగులు, 5 శతకాలు, 30 అర్ధశతకాలు సాధించాడు. కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ తదుపరి ఎడిషన్ ప్రారంభానికి ముందు పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీకి ఒక విదేశీ ఆటగాడిని నేరుగా సంతకం చేసుకునే అవకాశం ఉంది. గత ఎడిషన్లో ఆడని ఆటగాడిని మాత్రమే ఈ విధానం ద్వారా తీసుకోవచ్చు. స్టాలియన్జ్ ఈ అవకాశాన్ని వినియోగించి స్టీవ్ను చేజిక్కించుకుంది. స్టాలియన్జ్ PSLలో కొత్తగా ప్రవేశించిన రెండు జట్లలో ఒకటి.2026 జనవరి 8న జిన్నా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఫ్రాంచైజీల వేలంలో OZ Developers (హమ్జా మజీద్, కామిల్ ఖాన్) స్టాలియన్జ్ను రూ.1.85 బిలియన్ రికార్డు ధరకు కొనుగోలు చేశారు. PSL చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా నిలిచింది. -
ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్..
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలో మరో కీలక బౌలర్ జోష్ హాజిల్వుడ్ చేరాడు. హాజిల్వుడ్ ప్రస్తుతం కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే అతడు కీలక యాషెస్ సిరీస్కు కూడా దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలస్తోంది.ఈ క్రమంలోనే పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభ మ్యాచ్లకు హాజిల్వుడ్ దూరం కానున్నట్లు ఆసీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ జట్టుతో పాటు కొలంబోకు వెళ్లకుండా సిడ్నీలోనే ఉండనున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత జట్టుతో కలిసే అవకాశముంది.ఒకవేళ హాజిల్వుడ్ దూరమైతే కంగారులకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఆస్ట్రేలియా ప్రధాన పేసర్లు ఎవరూ లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తుంది. హాజిల్వుడ్ ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో సెలెక్టర్లు షాన్ అబాట్ను ట్రావెలింగ్ రిజర్వ్గా జట్టులోకి తీసుకున్నారు.అయితే బిగ్బాష్ లీగ్లో గాయపడ్డ విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు కొలంబోలో జట్టుతో కలవనున్నాడు. ఈ మెగా ఈవెంట్ సన్నాహాల్లో భాగంగా ఆసీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది. అయితే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆసీస్ క్లీన్స్వీప్కు గురైంది. ఆస్ట్రేలియా ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో తమ తొలి వరల్డ్కప్ మ్యాచ్ ఆడనుంది.ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ జట్టు (అప్డేటడ్): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జేవియర్ బార్ట్లెట్, జోష్ హేజిల్వుడ్, కూపర్ కాన్లీ, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ కుహ్నెమన్, బెన్ ద్వార్షుయిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, మాథ్యూ రెన్షా, నాథన్ ఎల్లిస్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా. (రిజర్వ్: షాన్ అబాట్).చదవండి: ఇదేం ప్రశ్న?.. పాక్ రిపోర్టర్కు ఇచ్చి పడేసిన ఆసీస్ కెప్టెన్ -
మూడో టీ20లోనూ ఆసీస్ను చిత్తు చేసిన పాక్
టీ20 ప్రపంచకప్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో పాక్ 111 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-0 తేడాతో ఆసీస్ను వైట్వాష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసిన పాక్.. అనంతరం ఆసీస్ను 16.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూల్చి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.రాణించిన బాబర్, సైమ్పాక్ ఇన్నింగ్స్లో సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా పాక్ ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 10, కెప్టెన్ సల్మాన్ అఘా 5, ఖ్వాజా నఫే 21, మొహమ్మద్ నవాజ్ 5, ఫహీం అష్రాఫ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.తిప్పేసిన నవాజ్అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో గ్రీన్ (22), స్టోయినిస్ (23), జోష్ ఫిలిప్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్ష్ (1), షార్ట్ (2), రెన్షా (1), ఓవెన్ (8), కన్నోలీ (0), కుహ్నేమన్ (5) దారుణంగా విఫలమయ్యారు. ఆడమ్ జంపా బ్యాటింగ్కు దిగలేదు. పాక్ ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో కూడా భారీ విజయాలు సాధించింది. ఈ సిరీస్కు ఆసీస్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ప్రపంచకప్ దృష్ట్యా సీనియర్లకు విశ్రాంతినిచ్చింది. -
పాకిస్తాన్దే సిరీస్
లాహోర్: ఐసీసీ టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఆ్రస్టేలియాపై సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో పాకిస్తాన్ 90 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సల్మాన్ ఆగా (76; 8 ఫోర్లు, 4 సిక్స్లు), ఉస్మాన్ ఖాన్ (53; 4 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఆ్రస్టేలియా 15.4 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లు ప్రభావం చూపలేక పోయారు. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
ఇదేం జంతువురా బాబూ!
ప్లాటిపస్ అనే జంతువు ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన జంతువుల్లో ఒకటి. ఇది గుడ్లు పెడుతుంది, తన పిల్లల కోసం పాలు ఉత్పత్తి చేస్తుంది, నీటిలో విద్యుత్ సంకేతాలను గుర్తించగలదు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? అంతే కాదు, అల్ట్రావయలెట్ కాంతిలో ఇది వెలుగుతుంది కూడా!ప్లాటిపస్లు ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న నదులు, వాగుల్లో నివసిస్తాయి. వీటిలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇవి విషం కలిగిన స్తన్యజంతువులు కావడం. సాధారణంగా మనం విషం అంటే పాములు, తేళ్లను గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ మగ ప్లాటిపస్ కూడా విషాన్ని కలిగి ఉంటుంది.మగ ప్లాటిపస్ల వెనుక కాళ్ల దగ్గర పదునైన ముళ్లు ఉంటాయి. ఆడవాటితో జతకట్టే కాలంలో, ఈ ముళ్లు విష గ్రంథులతో కలుస్తాయి. అప్పుడు అవి చాలా శక్తివంతమైన విషాన్ని విడుదల చేస్తాయి. శాస్త్రవేత్తలు ఈ విషంలో కనీసం 19 రకాల ప్రత్యేక రసాయనాలు (పెప్టైడ్లు) ఉన్నాయని కనుగొన్నారు. కొన్ని రసాయనాలైతే ప్రపంచంలో మరే జంతువులోనూ లేవు. ఈ విషం మనుషులకు ప్రాణాంతకం కాదు. కానీ చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ప్లాటిపస్ విషానికి గురైనవారు ‘ఎముక విరిగిన దానికంటే కంటే ఎక్కువ నొప్పి’ అని చెబుతారు. కొన్నిసార్లు ఆ నొప్పి వారాల పాటు లేదా నెలల పాటు కొనసాగుతుంది. దీనికి ఇప్పటివరకు ప్రత్యేక విరుగుడు మందు (యాంటీ వెనమ్) లేదు. ఈ విషం భవిష్యత్తులో మనుషులకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. శాస్త్రవేత్తలు దీని ద్వారా కొత్త నొప్పి నివారణ మందులు, డయాబెటిస్ మందుల తయారీకి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు.ఇదీ చదవండి: హైఎండ్ కార్లు,చాపర్ రైడ్స్ : ఎందుకు సీజే రాయ్ ఆత్మహత్య? -
ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం.. 37 ఏళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో సంచలనం నమోదైంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో స్థానిక జోడీ ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ టైటిల్ గెలిచింది. ఇదే జోడీ గతేడాది కూడా టైటిల్ ఎగరేసుకుపోయింది. తద్వారా వరుసగా రెండు ఎడిషన్లలో టైటిల్ గెలిచిన జోడీగా 37 ఏళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టింది. 1988-89లో యానా నవోత్న-జిమ్ పగ్ జోడీ వరుసగా రెండు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలిచింది.తాజా టైటిల్తో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ మరో రికార్డు కూడా సొంతం చేసుకుంది. మార్గరెట్ కోర్ట్-కెన్ ఫ్లెచర్ జోడీ (1963-64) తర్వాత స్వదేశంలో వరుసగా రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ టైటిళ్లు సాధించిన జోడీగా చరిత్ర సృష్టించింది.రాడ్ లేవర్ ఎరీనాలో ఇవాళ జరిగిన ఫైనల్లో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ జోడీ ఫ్రెంచ్ జంట క్రిస్టినా మ్లాడెనోవిక్-మాన్యుయెల్ గినార్డ్పై 4-6, 6-3, 10-8 తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో గడెకీ-పియర్స్ జోడీ టైబ్రేక్లో 5-7 వెనుకబడినప్పటికీ, చివరి ఆరు పాయింట్లలో ఐదు గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది. -
ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్
గత కొంతకాలంగా ఇంటా-బయటా.. ఆ ఫార్మాట్-ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ జట్టుకు టీ20 ప్రపంచకప్కు ముందు, స్వదేశంలో ఊరట కలిగించే విజయం లభించింది. లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి, వన్డే ప్రపంచ ఛాంపియన్లైన ఆస్ట్రేలియన్లను చిత్తు చేశారు. 169 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని ప్రపంచకప్కు ముందు కాన్ఫిడెన్స్ను పెంచుకున్నారు. ఈ మ్యాచ్లో ఆసీస్ తమ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ లేకుండా ట్రవిస్ హెడ్ నాయకత్వంలో బరిలోకి దిగింది. మిచెల్ లేని లేటు ఆసీస్ జట్టులో కొట్టొచ్చినట్లు కనిపించింది. వ్యూహ్యాల అమలు దగ్గరి నుంచి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మిచెల్ లేని ఆసీస్ సాధారణ జట్టులా కనిపించింది. ఈ గెలుపులో పాక్ బౌలర్ల గొప్పతనం పెద్దగా లేకపోయినా, ఆసీస్ బ్యాటర్ల డొల్లతనం స్పష్టంగా తెలిసింది. బౌలింగ్లో ఆడమ్ జంపా నైపుణ్యం వల్ల పాక్ను తక్కువ స్కోర్కే పరిమితం చేయగలిగినా, దాన్ని ఛేదించడంలో మాత్రం ఆసీస్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఫలితం మూడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్కు తొలి బంతికే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ను జేవియర్ బార్ట్లెట్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. అయితే ఆతర్వాత పాక్ కుదురుకుంది. మరో ఓపెనర్ సైమ్ అయూబ్ (40), వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సల్మాన్ అఘా (39) బాధ్యతాయుతంగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయూబ్ ఔటయ్యాక బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ (24) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, ఈసారి కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన ఫకర్ జమాన్ (16 బంతుల్లో 10) జిడ్డుగా ఆడి పాక్ భారీ స్కోర్ చేయకపోవడానికి అడ్డు గోడ అయ్యాడు. చివర్లో ఉస్మాన్ ఖాన్ (18), మహ్మద్ నవాజ్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేసినా కుదర్లేదు. ఆడమ్ జంపా (4-0-24-4) పాక్ ఆటగాళ్ల పాలిట కొరకరాని కొయ్యలా మారగా.. బార్ట్లెట్ (4-0-26-2), బియర్డ్మన్ (4-0-33-2) పాక్ ఆటగాళ్ల పప్పులు ఉడకనివ్వలేదు. చివరి ఓవర్లో బియర్డ్మన్ రెండు వికెట్లు తీసి పాక్ను 168 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమిమతమయ్యేలా చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ కూడా ఆదిలోనే తడబడింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. ఆతర్వాత ట్రవిస్ హెడ్ (23), గ్రీన్ (36) కాసేపు మెరుపులు మెరిపించినా, దాన్ని కొనసాగించలేకపోయారు. వీరద్దరు ఔటయ్యాక ఆసీస్ ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. చివర్లో బార్ట్లెట్ (34 నాటౌట్) బ్యాట్ ఝులిపించినా, అప్పటికే ఆసీస్ ఓటమి ఖరారైపోయింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ చెరో వికెట్ పడగొట్టారు. మొత్తంగా పాక్ స్పిన్నర్లు ఆసీస్ ఆటగాళ్లను విజయవంతంగా కట్టడి చేసి, సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లారు. రెండో టీ20 ఇదే లాహోర్ వేదికగా జనవరి 31న జరుగనుంది. -
సోషల్ మీడియాలో కొత్త సెన్సేషన్ ‘అప్స్క్రోల్డ్’ అసలేంటిది?
