రేపటి నుంచి దేశీయ క్రికెట్‌ మహా సంగ్రామం ప్రారంభం | Ranji Trophy 2025-26 to start from october 15th | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి దేశీయ క్రికెట్‌ మహా సంగ్రామం ప్రారంభం

Oct 14 2025 3:46 PM | Updated on Oct 14 2025 5:53 PM

Ranji Trophy 2025-26 to start from october 15th

రేపటి నుంచి (అక్టోబర్‌ 15) దేశీయ క్రికెట్‌ మహా సంగ్రామం రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ప్రారంభం కానుంది. టోర్నీకి ఇది 91 ఎడిషన్‌. ఇందులో మొత్తం 38 జట్లు పోటీపడనున్నాయి. 28 రాష్ట్రాలకు చెందిన జట్లు (కొన్ని రాష్ట్రాలకు సంబంధించి రెండుకు మించి జట్లు ఉన్నాయి), 4 కేంద్ర పాలిత ప్రాంతాల జట్లు, అలాగే సర్వీసెస్, రైల్వేస్జట్లు పాల్గొంటున్నాయి.

గత సీజన్లో విదర్భ విజేతగా, కేరళ రన్నరప్గా నిలిచాయి. తొలి మ్యాచ్లో ఉత్తర్ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్జట్లు తలపడనున్నాయి. రేపు మొత్తం 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. టోర్నీ కోసందాదాపుగా అన్ని జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించాయి. ఈసారి టోర్నీకి చాలామంది టీమిండియా స్టార్లు అందుబాటులో ఉన్నారు.

రంజీ ట్రోఫీ 2025-26లో ఆడనున్న కీలక ఆటగాళ్లు..
ముంబై- శార్దూల్ ఠాకూర్‌, అజింక్య రహానే, ఆయుశ్మాత్రే, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్
కేరళ- సంజూ శాంసన్
కర్ణాటక- మయాంక్అగర్వాల్‌, కరుణ్నాయర్
జార్ఖండ్‌- ఇషాన్కిషన్
హైదరాబాద్‌- తిలక్వర్మ
బీహార్‌- వైభవ్సూర్యవంశీ
బెంగాల్- మహ్మద్ షమీ
ఉత్తరప్రదేశ్- రింకూ సింగ్
అస్సాం- రియాన్పరాగ్

కాగా, రంజీ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు ముంబై గెలుచుకుంది. జట్టు ఇప్పటివరకు 42 సార్లు ఛాంపియన్గా నిలిచింది. ముంబై తర్వాత కర్ణాటక/మైసూర్అత్యధికంగా 8 టైటిళ్లు సాధించింది. ఆతర్వాతి స్థానాల్లో ఢిల్లీ (7), మధ్యప్రదేశ్‌/హోల్కర్‌ (5), బరోడా (5), సౌరాష్ట్ర (2), విదర్భ (2), బెంగాల్‌ (2), తమిళనాడు/మద్రాస్‌ (2), రాజస్తాన్‌ (2) జట్లు ఉన్నాయి.

చదవండి: కింగ్‌ కోహ్లి వచ్చేశాడు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement