మరుగుజ్జు రూపమే ఓ విద్యార్థి బాధలకు కారణమైంది. స్కూల్లో తోటి విద్యార్ధులు అవమానాలకు గురిచేయటం తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ కన్నతల్లి ముందే కన్నీరుపెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బ్రిస్బేన్కు చెందిన క్వాడెన్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు అచాన్రోప్లాసియా అనే మరుగుజ్జుతనం కారణంగా బాధపడుతున్నాడు. దీంతో స్కూల్లోని తోటి విద్యార్ధులు అతన్ని బాగా అవమానించేవారు. అయినా అతడు వారి మాటలను భరించేవాడు. కానీ, వారి అవమానాలు రోజురోజుకు పెరగసాగాయి.
తాడు ఇవ్వండి! ఉరేసుకుంటా..
Feb 20 2020 4:22 PM | Updated on Mar 22 2024 10:50 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement