T20 WC 2026: పసికూనతో పోరు.. టీమిండియాలో రెండు మార్పులు | T20 WC 2026: India won the toss and choose to bat against Netherlands | Sakshi
Sakshi News home page

T20 WC 2026: పసికూనతో పోరు.. టీమిండియాలో రెండు మార్పులు

Feb 18 2026 6:52 PM | Updated on Feb 18 2026 7:04 PM

T20 WC 2026: India won the toss and choose to bat against Netherlands

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌ ఇవాళ (ఫిబ్రవరి 18) తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

నామమాత్రపు ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ స్థానాల్లో అర్షదీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తుది జట్టులోకి వచ్చారు. 

మరోవైపు నెదర్లాండ్స్‌ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. ఫ్రెడ్‌ క్లాసెన్‌ స్థానంలో నోవా క్రాస్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చాడు. కాగా, ఈ మెగా టోర్నీలో భారత్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించి, సూపర్‌-8కు చేరగా.. నెదర్లాండ్స్‌ 3 మ్యాచ్‌ల్లో రెండిట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తుది జట్లు..
నెదర్లాండ్స్: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), జాచ్ లయన్-కాచెట్, నోహ్ క్రోస్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్

భారత్: ఇషాన్ కిషన్(w), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement