
కిచెన్, టెర్రస్ గార్డెన్లను కాపాడుకోండి ఇలా..
కోదాడ, భువనగిరిటౌన్ : చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇష్టం. మొక్కల పెంపకంలో చాలా కేర్ తీసుకుంటారు. అయితే, వేసవిలో మొక్కలను కాపాడుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఈ చిట్కాలు పాటిస్తే ఎండబారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.. ఉద్యానవన అధికారులు.
● రోజూ సాయంత్రం ఆరు గంటల తరువాతే మొక్కలకు నీరు పెట్టుకోవాలి.
● ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత మొక్కలపై నేరుగా పడకుండా గ్రీన్మ్యాట్ పైకప్పుగా ఏర్పాటు చేసుకోవాలి.
● గ్రీన్మ్యాట్పై రెండు మూడు గంటలకు ఒకసారి నీటిని చల్లాలి. ● మొక్కలకు రసాయన ఎరువులను అందించవద్దు. మొక్కల పాదుల్లో తడి ఆరకుండా చూసుకోవాలి. ● కుండీల్లో మొక్కలు నాటితే తరచూ మట్టిని మార్చాలి. మట్టిలో ఆవు పేడ కలపాలి. మట్టి ఎక్కువ రోజులు తడిగా ఉండటానికి కుండీలో ఎండిన ఆకులను ఉంచాలి.
● మొక్కలకు వేప పిండిని ఎరువుగా ఉపయోగించవచ్చు.
కుండీల్లో పదును ఉండేలా చూస్తున్నా..
గతేడాది కంటే ఈ సంవత్సరం ఎండులు ఎక్కువగా ఉన్నాయి. ఎండ వేడిమికి మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నా. కుండీల్లో నాటిన మొక్కలకు ఎప్పుడు తడిగా ఉండేలా చూస్తున్నా. సూర్యరశ్మి తక్కువ సోకే ప్రాంతాల్లో మొక్కలను ఉంచుతున్నా. – దాత్రక్ పద్మ, భువనగిరి