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తున్న యాప్ అప్స్క్రోల్డ్ (UpScrolled) ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్,టిక్టాక్లాంటి యాప్లకు ప్రత్యామ్నాయంగా దూసుకుపోతోంది. అసలేంటీ అప్స్క్రోల్డ్, ఎందుకు పాపులర్ అవుతోంది? తెలుసుకుందాం.ఎటాంటి సెన్సార్షిప్ లేదా దూకుడు అల్గారిథమ్లు లేని సురక్షితమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ప్రకటించుకుంటోంది యాజమాన్యం. యూజర్ డేటాను థర్డ్ పార్టీలకు అమ్మబోమని హామీ ఇస్తోంది. దీంతో యాక్టివిస్టులు, రాజకీయవేత్తలు సహా పలువురు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. టాప్లో దూకుడు, ఏకంగా సర్వర్లు క్రాష్ఆపిల్(iOS) యాండ్రాయిడ్ యాప్ స్టోర్లో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన యాప్గా ఇది నిలిచింది. జనవరి 2026 నాటికి, అమెరికాలో ఈ యాప్ ఆపిల్ యాప్ స్టోర్లో టాప్-10 లోకి చేరింది. టిక్టాక్ , మెటా (ఫేస్బుక్/ఇన్స్టాగ్రామ్) లపై అసంతృప్తిగా ఉన్న యాక్టివిస్టులు, క్రియేటర్లు ఈ ప్లాట్ఫారమ్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సార్షిప్లేని కంటెంట్ కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. పారదర్శకత ,న్యాయమైన కంటెంట్ను అందించే ప్లాట్పాం ప్రత్యామ్నాయాలన కోసం చూస్తున్నారు.ఆపిల్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో టిక్టాక్ను దాటేసింది. అంతేకాదు డౌన్లోడ్ల తాకిడికి జనవరి 26 న ప్లాట్ఫామ్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. టిక్టాక్ ప్లాట్ఫామ్ యాజమాన్య మార్పు తర్వాత సెన్సార్షిప్ ఆరోపణల మధ్య టిక్టాక్ను వదిలివేసి అప్స్క్రోల్డ్కు మారిపోతున్నారు.అప్స్క్రోల్డ్ ఎక్కడిది?ఆస్ట్రేలియాకు చెందిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్. దీనిని పాలస్తీనా-ఆస్ట్రేలియన్ డెవలపర్ ఇస్సాం హిజాజీ (Issam Hijazi) 2025,జూన్లో ప్రారంభించారు. ఇటీవల అమెరికాలో టిక్టాక్ యాజమాన్య మార్పుల నేపథ్యంలో, చాలామంది యూజర్లు ఈ యాప్ వైపు మళ్లుతున్నారు. దీని ‘‘ఎబౌట్" పేజీ ప్రకారం, పక్షపాతం, షాడోబ్యానింగ్ లేదా "అన్యాయమైన" అల్గారిథమ్ల ప్రమాదం లేకుండా యూజర్లందరూ తమ అభిప్రాయాలను పంచుకోవడానికి అనుమతించడమే అప్స్క్రోల్డ్ లక్ష్యం.కంపెనీ తమ మార్గదర్శకాలనుఉల్లంఘించే కంటెంట్ను మాత్రమే పరిమితం చేస్తుందట. అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ద్వేషపూరిత ప్రసంగం, బెదిరింపు, వేధింపులు, అశ్లీలం, లైసెన్స్ లేని కాపీరైట్ కంటెంట్ లేదా "హాని కలిగించడానికి ఉద్దేశించినది". UpScrolled కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడూ నిషేధించదని అని కూడా చెపుతోంది. ప్లాట్ఫారమ్ ఉంచి వీడియోలను లేదా మీ ఖాతాను తొలగిస్తే, ఎందుకు తొలగించిందో కూడా వివరిస్తుంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో పోలిస్తే దీని ప్రధానమైన తేడా దాని అల్గోరిథం. Discover Feedని ఉపయోగించవచ్చు డిస్కవర్ ఫీడ్, ఫాలోయింగ్ పీడ్ అని రెండు రకాలుగా యాప్ ఫీడ్లను విభజిస్తుంది. Following Feed అంటే మనం ఫాలో అయ్యే వ్యక్తుల పోస్ట్లు మాత్రమే వరుసగా కనిపిస్తాయి. Discover Feed అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న కంటెంట్ను చూడవచ్చు.ఇదీ చదవండి: కాబోయే సుప్రీం మొజ్తబా ఖమేనీ..దిమ్మదిరిగే వ్యాపార సామ్రాజ్యండిస్కవర్ ఫీడ్ అనేది వివిధ రకాల కంటెంట్ల మిశ్రమం, కానీ ప్రస్తుత ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణకు సంబంధించిన కంటెంట్తో నిండిపోతోంది. వాస్తవానికి, ప్రధాన స్రవంతి సోషల్ మీడియా యాప్లు ఈ రకమైన పోస్ట్లను సెన్సార్ చేస్తున్నాయనే ఆరోపణలకు ప్రతిస్పందనగా, చాలా మంది వినియోగదారులు ఈ ప్లాట్ఫామ్ను పాలస్తీనాకు మద్దతు ఇచ్చే కంటెంట్ కోసం దీన్ని ఒక వేదికగా ఎంచుకుంటున్నారు. దీంతోపాటు క్రీడలు, వార్తలు, గేమ్లు, సినిమాలు, సంగీతం, టెక్నాలజీ , ట్రావెల్ వంటి అనేక విభిన్న రకాల కంటెంట్లను అందిస్తామని వెల్లడించింది. టిక్టాక్, ఇన్స్టాలా కాకుండా, Discover Feed కొన్ని దూకుడు, వ్యక్తిగతీకరించిన అల్గారిథమ్ను ఉపయోగించదు. దీనికి బదులుగా, ఇది లైక్లు, కామెంట్స్, షేర్స్ మీదధారపడి ఉంటుంది.ముఖ్యమైన ఫీచర్లుప్రస్తుతం ఆండ్రాయిడ్ (Google Play Store, ఐఫోన్ (App Store) రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇందులో ఫోటోలు, చిన్న వీడియోలు (Short-form videos) , టెక్స్ట్ పోస్ట్లను షేర్ చేయవచ్చు. స్నేహితులతో నేరుగా చాట్ చేసే సదుపాయం కూడా ఉంది. ప్రధాన సోషల్ మీడియా సంస్థలు కొన్ని రకాల కంటెంట్ను (ముఖ్యంగా రాజకీయ అంశాలను) సెన్సార్ చేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో, "సెన్సార్షిప్ లేని ప్లాట్ఫారమ్"గా తనను తాను ప్రకటించుకుంది.షాడో బ్యానింగ్ (Shadowbanning) అంటే యూజర్ల పోస్ట్లను రహస్యంగా అణచివేయడం ఉండదు. ఇతర యాప్లలాగా యూజర్లను అడిక్ట్ చేసే క్లిష్టమైన అల్గారిథమ్స్ కాకుండా, సాధారణమైన క్రోనలాజికల్ (సమయానుకూల) ఫీడ్ను ఇది అందిస్తుంది.అయితే ఇది తన సేవా నిబంధనలను దూకుడుగా కొత్త ట్రాకింగ్తో అప్డేట్ చేస్తోందని, కొన్ని కంటెంట్ రకాలను బ్లాక్ చేస్తోందని, కొత్త పోస్ట్లను "షాడోబ్యాన్" చేస్తోందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి! -
ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక ఖరారైనట్లు తెలుస్తుంది. దిగ్గజ వికెట్కీపర్-బ్యాటర్ అలైస్సా హీలీ రిటైర్మెంట్ (ఫిబ్రవరి-మార్చిలో జరిగే భారత్ సిరీస్ తర్వాత) ప్రకటించడంతో, ఆమె స్థానంలో సోఫీ మోలినెక్స్ను కొత్త ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. మోలినెక్స్కు పట్టం కట్టడం దాదాపుగా ఖరారైనట్లు ఆసీస్ మీడియా వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజుల కిందటి వరకు రేసులో లేని మోలినెక్స్ అనూహ్యంగా కెప్టెన్సీని దక్కించుకుందని కథనాలు వెలువడుతున్నాయి. అందులోనూ ఆమెను ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా ఎంపిక చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. హీలీ తర్వాత కెప్టెన్సీ రేసులో ఎల్లిస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్ పేర్లు ప్రధానంగా వినిపించినా, క్రికెట్ ఆస్ట్రేలియా మోలినెక్స్వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. 28 ఏళ్ల మోలినెక్స్ 2018లో భారత్తో జరిగిన టీ20 ట్రై-సిరీస్తో ఆసీస్ తరఫున అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు ఆమె 3 టెస్ట్లు, 17 వన్డేలు, 38 టీ20లు ఆడింది. లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్గా 76 అంతర్జాతీయ వికెట్లు సాధించిన ఆమె, లోయర్ ఆర్డర్ బ్యాటర్గా చాలా ఉపయోగకరమైన ప్రదర్శనలు చేసింది. హీలీ నాయకత్వం వహించిన జట్టులో మోలినెక్స్ కీలక పాత్ర పోషించింది. 2018, 2020 టీ20 వరల్డ్ కప్లలో ఆస్ట్రేలియా విజయాల్లో భాగమైంది. ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్లోనూ ఎనిమిది వికెట్లు తీసి సత్తా చాటింది. మోలినెక్స్ ఎంపిక ఆసీస్కు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యత తీసుకొస్తుంది. -
అగ్నిగుండంలా ఆస్ట్రేలియా
వెల్లింగ్టన్: ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. వడగాలుల ధాటికి ఆగ్నేయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీ సెల్సియస్ స్థాయికి పెరిగిపోయాయి. ఎంతటి చలినైనా తట్టుకునే ఆస్ట్రేలియన్లను ఇంతటి భరించలేని వేడిమి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. విక్టోరియా రాష్ట్రంలోని హోప్టౌన్, వాల్ప్అప్లోని గ్రామీణ పట్టణాల్లో ఉష్ణోగ్రతలు 48.9 డిగ్రీ సెల్సియస్కు చేరుకున్నాయి. ఇవి బుధవారానికి మరింత పెరిగి 50 డిగ్రీ సెల్సియస్కు చేరుకునే అవకాశముందనే భయాందోళనలు నెలకొన్నాయి. 2009 ఏడాదిలోనూ ఇలాగే వడగాలుల ధాటికి 173 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నమోదైన వడగాలుల కారణంగా ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, కానీ సమీప అడవులు దహనమ య్యే ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. విక్టోరియా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం మెల్బోర్న్లోనూ వేడిమి అత్యధికమైంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ 34 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్కి వీడ్కోలు పలికాడు. 2008-09 సీజన్లో లిస్ట్-ఏ మ్యాచ్తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రిచర్డ్సన్, 2013లో శ్రీలంకతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి 25 వన్డేలు, 36 టీ20లు ఆడి మొత్తంగా 84 వికెట్లు పడగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా తమ తొలి టీ20 వరల్డ్కప్ టైటిల్ సాధించడంతో రిచర్డ్సన్ భాగస్వామ్యం ప్రత్యేకంగా గుర్తించదగ్గది.అంతర్జాతీయ క్రికెట్తో పోలిస్తే రిచర్డ్సన్కు బిగ్బాష్ లీగ్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్ ప్రతి ఎడిషన్లోనూ ఆడిన అతి తక్కువ మంది (అరుగురు) ఆటగాళ్లలో రిచర్డ్సన్ ఒకరు. మొదట ఆడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆరు సీజన్లు ఆడిన ఆయన, 2017-18లో మెల్బోర్న్ రెనెగేడ్స్కి మారి ఎనిమిది సీజన్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చివరిగా 2025-26 సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాడు. బీబీఎల్ కెరీర్లో 142 వికెట్లు తీసిన రిచర్డ్సన్.. లీగ్ చరిత్రలో ఐదో అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు.రిచర్డ్సన్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు, బిగ్బాష్ లీగ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీ లీగ్ల్లో ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ ఆయన తన ప్రతిభను (15 మ్యాచ్ల్లో 19 వికెట్లు) చూపించాడు. డెత్ ఓవర్లలో తన వేరియేషన్స్తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్గా రిచర్డ్సన్కు మంచి గుర్తింపు ఉంది. -
