హైదరాబాద్: ఆస్ట్రేలియా ఉగ్రదాడి కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ ఉగ్రదాడికి పాల్పడిన సాజిద్ అక్రమ్ అనే వ్యక్తికి హైదరాబాద్ నగరంతో లింక్స్ ఉన్నట్లు వెల్లడైంది. సాజిద్ హైదరాబాద్లో వీసా పొందినట్లు గుర్తించారు. స్టూడెంట్ వీసాపై 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్.. 2001లో పార్టనర్ వీసాగా మార్చుకున్నాడు.
ఆపై 2002లో రెసిడెంట్ రిటర్న్స్ వీసా పొందాడు సాజిద్. 2022లో టోలీచౌక్లోని ఆస్తులను అమ్ముకుని తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. హైదరాబాద్లోనే బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన్ సాజిద్.. అక్కడ యూరోపియన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు.
దీనిపై తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. సాజిద్ అనే వ్యక్తి 27 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లాడని, తిరిగి భారత్కు ఆరుసార్లు మాత్రమే వచ్చాడన్నారు. సాజిద్తో తెలంగాణకు కానీ, భారత్తో కానీ ఎలాంటి సంబంధం లేదని డీజీపీ వెల్లడించారు.
కాగా, ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్లో ఆదివారం(డిసెంబర్ 14వ తేదీ) ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. బాండీ బీచ్లో హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:


