షిర్డీ వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి..
షిర్డీ వెళ్లి తిరిగి వస్తుండగా కారులో మంటలు చెలరేగి ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనమయ్యాడు.
వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
గురితప్పని లక్ష్యం
నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన కాంత్రికుమార్ భారత ఆర్చరీ జట్టుకు కోచ్గా ఎంపికయ్యారు.
- IIలో
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
వందలాది మంది యువకుల ప్రాణ త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. గత పదేళ్ల పాటు రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగింది.. ప్రస్తుతం అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోంది.
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్లగొండ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం.. సోనియగాంధీ సాహసోపేత నిర్ణయం వల్లే తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల సభలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. నల్లగొండ అంటే నమ్మకానికి ప్రతిరూపం అన్నారు. అభివృద్ధిలో నల్లగొండను అగ్రపథాన నిలుపుతామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ భగవద్గీతలా పనిచేయనుందని పేర్కొన్నారు.
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేలా..
మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జిల్లాలో ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో అయిటిపాములలో స్వయం సహాయక మహిళా సంఘాలతో సోలార్ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు చేయించామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద క్యాంటిన్ల నిర్వహణ, పెట్రోలు బంక్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
రైతులకు రుణ విముక్తి..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చరిత్రలో నిలిచిపోయేలా జిల్లాలో 2,33,981 మంది రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసి రుణ విముక్తులను చేశామన్నారు. యాసంగి సీజన్లో రైతు భరోసా కింద ఎకరానికి రూ.6 వేలు చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు. ధాన్యం కొనుగోళ్లు, డబ్బుల చెల్లింపుల్లోనూ ఈ సారి ముందున్నామన పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ
చేసిన తొలి రాష్ట్రం
సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చేస్తోందన్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. బీసీలకు కూడా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు. 4 ఐటీఐలు అభివృద్ధికి రూ.6.77 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ.20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే బ్రాహ్మణవెల్లెంల, ఉదయ సముద్రం లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయి ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించామన్నారు. ఈ లిఫ్టు ద్వారా 3.61 ఎకరాలకు సాగునీరు.. 200 గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు.
పేద విద్యార్థులు వైద్యవిద్య చదివేలా..
పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేలా నల్లగొండలోని ఎస్ఎల్బీసీ వద్ద 37 ఎకరాల్లో నిర్మించిన వైద్య కళాశాలను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారన్నారు. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.24 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారభించి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు రూ.వందల కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినులు
న్యూస్రీల్
ఫ తెలంగాణ ఏర్పాటులో సోనియాగాంధీది సాహసోపేత నిర్ణయం
ఫ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశా..
ఫ గత పదేళ్లు దోపిడీ పాలన సాగింది
ఫ తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకెళ్తున్నాం
ఫ అభివృద్ధిలో నల్లగొండను అగ్రపథాన నిలబెడతాం
ఫ రాష్ట్ర అవతరణ వేడుకల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
సక్సెస్ ఫుల్గా ‘మిషన్ పరివర్తన్’
శాంతి భద్రతల పరిరక్షణతోపాటు గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన మిషన్ పరివర్తన కార్యక్రమంతోపాటు ఆపరేషన్ చబుత్ర సక్సెస్ ఫుల్గా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా కృషిచేస్తున్న జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్రపవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
త్యాగాలతోనే స్వరాష్ట్రం
త్యాగాలతోనే స్వరాష్ట్రం
త్యాగాలతోనే స్వరాష్ట్రం
త్యాగాలతోనే స్వరాష్ట్రం
త్యాగాలతోనే స్వరాష్ట్రం
త్యాగాలతోనే స్వరాష్ట్రం