సిడ్నీలో దారుణం.. షార్క్ దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. షార్క్ దాడిలో నికో ఆంటిక్ అనే 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గత ఆదివారం నికో తన స్నేహితులతో కలిసి సిడ్నీలోని వాక్లూస్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ రాళ్లపై నీటిలోకి దూకుతూ సరదాగా ఆడుతుండగా.. అకస్మాత్తుగా ఒక షార్క్ అతడిపై దాడి చేసింది. వెంటనే ఆ పిల్లాడిని నీటిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడిలో నికో రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నికో ఆంటిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ విషయాన్ని బాలుడి కుటంబ సభ్యులు ధ్రువీకరించారు."మా కుమారుడు నికో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా ఉత్సాహంగా ఉండేవాడు. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అతడు మాతో గడిపిన క్షణాలను మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం" అని నికో తల్లిదండ్రులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.గత రెండు రోజుల్లో నాలుగు షార్క్ దాడులు జరగడంతో సిడ్నీ సహా పలు తీరప్రాంతాల్లో చాలా వరకు బీచ్లను అధికారులు మూసివేశారు. భారీ వర్షాల వల్ల సముద్రపు నీరు మురికిగా మారడం వల్ల షార్క్లు తీరానికి ఎక్కువగా వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్, జపాన్పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్ (ఏ) మ్యాచ్లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం విజయాన్ని సొంతం చేసింది.విండ్హోక్లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. పేసర్ విల్ బైరోమ్ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్కు జతగా ఛార్లెస్ లచ్మండ్ (5-1-19-2), కేసీ బార్టన్ (4-0-13-2), హేడెన్ ష్కిల్లర్ (3-0-11-1) కూడా రాణించారు. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్ దిమంత మహావితన డకౌట్ కాగా.. మరో ఓపెనర్ విరాన్ చముదిత, దుల్నిత్ సిగెరా, ఆడమ్ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్ విమత్ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్ రింసర, కుగథాస్ మథులాన్ తలో 6 పరుగులు చేశారు. కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్ స్టేజీ మ్యాచ్ల్లో జపాన్, ఐర్లాండ్పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. -
ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం రేగింది. న్యూసౌత్ వేల్స్లోని లేక్ కార్గెల్లిగో పట్టణంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. బాండీ బీచ్ దాడి ఘటన జరిగిన నెల రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 1500 మంది జనాభా ఉన్న ఈ పట్టణంలోని వాల్కర్ వీధిలోని ఒక నివాస ప్రాంతంలో సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సెంట్రల్ వెస్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ అధికారులు వెల్లడించారు.తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగులు పరారీలో ఉండటంతో.. ప్రజలను ఆ ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్నందున స్థానికులు ఇళ్లలోనే ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే సెంట్రల్ వెస్ట్ పోలీస్, క్రైమ్ స్టాపర్స్ (1800 333 000) నంబర్కు కాల్ చేయాలని కోరారు. UPDATE: Police have commenced an investigation following reports of a shooting where three people have died at Lake Cargelligo this afternoon.About 4.40pm, emergency services were called to Walker Street, near Yelkin Street, Lake Cargelligo, following reports of a shooting.… https://t.co/XCvCpkL9Qz— NSW Police Force (@nswpolice) January 22, 2026 -
చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 వరల్డ్కప్ 2026లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ విల్ మలాజ్చుక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న (జనవరి 20) గ్రూప్-ఏలో భాగంగా జపాన్తో జరిగిన మ్యాచ్లో కేవలం 51 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా అండర్-19 వరల్డ్కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు.గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ పేరిట ఉండేది. ఖాసిమ్ 2022 ఎడిషన్లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఖాసిమ్ తర్వాత మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాడు రాజ్ బవా పేరిట ఉంది. బవా 2022 ఎడిషన్లోనే ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.మలాజ్చుక్ విషయానికొస్తే.. ఇతగాడు జపాన్పై మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్ పసికూన జపాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్కు ఇది వరసగా రెండో విజయం. అంతకుముందు తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను కూడా 8 వికెట్ల తేడాతోనే చిత్తు చేసింది.ఆసీస్తో మ్యాచ్లో జపాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ హ్యూగో కెల్లీ (79 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో జపాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెల్లీకి నిహార్ పర్మార్ (33), చార్లెస్ హింజ్ (24), హర హింజ్ (29) ఓ మోస్తరు సహాకారాలను అందించారు. ఆసీస్ బౌలర్లలో కూరే 3, విల్ బైరోమ్ 2, ఆర్యన్ శర్మ, కేసీ బార్టన్ తలో వికెట్ తీశారు.అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. మలాజ్చుక్ మెరుపు సెంచరీకి మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ (60 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ తోడవ్వడంతో ఆసీస్ 29.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఆసీస్ దిగ్గజ క్రికెటర్ కొడుకుకు ప్రతిష్టాత్మక అవార్డు
ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డారెన్ లెహ్మన్ కొడుకు జేక్ లెహ్మన్కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ 33 ఏళ్ల ఎడమ చేతి బ్యాటర్ను 2024-25 సీజన్కు గానూ మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జేక్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాక ఈ అవార్డు లభించింది.ఆసీస్ దేశవాలీ క్రికెట్లో సుదీర్ఘంగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు రాకపోవడంతో జేక్ గత నెలలోనే తన బ్రిటిష్ పాస్పోర్ట్ ఆధారంగా ఇంగ్లండ్కు వలస వెళ్లాడు. అక్కడ అతను హ్యాంప్షైర్ కౌంటీతో లోకల్ ప్లేయర్ కేటగిరీలో రెండు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నాడు. ఓ ఆటగాడు ఇతర దేశం తరఫున లోకల్ కేటగిరీలో అవకాశం దక్కించుకుంటే, తన సొంత దేశానికి ఆడే అర్హత కోల్పోతాడు. జేక్ విషయంలో ఇదే జరిగింది. జేక్ హ్యాంప్షైర్తో ఒప్పందం చేసుకోవడం వల్ల ఆస్ట్రేలియాకు ఆడాలన్న తన కలను చెరిపేసుకున్నాడు.షెఫీల్డ్ షీల్డ్లో రికార్డు ప్రదర్శన జేక్ 2024-25 షెఫీల్డ్ షీల్డ్ సీజన్లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున రికార్డు ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్ల్లో నాలుగు వరుస సెంచరీల సాయంతో 44.11 సగటున 750 పరుగులు చేశాడు. ఆ సీజన్ ఫైనల్లో జేక్ చేసిన సెంచరీ దక్షిణ ఆస్ట్రేలియాకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రెడ్బాల్ టైటిల్ను అందించింది.తండ్రి వారసత్వం జేక్ తండ్రి డారెన్ లెహ్మన్ తన జమానాలో మూడుసార్లు డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడు జేక్ కూడా ఆ అవార్డును తొలిసారి గెలుచుకుని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఈ అవార్డుకు ఎంపికైన తర్వాత జేక్ మాట్లాడుతూ .. ఇది నాకు షాక్లా అనిపించింది. గత 18 నెలలుగా మంచి క్రికెట్ ఆడుతున్నాను. సహచరులు, ప్రత్యర్థులు ఇచ్చిన గుర్తింపు ప్రత్యేకమైనది. ఈ అవార్డు నాకు గౌరవమని అన్నాడు. ఆస్ట్రేలియాకు ఆడటం నా కలజేక్ ఆసీస్ తరఫున ఆడే అవకాశాల కోసం సుదీర్ఘంగా ఎదురుచూసి గత నెలలోనే ఇంగ్లండ్ కౌంటీ హ్యాంప్షైర్తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు ఆడటం నా కల. కానీ అది సాధ్యం కాలేదు. అయినా 12 సంవత్సరాలుగా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సమయం ఆసన్నమైందని అన్నాడు. -
ఎన్నారై సుప్రియ కేసులో బిగ్ ట్విస్ట్
ఆస్ట్రేలియా అడిలైడ్లో జరిగిన ఎన్నారై మహిళ సుప్రియ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె భర్త విక్రాంత్ ఠాకూర్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఉద్దేశపూర్వకంగా తన భార్యను చంపలేదని.. తన కొడుకు కోసమైనా తనను క్షమించి వదిలేయాలని కోర్టును బతిమిలాడుకుంటున్నాడు.భారత మూలాలు ఉన్న విక్రాంత్ ఠాకూర్(42), భార్య కొడుకుతో అడిలైడ్లో స్థిరపడ్డాడు. గతేడాది డిసెంబర్ 21వ తేదీన తన నివాసంలో సుప్రియ(36) అపస్మారక స్థితిలో కనిపించింది. ఎమర్జెన్సీ టీం ప్రయత్నాలు చేసినా ఆమెను కాపాడలేకపోయింది. ఈ ఘటనలో అనుమానాల కింద భర్తను అప్పటికప్పుడు అదుపులోకి తీసుకన్నారు స్థానిక పోలీసులు. ఆపై హత్య కేసు నమోదు చేసి స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే.. అదే ఏడాది(డిసెంబర్ 23) జరిగిన కోర్టు విచారణలో విక్రాంత్ నోరు విప్పలేదు. బెయిల్ కోసం కూడా అప్లై చేసుకోలేదు. దీంతో భార్యను అతనే చంపి ఉంటాడని అంతా భావించారు. ఆ సమయంలో డీఎన్ఏ రిపోర్ట్స్, పోస్ట్మార్టం నివేదిక వంటి ఆధారాలు సిద్ధం కావడానికి సమయం కావాలని ప్రాసిక్యూటర్లు కోరారు. దీంతో విచారణ వాయిదా పడింది. తాజాగా జనవరి 14న మరోసారి విచారణ జరగ్గా.. తన భార్యను తాను కావాలని హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది అనుకోకుండా జరిగిన మరణం(manslaughter). నేనేమీ కావాలని ఆమెను చంపలేదు అంటూ వాదించాడు. తన బిడ్డ కోసం తనను వదిలేయాలంటూ వేడుకున్నాడు. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది కోర్టు. విక్రాంత్-సుప్రియ కొడుకు సంరక్షణను అక్కడి ఇండియన్ కమ్యూనిటీ చూసుకుంటోంది. ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. "సుప్రియా తన కొడుకు భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసింది. నర్సుగా మారి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఆమెకు ఉండేది. ఆమె ఆకస్మిక మరణం కుమారుడి జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసింది" అని ఆ పేజీలో పేర్కొన్నారు. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్
త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్లకు దూరమవుతున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. కమిన్స్ మూడు లేదా నాలుగో మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడని ప్రకటించాడు. కమిన్స్ వేగంగా పురోగతి సాధిస్తే ప్రణాళికలు మారవచ్చని చెప్పుకొచ్చాడు. కమిన్స్ గత కొంతకాలంగా లంబర్ బోన్ స్ట్రెస్ ఇంజరీతో బాధపడుతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ ఆడినా, గాయం తిరగబెట్టడంతో ఆతర్వాతి మ్యాచ్లకు దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే అవకాశం లేకపోవడంతో, వరల్డ్కప్ తొలి రెండు మ్యాచ్లు సహా, దానికి ముందు పాకిస్తాన్లో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా అందుబాటులో ఉండడంలేదు. పాక్తో సిరీస్కు కమిన్స్ సహా నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ హేజిల్వుడ్ కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రపంచకప్ జట్టులో ఉన్న వీరికి విశ్రాంతినిచ్చారు. ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్లకైనా కమిన్స్ అందుబాటులో లేకపోవడం ఆస్ట్రేలియాకు పెద్ద లోటే అవుతుంది. అతని అనుభవం, డెత్ ఓవర్లలో బౌలింగ్ నైపుణ్యం జట్టుకు చాలా కీలకం. అసలే ఆసీస్ ప్రపంచకప్ జట్టు అంతంతమాత్రంగా ఉంది. కమిన్స్ లాంటి ఆటగాడు ఒక్క మ్యాచ్కు దూరమైనా, ఆ జట్టు టైటిల్ గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచకప్లో ఆసీస్ ప్రయాణం ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో మ్యాచ్తో మొదలవుతుంది. ఆసీస్ రెండో మ్యాచ్ జింబాబ్వేతో ఆడనుంది. ఈ మెగా టోర్నీలో ఆసీస్..ఒమన్, ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక జట్లతో గ్రూప్-బిలో ఉంది. ప్రపంచకప్కు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా -
గుండెలపై పడుకున్న పాము.. తర్వాత ఏమైందంటే?
