భూ సమస్యలకు పరిష్కారానికే భూ భారతి చట్టం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలకు పరిష్కారానికే భూ భారతి చట్టం

Apr 24 2025 1:56 AM | Updated on Apr 24 2025 8:25 AM

భూ సమస్యలకు పరిష్కారానికే భూ భారతి చట్టం

భూ సమస్యలకు పరిష్కారానికే భూ భారతి చట్టం

చిట్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం–2025తో భూ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. చిట్యాల తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భూములకు సంబంధించిన మ్యుటేషన్‌ ఇబ్బందులు, ఇతర వివాదాలున్న భూములకు జియో కోఆర్టినేట్‌ ద్వారా హద్దులతో కూడిన వివరాలు ఆన్‌లైన్‌ చేసి భూధార్‌ కార్డులను అందజేయనున్నట్టు వివరించారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ భా భారతి చట్టం తేవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్‌ కృష్ణనాయక్‌, ఎంపీడీఓ జయలక్ష్మీ, ఏఓ పగిడిమర్రి గిరిబాబు, ఏఎంసీ చైర్మన్‌ నర్రా వినోదామోహన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏనుగు రఘుమారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కాటం వెంకటేశం, డీసీసీ కార్యదర్శి పోకల దేవదాసు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement