టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, నెదర్లాండ్స్ మధ్య ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
నెదర్లాండ్స్ బ్యాట్స్మెన్లలో బాస్ డి లీడ్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, జాచ్ లయన్-కాచెట్ 26 పరుగులు, నోహ్ క్రోస్ 25 పరుగులు, ఓపెనర్ మైఖేల్ లెవిట్ 24 పరుగులు, కోలిన్ అకెర్మాన్ 23 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా, శివమ్ దూబే 2 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తలో వికెట్టు తీశారు. 66 పరుగులు చేసిన శివమ్ దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మొదట ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. శివమ్ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడి భారత్కు భారీ స్కోర్ అందించాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్లో 3 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ ఓ సిక్సర్ బాది అజేయంగా నిలిచాడు.
ఈ విజయంతో భారత్ గ్రూప్ టాపర్గా సూపర్ 8లో ప్రవేశించింది. సూపర్ 8లో భాగంగా ఫిబ్రవరి 22 ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ధక్షిణ ఆఫ్రికాతో భారత్ తలపడనుంది.