పాము ఈ పేరు వింటే చాలు చాలామందికి గుండె గుబేల్ మంటుంది. అవి ఇంట్లోకి వచ్చినా.. వాటిని చుసినా భయంతో పరుగెత్తుతారు. ఇక పామే మనపై పడుకుంటే.. అప్పుడు పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకొండి.. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని ఓ మహిళకు జరిగింది. దీంతో ఆమె గుండె ఆగినంత పనైందని ఆ సమయంలోనే తన అనుభవాల్ని మీడియాతో పంచుకుంది.బ్రిస్సెన్స్కు చెందిన ఓ దంపతులు యథావిధిగా రాత్రి పడుకున్నారు. ఉదయం అవడంతో భర్త నిద్రలేచి లైటు వేశారు. దీంతో నిద్రలేచిన మహిళ కళ్లు తెరిచేసరికి గుండె ఆగినంత పనైంది. తన ఛాతిపై 2.5 మీటర్ల పొడుగైన పాము పడుకొని ఉంది. దీంతో అప్పుడు తనకు కలిగిన భావనను ఆ మహిళ మాటల్లో "నాకళ్లు తెరిచేసరికి నాపైన పెద్ద పాము పడుకొని ఉంది. భయంతో నాకు ఏం చేయాలో తోచలేదు. వెనక నుంచి నాభర్త కదవలవద్దు అన్నారు. దీంతో భయంభయంగా అలానే ఉన్నాను" అని చెప్పారు.దీంతో వెంటనే అక్కడి నుండి వెళ్లిన ఆమె భర్త పాములను పట్టే వ్యక్తిని తీసుకవచ్చారు. అతను ఆ మహిళకు ఏం ప్రమాదం కాకుండా ఆ సర్ఫాన్ని తీసి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనను తలుచుకుంటే తనకు ఎంతో భయంగా ఉంటుందని ఆ మహిళ తెలిపింది. అయితే ఆ పాము విషపూరితమైనది కాదని వన్యప్రాణి అధికారులు తెలిపారు. కాగా చలికాలం కావడంతో వెచ్చదనం కోసం పాములు ఇండ్లలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఇంటికి ఎటువంటి రంద్రాలు లేకుండా ఉంచడంతో పాటు తలుపులు వేసి ఉంచడం ద్వారా పాములు రావడాన్ని కొంతమేర నియంత్రించవచ్చని పేర్కొన్నారు. సరైన శిక్షణ లేకుండా పాములను పట్టుకోవడం చేయవద్దని అలా చేయడం ద్వారా అవి కరిచే ప్రమాదముందని అధికారులు తెలిపారు. -
టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్కు ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆసీస్-పాక్ మూడు టీ20లు ఆడనున్నాయి. ప్రపంచకప్కు సన్నాహకంగా ఇరు జట్లకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు జనవరి 28న లాహోర్కు చేరుకుంటుంది. జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రపంచకప్లో పాల్గొనే ఆసీస్ జట్టే ఈ సిరీస్లోనూ కొనసాగనుంది. ప్రపంచకప్ కోసం పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది.ఆస్ట్రేలియా జట్టు 2022 మార్చిలో చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది. ఆ పర్యటనలో టెస్ట్, టీ20 సిరీస్లను ఆసీస్ గెలుచుకోగా.. వన్డే సిరీస్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 8 వరకు సాగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీపడుతున్నాయి. పాకిస్తాన్.. టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో ఉండగా.. ఆ జట్టు ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. ఆస్ట్రేలియా గ్రూప్-బిలో ఉంది. పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. -
భారతీయ విద్యార్థులకు షాక్.. ఆస్ట్రేలియా వీసా నియమాలలో కీలక మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో చదువు కొనసాగించాలని కలలుకంటున్న భారతీయ విద్యార్థులకు మరో పెద్ద షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ భారతదేశాన్ని ‘అత్యధిక రిస్క్’ కేటగిరీ (Assessment Level 3 – AL3)లో ఉంచింది. ప్రధాన మార్పులు - భారతదేశం AL3 కేటగిరీకి: ఇంతవరకు AL2లో ఉన్న భారత్ ఇప్పుడు AL3లోకి పడిపోయింది. - డాక్యుమెంటరీ అవసరాలు: విద్యార్థులు తమ ఆర్థిక స్థితి, విద్యా అర్హతలకు మరింత బలమైన రుజువులు సమర్పించాలి. - బ్యాంక్ స్టేట్మెంట్లు: ఆర్థిక స్థితి నిరూపణ కోసం నేరుగా బ్యాంక్ ధృవీకరణ అవసరం. - డిగ్రీల ధృవీకరణ: విద్యా అర్హతలు సంబంధిత సంస్థల నుండి నేరుగా ధృవీకరించబడతాయి. భారతదేశం ఆస్ట్రేలియాకు అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి వనరులలో ఒకటి. ప్రస్తుతం 1.4 లక్షల మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. ఈ మార్పులు 2026 జనవరి 8 నుండి అమల్లోకి వస్తాయి. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా అదే ‘హై రిస్క్’ విభాగంలో ఉంచబడ్డాయి. ఇటీవలి కాలంలో భారతదేశంలో నకిలీ డిగ్రీ రాకెట్లు, వీసా మోసం కేసులు పెరగడం వల్ల ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల దక్షిణాసియా విద్యార్థులకు ఆస్ట్రేలియాలో ప్రవేశం మరింత కఠినతరం అవుతుంది. -
ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్..
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు జోష్ హాజిల్వుడ్, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్ గాయాలతో బాధపడుతుండగా.. ఇప్పుడు ఈ జాబితాలో స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ చేరాడు. బిగ్ బాష్ లీగ్ 2025-26లో భాగంగా మంగళవారం అడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో స్టోయినిష్( మెల్బోర్న్ స్టార్స్) గాయపడ్డాడు.ఏమి జరిగిందంటే?ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ 20 బంతుల్లో 23 పరుగులు చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.అయితే విజయానికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో.. జేమీ ఓవర్టన్ వేసిన ఓ రకాసి బౌన్సర్ స్టోయినిస్ కుడి చేతి బొటనవేలుకు బలంగా తగిలింది. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిన మార్కస్.. ఫిజియో సూచనతో 'రిటైర్డ్ అవుట్'గా వెనుదిరిగాడు.అతడిని మ్యాచ్ అనంతరం స్కాన్కు తరలించారు. అతడి గాయంపై అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికి మెగా టోర్నీకి ముందు స్టార్ ప్లేయర్లు గాయపడడం ఆసీస్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.టీ20 ప్రపంచకప్-2026కు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాచదవండి: 'భారత్లో ఆడే ప్రసక్తే లేదు'.. మారని బంగ్లాదేశ్ వైఖరి -
స్టీవ్ స్మిత్కు సంబంధించి షాకింగ్ న్యూస్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు సంబంధించి షాకింగ్ వార్త తెలుస్తుంది. త్వరలో అతను టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతానన్న సంకేతాలు ఇచ్చాడు. కమిన్స్ గైర్హాజరీలో తాత్కాలిక సారధిగా వ్యవహరించి స్వదేశంలో యాషెస్ సిరీస్ (4-1) గెలిచిన అనంతరం స్టీవ్ తన భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఫాక్స్ టీవీతో మాట్లాడతూ ఇలా అన్నాడు. స్వదేశంలో మరోసారి యాషెస్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇదే సిరీస్ను ఇప్పటివరకు ఇంగ్లండ్లో గెలవలేకపోయాను. అది సాధించాలని ఉంది. కానీ, వచ్చే ఏడాది (2027) అక్కడ ఉంటానో లేదో తెలీదంటూ పరోక్షంగా తన రిటైర్మెంట్పై సంకేతాలు పంపాడు. స్టీవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ సర్కిల్స్లో దుమారం రేపుతున్నాయి. స్టీవ్ టెస్ట్ ప్రస్తానంపై మరో రెండు, మూడేళ్లు ఆశలు పెట్టుకున్న ఆసీస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. స్టీవ్ రిటైర్మెంట్ ఇప్పట్లో ఆలోచన పెట్టుకోవద్దంటూ ఫ్యాన్స్ నెట్టింట సందేశాలు పంపుతున్నారు. మొత్తంగా స్టీవ్ ఎడిసోడ్ ఆసీస్ అభిమానులకు యాషెస్ గెలిచామన్న సంతోషాన్ని మిగలకుండా చేస్తుంది.కాగా, స్వదేశంలో యాషెస్ సిరీస్ను 4-1 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్పై మరోసారి ఆధిపత్యాన్ని చాటింది. ఈ సిరీస్లో ఆసీస్ ఇంగ్లండ్పై అన్ని విభాగాల్లో పైచేయి సాధించి తిరుగులేని జట్టుగా నిలిచింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా, ఉన్న వాళ్లతో స్టీవ్ అద్భుతంగా జట్టును ముందుండి నడిపించాడు. ట్రవిస్ హెడ్, మిచెల్ స్టార్క్, అలెక్స్ క్యారీ ఈ సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్టీవ్ స్వయంగా కూడా రాణించాడు.యాషెస్ ట్రోఫీ అందుకున్న తర్వాత స్టీవ్ తమ రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ చేతికి దాన్ని అందించి అభిమానుల హృదయాలను గెలిచాడు. సిరీస్ ఆధ్యాంతం రాణించిన స్టార్క్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్.. ఇవాళ ముగిసిన చివరి టెస్ట్లో సత్తా చాటిన ట్రవిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు లభించాయి.ఈ సిరీస్తో ఆసీస్ తమ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరి సేవలు కోల్పోనుంది. వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సిరీస్లో ఆసీస్ హాజిల్వుడ్ (5 టెస్ట్లు), కమిన్స్ (4 టెస్ట్లు), నాథన్ లియోన్ (3 టెస్ట్లు), స్టీవ్ స్మిత్ (ఒక టెస్ట్) సేవలు వినియోగించుకోకుండానే ఇంగ్లండ్ను చిత్తు చేయడం విశేషం. -
చివరి టెస్ట్లోనూ గెలుపు.. ఆసీస్దే యాషెస్
స్వదేశంలో జరిగిన 2025-26 యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో కైసవం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఇవాళ (జనవరి 8) ముగిసిన ఐదో టెస్ట్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.ఛేదనలో తొలుత తడబడినప్పటికీ అంతిమంగా గెలుపునందుకుంది. హెడ్ (29), వెదరాల్డ్ (34), లబూషేన్ (37), స్టీవ్ స్మిత్ (12), ఖ్వాజా (6) ఔట్ కాగా.. క్యారీ (16 నాటౌట్), గ్రీన్ (22 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో టంగ్ 3 వికెట్లు తీసి ఆసీస్పై ఒత్తిడి తెచ్చాడు. జాక్స్ ఓ వికెట్ పడగొట్టాడు.అంతకుముందు (ఐదో రోజే) ఇంగ్లండ్ ఓవర్నైట్ స్కోర్కు మరో 40 పరుగులు జోడించి 342 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను ముగించింది. నాలుగో రోజే సెంచరీ చేసిన జేకబ్ బేతెల్ 150 పరుగులు పూర్తి కాగానే ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, వెబ్స్టర్ తలో 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బేశారు.దీనికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 567 పరుగులు చేసింది. హెడ్ (163), స్మిత్ (138) సెంచరీలతో కదంతొక్కారు. ఆఖర్లో వెబ్స్టర్ (71 నాటౌట్) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, టంగ్ తలో 3, స్టోక్స్ 2, జాక్స్, బేతెల్ చెరో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. జో రూట్ (160) సెంచరీతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు.కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మాత్రమే గెలవగా.. ఆసీస్ మిగతా నాలుగు టెస్ట్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
35 ఏళ్ల నాటి ’అండర్వేర్’ కేసు మిస్టరీ..
