
న్యాయ సేవలు ప్రజలకు చేరువ కావాలి
నిడమనూరు : పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరిస్తూనే న్యాయ సేవలను ప్రజలకు చేరువ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్పాల్ అన్నారు. హైదరాబాద్ నుంచి సోమవారం వర్చువల్ విధానంలో నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్పాల్ మాట్లాడుతూ లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్రెడ్డి కృషితో నిడమనూరు కోర్టును రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా పోర్టు పోలియో జడ్జి టి.వినోద్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించవచ్చన్నారు. అలాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు నిడమనూరులో మాట్లాడుతూ కోర్టు, న్యాయమూర్తి నివాస భవనాలు నిర్మించుకోవడం సంతోషకర విషయమన్నారు. కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిడమనూరు కోర్టులో ఇన్చార్జి న్యాయమూర్తి పవన్కుమార్ మొదటి కేసును పరిశీలించారు. వర్చువల్ విధానంలో న్యాయమూర్తి కె.లక్ష్మణ్, జస్టిస్ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ సుజనాకలిసిరాం తదితరులు హాజరుకాగా నిడమనూరులో కోర్టు భవనం ప్రారంభం కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ, న్యాయమూర్తలు సంపూర్ణ ఆనంద్, వేణు, ఎమ్మెల్సీ, నిడమనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంసీ కోటిరెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
ఫ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్పాల్
ఫ వర్చువల్గా నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం

న్యాయ సేవలు ప్రజలకు చేరువ కావాలి