అది 1990వ సంవత్సరం.. తిరువనంతపురం ఎయిర్పోర్ట్. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ సాల్వెటర్ సెర్వెల్లి అనే వ్యక్తి 61.5 గ్రాముల హషీష్ తో పట్టుబడ్డాడు. తన అండర్వేర్ లో ప్రత్యేకంగా కుట్టిన రహస్య జేబులో డ్రగ్స్ దాచి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపో యాడు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి.. నిందితుడికి శిక్ష ఖాయమని అంతా భావించారు. కానీ, అక్కడే సినిమా కథకు తీసిపోని మలుపు తిరిగింది.కోర్టుకే టోకరా..ఈ కేసులో నిందితుడి తరపున జూనియర్ లాయర్గా ఉన్న వ్యక్తి మరెవరో కాదు.. కేరళ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆంటోనీ రాజు. 1991లో హైకోర్టులో అప్పీల్ నడుస్తున్నప్పుడు డిఫెన్స్ లాయర్లు ఒక వింత వాదన తెరపైకి తెచ్చారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న అండర్వేర్ నిందితుడిది కాదని వాదించారు. ఆశ్చర్యకరంగా, నిందితుడు కోర్టులోనే ఆ అండర్వేర్ను వేసుకోవడానికి ప్రయత్నించగా.. అది అతనికి అస్సలు సరిపోలేదు.. అది చాలా చిన్నదిగా ఉంది. దీంతో పోలీసులు తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించారని నమ్మిన కోర్టు, సెర్వెల్లిని నిర్దోషిగా విడుదల చేసింది. ఇంకేముంది.. అతను ఆస్ట్రేలియాకు చెక్కేశాడు.ఆస్ట్రేలియా జైల్లో లీకైన సీక్రెట్కేసు ముగిసిపోయిందని అంతా అనుకుంటున్న వేళ.. కొన్నేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఒక హత్య కేసులో సెర్వెల్లి జైలుకు వెళ్లాడు. అక్కడ తోటి ఖైదీ వెస్లీ జాన్పాల్తో మాట్లాడుతూ.. ‘ఇండియాలో డ్రగ్స్ కేసులో నేను ఎలా తప్పించుకున్నానో తెలుసా? మా కుటుంబం అక్కడి లాయర్లకు లంచం ఇచ్చింది. అసలు అండర్వేర్ స్థానంలో చిన్న సైజు అండర్వేర్ను పెట్టించింది’.. అని మురిసిపో తూ రహస్యం ఊదేశాడు. ఆ ఖైదీ ఈ విష యాన్ని ఆస్ట్రేలియా పోలీసులకు చెప్పడం.. అది ఇంటర్పోల్ ద్వారా భారత్కు చేరడంతో ఆంటోనీ రాజు పాపం పండింది.ఫోరెన్సిక్ రిపోర్ట్.. బట్టబయలైన కుట్రకేసును పునర్విచారించిన దర్యాప్తు బృందం దిమ్మతిరిగే నిజాలు బయటపెట్టింది. తిరువ నంతపురం కోర్టు క్లర్క్ను లాయర్ ఆంటోనీ రాజు బుట్టలో వేసుకున్నారు. సాక్ష్యంగా ఉన్న అండర్వేర్ను ‘పొరపాటున తీసుకున్నాను’.. అని చెప్పి 4 నెలలు తన వద్దే ఉంచుకున్నారు. ఒక టైలర్ కంటే అద్భుతంగా, మెషీన్ కుట్లు విప్పేసి, చేతి కుట్లు వేసి దాని పరిమాణాన్ని తగ్గించేశారు. కంపెనీ తయారీ లేబుల్ను కట్ చేసి మళ్లీ అతికించారు. ఫోరెన్సిక్ నిపుణులు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే తప్ప ఈ తిమ్మినిబమ్మి వ్యవహారం బయటపడలేదు.పాపం పండింది..మూడు దశాబ్దాల పాటు ఈ కేసు ఎన్నో మలు పులు తిరిగింది. మధ్యలో ఆంటోనీ రాజు రాజకీయాల్లో ఎదిగారు, మంత్రి అయ్యారు. కానీ సుప్రీంకోర్టు జోక్యంతో విచారణ వేగవంతమైంది. 1990లో కోర్టు వరండాలో రాజు అన్నారట.. ‘మేము ఈ కేసులో ఒక బాంబు పెట్టాం, అది ట్రయల్ అయ్యాక పేలుతుంది’.. అని. సరిగ్గా 35 ఏళ్ల తర్వాత ఆ బాంబు ఆయన పదవినే బలి తీసుకుంది. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఆంటోనీ రాజును దోషిగా తేలుస్తూ కోర్టు జనవరి 3న తీర్పు చెప్పింది. ఆంటోనీ రాజుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యారు. ఈ మేరకు జనవరి 5న అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సాక్ష్యాన్ని మార్చడానికి ఒక లాయర్ వేసిన ‘కుట్టు’.. ఆయన రాజకీయ జీవితాన్నే నిలువునా కాటేసింది. -
ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం
సిడ్నీ: సొంతగడ్డపై జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజృంభిస్తున్నారు. ఫలితంగా ఆఖరిదైన ఐదో టెస్టులో ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే 3–1తో చేజిక్కించుకున్న కంగరూలు ఆఖరి పోరులో పరుగుల వరద పారిస్తున్నారు. ఓవర్నైట్ స్కోరు 166/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆ్రస్టేలియా జట్టు... మంగళవారం ఆట ముగిసే సమయానికి 124 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది.ఓపెనర్ ట్రవిస్ హెడ్ (166 బంతుల్లో 163; 24 ఫోర్లు; 1 సిక్స్), కెపె్టన్ స్టీవ్ స్మిత్ (205 బంతుల్లో 129 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో కదం తొక్కారు. కామెరాన్ గ్రీన్ (37; 3 ఫోర్లు, 1 సిక్స్), బ్యూ వెబ్స్టర్ (58 బంతుల్లో 42 బ్యాటింగ్; 4 ఫోర్లు) కూడా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3, స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టారు. చేతిలో 3 వికెట్లు ఉన్న ఆసీస్ జట్టు... ఇంగ్లండ్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్మిత్తో పాటు వెబ్స్టర్ క్రీజులో ఉన్నాడు. స్మిత్ సూపర్ సెంచరీ... శతకానికి 9 పరుగుల దూరంలో మంగళవారం ఇన్నింగ్స్ కొనసాగించిన హెడ్... 105 బంతుల్లో మూడంకెల మార్క్ అందుకున్నాడు. ఈ సిరీస్లో హెడ్కిది మూడో సెంచరీ కావడం విశేషం. నైట్ వాచ్మన్ నెసెర్ (90 బంతుల్లో 24; 4 ఫోర్లు) అతడికి చక్కటి సహకారం అందించడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. మూడో వికెట్కు నెసెర్తో కలిసి హెడ్ 72 పరుగులు జోడించాడు. అతడు అవుటయ్యాక స్మిత్తోనూ అదే లయ కొనసాగించాడు. నాలుగో వికెట్కు 54 పరుగులు జోడించిన అనంతరం హెడ్ అవుట్ కాగా... కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా (49 బంతుల్లో 17; 2 ఫోర్లు) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అలెక్స్ కేరీ (16) విఫలమయ్యాడు.అయితే చివర్లో గ్రీన్, వెబ్స్టర్ అండతో స్మిత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు పెద్దగా రాణించలేకపోయిన స్మిత్... చివరి మ్యాచ్లో తనదైన ఆటతీరుతో చెలరేగాడు. ఈ క్రమంలో 166 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యాషెస్లో అతడికిది 13వ సెంచరీ కాగా... సిడ్నీ మైదానంలో ఐదోది. ఈ ఇన్నింగ్స్లో ఆ్రస్టేలియా ఏడు వికెట్లకు అర్ధ శతక భాగస్వామ్యాలు నమోదు చేసింది. ‘భాగస్వామ్యాలు బాగా కుదిరాయి. అందుకే సాఫీగా పరుగులు రాబట్టగలిగాం. తొలి ఇన్నింగ్స్లో రెండొందల పరుగుల ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వికెట్ నెమ్మదిగా మారుతోంది. ఇది నా సొంత మైదానం. ఇక్కడ బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా’ అని స్మిత్ అన్నాడు.⇒ 13 ‘యాషెస్’లో స్టీవ్ స్మిత్ సెంచరీల సంఖ్య. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో జాక్ హబ్స్ (12)ను అధిగమించి స్మిత్ రెండో స్థానానికి చేరాడు. డాన్ బ్రాడ్మన్ 19 శతకాలతో ‘టాప్’లో ఉన్నాడు.⇒ 37 టెస్టు క్రికెట్లో స్మిత్ సెంచరీల సంఖ్య. అత్యధిక శతకాలు చేసిన ప్లేయర్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (36)ను అధిగమించి ఆరో స్థానానికి ఎగబాకాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్వస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), జో రూట్ (41), కుమార సంగక్కర (38) ముందున్నారు.⇒3682 ‘యాషెస్’లో స్మిత్ చేసిన పరుగులు. బ్రాడ్మన్ (5028) అగ్ర స్థానంలో ఉండగా... స్మిత్ రెండో స్థానానికి చేరాడు. ⇒ 18 సారథిగా స్మిత్ సాధించిన శతకాలు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్ (25), విరాట్ కోహ్లి (20), రికీ పాంటింగ్ (19) ముందున్నారు. -
స్టీవ్ స్మిత్ అద్భుత శతకం.. పట్టు సాధించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో సెంచరీతో మెరిశాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో (తొలి ఇన్నింగ్స్) ఈ ఫీట్ను సాధించాడు. స్టీవ్కు టెస్ట్ల్లో ఇది 37వ శతకం. ఇంగ్లండ్పై 13వది. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 49వది.సిడ్నీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో స్టీవ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 129 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నాడు. అతనికి జతగా బ్యూ వెబ్స్టర్ (42) ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 518 పరుగులుగా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్పై ఆసీస్ 134 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ (163) కూడా సెంచరీతో కదంతొక్కాడు. మిగతా బ్యాటరల్లో వెదర్లాడ్ 21, లబూషేన్ 48, మైఖేల్ నెసర్ 24, కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా 17, అలెక్స్ క్యారీ 16, గ్రీన్ 37 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3, స్టోక్స్ 2, టంగ్, బేతెల్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులు చేసింది. జో రూట్ అద్భుత శతకంతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. -
డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న ట్రవిస్ హెడ్
యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ మరో శతకం బాదాడు. ఈ సిరీస్లో ఇప్పటికే మొదటి, మూడు టెస్ట్ల్లో సెంచరీలు చేసిన అతడు.. తాజాగా ఐదో టెస్ట్లోనూ శతక్కొట్టాడు. ఈ శతకాన్ని హెడ్ మెరుపు వేగంతో (105 బంతుల్లో) పూర్తి చేశాడు.- Hundred in 1st Test.- Hundred in 3rd Test.- Hundred in 5th Test.TRAVIS HEAD IS DOMINATING ALL FORMATS...!!! 🥶🔥 pic.twitter.com/SkgMekTNKQ— Johns. (@CricCrazyJohns) January 6, 2026సెంచరీతో ఆగిపోని హెడ్ మరో 47 బంతుల్లోనే 150 పరుగుల మార్కును కూడా తాకి డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. ఫలితంగా ఆసీస్ ఐదో టెస్ట్లో పైచేయి సాధించే దిశగా వెళ్తుంది. మూడో రోజు తొలి సెషన్ సమయానికి ఆసీస్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 268 పరుగులుగా ఉంది. హెడ్ 155, స్టీవ్ స్మిత్ 10 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆసీస్ ఇంకా 116 పరుగులు మత్రమే వెనుకపడి ఉంది.ఆసీస్ ఇన్నింగ్స్లో మిగతా బ్యాటర్లలో జేక్ వెదరాల్డ్ 21, లబూషేన్ 48, నైట్ వాచ్మన్ మైఖేల్ నెసర్ 24 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2, బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులు చేసింది. జో రూట్ అద్భుత శతకంతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.600 పరుగులకు చేరువలోప్రస్తుత యాషెస్ సిరీస్లో అరివీర భయంకర ఫామ్లో ఉన్న హెడ్ 9 ఇన్నింగ్స్ల్లో 599 పరుగులు చేసి, పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్లో ఇరు జట్ల తరఫున 500 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ హెడ్ ఒక్కడే. ఐదో టెస్ట్ మూడో రోజు లంచ్ సమయానికి హెడ్ 162 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. -
అద్భుతం.. కోమా నుంచి బయటపడిన ఆసీస్ దిగ్గజం
ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం డేమియన్ మార్టిన్ (54) ఆరోగ్య విషయంలో అద్భుతం జరిగింది. మెనినైటిస్తో బాధపడుతూ ఇటీవల కోమాలోకి వెళ్లిన ఆయన.. ఆశ్చర్యకర రీతిలో కోమా నుంచి బయటపడ్డాడు. మార్టిన్ ఆరోగ్యం అద్భుత రీతిలో పురోగతి సాధించింది. గంట గంటకు ఇంకా మెరుగవుతున్నాడని డాక్టర్లు చెప్పారు.మార్టిన్ ఆరోగ్యం ఆశ్చర్యకర రీతిలో పురోగతి సాధిస్తుండటాన్ని అతని స్నేహితుడు, ఆసీస్ దిగ్గజ వికెట్కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ 'మిరాకిల్'గా అభివర్ణించాడు.గిల్లీ మాటల్లో.. గత 48 గంటల్లో మార్టిన్ ఆరోగ్యం ఊహించని విధంగా మెరుగు పడింది. అతని ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కోమా నుంచి బయట పడిన తర్వాత మార్టిన్ అసాధారణంగా స్పందిస్తున్నాడు. స్పందించడమే కాకుండా చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. త్వరలోనే అతన్ని ICU నుంచి బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, గిల్క్రిస్ట్ గత కొన్ని రోజులుగా మార్టిన్ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.అభిమానులకు కృతజ్ఞతలుమార్టిన్ ఆశ్చర్యకర రీతిలో కోలుకుంటున్న నేపథ్యంలో అతని భార్య అమాండా తొలిసారి స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెట్ సమాజం చూపిన ప్రేమ, శ్రద్ధ వల్ల మార్టిన్ కోలుకుంటున్నాడని అంది. మార్టిన్ ఆరోగ్యం కుదుటపడటంలో అందరి పాత్ర ఉందని తెలిపింది. అభిమానుల సందేశాలు, మీడియా ద్వారా వచ్చిన మద్దతు మార్టిన్కు బలాన్నిచ్చాయని పేర్కొంది. కష్ట సమయంలో అండగా ఉన్న వారందకీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపింది.సొగసైన బ్యాటర్గా పేరొందిన డేమియన్ మార్టిన్ 1992 నుంచి 2006 మధ్యకాలంలో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 4406, 5346, 120 పరుగులు సాధించాడు.మార్టిన్ ఇటీవల జరిగిన బాక్సింగ్ డే టెస్టుకు ముందు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మార్టిన్ పూర్తిగా కోలుకునే క్రమంలో ఉన్నాడు. -
జో రూట్ 41వ శతకం
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్ట్ క్రికెట్లో మరో శతకం సాధించాడు. ఇది అతనికి 41వ శతకం. ఓవరాల్గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 60వ శతకం. ఈ సెంచరీతో రూట్ టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్, రూట్ చెరో 41 సెంచరీలు చేశారు. ఈ జాబితాలో సచిన్ (51), సంగక్కర (45) పాంటింగ్, రూట్ కంటే ముందున్నారు.ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ (84) ఒక్కడే రూట్ కంటే ముందున్నాడు. గత ఆరేళ్లలో రూట్కు ఇది 24 శతకం. ఇంత తక్కువ వ్యవధిలో ఓ ఆటగాడు ఇన్ని శతకాలు చేయడమనేది ఆషామాషీ విషయం కాదు.తాజా శతకంతో రూట్ తన సమకాలీకులు, ఫాబ్-4లో మిగతా ముగ్గురి కంటే మరింత ఎత్తుకు ఎదిగాడు. రూట్ ఖాతాలో 41 సెంచరీలు ఉండగా.. స్టీవ్ స్మిత్ 36, కేన్ విలియమ్సన్ 33, విరాట్ కోహ్లి 30 సెంచరీలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి టెస్ట్లో రూట్ తన 41వ శతకాన్ని సాధించాడు. ఈ సిరీస్కు ముందు రూట్కు ఆసీస్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా లేదు. ఇదే సిరీస్లోనే ఆసీస్ గడ్డపై తన తొలి సెంచరీ చేశాడు. తాజాగా ఆ సంఖ్యను రెండుకు పెంచుకున్నాడు. ఈ సిరీస్లో రూట్ 9 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీల సాయంతో 394 పరుగులు చేశాడు.టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (15921) కొనసాగుతుండగా.. అతనికి రూట్కు (13937) వ్యత్యాసం ఇంకా 1984 పరుగులు మాత్రమే.సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 242 బంతులు ఎదుర్కొన్న రూట్ 15 బౌండరీల సాయంతో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) సెంచరీకి చేరువలో ఔట్ కాగా.. జేమీ స్మిత్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మూడో సెషన్ సమయానికి వికెట నష్టపోకుండా 44 పరుగులు చేసింది. హెడ్ 24, వెదరాల్డ్ 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆసీస్ ఇంకా 340 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, 5 మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. -
ఇంగ్లండ్ 211/3
సిడ్నీ: ‘యాషెస్’ సిరీస్లో భాగంగా ఆ్రస్టేలియాతో మొదలైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ తొలి రోజు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. వెలుతురులేమి, వర్షం కారణంగా 45 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆదివారం మ్యాచ్ను నిలిపివేసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (92 బంతుల్లో 78 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (103 బంతుల్లో 72 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు పూర్తి చేసుకొని క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ను ఆరంభంలో ఆసీస్ బౌలర్లు దెబ్బ తీశారు. డకెట్ (27), క్రాలీ (16), బెతెల్ (10) తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో 57 పరుగులకే ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయింది. స్టార్క్, నెసర్, బోలండ్ తలా ఒక వికెట్ తీశారు. అయితే రూట్, బ్రూక్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు అభేద్యంగా 154 పరుగులు జోడించారు. స్పిన్కు అనుకూలమైన పిచ్పై ఆ్రస్టేలియా ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ను కూడా తుది జట్టులోకి తీసుకోకపోవడం చర్చనీయాంశం. 1888 తర్వాత ఆసీస్ ఇలా ఆడటం ఇదే మొదటిసారి కావడం విశేషం! -
కెరీర్ నిడివి 12 రోజులే.. అయితేనేం చరిత్రలో నిలిచిపోయాడు..!
క్రికెట్ చరిత్రలో మనకు తెలీని చాలా విషయాలు దాగి ఉన్నాయి. అందులో ఒకదాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. అది 1997. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్కు చెందిన కుడి చేతి వాటం మీడియం పేసర్ ఆంధొని స్టువర్ట్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన రోజు.ఈ బౌలర్ అంతర్జాతీయ కెరీర్ నిడివి కేవలం 12 రోజులు మాత్రమే. అయితేనేం, చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆంధొని తన స్వల్ప కెరీర్లో ఆడిన 3 వన్డేల్లోనే చారిత్రక ప్రదర్శనలు చేశాడు. అందులో ఒకటి తన మూడో మ్యాచ్లో పాకిస్తాన్పై హ్యాట్రిక్ నమోదు చేయడం.మెల్బోర్న్లో జరిగిన ఆ మ్యాచ్లో ఆంథొని హ్యాట్రిక్ (ఇజాజ్ అహ్మద్, మొహమ్మద్ వసీమ్, మొయిన్ ఖాన్) సహా 5 వికెట్ల ప్రదర్శన (5/26) నమోదు చేయడంతో పాటు రెండు క్యాచ్లు (ఇంజమామ్-ఉల్-హక్, షాహిద్ ఆఫ్రిది) కూడా పట్టుకొని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తద్వారా నాటికి ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ చరిత్రలో రెండో హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.Happy Birthday Anthony StuartTook an ODI hat-trick in his third ODI only but got injured and then never picked again to play for Australia.pic.twitter.com/TO3lDa9Spx— Cricketopia (@CricketopiaCom) January 2, 2026ఇక్కడ విశేషమేమింటంటే.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న మ్యాచే ఆంథొనికి కెరీర్లో చివరిది. సంచలన ప్రదర్శన నమోదు చేసిన తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. తొలుత గాయం, ఆతర్వాత పేలవ ఫామ్ కారణంగా ఒక్క అవకాశం కూడా రాలేదు.ఏడాది కాలంలోనే జాతీయ జట్టు సహా దేశవాలీ జట్టు నుంచి కూడా కనుమరుగైపోయాడు. అవకాశాల కోసం ఎదురుచూసీ, చూసీ చివరికి 2000 సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటగాడిగా కెరీర్ ముగిసాక ఆంధొని న్యూజిలాండ్లో కోచింగ్ కెరీర్ను ప్రారంభించాడు. ఆతర్వాత స్వదేశంలోనూ కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం 56వ పడిలో ఉన్న ఆంథొని తన దేశవాలీ జట్టు న్యూ సౌత్వేల్స్కే కోచింగ్ డెవలప్మెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు. 12 రోజుల్లోనే అంతర్జాతీయ కెరీర్ ముగిసినా, హ్యాట్రిక్ కారణంగా ఆంథొని చరిత్రలో నిలిచిపోయాడు. సంచలన ప్రదర్శన తర్వాత అతనికి మరో అవకాశం రాకపోవడం మరో విశేషం. చరిత్రలో ఇలాంటి ఎన్నో విశేషాలు ప్రస్తుత తరం క్రికెట్ అభిమానులకు తెలీవు. -
మన మూలమే బలం
‘రోమ్లో రోమన్లా ఉండాలి’ అంటారు. అలా అని మన మూలాలను మరచి పోనక్కర లేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన మూలాలే మన బలం. తెలంగాణ బిడ్డ అనితారెడ్డి భర్తతోపాటు ఆస్ట్రేలియాలో స్థిరపడింది. తన ప్రాంతీయ, సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే రాజకీయ రంగంలో అడుగు పెట్టింది. వాక్చాతుర్యం, సామాజిక సేవ, రాజకీయాలపై ఆమెకు ఉన్నఅవగాహనను పరిగణనలోకి తీసుకున్న లిబరల్ పార్టీ త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అనితారెడ్డి సౌత్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా బరిలో దిగనుంది.హైదరాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన అనితారెడ్డి అడిలైడ్లోని క్లెమ్జింగ్లో భర్తతో పాటు నివసిస్తోంది. ఎంబీఏ చేసిన అనితకు సీనియర్ మేనేజర్గా ప్రైవేట్ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఆమె భర్త ఆదిరెడ్డి యారా అక్కడ మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్. తన అత్తగారి ఊరైన హనుమకొండ జిల్లా రామకృష్ణాపూర్కు వచ్చిన అనితారెడ్డి యారాని ‘సాక్షి’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...ఏ ఇలా మొదలైంది...‘‘మేము 2006లో ఆస్ట్రేలియా వెళ్లాం. అడిలైడ్లో మా జీవితాన్ని ప్రారంభించాం. ఆ టైమ్లో అక్కడ భారతీయ జనాభా చాలా తక్కువ. 2007 ‘ఇండియన్ మేళా’ ఏర్పాటు చేశాం. తెలుగు అసోసియేషన్ (తాసా) ఏర్పాటు చేయాలనుకున్న రాజ్కిరణ్ అక్కడ మాకు పరిచయమయ్యారు. ఆయనతో పాటు మరో మూడునాలుగు కుటుంబాల వారితో పరిచయం అయింది. వారు తెలుగు అసోసియేషన్ పెడదామనే ఆలోచనలో ఉన్నారు. అసోసియేషన్ ఏర్పాటు అయ్యాక మా ఆయన కమిటీ మెంబర్గా చేరారు. తను ‘ఇండియన్ అసోసియేషన్ ’ ప్రెసిడెంట్ అయ్యాక పూర్తి సమయం కమ్యూనిటీ సర్వీస్లోనే ఉండేవారు. ఆ సమావేశాలు మా ఇంట్లోనే జరిగేవి.ఏ ఆస్ట్రేలియా పార్లమెంట్లో తొలిసారిగా బతుకమ్మ!తెలుగు వాళ్లమంతా మన పండుగలు ముఖ్యంగా బతుకమ్మ, దసరా, సంక్రాంతి జరుపుకునేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ ’ ఏర్పాటు చేశాం. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగలపై బాగా దృష్టి పెట్టాను. 2020లో ‘అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్’కు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ఆ టైమ్లో పార్లమెంట్లో బతుకమ్మ ఆడాలన్న నా ప్రతిపాదనను మల్టీ కల్చరల్ మినిస్టర్ జోయ్ బెడిసన్ అంగీకరించారు. ఆ రకంగా ఆస్ట్రేలియా పార్లమెంట్లో మొదటిసారి బతుకమ్మ ఆడింది మేమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు జరుపుతోంది. సాధారణంగా పార్లమెంట్లోకి ఎవరినీ అనుమతించరు. కానీ, ఇప్పుడు దాదాపు 200 మంది మహిళలకు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీపావళి పండుగ రోజుల్లో ఆస్ట్రేలియన్ పార్లమెంట్ దీపతోరణాలతో వెలిగిపోతుంది. రాజకీయాల్లోకి తొలి అడుగుఅక్కడి తెలుగువాళ్లందరికీ ఏ సమస్య ఉన్నా మా ఇంటికే రావడం అలవాటు. అసోసియేషన్ లో పనిచేసిన అనుభవం ఉండడంతో రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాం. 2011 నుంచి లిబరల్ పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉంటున్నాం. 2021లో లిబరల్ పార్టీలో టోరెన్ ్స బ్రాంచ్ సభ్యత్వం తీసుకున్నాను. ఆ తరువాత టోరెన్ ్స ఎస్ఈసీ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ప్రస్తుతం రెండోవిడత ఆ పదవిలో కొనసాగుతున్నాను. 2022లో క్లెమ్జింగ్ వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాను. అప్పుడు అనిపించింది... ఇంతవరకు వచ్చాం. మళ్లీ ఎందుకు పోటీ చేయకూడదు అని. అప్పుడే ఎంపీగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నాను. టికెట్ ప్రకటనకు ముందు మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. గెలిస్తే ఏమి చేస్తావు? ఓడిపోతే ఎలా ఉంటావు? – మొదలైన ప్రశ్నలకు నిక్కచ్చిగా జవాబులు ఇచ్చాను. మార్చి 18న ఎన్నికలు జరగనున్నాయి.ఏ గెలిస్తే... ఇలా..యువత, మహిళా సాధికారత, నిరుద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతాను. లిబరల్ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తాను. సమాజానికి మేలు చేసే అంశాలపై అసెంబీల్లో మంచి నిర్ణయాలు తీసుకునే విధానాలకు మద్దతు ఇస్తాను. ప్రజల గొంతుగా ఉంటాను. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను’’ అని చెప్పారు అనితారెడ్డి.– వర్ధెల్లి లింగయ్య, సాక్షి, వరంగల్ -
మిచెల్ మార్ష్ సారథ్యంలో..
మెల్బోర్న్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగే ఆసీస్ బృందానికి మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ఉపఖండంలో వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో... జట్టు ఎంపికలో స్పిన్నర్లకు పెద్దపీట వేశారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న ప్యాట్ కమిన్స్, జోష్ హాజల్వుడ్, టిమ్ డేవిడ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వరల్డ్కప్ సమయానికి వీరు ఫిట్నెస్ సాధిస్తారని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు టి20 ప్రపంచకప్లలో కేవలం ఒక్క టోర్నీలో మాత్రమే ఆడని స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టి20లకు వీడ్కోలు పలకడంతో... కూపర్ కొనొల్లీకి జట్టులో చోటు దక్కింది. ఆసీస్ ఆడిన గత 12 టి20 మ్యాచ్ల్లో ఆడని కొనొల్లీ ఎంపిక ఒక్కటే ఆశ్యర్చ పరిచే నిర్ణయం! గ్రీన్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, మ్యాక్స్వెల్ రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఈ జట్టులో మార్పు చేర్పులకు ఈ నెల 31 వరకు ఐసీసీ అవకాశం కలి్పంచింది. ఐర్లాండ్, ఒమాన్, శ్రీలంక, జింబాబ్వేలతో కలిసి ఆ్రస్టేలియా గ్రూప్ ‘బి’లో పోటీ పడనుంది. వరల్డ్కప్లో భాగంగా ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో ఆసీస్ తొలి మ్యాచ్ఆడనుంది. ఆ తర్వాత 13న జింబాబ్వేతో, 16న శ్రీలంకతో, 20న ఒమాన్తో తలపడుతుంది. ఇప్పటి వరకు తొమ్మిది టి20 ప్రపంచ కప్లు జరగగా... అందులో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండేసి సార్లు ట్రోఫీ దక్కించుకున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఆ్రస్టేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. వరల్డ్కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్తో ఆ్రస్టేలియా మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడనుంది. ఆ్రస్టేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెపె్టన్), హెడ్, ఇన్గ్లిస్, జేవియర్, కూపర్ కొనొల్లీ, కమిన్స్, టిమ్ డేవిడ్, గ్రీన్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, నాథన్ ఎలీస్, హాజల్వుడ్, కునేమన్, షార్ట్, జంపా. -
ప్రపంచకప్కు ముందు ఆసీస్ కెప్టెన్ ఉగ్రరూపం
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఉగ్రరూపం దాల్చాడు. బిగ్ బాష్ లీగ్ 2025-26లో భాగంగా పెర్త్ స్కార్చర్స్కు ఆడుతూ హోబర్ట్ హరికేన్స్పై విధ్వంసకర శతకం బాదాడు. 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని ఓవరాల్గా 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. బిగ్ బాష్ లీగ్లో మార్ష్కు ఇది రెండో శతకం. మార్ష్ తన తొలి బీబీఎల్ శతకాన్ని కూడా హోబర్ట్ హరికేన్స్పైనే చేశాడు.HUNDRED FOR MITCHELL MARSH IN BIG BASH...!!! 🥶- He is getting ready for the T20 World Cup. pic.twitter.com/Q7hXZpbgWK— Johns. (@CricCrazyJohns) January 1, 2026తాజా ప్రదర్శనలో భాగంగా మార్ష్ 2000 బీబీఎల్ పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. మిచెల్ ఓవెన్ బౌలింగ్లో బౌండరీ బాది ఈ ల్యాండ్ మార్క్ను చేరుకున్నాడు. 2011-12 ఎడిషన్లో అరంగేట్రం చేసిన మార్ష్.. బీబీఎల్ కెరీర్లో 76 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పైచిలుకు పరుగులు చేశాడు.తాజా మ్యాచ్లో మార్ష్తో పాటు ఆరోన్ హార్డీ కూడా చెలరేగాడు. హార్డీ కేవలం 43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 94 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హార్డీ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. వరుసగా 5 బౌండరీలు, సిక్సర్ బాదాడు. మార్ష్ సైతం 14వ ఓవర్లో చెలరేగిపోయాడు. వరుసగా 4,6,6,4 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్లో మార్ష్, హార్డీ కలిపి 20 బౌండరీలు, 10 సిక్సర్లు బాదారు. వీరి ఊచకోత ధాటికి స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది.మిగతా స్కార్చర్స్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ 16, కూపర్ కన్నోలీ 4, టర్నర్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 2, మిచెల్ ఓవెన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో హరికేన్స్ తడబడుతుంది. 9 ఓవర్ల తర్వాత 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేసింది. టిమ్ వార్డ్ (27), మిచెల్ ఓవెన్ (4), మాకలిస్టర్ రైట్ (16), బెన్ మెక్డెర్మాట్ (18) ఔట్ కాగా.. నిఖిల్ చౌదరి (17), మాథ్యూ వేడ్ (1) క్రీజ్లో ఉన్నారు. స్కార్చర్స్ బౌలర్లలో జోయల్ పారిస్, ఆరోన్ హార్డీ, ఆస్టన్ అగర్, బ్రాడీ కౌచ్కు తలో వికెట్ దక్కింది.ఈ మ్యాచ్లో హరికేన్స్ గెలవాలంటే 66 బంతుల్లో 154 పరుగులు చేయాలి.కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళే ప్రకటించారు. ఈ జట్టుకు నాయకుడిగా మిచెల్ మార్ష్ను కొనసాగించారు.టీ20 వరల్డ్కప్ 2026 కోసం ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కన్నోలీ, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా. -
యాషెస్ చివరి టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
యాషెస్ సిరీస్ 2025-26 చివరి టెస్ట్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. తుది జట్టు స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. కెమరూన్ గ్రీన్ పేలవ ఫామ్ ( గత 6 ఇన్నింగ్స్ల్లో 112 పరుగులు, 3 వికెట్లు) ఆసీస్ను కలవరపెడుతుంది. గ్రీన్ స్థానాన్ని మరో ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఓపెనర్లుగా జేక్ వెదరాల్డ్, ట్రవిస్ హెడ్ కొనసాగడం ఖాయం. ఉస్మాన్ ఖ్వాజా మరోసారి మిడిలార్డర్లోనే బ్యాటింగ్కు దిగాల్సి రావచ్చు. సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున టాడ్ మర్ఫీ తుది జట్టులోకి రావచ్చు. ఐదో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి జరుగుతుంది.కాగా, ఈ ఐదు మ్యాచ్ల యాషెస్ సిరీస్ను ఆసీస్ ఇదివరకే (3-1) కైవసం చేసుకుంది. తొలి మూడు మ్యాచ్ల్లో గెలిచిన ఆసీస్ నాలుగో టెస్ట్లో పరాజయంపాలైంది. ఈ టెస్ట్ నెగ్గి ఆధిక్యత 4-1కి పెంచుకోవాలని ఆసీస్.. ఆసీస్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉన్నాయి.ఐదో టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు- స్టీవ్ స్మిత్ (కెప్టెన్) - స్కాట్ బోలాండ్ - అలెక్స్ క్యారీ - బ్రెండన్ డాగెట్ - కెమెరూన్ గ్రీన్ - ట్రావిస్ హెడ్ - జోష్ ఇంగ్లిస్ - ఉస్మాన్ ఖవాజా - మార్నస్ లాబుషేన్ - టాడ్ మర్ఫీ - మైఖేల్ నేసర్ - జై రిచర్డ్సన్ - మిచెల్ స్టార్క్ - జేక్ వెదరాల్డ్ - బ్యూ వెబ్స్టర్ -
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్ఫారమ్లలో అసభ్యకరమైన కంటెంట్ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి..నిన్న డిసెంబర్లో ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. అయితే.. ఇప్పుడు మరో దేశం ఇప్పుడు ఈ రూట్నే ఎంచుకుంది. 15 ఏళ్లలోపు వాడకుండా త్వరలో ఫ్రాన్స్ ఓ చట్టం చేయబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను(డ్రాఫ్ట్)ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.పిల్లలను డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుండి రక్షించడమే ఈ చట్టం తీసుకురావడం వెనుక ఉద్దేశమని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ చెబుతున్నారు. ప్రతిపాదనల్లో.. 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించడం, అలాగే సెకండరీ స్కూల్స్లో మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం ఉన్నాయని తెలిపారాయన. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే..పిల్లలను స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లకు దూరం చేయాలనే ఫ్రాన్స్ ప్రయత్నం కొత్తేం కాదు. 2018లో ప్రీ-స్కూల్, మిడిల్ స్కూల్లలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఆదేశాలు తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో అది కఠినంగా అమలు కాలేదు. అయితే 2023లో ఇదే రూల్కు ఓ చిక్కు వచ్చిపడింది. “డిజిటల్ లీగల్ ఏజ్” కింద ఫోన్ వాడాలంటే 15 ఏళ్లుగా ఈయూ రూల్ తెచ్చింది. దీంతో ఫ్రాన్స్లో ఆ ఆదేశాలను తేలికగా తీసుకున్నారు.అయితే.. పిల్లలకు డిజిటల్ రక్షణను ప్రాధాన్యంగా తీసుకుని ఫ్రాన్స్ ఈసారి మరో రూట్లో వస్తోంది. నేరుగా నిషేధం అని చెప్పకుండా.. సోషల్ మీడియా, మొబైల్ వినియోగంపై కఠిన నియంత్రణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. సెనేట్ ప్రతిపాదనలో 13 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు నేషనల్ అసెంబ్లీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది.ఇంటర్నెట్లో యథేచ్ఛగా అశ్లీల చిత్రాలు లభిస్తున్నాయి. వీటిని ఎవరైనా చూసే వీలుంది. ఇవి చిన్నారుల జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయనే వాదనతో ఏకీభవిస్తున్నాం. ఇలా ఎవరిపడితే వారు అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడకుండా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే అవసరం ప్రభుత్వాలపై ఉంది. అలాగే, ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం అంశాన్ని పరిశీలించాలి. అప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల కమిషన్ దీనిపై అవగాహన కల్పించే బాధ్యతను తీసుకోవాలి..::మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తాజా వ్యాఖ్యలుఇప్పటిదాకా .. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి. ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ స్ఫూర్తితో.. యూరోపియన్ యూనియన్ అంశాన్ని పరిశీలిస్తోంది. మరి కొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. సోషల్ మీడియా వాడకంపై వయస్సు పరిమితులు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ధోరణిగా మారుతోందన్నమాట. -
చరిత్ర సృష్టించిన క్రిస్ లిన్
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ క్రిస్ లిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్లో 4000 పరుగుల మైలురాయిని తాకిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2025-26 ఎడిషన్లో భాగంగా బ్రిస్బేన్ హీట్తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు (అడిలైడ్ స్ట్రైకర్స్కు ఆడుతూ).ఈ మ్యాచ్లో 41 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 79 పరుగులు చేసిన లిన్.. చారిత్రక మైలురాయిని తాకడంతో పాటు తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. బిగ్ బాష్ లీగ్ కెరీర్లో 129 ఇన్నింగ్స్లు ఆడిన లిన్ 149.77 స్ట్రయిక్రేట్తో 32 అర్ద సెంచరీలు, సెంచరీ సాయంతో 4065 పరుగులు చేశాడు.మొత్తం టీ20 కెరీర్లో 300 మ్యాచ్లు ఆడిన లిన్.. 57 అర్ద శతకాలు, 6 శతకాల సాయంతో 8636 పరుగులు చేశాడు. పవర్ హిట్టర్గా పేరున్న లిన్ ఐపీఎల్లోనూ మెరుపులు మెరిపించాడు. 2012-21 మధ్యలో 42 మ్యాచ్లు ఆడి 140.6 స్ట్రయిక్రేట్తో 10 అర్ద సెంచరీల సాయంతో 1329 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. లిన్ చెలరేగడంతో బ్రిస్బేన్ హీట్పై అడిలైడ్ స్ట్రయికర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ చేసిన హీట్.. జేమీ ఓవర్టన్ (4-0-19-3), లియామ్ స్కాట్ (4-0-12-2), హసన్ అలీ (4-0-29-2), లూక్ వుడ్ (4-0-19-1), మాథ్యూ షార్ట్ (0.4-0-1-1) దెబ్బకు 19.4 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. హీట్ ఇన్నింగ్స్లో తొమ్మిదో నంబర్ ఆటగాడు కుహ్నేమన్ (31 నాటౌట) టాప్ స్కోరర్గా నిలువగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అడిలైడ్ 14.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. క్రిస్ లిన్ (79 నాటౌట్) మెరుపు అర్ద శతకంతో అడిలైడ్ను ఒంటిచేత్తో గెలిపించాడు. -
వేలానికి బ్రాడ్మన్ ‘బ్యాగీ గ్రీన్’
సిడ్నీ: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్కు చెందిన మరో ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. 1947–48 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో బ్రాడ్మన్ ఈ క్యాప్ ధరించాడు. ఈ సిరీస్లో 6 ఇన్నింగ్స్లలో కలిపి 178.75 సగటుతో బ్రాడ్మన్ 715 పరుగులు (ఇందులో ఒక డబుల్ సెంచరీ, 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి) సాధించాడు. బ్రాడ్మన్ తన కెరీర్లో భారత్తో ఆడిన ఏకైక సిరీస్ ఇదే కాగా...స్వాతంత్య్రం లభించిన తర్వాత భారత క్రికెట్ జట్టు తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.ఈతరంలో ఆ్రస్టేలియా క్రికెటర్లకు ఒక సారి అరంగేట్ర సమయంలో బ్యాగీ గ్రీన్ ఇస్తే కెరీర్ చివరి వరకు దానినే వాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే నాటి రోజుల్లో ప్రతీ సిరీస్కు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు కొత్త బ్యాగీ గ్రీన్ క్యాప్ను అందించేవారు. అందు వల్లే బ్రాడ్మన్కు చెందిన పలు క్యాప్లు వేర్వేరు మ్యూజియంలలో ఉండగా, ఇతర క్యాప్లు, జ్ఞాపికలను పలువురు ప్రైవేట్ వ్యక్తులు వేలం ద్వారా సొంతం చేసుకున్నారు. 1947–48 సిరీస్లో భాగంగా బ్రిస్బేన్లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టుకు శ్రీరంగ వాసుదేవ్ సొహొని ప్రాతినిధ్యం వహించాడు. సిరీస్ ముగిసిన అనంతరం వాసుదేవ్కు బ్రాడ్మన్ తన క్యాప్ను కానుకగా అందించాడు. గత 78 ఏళ్లుగా ఈ క్యాప్ వాసుదేవ్ కుటుంబం వద్దే ఉంది. ఇప్పుడు దీనిని ప్రముఖ ఆక్షనర్ లీ హేమ్స్ వేలం వేస్తున్నాడు. జనవరి 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి భారీ మొత్తం పలికే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సిరీస్లో బ్రాడ్మన్ ధరించిన మరో క్యాప్ను వేలం వేస్తే దానికి రూ.2.63 కోట్లు లభించాయి. -
ఆస్ట్రేలియా బ్యాటర్ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ!
మహిళల టీ20 క్రికెట్లో మరో వేగవంతమైన అర్ధసెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన లౌరా హారిస్ న్యూజిలాండ్లో జరుగుతున్న టి20 లీగ్లో ఈ ఘనత సాధించింది. కేవలం 15 బంతుల్లో ఆమె ఫిఫ్టీ బాదింది. కివీస్ లీగ్ టోర్నీ ఉమెన్ సూపర్ స్మాష్ (డబ్ల్యూఎస్ఎస్)లో ఒటాగో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఆదివారం కాంటర్బరీతో జరిగిన మ్యాచ్లో చెలరేగింది.అలెగ్జాండ్రాలోని మోలినెక్స్ పార్క్లో జరిగిన ఈ మ్యాచ్లో లౌరా (15 బంతుల్లో 52; 6 ఫోర్లు, 4 సిక్స్లు) దంచేసింది. తద్వారా 2022లో వారి్వక్షైర్ తరఫున మేరి కెల్లీ చేసిన (15 బంతుల్లో ఫిఫ్టీ) రికార్డును సమం చేసింది. లౌరా వీరబాదుడుతో 146 పరుగుల లక్ష్యాన్ని 15వ ఓవర్లోనే ఛేదించిన ఒటాగో ఈ మ్యాచ్లో బోనస్ పాయింట్తో గెలిచింది.ఈ సీజన్ మహిళల బిగ్బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో నిరాశపరిచిన లౌరా.. న్యూజిలాండ్లో మెరుపులు మెరిపించింది. అయితే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఆమెకిదే మొదటిది కాదు. ఓవరాల్ టి20 లీగ్లలోనే ఆరుసార్లు 50 పైచిలుకు (ఫిఫ్టీలు) పరుగులు చకచకా చేసిన ఘనత ఆమెకు ఒక్కరికే దక్కుతుంది.మూడుసార్లు 18 బంతుల్లో, ఒకసారి 19 బంతుల్లో, ఇంకోసారి 17 బంతుల్లో, ఇప్పుడేమో 15 బంతుల్లో ధనాధన్ అర్ధశతకాల్ని బాదింది. ప్రత్యేకించి మహిళల టి20 క్రికెట్, లీగ్లలో ఆమె తప్ప ఇంకెవరూ ఒకసారి మించి వేగవంతమైన అర్ధసెంచరీల్ని బాదలేకపోయారు. చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
ఐదో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్ అవుట్
యాషెస్ సిరీస్ 2025-26 తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రతిష్టాతక సిరీస్లో ఆఖరి టెస్టు జనవరి 4 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ తొడ కండరాల గాయం కారణంగా ఐదో టెస్టుకు దూరమయ్యాడు.బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట సందర్భంగా బౌలింగ్ చేసే క్రమంలో అట్కిన్సన్ తొడ వెనక కండరాలు పట్టేశాయి. అనంతరం స్కాన్ రిపోర్ట్లో గాయం తీవ్రత గ్రేడ్-1గా ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు నిజంగా ఇది భారీ షాక్ అని చెప్పాలి. అయితే ఈ సిరీస్లో అట్కిన్సన్ తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.అట్కిన్సన్ తొలి టెస్టులో ఒక్క వికెట్ కూడా సాధించికపోయినప్పటికి.. బ్రిస్బేన్లో మాత్రం 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం అడిలైడ్ టెస్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆర్చర్ గాయపడడంతో అట్కిన్సన్ తిరిగి బాక్సింగ్ డే టెస్టు కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ చారిత్రత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ సిరీస్లో అతడు మూడు మ్యాచ్లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు.పాట్స్ ఎంట్రీ?ఇక ఐదో టెస్టులో అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్ ప్లేయింగ్ ఎలెవన్లో రానున్నట్లు తెలుస్తోంది. బ్రైడన్ కార్స్, జోష్ టంగ్తో కలిసి మాథ్యూ పాట్స్ బౌలింగ్ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. ఒక వేళ సిడ్నీ పిచ్ కండీషన్స్ బట్టి స్పిన్నర్ ఆడించాలనుకుంటే షోయబ్ బషీర్ను తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ యాషెస్ సిరీస్ను ఇంగ్లండ్ ఇప్పటికే 3-1 తేడాతో కోల్పోయింది. ఆఖరి మ్యాచ్లో గెలిచి తమ పరువు నిలబెట్టుకోవాలని స్టోక్స్ సేన భావిస్తోంది.సిడ్నీ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు:బెన్ స్టోక్స్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, విల్ జాక్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్. -
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో ఓరుగల్లు ఆడబిడ్డ
సాక్షి ప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి యారాల హరిత సౌత్ ఆస్ట్రేలియాలో లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె 2011 నుంచి సౌత్ ఆస్ట్రేలియా లిబరల్ పార్టీకి బలమైన మద్దతురాలిగా ఉన్నారు. 2023లో టోరెన్స్ ఎస్ఈసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అక్కడి తెలుగు వారందరినీ ఐక్యపరచి తెలుగు సంప్రదాయాన్ని చాటుతున్నారు. మార్చి 18న జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తెలుగు వారి సత్తా చాటుతామంటున్నారు. 2022లో క్లెమ్ జిగ్ వార్డు కౌన్సిలర్గా ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. -
క్రికెట్ ఆ్రస్టేలియాకు రూ. 60 కోట్ల నష్టం!
మెల్బోర్న్: సొంతగడ్డపై జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్కు అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తున్నా... ఆర్థికంగా మాత్రం క్రికెట్ ఆ్రస్టేలియాకు నష్టాలు తప్పేలా లేవు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో మూడింట గెలిచిన ఆతిథ్య ఆసీస్ సిరీస్ నిలబెట్టుకుంది. అయితే వీటిలో రెండు టెస్టు మ్యాచ్లు రెండు రోజుల్లోనే ముగిశాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు రోజుల్లోనే ఫలితం రాగా... మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన నాలుగోదైన ‘బాక్సింగ్ డే’ టెస్టు మ్యాచ్ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది. చివరి మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు శుక్రవారం తొలి రోజు రికార్డు స్థాయిలో 94,199 మంది అభిమానులు మైదానానికి తరలిరాగా... శనివారం రెండో రోజు 92,045 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మూడో రోజు కోసం కూడా 90 వేల మందికి పైగా టికెట్లు కొనుగోలు చేసుకున్నారు. అయితే పిచ్ పేసర్లకు ఇతోధిక సాయం చేయడంతో ఈ మ్యాచ్లో తొలి రోజే 20 వికెట్లు నేలకూలాయి. ఇక రెండో రోజు 16 వికెట్లు పడగా... ఆరు సెషన్లలోపే ఫలితం తేలింది. దీంతో మూడో రోజు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఇలా సిరీస్లో రెండు మ్యాచ్లు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ)కు 10 మిలియన్ ఆ్రస్టేలియా డాలర్లు (రూ. 60.22 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఎంసీజీ పిచ్పై దుమారం ‘బాక్సింగ్ డే’ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రీడాభిమానులతో పాటు విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తునున్నారు. ఆస్ట్రేలియాలో కాకుండా మరెక్కడైనా ఇలా రెండు మ్యాచ్లు రెండు రోజుల్లోనే ముగిసిఉంటే పెద్దఎత్తున చర్చ జరిగేదని ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ నిప్పు రాజేయగా... దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఎంసీజీ పిచ్పై 10 మిల్లీ మీటర్ల కన్నా ఎక్కువ పచ్చికను సిద్ధం చేశారని... ఇలా అయితే ఆటలో సమతుల్యత దెబ్బతింటుందని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయ పడుతున్నారు. ‘మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం అసంతృప్తినిచి్చంది. తొలి రోజు పిచ్ అనూహ్యంగా స్పందించి పేసర్లకు సాయం చేసింది. ఇందులో మా ప్రమేయం లేదు. మంచి స్పోర్టింగ్ వికెట్ తయారు చేయాలనుకున్నాం. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటాం’ అని ఎంసీజీ క్యూరేటర్ మాథ్యూ పేజ్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఇరు జట్ల తరఫున అత్యధిక స్కోరర్గా నిలిచిన ఆసీస్ ఓపెనర్ హెడ్ మాట్లాడుతూ... ‘మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు విజయం సాధించడం ఖాయం. బంతికి, బ్యాట్కు మధ్య పోరాటాన్ని అభిమానులు ఆస్వాదిస్తారు. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇది కనిపించింది. ఎంసీజీలో మాత్రం ఇలా జరగలేదు’ అని అన్నాడు. -
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజానికి అరుదైన గౌరవం
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీకి (Brett Lee) అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈ స్పీడ్గన్ స్వదేశీ (Australia) హాల్ ఆఫ్ ఫేమర్ల (Hall Of Fame) జాబితాలోకి ప్రవేశించాడు. అత్యంత అరుదైన ఈ జాబితాలో లీ 66వ ఆటగాడిగా చేరాడు. లీకి ముందు చాలామంది ఆసీస్ దిగ్గజాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.లీకి ముందు ఇదే ఏడాది (2025) మైఖేల్ క్లార్క్, మైఖేల్ బెవాన్, క్రిస్టినా మాథ్యూస్ ఆసీస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్మన్, అలెన్ బోర్డర్, షేన్ వార్న్, రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు ఉన్నారు.49 ఏళ్ల లీ దశాబ్దానికిపైగా (1999-2012) తన ఫాస్ట్ బౌలింగ్లో ప్రపంచ బ్యాటర్లను గడగడలాడించాడు. ప్రపంచ క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యం కొనసాగించడంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్లు తీయడం కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన లీ.. కెరీర్లో ఎన్నో సార్లు స్పీడో మీటర్లు (బౌలింగ్ వేగాన్ని కోలిచే యంత్రం) బద్దలు కొట్టాడు.అత్యుత్తమంగా లీ గంటకు 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన బంతిగా నేటికీ చలామణి అవుతుంది. లీ కంటే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కేవలం 0.2 వేగాన్ని అధికంగా సాధించాడు.తనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం (ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్) దక్కడం పట్ల లీ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ అని చెప్పాడు. తొమ్మిదేళ్ల వయసు నుంచి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయాలని కలలు కన్నట్లు తెలిపాడు.


